విశాఖపట్నంలో చంద్రబాబుని వైసీపీ నేతలు అడ్డుకోవటం, ఎయిర్ పోర్ట్ లో వీరంగం చెయ్యటం, అలాగే అయుదు గంటలు పాటు చంద్రబాబుని కదలనియ్యకుండా చెయ్యటం, చివరకు వైసీపీ వారిని ఏమి చెయ్యకుండా, చంద్రబాబుకు 151 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి, చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చెయ్యటం తెలిసిందే. అయితే, ఈ విషయంలో మాత్రం అందరూ షాక్ తిన్నారు. ఎందుకంటే, చంద్రబాబు పర్మిషన్ తీసుకుని, యాత్రకు వచ్చారు. పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇస్తే, దానికి తగ్గట్టే చంద్రబాబు వచ్చారు. అయితే అంతకు ముందు రోజు, చంద్రబాబుని అడ్డుకుంటాం అని వైసీపీ మంత్రులే చెప్పినా, దాని కోసం ముందే ప్లాన్ చేసినా, పోలీసులు మాత్రం వారిని అడ్డుకోలేదు. ఏకంగా 500 నుంచి వెయ్యి మంది వైసీపీ కార్యకర్తలను ఏకంగా విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోకే అనుమతి ఇచ్చారు. పోనీ చంద్రబాబు వచ్చిన తరువాత వారిని క్లియర్ చేసారా అంటే అదీ లేదు. ఇంతా జరిగి, చివరకు చంద్రబాబునే అరెస్ట్ చేసి, వైజాగ్ నుంచి హైదరాబాద్ పంపించారు.

sawang 02032020 2

అయితే, దీని పై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. విశాఖ పోలీసులు తీరు, అదే విధంగా ప్రభుత్వం తీరు పై, హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. అయితే రెండు రోజుల క్రితం ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్, ఆ రోజే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎక్కడైనా అనుమతి ఇచ్చి, వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చెయ్యటం ఏమిటి ? గొడవ చేసిన వారిని కదా అరెస్ట్ చెయ్యల్సింది అంటూ కోర్ట్ ప్రశ్నించింది. అసలు చంద్రబాబుకి 151 నోటీస్ ఇచ్చి, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చింది అంటూ, కౌంటర్ వెయ్యాలి అంటూ, పోలీసులను హైకోర్ట్ ఆదేశిస్తూ, విశాఖ సిపీకి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు ఇచ్చింది హైకోర్ట్. అయితే, కోర్ట్ ఆదేశాలు ప్రకారం, ఈ రోజు పోలీసులు, కౌంటర్ వేసారు. ఈ రోజు ఈ కేసు పై విచారణ జరిగింది.

sawang 02032020 3

ఈ విచారణ పై, టిడిపి తరుపు న్యాయవాది, కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈనెల 12న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కోర్టుకు హాజరుకావాలని, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి అంటూ, కోర్ట్ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ కేసు పై తదుపరి విచారణను, ఈనెల 12కు వాయిదా వేసిందని చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇస్తే చంద్రబాబు వచ్చారని, అలాంటిది, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేసారు, గుడ్లు, రాళ్ళు వేసిన వారిని ఎందుకు నివారించలేదు అంటూ కోర్ట్ అడిగినట్టు న్యాయవాది చెప్పారు. ఈ రోజు పోలీసులు వేసిన కౌంటర్ తో, కోర్ట్ సంతృప్తి చెందలేదు కాబట్టే, డీజీపీని కోర్ట్ కు వచ్చి హాజరు అవ్వమని, వివరణ ఇవ్వమని కోర్ట్ చెప్పినట్టు, న్యాయవాది, కృష్ణారెడ్డి అన్నారు.

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పటికే దాదాపు 5వేల కోట్ల రూపాయల మేర పీకల్లోతు నష్టాలతో ఉన్న ఆర్టీసీ పై అదనపు భారం పడింది. ఇటీవలే నామమాత్రంగా టిక్కెట్ చార్జీ పెంచినప్పటికీ పెరిగే వడ్డీల భారంతో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారిగా డీజిల్ పై లీటరు రూ. 1.07 పైసలు వ్యాట్ చార్జీ పెంచింది. రాష్ట్రంలో అత్యధి కంగా డీజిల్ వినియోగంలో మొదటి నుంచి ఏపీ ఎస్ ఆర్టీసీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల బస్సులు ఉండగా నెలకు సగటున 30కోట్ల లీటర్ల డీజిల్ ని వినియోగిస్తున్నాయి. తాజాగా లీటర్‌కు రూ. 1.07 పైసలు పెరిగిందంటే నెలకు రూ. 32 కోట్లు, సంవత్సరానికి దాదాపు రూ. 400 కోట్లు అదనపు భారం పడినట్లయింది. ఇప్ప టికే రాష్ట్రంలో ప్రభుత్వం 2 రూపాయలు అదనంగా అంటే 22.25 శాతంపై రూ. 24.25 పైసలు మేర వ్యాట్ వసూలు చేయటం ప్రారంభించింది. అలాగే పెట్రోలు లీటర్ 31శాతంపై రెండు రూపాయలు అదనంగా మొత్తం రూ.38 వ్యాట్ వసూలు చేయటం ఆరంభించింది.

rtc 02022020 2

అయితే పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం రెండు రూపాయలు తగ్గించడంతో వాహన యజమానులు సరిహద్దులోని తెలంగాణ పెట్రోలు బంక్ లతో ఫుల్ ట్యాంకు నింపుకోవటం ప్రారంభించారు. తాజాగా డీజిలపై రూ. 1.07 పైసలు, పెట్రోల్ పై 76 పైసలు వడ్డన జరిగింది. గతంలో డీజిల్ ధర పెరిగినప్పుడల్లా ఆర్టీసీ కార్మిక సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేసేవి. అయితే ప్రభుత్వంలో విలీనం కావటం, పైగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ వర్తించడంతో ఏఒక్కరూ రోడ్డెక్కే వీలులేదు. దీంతో పెరిగిన డీజిల్ ధరపై ఆందోళన చేసేవారు కనిపించడం లేదు. ఇక కృష్ణాజిల్లానే అధికంగా ఆర్టీసీ బస్సులున్నాయి. జిల్లాలో 1432 బస్సులున్నాయి. ప్రతిరోజు ఈ బస్సులు ఐదు లక్షల కి.మీ చొప్పున నడుస్తాయి. పెరిగిన 1.07 పైసల వ్యా ట్ నెలకు కోటీ 60లక్షలు చొప్పున సాలీనా రూ. 19.21 కోట్ల మేర భారం పడనుంది.

rtc 02022020 3

జిల్లాలో ఇతర వినియోగ దారులందరిపై కలిసి రూ. 117 కోట్ల మేర భారం పడింది. జిల్లావ్యాప్తంగా 250 పెట్రోలు, డీజిల్ బంకులున్నాయి. ప్రతి బంకులో సగటున రోజుకు 3వేల లీటర్ల పెట్రోలు, 8వేల లీటర్ల డీజిల్ విని యోగం జరుగుతుంది. పెరిగిన చార్జీలను మొత్తం 250 బంకులపై రోజుకు పెట్రోలు వినియోగదారులు రూ. 5.70 లక్షల లెక్కన నెలకు రూ. 1.71కోట్లు, ఏడాదికి రూ. 20.52 కోట్లు భారం పడుతుంది. అదే డీజిల్ వినియోగదానికి వస్తే సగటున బంకుల్లో రోజుకు 8వేల లీటర్ల వినియోగం జరుగుతుంది. దీనివల్ల రోజుకు రూ. 21.40 లక్షల చొప్పున నెలకు రూ. 6.42 కోట్లు సాలీనా రూ. 77.10 కోట్ల భారం పడుతోంది. ఒక్క నెల రోజుల్లో, రెండు సార్లు డీజిల్ రెట్లు పెంచటంతో, ఆర్టీసీ షాక్ అయ్యింది. మొదటి సారి డీజిల్ రేట్లు పెంచాగానే ఆర్టీసీ చార్జీలు పెంచారు. అయితే, ఇప్పుడ నెల రోజుల్లోనే రెండో సారి పెంచటంతో, ఆర్టీసీకి ఈ నష్టం ఎలా బర్తీ చేసుకోవాలో అర్ధం కావటం లేదు.

రాజకీయంలో అధికారమదం తలెకెక్కిన తర్వాత బందువుల్ని, రక్త సంబందీకుల్ని, స్నేహితుల్ని మరచిపోతారనేదానికి ముఖ్యమంత్రి జగనే ప్రత్యక్ష నిదర్శనం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖేష్ అంబానితో ముఖ్యమంత్రి జగన్ భేటీ అందరకీ ఆశ్చర్యం కల్గిస్తోంది. నిన్న భేటీలో అంబానీని, ఆయన కుమారుడ్ని జగన్ కల్మషం లేని నవ్వుతో ఆప్యాయంగా ఆహ్వానించిన తీరు, ఖరీదైన శాలువ కప్పడం, ఆయన వారి పట్ల చూపించిన అభిమానం అందరికీ ఆశ్చర్యం కల్గించింది., నాడు వైయస్ మరణం వెనుక రిలయన్స్ సంస్ధ కుట్ర ఉందంటూ ఉమ్మడి రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రిలయన్స్ సంస్ధలపై జగన్ దా-డు-లు చేయించి వి-ద్వం-స కాండ సృషించారు. వైయస్ హ-త్య వెనుక రిలయన్స్ హస్తముందని జగన్ అన్న మాటలు నిజమే అయితే నేడు ముఖేష్ అంబానీని ఆప్యాయంగా జగన్ నవ్వుతూ స్వాగతించటం ఏంటి? తండ్రి శ-వం ఇంటికి చేరకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేశారనే అపవాదు జగన్ పై ఉంది.

నాడు రిలయన్స్ సంస్ధలపై జగన్ దా-డు-లు చేయించటం వాస్తవం కాదా? జగన్ కి అత్యంత సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీ విధ్యార్ది నాయకుడు వంశీచందర్ రెడ్డి రిలయన్స్ పై దా-డు-ల-కు పురిగొల్పుతూ మెసేజ్ లు పెట్టింది వాస్తవం కాదా? ఉమ్మడి రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రియలన్స్ సంస్ధలపై జరిగిన దా-డు-ల-కు కారణం జగన్ కాదా? అంటూ ప్రశ్నించారు. ఆ దా-డు-ల-కు సంబందించిన ప్రతికల్లో వచ్చిన పోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. నాడు జగన్ ఇచ్చిన పిలుపుతో రిలయన్స్ సంస్దలపై దా-డు-లు చేసిన వేలాదిమంది అమాయకులు ఇప్పటికీ జైళ్లలో ఉన్నారు, మరికొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వేలాది మంది పోలీసుల చేత బూటు దెబ్బలు తిన్నారు, వారి బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకున్నారు, కానీ నేడు అంబానీనీ ఆప్యాయంగా హత్తుకున్న జగన్ వారి కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్తారు? నాడు రిలయన్స్ సంస్ధల్ని ద్వం-సం చేయండి అన్న జగన్ నేడు అదే రిలయన్స్ అధినేతతో భేటీ అవటం ఏంటి? మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ దీనికి ఏం సమాధానం చెప్తారు. రిలయన్స్ సంస్ధ మరియు సోనియా గాంధీ కుటుంబం కుమ్మక్కై వైయస్ రాజశేఖర్ రెడ్డిని హ-త్య చేయించారని వైయస్ కుటుంబానికి సన్నిహితుడైన భూమణ కరుణాకర్ రెడ్డి నాడు చెప్పలేదా?

వైయస్ మరణం వెనుక రిలయన్స్ హస్తముందన్న జగన్ నేడు అదే రిలయన్స్ అధినేతతో ఎలా సమావేశమయ్యారు? ముఖ్యమంత్రి ఇంట్లో మంత్రాంగం జరుగుతోందని రాష్ర్ట ప్రజలు భావిస్తున్నారు, వారిద్దరి భేటీలో జరిగిన క్విడ్ ప్రోకో బప్పందాలను జగన్ ప్రజలకు చెప్పాలి. వారికి రాజ్యసభ ఇస్తామన్నారా? అసలు ఇద్దరి మద్య జరిగిన ఒప్పందాలు ఏంటి? వారి బేటీ అంశాలను బయటికి చెప్పకుండా రహస్యంగా ఎందుకు ఉంచారు? పరిపాలనలో అంతా పారదర్శకంగా ఉండాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎవరితో భేటీ అయినా వెంటనే మీడియాకు వెల్లడించేవారు. కానీ జగన్ ఎందుకు వారి భేటీ అంశాలను బయటికి చెప్పటం లేదు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన భాద్యత ముఖ్యమంత్రిగా జగన్ పై ఉంది. నీతి మాటలు చెప్పే నైతిక ‍హక్కు జగన్ కి లేదు. జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డకున్న దానిపై జగన్ కి కోర్టు మొట్టికాయలు వేసినా ఆయన తీరు మారలేదు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్యుల సలహాలు కూడా పాటించారు. కానీ జగన్ ఎవరి సలహాలు స్వీకరించే స్ధితిలో లేరు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మౌనం వీడి ముఖేష్ అంబానీతో బేటీలో చర్చించిన అంశాలను ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, విజయనగరంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో భాగంగా, విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ పెందుర్తి మండలం పినగాడి పంచాయతీ పరిధిలోని కోట్నివానిపాలెం సమీపంలో 90 ఎకరాల విస్తీర్ణంలో పెంటవాని చెరువు ఆక్రమించుకోవటం, పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో గల వీర్రాజు చెరువుని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ కబ్జా చేస్తున్నారు అంటూ, ఈ రెండు ఘటనల పై, విశాఖలో కూడా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు ఆ చెరువును చేరుకోనివ్వకుండా, రాత్రికి రాత్రి, చెరువుకి అరకిలోమీటర్ ముందు గొయ్యి తవ్వారు. ఇది ఇలా ఉంటే, ఈ పర్యటన కోసం, తెలుగుదేశం పార్టీ, పోలీస్ పర్మిషన్ కూడా తీసుకుంది. పోలీసులు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే విశాఖలో చంద్రబాబు దిగే సరికి, 500 మందికి పైగా వైసీపీ పోగేసిన అల్లరి మూకలు ఎయిర్ పోర్ట్ లోకి వచ్చాయి. 50 మందికి మించి టిడిపి నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలకకూడదు అని చెప్పిన పోలీసులు, ఇంత మందిని ఎలా రానిచ్చారు అనేది తెలుగుదేశం ప్రశ్న.

nsg 02032020 1

ఈ వైసీపీ అల్లరి మూకల చేతిల్లో రాళ్ళు, గుడ్లు ఉన్నాయి. వీటిని ఒక అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లోపలకి ఎలా అనుమతి ఇచ్చారు ? ఎయిర్ పోర్ట్ బయట, కేవలం 500 మంది వైసీపీ మూకలు, చంద్రబాబుని 5 గంటలు పాటు కదల నివ్వకుండా ఉంటే, పోలీసులు ఆ అల్లరి మూకలను ఎందుకు క్లియర్ చెయ్యలేదు ? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న వ్యక్తిని, 5 గంటల పాటు, అల్లరి మూకల మధ్య ఎలా ఉంచారు ? ఇక చివరగా, వైసీపీ అల్లరి మూకలను అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటం పై, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మొత్తం వ్యవహారం, పై, చంద్రబాబుకు రక్షణగా ఉన్న, కేంద్ర బలగాలు అయిన, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, కేంద్రానికి నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది.

nsg 02032020 1

చంద్రబాబుకి రక్షణగా ఉండే, ఎన్‌ఎస్‌జీ కమాండర్, ఈ మొత్తం వ్యవహరం పై, కేంద్ర హోమ శాఖకు ఒక నివేదిక పంపించారు. ఆ నివేదికలో, రాష్ట్ర పోలీసులు పై సంచలన ఆరోపణలు చేసారని తెలుస్తుంది. చంద్రబాబు విశాఖపట్నం పర్యటనలో, పోలీసులు, ఆయనకు కనీస రక్షణ కూడా కల్పించ లేదని, ఎక్కువ మంది నిరసనకారులు దూసుకు వచ్చినా, వారిని ఆపలేదని, రాళ్ళు, గుడ్లు, టమాటాలు, తీసుకు వచ్చి, ఆయన పై వెయ్యటానికి ప్రయత్నం చేసినా, నిర్లిప్తంగా వ్యవహరించారని, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇదంతా జరిగినట్టు, కేంద్ర హోం శాఖకు, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ బృందం నివేదిక పంపించింది. దీనికి సంబంధించిన, వీడియో ఎవిడెన్స్, ఫోటోలు కూడా కేంద్రానికి పంపినట్టు సమాచారం. మరో పక్క ఇప్పటికే కోర్ట్, ఈ విషయం పై సీరియస్ అయిన విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read