తానెందుకు ఢిల్లీ వెళ్లొచ్చాడు.. ప్రధానితో ఏం చర్చించాడనేది జగన్మోహన్‌రెడ్డి ఇంతవరకు స్పష్టంచేయలేదని, శాసనమండలిరద్దు, మూడురాజధానుల ఏర్పాటు అంశాలపై చర్చించడానికే ఆయన ఢిల్లీవెళ్లినట్లు స్పష్టమవుతోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పష్టంచేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీలు, రామకృష్ణ, బీ.ీ.నాయు డుతో కలిసి మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. తనకు అనుకూలంగా వ్యవహరించలేదన్న అక్కసుతో మండలిని రద్దుచేయాలనుకుం టున్న జగన్‌, తనకు అధికారముంటే రాజ్యసభను, లోక్‌సభను కూడా రద్దుచేసిఉండే వాడని అశోక్‌బాబు ఎద్దేవాచేశారు. జగన్‌ తనరాజకీయ కక్షకోసమే మండలిరద్దుకు పూనుకున్నాడనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, ప్రజాస్వామ్యవ్యవస్థలను కాపాడుకునేందుకు కలిసివచ్చేఇతరపార్టీల సభ్యులను కలుపుకొని ఢిల్లీ వెళతామని టీడీపీనేత తెలిపారు. ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులను కలిసి, మండలిరద్దుకు జగన్‌అనుసరిస్తున్న కారణాలను వారికి వివరిస్తామన్నారు. పదిరాష్ట్రాలు మండలిఏర్పాటును కోరుకుంటున్నాయని, కేవలం తననిర్ణయాన్ని అడ్డు కున్నారన్న అక్కసుతోనే జగన్‌ పెద్దలసభపై కక్ష క్టాడన్నారు. సీఆర్డీయేరద్దు, మూడురాజ ధానుల ఏర్పాటు నిర్ణయాలను అడ్డుకోవడమే మండలిచేసిన తప్పిదంగా జగన్‌ భావిస్తు న్నాడన్నారు. ఇదివరకే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నామని, పార్లమ్‌ెంసమావేశాలు, అమరావతి జే.ఏ.సీసభ్యుల ఢిల్లీపర్యటనతో తమనిర్ణయాన్ని వాయిదావేసుకున్నామని అశోక్‌బాబు తెలిపారు.

అసెంబ్లీలో మేథావులున్నారని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మూడురాజధానుల నిర్ణయం తీసుకున్నందుకు బాధ్యతవహి స్తూ, అసెంబ్లీనికూడా రద్దుచేయాలని అశోక్‌బాబు డిమాండ్‌చేశారు. కేవలం బిల్లులకు సూచనలు, సవరణలు చేశారని వ్యవస్థల్ని రద్దుచేయాలనుకునే ముఖ్యమంత్రి, అసెంబ్లీ రాష్ట్రానికి అవసరంలేదని, ఆయన దాన్ని రద్దుచేస్తాడా అని అశోక్‌బాబు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలెవరూ అడ్డదారుల్లో, గాలికి కొట్టుకురాలేదనే విషయాన్ని జగన్‌ గుర్తిస్తేమం చిదన్నారు. వచ్చే ఏడాదినుంచి ప్రభుత్వ, ప్రైవ్‌ేపాఠశాలల్లో ఒకి నుంచి 6వతరగతి వరకు నిర్బంధ ఆంగ్లమాధ్యమబోధనను అమలుచేయడానికి సిద్ధపడిన ప్రభుత్వం, ఆనిర్ణయానికి తల్లిదండ్రుల కమిీలు కూడా అంగీకారం తెలిపాయని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ ఏ.ఎస్‌.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేలా, తల్లిదండ్రులకమిీలను బెదిరించడం ఒకకారణమైతే, వారికి ఇంగ్లీషు బోధనపై సరైన అవగాహనలేకపోవడం మరోకారణమన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మ కతను వెలికితీయడానికి పనికొచ్చే తెలుగుబోధననుకాదని, ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడంవల్ల, పిల్లల్లో ఒత్తిడి అధికమవుతుందని, భవిష్యత్‌లో డ్రాపవ్స్‌ు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

ఏమీడియంలో చదవాలనేది విద్యార్థినీ, విద్యార్థులకు ఐచ్ఛికాంశంగా ఉండాలితప్ప, బలవంతగా అమలుచేయడం సరికాదన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 3,500లకు పైగా మున్సిపల్‌పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశప్టిెందన్నారు. ఆప్పుడు బట్టలూడదీసి గగ్గోలుప్టిెన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నేడు ఎక్కడకు పోయాడని రామకృష్ణ నిలదీశారు. తెలుగుఅకాడమీ ఛైర్మన్‌గా ఉన్న లక్ష్మీపార్వతిని పక్కనే కూర్చొబెట్టుకొని మంత్రి ప్రకటన చేశాడని, తెలుగుభాషే లేకపోతే, ఆమెకు ఆపదవులు ఎందుకని ఏ.ఎస్‌. ప్రశ్నించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు స్వేచ్ఛలేకుండా, ఎంఈవోలు, డీఈవోలద్వారా తల్లిదండ్రుల కమిీలు ఒప్పుకున్నాయని చెప్పించారని, కుప్పంలోని పాఠశాలలన్నీ ఆంగ్లానికి ఓటేశాయనడం దుర్మార్గమన్నారు. ఒకతటస్థమైన ఏజెన్సీద్వారా ప్రజల్లో ఇంగ్లీషుమా ధ్యమంపై రహస్యఓింగ్‌ జరపాలని ఆయన డిమాండ్‌చేశారు. విద్యాహక్కుచట్టం, జాతీయ విద్యావిధానం, రాజ్యాంగం మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని స్పష్టం చేస్తున్నాయని, అవేవీ ప్రభుత్వం ప్టించుకోవడంలేదన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధం గా రాష్ట్రప్రభుత్వమే నిర్బంధ ఆంగ్లమాధ్యమబోధనను అమలుచేస్తోందన్నారు. విద్య విషయంలో కూడా వైసీపీ ఓట్లరాజకీయాలు చేస్తోందని, కోర్టులు ఈవిధానాన్ని తప్పు ప్టినా, ప్రభుత్వం తనవైఖరి మార్చుకోవడంలేదన్నారు.

వచ్చే బడ్జ్‌ెసమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్‌పై ప్రివిలేజ్‌మోషన్‌ నోీస్‌ ఇస్తామని, ీడీపీ ఎమ్మెల్సీ బీ.ీ.నాయుడు తెలిపారు. ఆర్టికల్‌169 ప్రకారం ఏర్పడిన మండలి గురించి, ఛైర్మన్‌గురించి చులకనగా మ్లాడి, గవర్నర్‌తర్వాత అంతిహోదా ఉన్న ఛైర్మన్‌ను దుర్భాషలాడినందుకు ముఖ్యమంత్రిపై ప్రివిలేజ్‌మోషన్‌ నోీసు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. శాసససభకు ఎన్నికైనవారే ప్రజలద్వారా ఎన్నుకోబడ్డారని, మండ లి సభ్యులంతా దొడ్డిదారిన వచ్చారనే పదాన్ని ముఖ్యమంత్రి వినియోగించాడన్నారు. గ్రాడ్యుయ్స్‌ే, ీచర్స్‌, స్థానికసంస్థల సభ్యులద్వారా, గవర్నర్‌, ఎమ్మెల్యేలద్వారా ఎన్ను కున్నవారంతా అసమర్థులన్నట్లుగా అసెంబ్లీలో చిత్రీకరించాలని ముఖ్యమంత్రి ప్రయ త్నించాడన్నారు. నిద్రనిస్తున్న జగన్‌కు అన్నీ తెలిసొచ్చేలా చేస్తామన్నారు. రాష్ట్రపతి నుంచి గ్‌ిెనోిఫికేషన్‌ వచ్చేవరకు మండలికొనసాగుతుందన్నారు. మండలికార్యదర్శి, ఛైర్మన్‌పై ధిక్కారస్వరం వినిపించడానికి ప్రభుత్వమే కారణమన్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో జోష్ నింపేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఏపీ అధ్యక్షునిగా ప్రస్తుతం కొనసాగుతున్న కళావెంకట్రావు స్థానంలో మరొకరికి అవకాశమివ్వాలని భావిస్తున్నారు. ఈమేరకుఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు సైతంచేస్తున్నట్లు సమా చారం. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చే పనిలో నిమగ్నమైంది. టీడీపీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ నియామకాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రాధా న్యత ఇవ్వాలనిచంద్రబాబు భావిస్తున్నారు. ఇప్ప టికే తెలుగుమహిళా అధ్యక్షురాలిని సైతం విశాఖ కు చెందినమాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడితోపాటు తెలుగు యువత అధ్యక్ష పదవిని సీమ సీమ ప్రాంతానికి చెందినయువనేతకు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఏపీ, తెలంగాణా లకు ఇద్దరు అధ్యక్షులను నియమించింది. ఏపీ అధ్యక్షునిగా శ్రీకాకుళంకు చెందిన కిమిడి కళా వెంకట్రావును నియమించారు.గత ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. ఇప్పుడుస్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలతో పాటుగా పార్టీలో జోష్ నింపేందుకు సంస్థాగతంగా కొత్త నియామకా లు చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా తిరిగి శ్రీకాకుళంకే చెందిన మాజీమంత్రి అచ్చెన్నాయుడితో పాటు రామ్మోహన్ నాయుడిలో ఒకరికి పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు నేతలు ఇప్పుడు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు అసెంబ్లీలో బాబాయ్, ఇటు పార్లమెంట్ లో అబ్బాయ్, గట్టిగా తమ వాణి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

మాజీ మంత్రిగా, వాయిస్ ఉన్న నేతగా గుర్తింపు ఉండటంతో పాటుగా అసెంబ్లీలోనూ బయట వైసీపీని ఎటాక్ చేయడంలో చంద్రబాబుకు చేదోడువా దోడుగా నిలుస్తున్న అచ్చెన్నాయుడికే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది. రామ్మోహన్ నాయుడు ఎంపిగా పార్లమెంటులో తన ప్రసంగాలతో ప్రత్యేక గుర్తింపు పొందా రు. ఆయన సేవలు పార్టీ భవిష్యత్ లో మరింత గావినియోగించుకునే అవకాశముందని, అచ్చెన్నాయుడికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలో దివంగత ఎర్రంనాయుడు కూడా, చంద్రబాబుకి ఎంతో అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎర్రం నాయుడు, ఢిల్లీలో ఉంటూ, పార్టీ తరుపున అన్ని పనులు చేస్తూ, చంద్రబాబుకి చేదోడు వాదోడుగా ఉండేవారని, ఇప్పుడు అచ్చెంనాయుడు, రామ్మోహన్ నాయుడు అండగా ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు.

“విజిలెన్స్ కార్యాలయం లేకుండా సచివాలయం ఎలా పనిచేస్తుంది ? ఆ శాఖలో ఎంత మంది పనిచేస్తున్నారు ? వారి హోదాలు ఏమిటి ? వారి విధులు, వేతనాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి " అని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దానిపై ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారితో అఫిడవిట్ సమర్పించాలని అడ్వకేట్ జనరల్ కు ధర్మాసనం సూచించింది. రాష్ట్ర సచివాలయం నుంచి విజిలెన్స కార్యాలయాన్నితరలిస్తూ జారీ చేసిన జీవో వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై రాష్ట్ర హైకోర్టులో - దాఖ లైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ శేషసాయి, జసిస్ట్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధ వారం విచారణ జరిపింది. ధర్మాసనం కోరిన వివరాలు సమర్పించేందుకు అడ్వకేట్ జనరల్ గడువు కోరటంతో విచారణను 18వ తేదీకి వాయిదా వేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 13ను సవాల్ చేస్తూ కొండేపాటి గిరిధర్, మరికొంత మంది వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.

హైకోర్టులో విచారణ సందర్భంగా బుధవారం పిటీషనర్లు కోరిన పలు అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. గిరిధర్ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదిస్తూ సచివాలయం లో అంతర్భాగంగా ఉన్న విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించకుండా చూడాలని కోరారు. ధర్మాసనం ప్రధానంగా దానిపైనే దృష్టిసారించింది. కార్యాలయం తరలింపుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ శ్రీరాం వివరణ ఇచ్చారు. “గత ప్రభుత్వం హయాంలో సలహదారులు తొమ్మిదిమంది ఉన్నారు. ప్రస్తుతం వారి సంఖ్య 40కి చేరుకుంది. అందరికి కేబినెట్ హోదా ఇవ్వటంతో నిబంధనల ప్రకారం వారందరికి పేషీలు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో సచివాలయంలో జాగా సరిపోవటం లేదు " అని అడ్వకేట్ జనరల్ వివరించారు.

జాగా సరిపోని పక్షంలో పక్కనే వేరొకటి నిర్మించుకోవచ్చు కదా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. కార్యాలయాన్ని పూర్తిగా తరలించటం లేదని, కేవలం కమీషనర్, దానికి అనుబంధంగా ఉండే ఉద్యోగులను మాత్రమే తరలిస్తున్నట్టు అడ్వకేట్ జనరల్ చెప్పారు. అసలు విజిలెన్స్ కార్యాలయంలో ఉద్యోగులు ఎంతమంది వున్నారు ? వారి హోదా, విధులు, వేతనాలకు సంబంధించి పూర్తి వివరాలు రేపటికల్లా తీసుకురండి అని ధర్మాసనం అడ్వకేట్ జనరలను సూచించింది. అయితే ప్రిన్సిపాల్ సెక్రటరీ అందుబాటులో లేనందున క్రిందిస్థాయి అధికారితో అఫిడవిట్ తీసుకురాగలనని అడ్వకేట్ జనరల్ చెప్పారు. అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. ప్రిన్సిపాల్ సెక్రెటరీ సాయి అధికారితోనే సంతకం చేయించి తీసుకురావాలని ఆదేశించింది. అడ్వకేట్ జనరల్ గడువు కోరటంతో కేసును 18వ తేదీకి వాయిదా వేసింది.

అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం 57వ రోజుకి చేరుకుంది. గత 57 రోజులుగా, చిన్న సంఘటన కూడా, జరగకుండా, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అమరావతి రైతులు. వారిని పైడ్ ఆర్టిస్ట్ లు అని పిలిచినా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లు అని పిలిచినా, వారు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోకుండా, ముందుకు వెళ్తున్నారు. తమ ఉద్యమాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఇలా ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమంలో, ఈ రోజు జరిగిన ఘటనతో , మందడం ఉలిక్కి పడింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బస్సులో వెళ్తున్న ఒక వ్యక్తి, దీక్షా శిబిరం పై, మందు సీసా విసరటంతో, ఒక్కసారిగా అక్కడ ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. బస్సుల్లో వెళ్తున్న ఒక వ్యక్తి, దీక్షా శిబిరంపై మందు సీసా విసిరేశాడు. ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అని కంగారు పడిన రైతులు తేరుకుని, బస్సుని ఆపారు, గ్రామస్తులు. బస్సుని ఆపి, రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.

మద్యం సీసా విసరిన వ్యక్తీని, గుంటూరు జిల్లా ధరణికోట కు చెందిన శ్రీనివాసరెడ్డిగా గుర్తించారు. శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి వైసీపీ సానుభూతి పరుడిగా రాజధాని ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. ఎవరైనా చెప్తే ఇలా చేసాడో, లేక ఎందుకు చేసాడో, పోలీసులు విచారించాలని కోరుతున్నారు. ఇక మరో పక్క, రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళలు, రైతులు, యువత పెద్ద ఎత్తున పాల్గొంటూ అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకుని అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాజధాని పరిధిలోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయ పాలెం, ఎర్రబాలెం, పెనుమాక తదితర గ్రామాల్లో మహాధర్నాలు, వంటవార్పు కార్యక్రమాలను నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. రహదారులపైకి వచ్చి వంటవార్పు నిర్వహిస్తూ జై అమరావతి అని, అమరావతిని రక్షించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు బుధ వారం నాటికి 57వ రోజుకు చేరుకున్నాయి. మహిళలు, రైతులు, యువత ప్రభుత్వ తీరుపై రోజుకో రూపంలో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు సుమారు 200 మందికి పైగా షిరిడీ సాయినాధుని సన్ని ధికి బయలుదేరి వెళ్లారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చు కుని, రాజధానిగా అమరావతినే కొనసాగించేలా జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చాలని సాయిబాబాను వేడుకోనున్నట్లు రైతులు తెలిపారు. షిరిడీ బయలుదేరి వెళ్లేముందు స్థానిక గ్రామ దేవ తలకు నైవేద్యాలు సమర్పించారు. షిరిడీలో అమరావతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. మందడం, వెలగ పూడి, తుళ్లూరు దీక్షా శిబిరాలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ, తదితరులు సందర్శించి దీక్షాపరులకు సంఘీభావం తెలియజేశారు. సాయంత్రం సమయంలో మహిళలు ప్రదర్శనగా దుకాణాలు, ఇంటింటికీ వెళ్లి అమరావతిని తరలిస్తే జరిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. ఎర్రబాలెంలో ఆర్టీసీ బస్సులను, కార్లను నిలిపి అద్దాలు శుభ్రపరుస్తూ, ప్రయాణికులకు గులాబీలు ఇస్తూ నిరసన వ్యక్తంచేశారు.

Advertisements

Latest Articles

Most Read