అమరావతి తరలించి, మూడు ముక్కలు చెయ్యాలనే, విషయంలో ఉత్సాహంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డికి, వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక పక్క 34 వేల ఎకరాలు, రాజధాని కోసం ఇచ్చామని రైతులు, అలాగే ఇప్పటికే 10 వేల కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టారని కొందరు, ఇలా అనేక పిటీషన్లు హైకోర్ట్ లో దాఖలు అయ్యాయి. అయితే అనేక పిటీషన్లు విచారణ సందర్భంగా, హైకోర్ట్, ప్రభుత్వ నిర్ణయం పై వ్యతిరేక కామెంట్లు చేస్తూనే ఉంది. ప్రతి సందర్భంలో, ప్రభుత్వాన్ని కోర్ట్, అనేక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. అయితే రైతులు మాత్రం, తమ వాదనలు గట్టిగా వినిపిస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా, అమరావతి నుంచి, కర్నూలుకువిజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎక్వైరీస్‌ కార్యాలయం, తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక జీవో ఇచ్చింది. అయితే, ఈ విషయం పై, కొంత మంది కోర్ట్ కు వెళ్లారు. ఈ విషయం పై గతంలో విచారణ చేసిన హైకోర్ట్, తీర్పు రిజర్వ్ లో ఉంచింది. అయితే ఈ రోజు, ఈ కేసు పై, హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

amaravati 20032020 12

కర్నూలుకు వివిధ కార్యాలయాలను తరలిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్ట్ నిలుపుదల చేసింది. కర్నూల్ కు విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎక్వైరీస్‌ కార్యాలయాల తరలింపునకు ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేస్తూ ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది అనే చెప్పాలి. ఎక్కడో ఉన్న కర్నూల్ కు, ఆఫీస్ లు ఎలా తీసుకు వెళ్తారు అంటూ, పిటీషన్లు దాఖలు అయ్యాయి. విచారణ సందర్భంగా, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ హైకోర్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటంతో, ప్రభుత్వ తరుపు న్యాయవాది స్పందిస్తూ, విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎక్వైరీస్‌ కార్యాలయాలకు, అమరావతిలో సరైన చోటు లేదని, అందుకే కర్నూల్ కు వెళ్తున్నాం అని చెప్పారు.

amaravati 20032020 3

సరైన చోటు లేదు అని చెప్పటం పై హైకోర్ట్ అభ్యంతరం చెప్పింది. ఇక్కడ ఇంత ఖాళీ ఉండగా, కుర్నోల్ కు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి, ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో, మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి అంటూ,హైకోర్ట్ ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోరింది. అయితే ఇది సియం తీసుకున్న నిర్ణయం అని చెప్పటంతో, కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ప్రణాళిక లేకుండా, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పటం ఏమిటి అని, విచారణ సందర్భంగా కోర్ట్ ప్రశ్నించింది. అలాగే పిటీషనర్ తరుపు న్యాయవాది వాదనలు కూడా విన్న కోర్ట్, తీర్పు రిజర్వ్ లో పెట్టి, ఈ రోజు ఈ విషయం పై తీర్పు ఇస్తూ, ప్రభుత్వం ఇచ్చిన జీవో కొట్టేసింది.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తనకు రాష్ట్రంలో భద్రత లేదని, కేంద్ర బలగాల భద్రత కావాలి అంటూ కేంద్రానికి లేఖ రాసిన లేఖ పై నిన్నటి నుంచి క్లారిటీ లేదు. రమేష్ కుమార్ ఈ విషయం పై స్పందించక పోవటంతో, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పుకున్నారు. అయితే, ఈ లేఖ వాస్తవమేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టం కింద, నీరజ్‌కుమార్ అనే ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు, కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. లేఖ మీద ఏ చర్యలు తీసుకుంది, వ్యక్తిగతంగా పోస్టులో పంపుతున్నట్టు హోంశాఖ తెలిపింది. హోంశాఖ స్పందనను నీరజ్‌కుమార్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే ఇదే విషయం ఈ రోజు చంద్రబాబు ప్రెస్ మీట్ లో కూడా చదివి వినిపించారు. ఆయన ఏమన్నారంటే, ‘‘ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా బాధ్యతగా ప్రవర్తించడం లేదు. ప్రపంచం మొత్తం కరోనా నియంత్రణపై దృష్టి పెడితే, దేశాధినేతలు, అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు కూడా కరోనాను ఏవిధంగా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంటే, ఈ ముఖ్యమంత్రి మాత్రం ప్రతిపక్షాలపై, రాజ్యాంగ వ్యవస్థలపై ఏవిధంగా బురద జల్లాలా అని ఆలోచిస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. డిజిపి దగ్గరకు వెళ్లిన 7గురు వైసిపి ఎమ్మెల్యేలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన స్థాయిని పూర్తిగా దిగజార్చేలా కమిషన్ ఉంది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హైకోర్ట్ న్యాయమూర్తి స్థాయి వ్యక్తి ఉపయోగించే పదజాలం కాకుండా, రాజకీయశత్రువులు కుట్రదారులు వాడే పదజాలంతో లేఖ రాశారని మాట్లాడారని అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ, జాతీయ మీడియా, కొంతమంది మీడియా చేస్తున్నారని వాళ్లు ఆరోపించడం దుర్మార్గం, దీనిని మేము ఖండిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి, వైసిపి ప్రతిష్టకు భంగం కలిగించే పరిణామం అనడం హాస్యాస్పదం. ఎన్నికల సంఘం కేంద్ర హోంమంత్రికి పంపిన వినతిని వేరే పార్టీలు రాసినట్లుగా చిత్రించడం కంటే దౌర్భాగ్యం మరోకటిలేదు. "

"ఇది ఈసి రాశారా, ఎవరు రాశారు, రాజకీయాలు ఎందుకు రాశారు, ఎవరు రాశారో చెప్పాలి కదా అంటూ ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని నేను ఖండిస్తున్నాను. ఈ లేఖ ఎవరు రాశారనేది తెలుసుకోడానికి నీరజ్ కుమార్ గూడపాటి అనే వ్యక్తి ఆర్టీఐకింద కేంద్ర హోం శాఖకు మార్చిన 18న లేఖ పంపినట్లుగా అది అందిందని, దానిని సంబంధిత శాఖకు పంపామని ఈ రోజు కేంద్ర అధికారులే నిర్దారించారు. నిన్నటినుంచి ఈసి దీనిపై మాట్లాడలేదు, ఒకవేళ ఇది వాస్తవం కాకపోతే ఎప్పుడో మాట్లాడేవారు. దీనిని చూసైనా వీళ్లకు సిగ్గు అనిపించాలి. ఇది వాస్తవం కాకపోతే ఎప్పుడో ఖండించేవారు. ఇప్పటికే కేంద్రం నుంచి సిఆర్ పిఎఫ్ బలగాలు వాళ్ల ఆఫీసుకు వచ్చాయి. రాజ్యాంగ వ్యవస్థ అధిపతి, ఒక హైకోర్ట్ న్యాయమూర్తి స్థాయి వ్యక్తి, ‘నాకు ప్రా-ణ-హా-ని ఉంది, నా కుటుంబ సభ్యులకు భద్రత లేదు, నేను స్వేచ్ఛగా విధులు నిర్వహించాలంటే నాకు భద్రత ఉంటే తప్ప విధులు నిర్వహించలేనని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ 2/2020 కూడా డ్రెకోనియన్(కిరాతక) ఆర్డినెన్స్ అని చెప్పారు. వాళ్ల ఇళ్లలో మద్యం, నగదు దొరికితే ఎన్నికల్లో గెలిచినవారిని అనర్హులను చేయవచ్చు, తమను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని ప్రతిపక్షాలు పేర్కొన్నాయని, అంటూ వారి వాదనకు బలం చేకూర్చేలా, అధికార పార్టీ వాళ్లు ప్రతిపక్ష అభ్యర్ధుల, నాయకుల ఇళ్లలో మద్యం సీసాలు పెట్టి పోలీసులను పంపి అరెస్ట్ చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని రాశారు. "

"అదే మేము చెప్పాం ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడే...మేము చెప్పిందే జరిగింది తరువాత కూడా. తెనాలిలో అర్ధరాత్రి మా అభ్యర్ధి ఇంట్లోకి దొంగల్లాగా వెళ్లి వాటర్ ట్యాంక్ పక్కన మద్యం సీసాలు పెట్టి, పోలీసులను పిలిపించి ఏవిధంగా టిడిపి అభ్యర్ధిపై కేసులు పెట్టారో రుజువు చేశాం. అది కాదని చెప్పే ధైర్యం వైసిపి వాళ్లకు ఉందా..? సిగ్గుందా వీళ్లకు అసలు. ఎన్నికల వాయిదాపై ఈసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ చర్యలనే సమర్ధించింది, కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మాత్రం ఎత్తేయాలని సూచించింది, తదుపరి విడత ఎన్నికలోనైనా ఉల్లంఘనలను అడ్డుకుని ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఆ లక్ష్యం అందని ద్రాక్షే అని ఆయన ఆ లేఖలో చెప్పారు. ఈ నేపథ్యంలో నాకు నా కుటుంబానికి భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నాను. ఈ సమయంలో నేను హైదరాబాద్ లో ఉండటమే కొంత సురక్షితం, అలాగని పూర్తిగా కాదు. నా శ్రేయోభిలాషులు, నాతో కలిసి పనిచేసేవారు భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారు నన్ను జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా భౌ-తి-క-దా-డు-లు చేస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుత పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహన వైఖరి, ప్ర-తీ-కా-రే-చ్ఛ-ల-ను పరిగణలోకి తీసుకుని నాకు , నా కుటుంబ సభ్యులకు ఆపద ఏర్పడిందని ఆందోళన చెందుతున్నానని ఆ లేఖలో రాశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖను శరణు కోరడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదంటూ, ఈ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల వారి అనుయాయులు, నేరగాళ్లు నాపై దాడికి సిద్ధంగా ఉన్నారు, వారి నేరచరిత్రను దృష్టిలో ఉంచుకునే ఈ బాధాకరమైన అభిప్రాయానికి వచ్చానని ఆయన రాస్తే ఆయనకు ఈరోజు బలగాలతో భద్రత కల్పిస్తే మీ ఇష్టం వచ్చినట్లు అంటారా..?" అంటూ చంద్రబాబు అన్నారు.

ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందన్నట్లు.. కరోనా ప్రభావం స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంరంభం ప్రారంభమైన దగ్గర నుంచి పోలింగ్ కు సమయం తక్కువగా ఉండటంతో గతంతో పోలిస్తే తక్కువ ఖర్చులో బయట పడొచ్చని చాలా మంది అభ్యర్థులు భావిం చారు. మార్చి 1 వతేది ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు 8న కార్పొరేషన్లు, మున్సిపాలి టీలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి, అల్లకల్లోలం సృష్టించింది వైసీపీ. అన్ని వీడియోలు టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చాయి. దోర్జన్యాలతో, జగన్ చెప్పినట్టు, 90 శాతం సీట్లు మావే అని వైసీపీ విర్రవీగుతున్న సమయంలో, తొమ్మిదో రోజు మార్చి 15న మాత్రం ఊహించని పిడుగు లా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కరోనా ప్రభావమంటూ ఆరు వారాలు వాయిదా వేయడంతో చాలా మంది అభ్యర్థులు డీలా పడిపోయారు. ఏకగ్రీవాలు అయిన వారు ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నా.. భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మళ్లీ వ్యవహారం మొదటికి వస్తుందేమోనన్న అనుమానాలు ఏదోమూలవారిని కూడా వెంటాడుతున్నాయి.

ఎంతో కష్టపడి, మ్యానేజ్ చేసి, ఏకాగ్రీవాలు చేస్తే, ఇప్పుడు నోటిఫికేషన్ ఉంటుందో, రద్దు చేసి, మళ్ళీ మొదలు పెట్టాలో అనే భయం వారిని భయపెడుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు మార్చి 21న, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లు, నగర పంచాయితీలతో పాటు గ్రామ స్థాయి పంచాయతీలకు కూడా ఈ నెల 27న పోలింగ్ పూర్తవ్వాల్సి ఉంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఎంపీటీసీ అత్యధికంగా రూ.2 లక్షల వరకు, జెడ్పీటీసీ అత్యధికంగా రూ.4 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అదే విధంగా కార్పొరేషన్ల పరిధిలోని వార్డు సభ్యులు రూ.2 లక్షలు, మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సభ్యులు రూ.1.50 లక్షలు, నగర పంచాయితీ పరిధిలోని వార్డు సభ్యులు ఒక లక్ష రూపాయిల వరకు గరిషంగా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది. ప్రస్తుత వాయిదా నేపధ్యంలో మరలా పోలింగ్ జరిగే వరకు ఓటర్లతో పాటు కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

ఖర్చు ఎంతవుతుందో తెలియదు, ఎన్నికల కోడ్ కూడా తీసివేయమని సుప్రీం కోర్టు సూచించిన నేపధ్యంలో.. మరో 40 రోజులు ప్రచారంలో గడపాలా వద్దా, ఒక వేళ గడపాల్సివస్తే అంత ఖర్చును భరాయిస్తూ ఎలా అన్నదే ఇప్పుడు ఎక్కువ మంది అభ్యర్థులను వేధిస్తున్న ప్రధాన సమస్య. నిబంధనలు మీరితే ప్రత్యర్థులతో పాటు సొంతపార్టీలోని అస్మదీయుల కన్ను కూడా తమపై ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పోటీకి దిగిన ఆశావహులు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా ప్రభావంతో అకస్మాత్తుగా ఆరు వారాలు అంటే సుమారు 42 రోజులు వాయిదా పడటంతో అభ్యర్థులు బెంబేలెత్తు తున్నారు. 5 నుంచి 12 రోజులకు సరిపడా నగదును సిద్ధంచేసుకుని రంగంలోకి దిగిన వారికి ఇప్పుడు మరో ఆరు వారాలు అదనంగా ప్రచారం చేయడం, మ్యానేజ్ చెయ్యటం ఆర్థికంగా పెను భారం కానున్నది. వాయిదా ప్రకటన రావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అన్నింటినీ సిద్ధం చేసుకున్న కొందరు ఇప్పుడు సంబంధిత పార్టీలలో ఇతర పోటీదారులతో పాటు స్థానికుల ఒత్తిడిని కూడా తట్టుకోలేక పోతున్నారు. అన్నిటికీ మించి, నోటిఫికేషన్ రద్దు అయితే, ఇంత కష్టపడి, అందరినీ మ్యానేజ్ చేసి, చేసిన ఏకగ్రీవాలు, వాటి కోసం పెట్టిన ఖర్చు ఎలా అనేది, అధికార పార్టీ నేతలకు అర్ధం కావటం లేదు.

కరోనాపై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. అందరూ కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని.. ప్రతి ఒక్కరూ అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ప్రజల్ని కోరారు. శాస్త్రవేత్తలు కూడా ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని.. ఏకాంతంగా ఉండటం వల్లే ఈ వైరస్​ను కట్టడి చేయొచ్చని అన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడాలని.. సూచించారు ప్రధాని. ‘‘ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడిప్పుడే ఊరట లభించే అవకాశం లేదు. రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నాం. ప్రతిఒక్కరూ జాగరూకతతో ఉండటం అవసరం ఉంది. అందరం చేయిచేయీ కలిపి ఈ విపత్తును ఎదుర్కోవాలి. కొద్ది వారాలు మీ అందరి సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. జనం కోసం జనం ద్వారా కర్ఫ్యూ.. మన ఇళ్లల్లో 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లనీయరాదు. జనతా కర్ఫ్యూ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నా."

"ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు బయటకు రాకుండా కర్ఫ్యూ పాటిద్దాం. ఇది జనం కోసం జనం ద్వారా జనమే చేసుకునే కర్ఫ్యూ. ఆదివారం సంయమనంతో మనకు మనంగా విధించుకున్న కర్ఫ్యూ కరోనాపై అతిపెద్ద యుద్ధం. జనతా కర్ఫ్యూను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని కోరుతున్నా. రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు జనతా కర్ఫ్యూ సాధనంగా ఉపయోగపడుతుంది. జనతా కర్ఫ్యూ సందేశం, ఉద్దేశం ప్రజలందరికీ చేరవేయాలని కోరుతున్నా. ఈ సమయంలో మనకు కావాల్సింది సంయమనం. అవసరం లేకుండా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టవద్దు. ప్రజలు పరస్పరం సామాజిక దూరం పాటించాలి. ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం ముఖ్యం."

"నిర్లక్ష్యంగా ఉండటం.. మనకు ఏమవుతుందనే ధోరణి విడనాడాలి. అవకాశం ఉన్నంత మేరకు వ్యాపారులు, ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలి. వైద్య ఆరోగ్య రంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రంగంలో పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనందరం చేయిచేయి కలిపి ఈ మహమ్మారిపై యుద్ధం చేయాలి. ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారమయ్యేది కాదు. వచ్చే కొద్ది వారాలపాటు మీ సమయాన్ని నాకు ఇమ్మని కోరుతున్నా. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారు. కరోనా మహమ్మారి విస్ఫోటనంలా విరుచుకుపడుతోంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నాం. ప్రపంచ మహమ్మారి నుంచి ఊరట లభించే అవకాశం ఇప్పుడిప్పుడే లేదు. ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉండటం అత్యంత అవసరం."

Advertisements

Latest Articles

Most Read