జపాన్ పరిశ్రమల కోసం ప్రత్యేక సింగిల్ డెస్క్ విధానాన్ని తీసుకురానున్నట్టు రాష్ట్ర పరిశ్రమల, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. శ్రీసిటీలోని జపాన్ కు చెందిన ప్రముఖ టోరే ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ శుక్రవారం ఉదయం రాష్ట్ర పరిశ్రమల, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వచ్చేందుకు త్వరలో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామన్నారు. ఈ పాలసీలో నైపుణ్య శిక్షణాభివృద్ధికి పెద్ద పీట వేస్తామని మంత్రి తెలిపారు. ప్రతిపార్లమెంటరీ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, దానికి అనుబంధంగా పలు కళాశాలలను ప్రారంభించడం ద్వారా నాణ్యమైన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చాలా ఆసక్తిగా వుందన్నారు. శ్రీ సిటీ యాజమాన్యం కోరిక మేరకు శ్రీ సిటీ నుంచే ఈ పాలసీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

1000 కోట్లుతో ఏర్పాటైన టోరె పరిశ్రమ, రాష్ట్రంలో పారిశ్రామిక స్థిరత్వాన్ని సూచిస్తోందన్నారు. ఇంజనీరింగ్ ప్యాబ్రిక్స్, టెక్స్ టైల్స్ తయారు చేసే ఈ తరహా పరిశ్రమ దేశంలోనే ఇదే మొదటిదని ఆయన తెలిపారు. స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వలన పలు జపనీస్ కంపెనీలు ఆంధ్రప్రదేశకు, ప్రత్యేకించి శ్రీసిటీకి రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. తమ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్రాన్ని ఎంచుకోవడం పట్ల టోరే యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామన్నారు. 29 దేశాలకు చెందిన 187 పరిశ్రమలతో 50 వేలకు పైగా ఉపాధి కల్పించి, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న శ్రీసిటీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.

అయితే ఇది ఇలా ఉంటే, టోరే కంపెనీ, చంద్రబాబు హయంలో వచ్చింది. అప్పట్లోనే ఒప్పందం చేసుకుని, భూమి ఇచ్చి, భూమి పూజ చేసి, కంపెనీ నిర్మాణం ప్రారంభించారు. ఈ కంపెనీని జగన్ తెచ్చినట్టు, వైసీపీ చెప్పటం పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. జరగాలి పెళ్లి... మళ్ళీ మళ్ళీ.. అనే వ్యంగ్య సామెతనుజగన్​ను చూసే పెట్టారేమో అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. కియా మోటార్స్ విషయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి బుర్రకథ వినిపించారని.. అలాగే తెదేపా హయాంలో వచ్చిన టీసీఎల్​ని తమ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. తాజాగా 'టోరే' వంతు వచ్చిందన్న లోకేశ్.. ఈ కంపెనీని ఎంతో కష్టపడి చంద్రబాబు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెదేపా హయాంలో 'టోరే' కంపెనీ రాష్ట్రంలో భూమిపూజ చేసిందని... భవనాలూ సిద్ధం అయిపోయన కంపెనీని తామే తెచ్చినట్లు వైకాపా ప్రభుత్వం హడావిడి చేస్తోందన్నారు. కియా మోటార్స్​ను బెదిరించినట్లు టోరేను కూడా బెదరగొట్టి ఏపీ నుంచి తరిమివేయొద్దని కోరారు.

క్రైస్తవ మత ప్రబోధకుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. బ్రదర్ అనిల్, తన పనుల మీద, హైదరాబాద్ నుంచి విజయవాడ కార్ లో వస్తున్న సందర్భంలో, అనిల్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి, రోడ్డు పక్క ఉన్న పొలాల్లోకి దూసుకు వెళ్ళింది. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారులో, ఎయిర్ బలూన్స్ ఓపెన్ అవ్వటంతో, బ్రదర్ అనిల్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వాహనం అతి వేగంతో రావాతమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. వాహనాన్ని నియంత్రించే క్రమంలో, వాహనం అదుపు తప్పటంతో, వాహనం పొలాల్లోకి వెళ్ళిపోయింది. అయితే, బ్రదర్ అనిల్ సురక్షితంగా బయట పడటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలంలో, కారు చూసిన ఎవరైనా, పెద్ద ప్రమాదం నుంచి అనిల్ బయట పడినట్టే చెప్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి, విజయవాడ వస్తున్న క్రమంలో, ఈ ఆక్సిడెంట్ అయ్యింది. ఆయనతో పాటుగా, డ్రైవర్, గన్ మెన్ కూడా ఉన్నారని సమాచారం.

న్ మేన్, డ్రైవర్‌కు పలు గాయాలు కావడంతో, వారికీ చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాద విషయాన్ని తెలుసుకున్న, స్థానిక జగ్గయ్య పేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సాధినేని ఉదయభాను వెంటనే అక్కడకి చేరుకున్నారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ అక్కడ నుంచి, విజయవాడ వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అతి వేగమే కారణమా, లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

జగన్ మోహన్ రెడ్డి, మూడు రోజుల వ్యవధిలో, రెండు సార్లు ఢిల్లీ వెళ్ళటం పై, అనేక చర్చలు జరుగుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది, రాజకీయ అవసరాల కోసం అని, అటు బీజేపీ కూడా, తమ రాజకీయం కోసమే, జగన్ ని పిలిపించిందనే వార్తలు వస్తున్నాయి. త్వరలో జరగబోయే, కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో, జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ పార్టీని కూడా తీసుకునే విషయంలోనే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారానికి, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, మరింత బలం చేకురుంది. కేంద్ర మంత్రి వర్గంలో, వైసీపీకి, రెండు నుంచి మూడు మంత్రి పదవులు దక్కే అవకాసం ఉందని తెలుస్తుంది. విజయసాయి రెడ్డితో పాటుగా, బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్‌ తో పాటు, మరోకరకు మంత్రి పదవి ఇచ్చే విషయం పై, చర్చలు జరుగుతున్నాయని సమాచారం వస్తుంది. గత వారం పది రోజుల నుంచి ఈ జరుగుతున్న ఈ ప్రచారం, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటంతో, మరింత ఊపు అందుకుంది.

అయితే ఇదే విషయం పై, నిన్న రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణను, మీడియా ప్రశ్నించింది. కేంద్ర మంత్రి వర్గంలో, వైసీపీ చేరుతుంది కదా అని విలేఖరులు ప్రశ్నించగా, బొత్సా ఆచి తూచి స్పందించారు. తాము ఇప్పటికే కేంద్రంలోని మోడీ సారధ్యంలో ఉన్న ప్రభుత్వానికి, అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. మొన్నటి దాక, జగన్ కు ఢిల్లీలో అప్పాయింట్మెంట్ లేదు అని చెప్పిన పత్రికలే, ఈ రోజు బీజేపీ, వైసీపీ దగ్గర అవుతున్నాయని రాస్తున్నాయని బొత్సా అన్నారు. కేంద్రంతో తాము ఎందుకు గొడవ పెట్టుకుంటామని అన్నారు. తాము కేంద్రంతో ఏమి రాసుకుని పూసుకుని తిరగటం లేదని, అలాగని, వారితో పూర్తిగా వైరం పెట్టుకోలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని, దాని కోసం, ఎంత వరకు అయినా వెళ్తాం అని, ఎవరి గడ్డెం అయినా పట్టుకుని బ్రతిమలాడతాం అని బొత్సా అన్నారు. రాష్ట్రానికి నష్టం అనుకుంటే, దాని జోలికి వెళ్ళాం అని అన్నారు. కేంద్రంతో వైసీపీ కలిస్తే, రాష్ట్రానికి మేలు అనుకుంటే, ముందుకు వెళ్తాం అని అన్నారు. ఇక చిరంజీవికి వైసీపీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నారు కదా అని ప్రశ్నించగా, దీని పై కూడా బొత్సా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పార్టీ ప్రయోజనాలకు ఏది మంచి నిర్ణయం అయితే అది తీసుకుంటామని, పార్టీ బలోపేతానికి పనికొచ్చే నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్ది తీసుకుంటారని, మరో రెండు నెలలు పొతే, ఎవరికీ సీట్ ఇచ్చేది, చెప్తామని, ముందుగానే, ప్రయారిటీ లిస్టు చెప్పలేం కదా అని బొత్సా అన్నారు.

ముఖ్యమంత్రి జగ న్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సాధించిందేమిటని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, అభివృద్ధి నిధులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర వాటి గురించి ఏమీ మాట్లాడనపుడు ఆయన ఢిల్లీ వెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఆయన వద్ద 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన వేల కోట్ల నిధు లను అడిగే దమ్ము, ధైర్యం ఆయనకు లేవా అని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో బీజేపీని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. దేశాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాగా, దేశంలో బీజేపీని నిలదీసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అంటూ చమత్కరించారు. జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ ముందు సరెండర్ అయ్యారని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న విజయన గరం జిల్లాకు బుందేల్‌ఖండ్ మాదిరిగా కేంద్రం రూ.5వేల కోట్లు ప్యాకేజీ ఇస్తే పక్క జిల్లాల మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింద న్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇక్కడ వలసలు నిరోధించగలిగామన్నారు. దళిత మైనార్టీలను కాపాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో వైసీపీ నిలదీస్తే, కాంగ్రెస్ మీకు సహకరిస్తుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పాటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్నార్సీల మీద సుప్రీం కోర్టు తీర్పును పునఃపరిశీలన చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆనాడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే దివంగత వైఎస్ రాజు శేఖరరెడ్డి అంతిమ లక్ష్యమని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి, 42 ఎంపీ సీట్లు గెలిచి, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని చెప్తూ ఉండే వారని గుర్తు చేసారు. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి కూడా, ఈ ఆశయం కోసం పని చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పుడు మాత్రం, జగన్ పూర్తీ భిన్నంగా ఉన్నారని అన్నారు. అలాంటి నాయన పేరు చెప్పుకొని నేడు కాంగ్రెస్ కు బద్ద శత్రువులుగా ఉండే బీజేపీ ముందు జగ న్మోహన్ రెడ్డి తన అధికారం కోసం ప్రధాని మోదీ, అమిత్ షాలకు వంగి వంగి దండాలు పెడుతున్నాడని వ్యంగ్యంగా అన్నారు. రెండు రోజుల నుంచి వస్తున్న ఫోటోలు చూసి, వైఎస్ఆర్ ఆత్మ క్షోబిస్తుందని, శైలజానాథ్ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read