జనవరి 30న చంద్రబాబు లేఖకు చంద్రబాబుకు విదేశాంగమంత్రి జైశంకర్ రిప్లై ఇచ్చారు. చైనాలో కరోనా వ్యాధితో అల్లాడుతున్న వుహాన్ నగరంలో చిక్కుకున్న 58మంది ఇంజనీర్ల ఆరోగ్యంపై చంద్రబాబు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి విదితమే. దానికి జవాబిస్తూ ప్యానల్ ఆప్టోడిస్ ప్లే టెక్నాలజి ప్రైవేట్ లిమిటెడ్ ఇంజనీర్ల తాజా స్థితిగతులపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వివరాలను తెలియజేశారు. మొత్తం 58ఇంజనీర్లలో 56మందిని వుహాన్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఫిబ్రవరి 1నే తరలించామని తెలిపారు. ఈ 56మంది ప్రస్తుతం ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఇద్దరు ఇంజనీర్లు అన్నెం జ్యోతి, దొంతంశెట్టి సత్య సాయికృష్ణలకు సాధారణం కన్నా జ్వరం స్వల్ప తీవ్రత ఉండటంతో ఫిబ్రవరి 1న విమానంలో పంపేందుకు చైనా అధికారులు అనుమతించలేదు. ఈ ఇద్దరు చైనాలోని వుహాన్ హైటెక్ డెవలప్ మెంట్ జోన్, ఆప్టిక్స్ వ్యాలీ ఇండస్ట్రియల్ పార్క్ లో స్టార్ట్ ఆప్టోఎలక్ట్రానిక్స్ టెక్నాలజి కం లిమిటెడ్ లోనే ప్రస్తుతం ఉన్నారు.

బీజింగ్ లోని భారత ఎంబసి అధికారులు వారిద్దరితో, వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. ఆ ఇద్దరికి కావాల్సిన వైద్య చికిత్స, ఇతర అవసరాలలో అండగా ఉండాలని, వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, వారి క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వుహాన్ లోని వైద్యాధికారులను భారత ఎంబసి అధికారులు అభ్యర్ధించారు. వారిద్దరి ఆరోగ్యానికి, చికిత్సకు సంబంధించిన సమాచారాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరుగుతుందని, కేంద్రమంత్రి జైశంకర్ ఆ లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు గత 5 ఏళ్ళ పాలనలో, 2014 నుంచి 2019 వరకు చేసిన పరిపాలనలో, ఒక్క పెట్టుబడి కూడా రాలేదని, ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగం కూడా రాలేదని, గత 5 ఏళ్ళ పాటు, వైసీపీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అమరావతి మీద, పోలవరం మీద ఎలాంటి ప్రచారం, గడిచిన 5 ఏళ్ళలో జరిగిందో, చంద్రబాబు పెట్టుబడులు తేలేదు అంటూ, అదే రకమైన ప్రచారం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తూ, చంద్రబాబు దావోస్ వెళ్ళేది, లేక ఇతర దేశాలకు వెళ్ళేది, విహార యాత్రలకు అంటూ ఎద్దేవా చేసారు. చంద్రబాబు సుందర మొఖం చూసి, ఉద్యోగాలు వస్తాయా అంటూ, జగన్ మోహన్ రెడ్డి హేళన చేస్తూ మాట్లాడే వారు. యువతతో మీటింగ్ లు పెట్టి, ఇదే విషయాన్ని వారికి ఎక్కించే వారు. చంద్రబాబు ఒక్క పెట్టుబడి కూడా తేలేదు అని, మేము అధికారంలోకి రాగానే, కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తెస్తామని, అప్పుడు పెట్టుబడులే పెట్టుబడులు అంటూ నమ్మించారు. అయితే, ఇక్కడ గత ప్రభుత్వం తప్పు కూడా ఉంది.

చంద్రబాబు హయంలో అనేక కంపెనీలు వచ్చినా, ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తున్నా, వాటిని ఖండించే ప్రయత్నం చెయ్యలేదు. దీంతో, అదే నిజం అని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. చివరకు చంద్రబాబు ఎన్నికలు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. ఎంతో కీలకంగా ఉండే యువ ఓటర్లు చంద్రబాబు వైపు నిలవలేదు. అయితే, ఇప్పుడు తాజగా ఆర్బీఐ ఇచ్చిన ఒక నివేదికలో, వైసీపీ చేసిన ప్రచారం అంతా అబద్ధం అని తేలిపోయింది. ఏకంగా ఆర్బీఐ నివేదిక ఇవ్వటంతో, దీని కంటే ప్రామాణికంగా ఉండేది ఇంకోటి లేదు అనే చెప్పాలి. 2018-19లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దేశంలో పెట్టిన పెట్టుబడుల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.8 శాతం పెట్టుబడులను ఆకర్షించి, దేశంలోనే ఏపి మొదటి స్థానంలో నిలిచింది.

పెద్ద రాష్ట్రాలు అయిన గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో నిలిచాయి. ఇక గడించిన 5 ఏళ్ళలో, అంటే, 2014 నుంచి 2019 వరకు వచ్చిన పెట్టుబడులు చూస్తే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 2014 నుంచి 2019 వరకు రూ.7,03,103 కోట్ల విలువైన 2,112 ప్రాజెక్టులు, దేశ వ్యాప్తంగా రాగా, 70 వేల కోట్ల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా తన రిపోర్ట్ లో వెల్లడించింది. ఈ ఐదేళ్ల కాలంలో, 13.6% వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 13.4% వాటాతో గుజరాత్‌ రెండో స్థానంలో నిలవగా, 10% వాటాతో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. రిపోర్ట్ ల్లో ఇంత స్పష్టంగా ఉంటే, వైసీపీ అలా ప్రచారం చేసి నిజం అని నమ్మించింది అంటే, ఇది అప్పటి టిడిపి ప్రభుత్వం వైఫల్యంగానే చెప్పుకోవాలి.

ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటన తరువాత ఆయన నోటినుంచి ఒక్కమాట కూడా రాలేదని, ప్రధాని, ఇతరమంత్రులకు ఇచ్చిన విజ్ఞాపనలను పబ్లిక్‌డొమైన్‌లో పెట్టకపోవడం విడ్డూరంగా ఉందని, టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడుతూ, కేంద్రమంత్రులకు విడివిడిగా వినతిపత్రాలిచ్చిన ముఖ్యమంత్రి, వాిలోని వివరాలను వెల్లడించడానికి ఎందుకు సంకోచిస్తున్నాడన్నారు. కనీసం మీడియాముందు కు కూడా రాలేని నిస్సహాయస్థితిలో సీఎం ఎందుకున్నాడో చెప్పాలన్నారు. మంత్రి బొత్స ఒకప్రముఖ పత్రికాసంస్థ అధినేతకు లేఖరాశారని, దానిలో తాను అననిమాటలను అన్నట్లుగా రాసినట్లు ఆయన ఆరోపించారని దేవినేని తెలిపారు. అదేవార్తను టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రభ పత్రికలుకూడా ప్రచురించాయని, బొత్స వాటికి ఎందుకు నోటీసులివ్వలేదని దేవినేని ప్రశ్నించారు. వైసీపీప్రభుత్వం ఎన్డీఏలో చేరుతున్నట్లు మంత్రే ప్రకించారంటూ, అందుకు సంబంధించిన వీడియోను ీడీపీనేత విలేకరుల ఎదుట ప్రదర్శించారు. జగన్‌ ఒత్తిడివల్లే బొత్స 1974, ఆగస్ట్‌10న ప్రారంభమైన ప్రముఖ తెలుగుదినపత్రిక వ్యవస్థాపకుడికి నోీసు ఇచ్చాడని, ఆయనవైఖరి చూస్తుంటే, సీఎం, సాక్షిమీడియా ఎంతలా భయపడుతున్నాయో అర్థమవుతోందన్నారు.

చంద్రబాబు, సదరుపత్రికా యజమాని వయస్సుని గురించి హేళనగా మ్లాడుతున్న మంత్రులంతా ఒక్కసారి వారి బతుకులేమిో, ఎక్కడినుంచి వచ్చారో ఆలోచిస్తే బాగుంటుందన్నారు. 2018-19లో దేశంలోనే పెట్టుబడులు ఆకర్షణలో ఏపీ మూడోస్థానంలో నిలిచి, రూ. 70వేలకోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిందని, వైసీపీవచ్చాక రూ.లక్షా80 వేలకోట్ల పెట్టుబడులు రాష్ట్రంనుంచి వెనక్కువెళ్లాయని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే చెప్పిందన్నారు. ఈ అంశాన్ని వదిలేసిన రాష్ట్ర ఆర్థికమంత్రి పదేపదేపాతపాటే పాడుతూ పాచిపళ్ల దాసుడిగా తయారయ్యాడన్నారు. కియావెళ్లిపోవడం గురించి, కియా అనుబం ధపరిశ్రమలు తరలిపోవడం గురించి, విశాఖలో ఉండాల్సిన సంస్థలు వెనక్కువెళ్లడం గురించి మ్లాడలేని బుగ్గన, అసెంబ్లీలో చెప్పిన రాజధానిభూముల ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ కి సంబంధించిన తప్పులప్రసంగాన్నే, నేడుకూడా చదివి వినిపించాడన్నారు. అమరావతి పై విషం చిమ్మడంతప్ప, బుగ్గనకు, ఇతరమంత్రులకు రాష్ట్రంలోని ఇతరసమస్యలు పట్టడంలేదన్నారు.

రాజధానిలోని ఎస్‌ఆర్‌ఎం, వ్‌ి విశ్వవిద్యాలయం, అమృతమయ విశ్వవిద్యాలయాలు మూసేసి, విజ్ఞాన్‌సంస్థలకు లాభంచేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థికఎమర్జన్సీ వస్తున్నా కూడా బుగ్గన తన బురదజల్లే ప్రయత్నాలు మానుకోవడంలేదన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్‌, సివిల్‌ సప్లైస్‌ మంత్రులంతా బాధ్యతలేకుండా, వారిశాఖలపై అవగాహనలేకుండా మ్లాడు తున్నారని, ధాన్యం, మిర్చి, సుబాబుల్‌రైతులు గిట్టుబాటుధరలేక రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. గుంటూరు మిర్చియార్డులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు రైతులను దోచుకుంటుంటే, ఆయనేమో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. వైసీపీమంత్రులు, సాక్షిమీడియా వార్తలుచూస్తుంటే, వారేదో మానసికజాడ్యంతో బాధప డుతున్నట్లుగా అనిపిస్తోందని, ఐీశాఖ సోదాలు నిర్వహించిన శ్రీనివాస్‌, కిలారిరాజేశ్‌ ల ఇళ్లలో దొరికినసొత్తుపై ఆశాఖ ఇచ్చే పంచనామా లేకుండా పిచ్చిపిచ్చిరాతలు ఎలా రాస్తారని టీడీపీనేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు.

పంచనామా ప్రచురించ కుండా, ఐటీశాఖ ఇచ్చిన పూర్తివివరాలు రాయకుండా తప్పుడు వార్తలురాసిన సాక్షిపత్రి కపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సాక్షిపత్రికకు నీతి, నిజాయితీ ఉంటే, ఐీసోదాలు జరిగిన మూడుకంపెనీల గురించి ఎందుకు రాయడంలేదన్నారు. పూర్తిగా విషప్రచారం చేయడం మానకపోతే, సాక్షిని, ఆసంస్థ యాజమాన్యాన్ని కోర్టుల్లో దోషులు గా నిలబ్టెి తీరుతామని అశోక్‌బాబు తేల్చిచెప్పారు. ఐీశాఖ వివరణను కనిపించి, కనిపించకుండా ప్రచురిస్తూ, చంద్రబాబు దగ్గర గతంలో పనిచేసిన శ్రీనివాస్‌, కిలారి రాజేశ్‌ల చిత్రాలను, వారి వివరాలను పెద్దపెద్ద అక్షరాలతో వేయడం సాక్షి చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమేనని అశోక్‌బాబు దుయ్యబ్టారు. సాక్షి వార్తలో భూతద్దం వేసి వెతికినా ఎక్కడా వాస్తవాలు కనిపించడంలేదని, చంద్రబాబు ని, లోకేశ్‌ని దోషులుగా చూపాలన్న తాపత్రయం తప్ప, ఐీశాఖ ఇచ్చిన పూర్తివివరాలు ఇవ్వకుండా తప్పుడువార్తలు రాయడం సిగ్గుచేటని ీడీపీనేత, మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ దుయ్యబ్టారు. జర్నలిజంలో కనీసవిలువలను పాించని సాక్షి మీడియాను బ్యాన్‌చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆధారాలు లేకుండా మసి పూసి మారేడుకాయగా ఏమార్చే ప్రక్రియను నమ్ముతున్న సాక్షి, తన హీనమైన చర్యలతో మీడియావ్యవస్థకే కళంకంగా మారిందన్నారు. మంత్రులుకూడా జ్ఞానంలేకుండా సాక్షి రాతలనే పట్టుకొని పిచ్చిపిచ్చిగా మ్లాడటం సరికాదన్నారు. ఐీశాఖ తాను నిర్వహించి న సోదాల్లో ఎక్కడాకూడా చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పలేదన్నారు. నిజంగా టీడీపీనేతలు తప్పుచేసి ఉంటే, అధికారంలోఉన్న వైసీపీ, చర్యలు తీసుకోకుండా ఎందుకు వెనకడుగు వేస్తోందని శ్రావణ్‌ ప్రశ్నించారు.

గత మూడు నాలుగు రోజులుగా, వైసీపీ పార్టీ, ఎన్డీఏలో చేరుతుందని, చేరగానే, వారికి కేంద్ర మంత్రి పదవులు వస్తాయి అంటూ, ప్రచారం జరిగింది. వైసీపీకి రెండు నుంచి మూడు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని, విజయసాయిరెడ్డికి నౌకాయానశాఖను ఇస్తారని, మరొకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి వస్తుంది అనే వార్తలు వచ్చాయి. ఈ విషయం పైనే, జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ వెళ్ళారని, మూడు రోజుల వ్యవధిలో జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం వెనుక, కారణం ఇదే అని, అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో, ఈ విషయం పై చర్చలు జరిపారనే, వార్తలు వచ్చాయి. నిన్న ఇదే విషయం పై బొత్సా సత్యన్నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రం కోసం ఎవరితో అయినా కలుస్తామని, రాష్ట్రానికి మంచిది అనుకుంటే, కేంద్ర మంత్రి పదవి తీసుకుంటాం అని చెప్పిన విషయం తెలిసిందే. దీని పై ఇప్పటికే, గోల జరగటంతో, నేను అలా అనలేదు అంటూ ఈ రోజు బొత్సా మరో ప్రకటన విడుదల చేసారు. మొత్తంగా, వైసీపీ, కేంద్రం మంత్రి వర్గంలో చేరుతుంది అంటూ, మీడియాకు లీకులు ఇచ్చారు.

అయితే ఇదే విషయం పై, బీజేపీ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్, ఈ ప్రచారం పై స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. తమకు ఆంధ్రప్రదేశ్ లో కేవలం జనసేనతో పొత్తు ఉందని, తెలుగుదేశం పార్టీతో కాని, వైసీపీ పార్టీతో కాని, ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పారు. వైసీపీ పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది ప్రచారం మాత్రమే అని సునీల్ దేవధర్ తేల్చి చెప్పారు. ఈ విషయం పై, గత రెండు రోజులుగా అనేక, చర్చలు జరిగిన విషయం తమకు తెలుసని, ఇవన్నీ తప్పుడు వార్తలని, వైసీపీ, కేంద్ర మంత్రి వర్గంలో చేరే అవకామే లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు, తమకు వైసీపీ, రాజకీయ ప్రత్యర్థులే తప్ప మరొకటి కాదని, సునీల్ దేవధర్ స్పష్టం చేసారు.

"జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాను కలిసిన తరువాత, వైసీపీ పార్టీ ఎన్డీయేలో చేరి, కేంద్ర మంత్రి పదవులు చేపడుతున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం పై నేను మీకో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని, దీని కోసం వీలు అయినంత సహాయం చెయ్యాలని మోడీ సారధ్యంలోని కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, వేరే పార్టీ ఉన్నా, రాష్ట్రాలకు సహాయం చెయ్యటంలో, కేంద్రం వైఖరిలో మార్పు ఉండదు. మాకు అన్ని రాష్ట్రాలు ఒక్కటే, అన్ని రాష్ట్రాలను సమాన దృష్టిలో చూస్తాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చే సరికి, మేము జనసేన పార్టీతో మాత్రమే పొత్తు పెట్టుకున్నాము. ఏపిలో అధికారంలో ఉన్న వైసీపీతో కాని, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కాని, మాకు రాజకీయ ప్రత్యర్థులే" అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read