ఎన్నికలకు ముందు పాదయాత్రలో బీసీ డిక్లరేషన్, బీసీ గర్జన, బీసీ సబ్ ప్లాన్ అంటూ ఊదరగొట్టి ఆయా వర్గాల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడు బీసీల వెన్నెముకనే విరిచేయడానికి సిద్ధపడ్డాడని టీడీపీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిన్న కోర్ట్ లు రిజర్వేషన్ లు కొట్టేయగానే, జగన్ లో ఏ మాత్రం బాధ లేదని, తనకు కావాల్సిందే జరిగింది అన్నటు, జగన్ వెంటనే మంత్రులు చేత బీసీలకు తగ్గించి 50 శాతంతో ఎన్నికలకు వెళ్తాం అని నిన్న సాయంత్రం చెప్పించారని, ఈ రోజు జగన్ స్వయంగా చెప్పారని, రేపు క్యాబినెట్ అంటున్నారని, ఎక్కడైనా కోర్ట్ లు కొట్టేస్తే, సుప్రీం కోర్ట్ కు వెళ్తారని, కాని జగన్ కు బీసీలు అంటే చులకన కాబట్టి, సుప్రీంకు వెళ్ళకుండా, బీసీల గొంతు కోస్తున్నారని అన్నారు. జగన్ నిర్లిప్తత, నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగానే 60.55 శాతం ఉండాల్సిన రిజర్వేషన్లకు 10 శాతం కోత పడిందని... తద్వారా 34 శాతం ఉండాల్సిన బీసీ రిజర్వేషన్లు 24 శాతానికే పరిమితమయ్యాయన్నారు. 1995 నుంచి 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు జగన్ పాలనలో 24 శాతానికి తగ్గించబడ్డాయన్నారు. 25 సంవత్సరాల నుంచి అమలు లో ఉన్న బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి తక్షణమే బడుగు, బలహీన వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ లు కొనసాగించలేని ముఖ్యమంత్రికి అధికారంలో ఉండే అర్హత లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

2010లో హైకోర్టు రిజర్వేషన్లలో కోత పెట్టినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టు ద్వారా 60.55 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేసిన విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. బీసీలంటే జగన్ కు చిన్నచూపు ఉండబట్టే నేడు వారు రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. బీసీలు 10 శాతం రిజర్వేషన్లు కోల్పోయేలా కోర్టు తీర్పు రావడానికి జగనే ప్రధాన కారకుడన్నారు. హైకోర్టులో రిజర్వేషన్లపై వాదనలు జరిగేటప్పడు జగన్ ప్రభుత్వం అసమర్థులైన లాయర్లను నియమించబట్టే బీసీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. 70 శాతం జనాభా ఉన్న బీసీలకు న్యాయం చేయడం కోసం పేరు ప్రతిష్టలు గల న్యాయవాదులను ఎందుకు నియమించలేదో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజల ధనాన్ని దుబారా చేయడంలో జగన్ ప్రభుత్వం నెంబర్ వన్ గా నిలిచిందన్న నిమ్మల, సచివాలయ, ఇతర ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, శ్మశానాలకు రంగులు వేయడానికి రూ. 13 వందల కోట్లను దుర్వినియోగం చేసిందన్నారు. తన ఇంటి మరమ్మత్తులకు కూడా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్నే జగన్ దుబారా చేశాడన్నారు. తన కేసులకు సుప్రీం కోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గీ కి రూ. 5 కోట్లు ఇచ్చి పెట్టుకున్న జగన్, బీసీల రిజర్వేషన్ల కేసు విషయంలో మాత్రం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ని నియమించి చేతులు దులుపుకున్నాడని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిజర్వేషన్ల అంశంలో ఓడిపోవాలన్న ఉద్దేశం ఉండబట్టే ప్రభుత్వ న్యాయవాది చిత్తశుద్ధితో పని చేయలేదన్నారు. రిజర్వేషన్ లు 50 శాతం దాటకూడదంటూ కోర్టుకు వెళ్లిన వారంతా తెలుగుదేశం పార్టీవారేనని అసత్య ప్రచారం చేసిన జగన్ అంతర్ ‘సాక్షి’ ప్రతాపరెడ్డి, రామాంజనేయులు అనే వ్యక్తులతో జగన్ కు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి తెలుసుకుంటే మంచిదన్నారు. రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడైన ప్రతాప్ రెడ్డి రిజర్వేషన్లు తగ్గిస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ప్రకటన చేసిన వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదని నిమ్మల ప్రశ్నించారు. బోయరామాంజనేయులు రాప్తాడు మండల వైసీపీ కన్వీనర్ అని, అటువంటి వ్యక్తి బీసీలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది వాస్తవమో కాదో వైసీపీ నేతలు, మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రోద్భలంవల్లే రామాంజనేయులు కోర్టులో బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెండు పిటిషన్లు (1143/2020 మరియు 604/2020) వేశాడన్నారు. (ఈ సందర్భంగా బోయ రామాజంనేయులు జగన్ తో దిగినఫొటోలను, శుభాకాంక్షలు చెబుతూ జగన్ పేరుతో వేసిన ప్లెక్సీల ఫొటోలను నిమ్మల విలేకరులకు చూపించారు).

తనపార్టీ వారితోనే బీసీల రిజర్వేషన్లు తగ్గించేలా కోర్టులో పిటిషన్లు వేసిన జగన్, బీసీలకు ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. 15వేల పదవులు బీసీలకు దక్కకుండా రామాంజనేయులు ద్వారా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డేనన్నారు. జగన్ ఇంతచేస్తుంటే, బీసీ వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిమ్మల నిలదీశారు. బీసీలకు పెద్దపీట వేస్తామని డబ్బాలు కొట్టుకుంటున్న జగన్, రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా వారిని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడన్నారు. నిజంగా జగన్ కు బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే, తమిళనాడు, కర్ణాటక మాదిరి రిజర్వేషన్లను షెడ్యూల్ లో చేర్చడానికి ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు. సొంతకేసుల నుంచి బయటపడటానికి, అమరావతిని చంపేయడానికి, మండలిని రద్దుచేయడానికి ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేసిన జగన్, బీసీల రిజర్వేషన్ల కోసం కేంద్రపెద్దలతో ఎందుకు లాబీయింగ్ చేయలేదని నిమ్మల నిలదీశారు.

దశలవారీ మద్యపాన నిషేధం ముసుగులో జగన్ ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయాలు జరుపుతూ, మద్యంవ్యాపారాన్నేప్రధాన ఆదాయవనరుగా మార్చుకొని, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాణాలకు హానికలిగించే పలురకాల కల్తీ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో విక్రయిస్తూ, తాడేపల్లిలో ఇండెంట్ – హైదరాబాద్ లో పేమేంట్ అన్నతీరుగా జే-ట్యాక్స్ కోసం జగన్ వ్యవహారం నడిపిస్తున్నాడన్నారు. నెలకు రూ.350కోట్ల పైచిలుకు చొప్పున కమీషన్లు కొట్టేస్తూ, 10నెలల నుంచి జే-ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారన్నారు. మద్యపానం నిషేధం కోసమే ధరలు పెంచామని, దానివల్ల మద్యం వినియోగం తగ్గుతుందని చెబుతున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎక్కడా కనీవినీ ఎరుగని, ఎవరూ చూడని, పిచ్చిపిచ్చిపేర్లతో చెలామణి అవుతున్న మద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాలకు సరఫరా చేస్తున్నారన్నారు. జార్డీ ఎస్ బార్ (విస్కీ), బూమ్ (బీర్), వంటి పేర్లున్న వివిధరకాల కల్తీ మద్యాన్ని కమీషన్ల కోసమే విక్రయిస్తున్నారని ఉమా తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలతో సహా, జగన్ కు ఇష్టమైన దక్షిణాఫ్రికాలో కూడా లభించని మద్యం బ్రాండ్లన్నీ, ఏపీలోనే జగన్ సర్కారు అమ్ముతోంద న్నారు. బీర్ కేసుకి ఇంత, చీప్ లిక్కర్ కు ఇంత, లిక్కర్ కు ఇంతా అని లెక్కలేసి మరీ జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా కమీషన్లు వసూలు చేస్తోందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో 50, 60ఏళ్ల నుంచి మద్యం ఉత్పత్తులు తయారుచేస్తున్న జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లనే విక్రయించడం జరిగిందన్నారు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడేలా జగన్ మాదిరి పిచ్చి మద్యం అమ్మలేదన్నారు. డబ్బుపిచ్చి పట్టిన జగన్ ప్రభుత్వం, పొద్దస్తమానం కష్టపడిన శ్రమజీవి రక్తాన్ని, మద్యం అమ్మకాల ద్వారా పీల్చడానికి కూడా వెనుకాడటం లేదని బొండా మండిపడ్డారు. హైదారాబాద్ లో జే-ట్యాక్స్ కట్టిన బ్రాండ్లకు మాత్రమే తాడేపల్లిలో ఇండెంట్ ఇస్తున్నారని, గతంలో ఎప్పుడూ చూడని, వినని పేర్లతో కూడిన డిస్టిలరీలన్నీ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. తొలి రెండునెలలు డిస్టిలరీలు ఇచ్చిన కమీషన్లతోనే సర్కారు తృప్తిపడిందని, కానీ తరువాత సొంతంగా నడపాలన్న ఆలోచనతో పక్కరాష్ట్రాల నుంచి పిచ్చిపిచ్చిపేర్లతో కల్తీమద్యం విక్రయాలు జరపడానికి సిద్ధపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో, మద్యం సిండికేట్ల వ్యవహారం భారీ ఎత్తున సాగుతున్న ఉదంతాలనుచూశామని, బొత్స లాంటి ప్రముఖుల పేర్లుకూడా ప్రచారంలోకి వచ్చాయన్నారు. వైసీపీప్రభుత్వం లోని కీలకనేతలంతా కలిసి, జగన్ అండదండలతో ఏపీలో అతిపెద్ద లిక్కర్ మాఫియాకు తెరలేపారన్నారు. టీడీపీ ప్రభుత్వం విక్రయించిన మద్యం రకాలన్నీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైనవని, జగన్ ప్రభుత్వం విక్రయించే బ్రాండ్లు మాత్రం ఏపీలో తప్ప ఇంకెక్కడా లభించడంలేదన్నారు. (కల్తీ మద్యంరకాలను బొండా ఉమా ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు), ప్రతిరోజు కొన్ని లక్షలలీటర్ల కల్తీ మద్యం రాష్ట్రంలోనే తయారవుతోందని, దానికితోడు అదనంగా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన ఎన్ డీపీ లిక్కర్ (నాన్ డ్యూటీపెయిడ్)ను రాత్రి 8.30గంటల నుంచి వైసీపీనేతలే విక్రయిస్తున్నారన్నారు.

వాలంటర్లీ ద్వారా పింఛన్లు ఇంటింటికీ ఇప్పించామని డబ్బాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం, వారిద్వారానే గడపగడపకూ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తోందన్నారు. రూ. 500 నుంచి రూ.700 సంపాదించే దినసరి కూలీ, మద్యానికి రూ.200 ఖర్చుచేసేవాడని, ఇప్పుడు పిచ్చిమందు కొనడానికి రూ.400వరకు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పిచ్చి మందు తాగేవారంతా, రాత్రివేళల్లో వింతవింతగా ప్రవర్తిస్తూ ఇంట్లోనివారికి కూడా నిద్రలేకుండా చేస్తున్నారని, ఉదయం ఎన్నిగంటలకు లేస్తారో కూడా తెలియడంలేదని, దీనికంతటికీ జగన్ కు పట్టిన డబ్బుపిచ్చే కారణమన్నారు. తన డబ్బుపిచ్చి కారణంగా ప్రజల ప్రాణాలను హరించడానికి కూడా జగన్ వెనుకాడటంలేదని ఉమా దుయ్యబట్టారు. రాష్ట్రంలో తయారవుతున్న కల్తీమద్యం వల్ల తమకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని మద్యపానప్రియులే చెబుతున్నారన్నారు. కేస్ ల వారీగా చీప్ లిక్కర్ పై రూ.3వేలు, బీర్ ల కేస్ పై రూ.700, ప్రీమియం బ్రాండ్లపై కేస్ కు రూ.4నుంచి రూ.5వేల వరకు ధరలు పెంచి అమ్ముతూ, జే-ట్యాక్స్ వసూలుచేస్తున్నారన్నారు. మద్యనిషేధం అమల్లో ఉంటే, ప్రభుత్వానికి ఆదాయం తగ్గాలని, కానీ అందుకు విరుద్ధంగా జగన్ కు, ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో, పేదలు, కార్మికులు, రోజువారీ కూలీల జేబుకు చిల్లుపడిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కల్తీ మద్యం కారణంగా ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్యకూడా పెరిగిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుధ్ధి ఉంటే, నిజంగా సంపూర్ణ మద్య నిషేధం అమలుచేయాలన్నారు.

జగన్ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఉల్లిపాయలకోసం, మగవాళ్లు మద్యం కోసం క్యూలైన్లలో నిలబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పిచ్చి మద్యం తాగేవారంతా, తామేం చేస్తున్నామో తెలియని స్థితిలో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. మద్యం తరలింపు కాంట్రాక్ట్ కూడా వైసీపీనేతలే కొనసాగిస్తున్నారని, దానిద్వారా కూడా ప్రభుత్వం దోపిడీ సాగిస్తోందన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం నిబంధనలప్రకారం మద్యం దుకాణాలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదని, అందుకు విరుద్ధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేలా పాఠశాలలు, గుడులు, మసీదులు, చర్చిలు, ఇళ్లమధ్యనే దుకాణాలు నిర్వహిస్తున్నారని ఉమా స్పష్టంచేశారు. రాష్ట్రంలో కొత్తమద్యం పాలసీ వచ్చాక, దాదాపు 8లక్షల పైచిలుకు మద్యం కేసులు విక్రయించారని, వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి కూడా 40 నుంచి 50శాతం వరకు కమీషన్లు దండుకుంటున్నారని ఉమా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అడిగే కమీషన్లు డబ్బురూపంలో చెల్లించలేమంటూ ప్రధాన కంపెనీలన్నీ ఇప్పటికే చేతులెత్తేశాయన్నారు. దానివల్లే ప్రధాన కంపెనీల మద్యం అందుబాటులో లేకుండా పోయిందని, కమీషన్లు ఎక్కువిచ్చే జగన్ బ్రాండ్లు మాత్రమే విచ్చలవిడిగా లభిస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఎవరు ఎక్కువలంచం ఇస్తే, వారి బ్రాండ్లనే అమ్ముతున్నారని ఉమా తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సంపూర్ణ మద్యపాని నిషేధాన్ని అమలుచేసి, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. మద్యాన్ని నిషేధించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే, పిచ్చిపిచ్చి బ్రాండ్లను విక్రయానికి పెట్టేదికాదని, ఆ ఆలోచన లేకపోబట్టే, దశలవారీగా మద్యం దుకాణాలను ఆదాయవనరుగా మార్చిందన్నారు. తెలంగాణలో ఏఏ రకాలు అమ్ముతున్నారో, ఏపీలో ఏరకమైన మద్యం అమ్ముతున్నారో, ఎందుకు అమ్ముతున్నారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.

నాలుగు రోజులు క్రితం, ఒక వార్త వినిపించింది. అదే వాలంటీర్లను, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్లగా వేస్తున్నాం అంటూ ప్రభుత్వం ప్రకటించటం. దీని పై అందరూ విమర్శలు గుప్పించారు. వారి భవిషత్తును శాసించే పరీక్షల్లో, వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వెయ్యటం ఏమిటి, ఒక చిన్న తప్పు జరిగినా, జీవితాలు తారు మారు అయిపోతాయి అంటూ విమర్శలు గుప్పించారు. అనుభవం ఉన్న టీచర్లే ఒకోసారి పొరపాటు పడతారని, మరి వాలంటీర్లు ఇన్విజిలేటర్లగా ఎలా నియమిస్తారు అంటూ వ్యాఖ్యలు వినిపించాయి. రేపు వారి చేత పేపర్లు కూడా దిద్దిస్తారా అంటూ, విమర్శలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ అయితే మాములుగా లేవు. టీచర్లను ఇంట్లో కూర్చో పెట్టి, వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వెయ్యటం ఏమిటి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఇదంతా ఎంతో సిల్లీగా అనిపిస్తున్నా, ప్రభుత్వం ఆలోచన మాత్రం మాములుగా లేదు. ప్రభుత్వం ఎంతో ప్లానింగ్ తో, ఇలా వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వేస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే విషయం వెనుక, ఎంతో స్కెచ్ ఉంది.

volunteers 03032020 2

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. మార్చి 31వ తేదీతో 14వ ఆర్థిక సంఘం గడువు పూర్తి కానుంది. ఈలోగా స్థానిక ఎన్నికలు పూర్తయితేనే కేంద్రం నుండి రాష్ట్రానికి రావల్సిన సుమారు రూ. 5 వేల కోట్లు వస్తాయి. అలా కాకపోతే ఆ రూ. 5 వేల కోట్లపై ప్రభుత్వం ఆశలు వదులుకోవాల్సిందే. ఏప్రిల్ 1 నుండి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15 లోగా స్థానిక సమరాన్ని పూర్తిచేస్తే కేంద్రం నుండి రావల్సిన నిధులను తీసుకొనేందుకు సమయం సరిపోతుందని భావిస్తున్నారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రావల్సిన రూ. 5 వేల కోట్లు పోతే అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

volunteers 03032020 3

ఈ నేపథ్యంలోనే ఈనెల 7వ తేదీ లోగా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే కోర్ట్, ప్రభుత్వం నియమించిన 59 శాతం రిజర్వేషన్ కొట్టేసింది. దీంతో, 5 వేల కోట్ల కోసం, 50 శాతం రిజర్వేషన్ తోనే, ఎన్నికలకు వెళ్లనున్నారు. అయితే, ఇక్కడ వాలంటీర్లకు పని ఏమిటి అనుకుంటున్నారా ? ప్రభుత్వం చెప్తున్నట్టు, మార్చి నెలలోనే ఎన్నికలు జరిగితే, ఇది పరీక్షలు టైం. ఎన్నికల ప్రక్రియలో ఎక్కువగా ప్రభుత్వ టీచర్లను ఉపయోగిస్తారు. అయితే ఎన్నికల సమయం, పరీక్షలు ఒకేసారి వస్తూ ఉండటంతో, టీచర్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించటం కోసం, వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగిస్తే విమర్శలు వస్తాయి కాబట్టి, ఇలా చేసారని వార్తలు వినిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, మూడు రాజధానులపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. పంచాయతీ ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేయరా దని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసే అంశాన్ని ప్రభుత్వం నిశతంగా పరిశీలిస్తోంది. హైకోర్టు నెల రోజులు గడువు ఇచ్చినప్పటికీ వారం రోజుల్లోగా రిజర్వేషన్ల ప్రక్రియను సిద్ధం చేయాలని నిర్ణయించింది. మరోవైపు శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని తిప్పికొట్టే విషయమై అధికార పార్టీ నేతలు, మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ వల్లే 'స్థానిక ఎన్ని కల్లో రిజర్వేషన్లకు విఘాతం కలిగిందనే ప్రచారాన్ని చెయ్యాలని జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే స్థానిక ఎన్నికలు, శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 4 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నందున ఎన్నికలకు అవకాశం ఉండదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.

హైకోర్టు నెల రోజులు గడువు ప్రకటించిన నేపథ్యంలో ఈ లోగా శాసన సభ బడ్జెట్ సమావేశాలను ముగిస్తే ఎలా ఉంటుందనే విషయమై సీఎం జగన్ సమాలోచనలు జరుపుతున్నారు. అయితే బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవ ర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రకటనను శాసనమండలిలో మెజారిటీ పక్షంగా ఉన్న తాము వ్యతిరేకిస్తామని మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేసిన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగ పాఠంపై అధికార పార్టీ నేతలు దృష్టి సారించారు. ఈ నెల 6 నుంచే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగి స్తారు. ఇదే అదనుగా టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ చెల్లుబాటు కాదని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇవే బిల్లులు గవర్నర్ ప్రసంగంలో పునరావృతమైతే తిరస్కరించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది.

శాసనమండలిలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఇంతకు ముందెన్నడూలేని రీతిన అసలు గవర్నర్ ప్రసంగాన్ని తిరస్కరించడం ద్వారా ఉనికిని చాటుకునే ప్రయత్నాలు టీడీపీ ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ ఆమోదం విషయంలో కూడా వ్యతిరేకంగానే వ్యవహరించాలని నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వమే రూపకల్పన చేస్తుంది. ఇప్పటికే రాజధాని వికేంద్రీకరణ, సీఆ స్టీఏ బిల్లులను గవర్నర్ ప్రసంగంలో చేర్చినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. మూడు రాజధానులపై పంతం నెగ్గించుకు నేందుకు ఆర్డినెన్స్ ఏకైక మార్గమని భావిస్తోంది. మండలి జోలికి వెళ్లకుండా ఆర్డినెన్సును జారీ చేసి గవర్నర్ సంతకంతో ప్రక్రియ ప్రారంభించాలనే యోచనతో ఉంది. దీనిపై ఈనెల 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read