రాష్ట్రమంత్రివర్గమంతా ఊకదంపుడుగా మీడియాముందుకొచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ, జగన్‌మెప్పుకోసం అర్రులచాస్తున్నారని, చంద్రబాబు దగ్గర గతంలో పనిచేసిన శ్రీనివాస్‌ అనేవ్యక్తి ఇంటిలో ఐటీదాడుల్లో రూ.2వేలకోట్లు దొరికాయంటూ, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐటీశాఖ నిర్వహించిన సోదాల వివరాలపై పూర్తిస్థాయి నివేదిక (పంచనామా) వచ్చాక, దానిఆధారంగా ఎవరిపేర్లున్నాయో, ఎవరు ఎవరికి బినామీలో చర్చిద్దామని టీడీపీ చెబుతున్నా, నిస్సిగ్గుగా బురదజల్లడానికే రాష్ట్రమంత్రులు , వైసీపీనేతలు తాపత్రయపడుతున్నారన్నారు. పరిపాలన చేయడం చేతగాక, నిందారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఐటీసోదాలపై బహిరంగచర్చకు రావడానికి వైసీపీనేతలు, మంత్రులు సిద్ధంగా ఉంటే, వేదికనువారే నిర్ణయించాలని ఆలపాి సూచించారు. వ్యవస్థలపై వారికి ఏమాత్రం నమ్మకమున్నా, వారు తక్షణమే సీబీడీటీ ప్రకటన, ఐటీసోదాలపై బహిరంగచర్చకు రావాలన్నారు. గతంలో ఊళ్లలో అచ్చోసిన ఆంబోతులని తిరుగుతుండేవని, రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్మూలించే కార్యక్రమాలు చేస్తున్న మంత్రులుకూడా అదేవిధంగా తయారయ్యారని ఆలపాటి మండిపడ్డారు.

చంద్రబాబుని అవినీతిపరుడిగా చిత్రీకరించడంకోసం, నాటి వై.ఎస్‌నుంచి నేటి జగన్‌ వరకు అందరూ కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. పీపీఏలరద్దు, రివర్సటెండరింగ్‌, రాజధానిలో ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ అని, గృహనిర్మా పథకాల్లో అవినీతి జరిగిందని, విషప్రచారంచేసి చివరకు ఏమీనిరూపించలేక తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారన్నారు. 9నెలల్లో సాధించిందేమీ లేకపోవడంతో చివరకు ఆధారాల్లేని ఆరోపణలతో ప్రతిపక్షంపై పసలేని వాదనలు చేస్తున్నారని రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. పార్లమెంటుసాక్షిగా ప్రత్యేకహోదా ఇవ్వమని కేంద్రంచెబితే, హోదాకోసం జగన్‌ ఢిల్లీవెళ్లాడని చెప్పుకోవడం సిగ్గుమాలిన వైసీపీనేతలకే చెల్లిందన్నారు. కర్నూలుని న్యాయరాజధానిగా చేస్తామని చెబుతూ, కేంద్రానికిచ్చిన నివేదికలో మాత్రం హైకోర్టుబెంచ్‌ ఏర్పాటుచేయాలని కోరడం సీమ వాసుల్ని మోసగించడంకాదా అన్నారు.

మంత్రివర్గమంతా అలీబాబా 40దొంగలముఠా లా మారి, రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలకు పాల్పడుతోందన్నారు. విశాఖకేంద్రంగా ఉన్న ప్రాజెక్టుల్లో మంత్రులు 70శాతం, 80శాతం షేర్‌హోల్డర్లుగా ఎందుకు మారారో చెప్పాలన్నారు. శ్రీనివాస్‌ ఇంట్లోని ఐటీదాడులు, కిలారిరాజేశ్‌ ఇంట్లోని ఐటీదాడుల పంచనామాలతో వైసీపీనేతలు చర్చకొస్తే, ఎవరు అవినీతిపరులో తేలుస్తామన్నారు. క్విడ్‌ప్రోకో ద్వారా లక్షలకోట్లు పోగేసిన జగన్‌, తనకున్న ఆస్తులన్నీ ఎక్కడినుంచి చెప్పగలరా అని ఆలపాటి నిలదీశారు. 2004కు ముందు రూ.9లక్షల పన్నులుక్టిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు రూ.365కోట్లు చెల్లించేస్థాయికి ఎలావచ్చాడన్నారు. జగన్‌ తన ఒంటినిండా అవినీతి మసిపూసుకొని, దాన్ని చంద్రబాబుకి పూయాలని చూస్తున్నాడ న్నారు. అవినీతి..అవినీతి అనడంతప్ప, దాన్ని నిరూపించడం వైసీపీకి చేతకాలేదన్నారు.

వైసీపీప్రభుత్వ తీరు నీరోచక్రవర్తిని తలపిస్తోందని, గతప్రభుత్వంలో భూముల ధరలు ఎలాఉన్నాయో, అభివృద్ధి ఏతీరుగా పరుగులుపెట్టిందో, ఇప్పుడు జగన్‌వచ్చాక రాష్ట్రపరిస్థితి ఎంతదారుణంగా తయారైందో ఆలోచనచేయకుండా మంత్రులంతా అవాస్తవాలు, అభూతకల్పనలుచెప్పడానికి పోీపడుతున్నారని ీడీపీసీనియర్‌నేత, ఆపార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐీసోదా ల్లో పట్టుబడిన సొమ్మంతా చంద్రబాబునాయుడిదేనని, ఆయనదగ్గర గతంలో పీ.ఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ ఇంో్ల రూ.2వేలకోట్లు పట్టుబడ్డాయని చెప్పడం వైసీపీనేతల మందబుద్ధికి నిదర్శనమన్నారు. దేశంలో జరిగిన ఐీదాడులకు, పట్టుబడిన మొత్తం సొమ్ముకి చంద్రబాబునాయుడిని బాధ్యుడిని చేయాలని చూడానికి వైసీపీనేతలు, మంత్రులకు సిగ్గులేకపోయినా, అవాస్తవాలు వినడానికి ప్రజలకు సిగ్గుగా ఉందన్నారు. 11సీబీఐకేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి, క్రమంతప్పకుండా కోర్టుకు హాజరైతే ఇప్పికే ఊచలులెక్కపెడుతూ ఉండేవాడన్నారు.

ఏ2 విజయసాయిరెడ్డి ఈడీ డైరెక్టర్లను ప్రభావితం చేసేలా మ్లాడుతున్నారని, ీడీపీనేతలపై ఐీసోదాలుచేయిస్తూ రాక్షసానం దం పొందుతున్నారని బచ్చుల దుయ్యబ్టారు. నిజం నిలకడమీద తెలుస్తుందన్నట్లుగా , టీడీపీనేతల సచ్ఛీలత, నిజాయితీ త్వరలోనే రాష్ట్రప్రజానీకానికి అవగతమవుతుందన్నా రు. వైసీపీలో దిక్కూమొక్కూలేకుండా ఉన్న పార్థసారథి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని అర్జునుడు హెచ్చరించారు. వైసీపీప్రభుత్వం వచ్చాక రియల్‌ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నదో, ీడీపీ హయాంలో పతనమైందో పార్థసారథి నిరూపించాలన్నారు. జగన్‌ నిర్ణయాలకారణంగా రియల్‌ రంగం కుదేలైందని దేశవ్యాప్తంగా చర్చించుకుంటు న్నారన్నారు. రాజధానిలో ఆనాడు గజం రూ.32వేలు అమ్మితే, జగన్‌ప్రభుత్వం వచ్చాక రూ.9వేలకు పడిపోయిందని, రాష్ట్రవ్యాప్తంగా భూములధరలు పతనమైన విషయాన్ని గ్రహించకుండా పార్థసారథి దిగజారి మ్లాడుతున్నాడన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న మెగాకృష్ణారెడ్డి ఇన్‌కంటాక్స్‌ దాడుల్లో దొరికాడని, అలాంటి వ్యక్తికి జగన్‌ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఎలా ఇచ్చిందో చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూములు లేకుండా చేశారంటున్న పార్థసారథి, విశాఖలో రాజధాని పేరుతో జరుగుతున్న భూదోపిడీపై ఎందుకు మ్లాడటంలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సాగుభూములపై చంద్రబాబునాయుడు హక్కులు కల్పించారని, వారికి ప్టాలిచ్చి భూహక్కుదారుల్ని చేశారని పార్థసారథి తెలుసుకోవాలన్నారు. మంత్రిపదవికోసం, జగన్‌ మెప్పుకోసం అవాస్తవాలు మ్లాడటం వైసీపీనేతలకు అలవాటుగా మారిందని వారుచేస్తున్న పాపాలకు ప్రతిఫలం అనుభవించి తీరతారని బచ్చుల హెచ్చరించారు. గతప్రభుత్వం రాజధానిలో అమలుచేసిన హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ను చూస్తే, ఏప్రభుత్వ హయాంలో భూములధరలు ఎంతున్నాయో అవగతమవుతుందన్నారు. పార్థసారధి దగ్గర దమ్ముంటే, ఆయన చెప్పినట్లుగా భూములధరలపై చర్చకురావాలని, ఏ ప్రభుత్వ హయాంలో భూములధరలు ఎలా ఉన్నాయో వాస్తవాలతో సహా నిరూపిస్తామని ీడీపీ ఎమ్మెల్సీ పత్రికాముఖంగా సవాల్‌విసిరారు.

జగన్మోహన్‌రెడ్డి తనకు తానుగా ఢిల్లీవెళ్లాడా.. లేక కేంద్రపెద్దలే ఆయన్ని పిలిపించా రా అనేదానిపై ఆయనే రాష్ట్రప్రజలకు వివరణివ్వాలని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌చేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. అధికారంలోకి వచ్చినప్పి నుంచీ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా, అస్తవ్యస్త విధానాలతో ఏపీ ప్రజల్ని గందరగోళ పరిస్థితుల్లోకి న్టెిన ముఖ్యమంత్రి, ఆయన భజనబృందం ఇప్పుడు ఢిల్లీపెద్దలకు సంజాయిషీ ఇచ్చుకునే స్థితికి దిగజారారని కనకమేడల దుయ్యబ్టారు. ముఖ్యమంత్రయినప్పినుంచీ ఇప్పివరకు 9సార్లు ఢిల్లీవెళ్లొచ్చిన జగన్‌, ఒక్కసారికూడా ఎందుకు మీడియా ముందుకొచ్చి తనపర్యటనల్లోని వివరాలను వెల్లడించలేదన్నారు. రాష్ట్రప్రయోజనాలకోసమే ముఖ్యమంత్రి ఢిల్లీవెళితే, ఆయన అడిగిన అంశాలపై కేంద్రం స్పందించలేదుకాబ్టి, ఏమీచెప్పలేదా.. లేక తాను తీసుకుంటున్న అస్పష్ట నిర్ణయాలపై కేంద్రపెద్దలు మందలించారన్న అవమానభారంతో ముఖ్యమంత్రి మీడియాకు ముఖం చాటేశారా అని కనకమేడల నిలదీశారు. గతంలో రాష్ట్రానికి ఏవిధమైన న్యాయం చేయలేని టీడీపీ, ఎన్డీఏలోఉండానికి వీల్లేదని, వారుబయటకు వచ్చేయాలని డిమాండ్‌ చేసిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు రాష్ట్రానికి తానేంవెలగబ్టెట్టాడని ఎన్డీఏలో దూరడానికి సిద్ధమయ్యాడో చెప్పాలని కనకమేడల డిమాండ్‌ చేశారు.

ఢిల్లీవెళ్లి, కేంద్రపెద్దలతో తానేం చర్చించాడో, ఎవరిప్రయోజనాలగురించి.. ఎవరెవరితో చర్చించాడో జగన్మోహన్‌ రెడ్డి తక్షణమే స్పష్టంచేయాలన్నారు. ప్రజలకోసం, రాష్ట్రప్రయోజనాలకోసమే ఆయన ఢిల్లీవెళ్లి ఉంటే, అధికారులు, మంత్రులు లేకుండా రహస్యంగా మంతనాలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇప్పికే కేంద్రంలో వైసీపీకి ఇద్దరు రాజ్యసభసభ్యులు న్నారని, త్వరలోనే మరో ముగ్గురు రానున్నారని, ఈనేపథ్యంలో కేంద్రంతో ఏంబేరసా రాలు నడపానికి ముఖ్యమంత్రి హస్తిన కు వెళ్లాడన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తమపర్యటన వివరాలుసకాలంలో వెల్లడించనప్పుడే ప్రజలందరికీ అనుమా నాలు వస్తాయన్నారు. ఇప్పివరకు కేంద్రప్రభుత్వాన్ని మభ్య పెడుతూ, వెర్రిమొర్రి నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్‌రెడ్డికి, ఇకనుంచీ అలాసాగదని కేంద్రవర్గాలు స్పష్టం చేసినట్లు రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయని, వాికి తెరదించాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందని, అలాచేయకుంటే ఊహాగానాలను ఆయన సమ్మతించినట్టే భావించాల్సి వస్తుందన్నారు.

60 రోజులుగా రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనలుసహా, మండలిరద్దు, ప్రత్యేకహోదా, విభజనహామీలు, పోలవరం, ఇతరేతర అంశాలపై కేంద్రంతో ఫలవంత మైన చర్చలు జరగలేదని జగన్‌ వైఖరితోనే స్పష్టమైందన్నారు. సుస్థిరంగా ఉన్న రాష్ట్రాన్ని అస్థిరపరిచి, లేనిసమస్యలను సృష్టించి, అన్నివర్గాలవారిని రోడ్డునపడేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని, ఈ వివరాలన్నీ ఇప్పికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చర్యలు అంతర్జాతీయస్థాయిలో కూడా చర్చకొచ్చాయని, దావోస్‌లో పలువురు పారిశ్రామికవేత్తలు, ఏపీ పరిణామాలను కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. జగన్‌ ప్రధానంగా మూడు అజెండాల తో ఢిల్లీకి వెళ్లాడని, సీబీఐకేసుల విచారణ, తాను తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు, శాసనమండలి రద్దు అంశాలున్నాయన్నారు. సీబీఐ కోర్టులో వేసిన పిషన్లలో, జగన్‌ ఆర్థికనేరగాడని, ఆయన విచారణకు గైర్హాజరువుతున్నాడని, ఆయనకున్న పదవితో సాకక్షులను ప్రభావితంచేస్తాడని, అటువిం వ్యక్తికి కోర్టుహాజరు నుంచి మినహాయింపు లివ్వడం సరికాదని స్పష్టంగా పేర్కొన్నదన్నారు. ఈనేపథ్యంలో తనపైఉన్న కేసులనుంచి బయటపడాలన్నదే జగన్‌ తొలి ఎజెండా అన్నారు.

అమరావతి తరలింపుద్వారా సమస్యలను సృష్టించిన ముఖ్యమంత్రి, ప్రజలను లెక్కచేయ కుండా ముందుకెళ్లాడని, అస్తవ్యస్త విధానాలతో ప్రజల్ని రోడ్లపైకి వచ్చేలాచేయడం, జగన్‌ నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టడం, ప్రజలను సంతృప్తిపరచలేక, చేసేదిలేక ఢిల్లీకి వెళ్లడం రెండో అజెండా అని కనకమేడల తెలిపారు. మూడో అజెండాగా శాసనమండలరద్దు, ఆనిర్ణయంద్వారా శాసనమండలి ఛైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించేలా మండలికార్యదర్శిని రెచ్చగొట్టడం, కేంద్రప్రమేయం లేకుండా తాననుకున్నది చేయాలని చూసి భంగపడటంతో ఢిల్లీ గుర్తొచ్చిందన్నారు. కేంద్రంతో పనిలేకుండా శాననమండలని రద్దుచేయాలని చూడటంద్వారా, రాజ్యాంగ సంస్థలపట్ల జగన్‌కు ఉన్న గౌరవమేమిటో కేంద్రానికి స్పష్టంగా అర్థమైందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నిప్రయత్నాలుచేసినా, ఢిల్లీనుంచి సానుకూలస్పందన రాలేదని కూడా స్పష్టమైందన్నారు. రాజ్యసభఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శులు కాదన్న దాఖలాలు ఎన్నడూ జరగలేదన్నారు.

తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు, పి. అశోక్ బాబు, ఈ రోజు సాక్షి మీడియాకు బహిరంగ లేఖ రాసారు. ఆ ఉత్తరం యధాతధంగా.. "బహిరంగ లేఖ.. ఎడిటర్, జగతి పబ్లికేషన్స్ (సాక్షి డైలీ), హైదరాబాద్, విజయవాడ. గత రెండు రోజులుగా మీ సాక్షి పేపర్‌లో వార్తలు చదివిన తరువాత, పత్రికా రంగం యొక్క దిగజారుడుతనాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాను. ఫిబ్రవరి 6వ తేదిన ఆదాయ పన్ను శాఖ తనిఖీలపై 13.02.2020 వ తేదిన కమిషనర్ ఇన్కమ్ ట్యా క్స్ ఒక పత్రికా ప్రకటన చేయటం జరిగింది. అందులో స్పష్టంగా దేశ వ్యాప్తంగా 40 చోట్ల, 6నగరాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. పేరా 2లో చాలా స్పష్టంగా 3 ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీల యొక్క కాంట్రాక్టు పనులలో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ప్రధానంగా ప్రకటన చేశారు. ప్రకటనలో స్పష్టంగా 4వ పేరాలో 2 వేల కోట్ల రూపాయలు ఈ మూడు కంపెనీల యొక్క లావాదేవీలలో చట్ట విరుద్దంగా జరిగినవని ప్రాధమికంగా ఆదాయ పన్ను శాఖవారు నిర్ధారించారు. అదే పేరాలో పన్ను ఎగవేసేందుకు, ఆ కంపెనీలే సబ్ కాంట్రాక్టులు సృష్టించి దాన్ని 2 కోట్ల రూపాయలకంటే తక్కువగా ఉన్నట్లుగా చూపించారని ప్రకటించారు. అలా సృష్టించిన కంపెనీలలో కొన్ని కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి చట్టవిరుద్ధంగా వచ్చాయని తెలిపారు. ఆఖరి పేరాలో ఈ మొత్తం తనిఖీలలో 85 లక్షల రూపాయలు నగదు మరియు 71 లక్షల రూపాయల ఆభరణాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు."

"3వ పేరాలో తనిఖీలు ఒక ప్రముఖ వ్యక్తి యొక్క వ్యక్తిగత కార్యదర్శి మరియు ఆ వ్యక్తి యొక్క సన్నిహితులపై కూడా తనిఖీలు చేసినట్లు, కొన్ని ఆధారాలు సీజ్ చేసినట్లు తెలిపారు. పై ప్రకటనల్లో 3వ పేరాలో తెలిపిన విషయాలు కేవలం సమాచారం నిమిత్తం తెలిపారే తప్ప ఎక్కడా పైన తెలిపిన 3 ఇన్ ఫ్రా కంపెనీలతో 3వ పేరాలోని వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు చెప్పలేదు. కానీ ఫిబ్రవరి 14 మరియు 15 తేదిలలో సాక్షి పేపర్‌లో మీరు ప్రచురించిన అవాస్తవాలు విస్మయానికి గురిచేశాయి. 3వ పేరాలో చెప్పిన వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి అఫిషియల్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీ పి. శ్రీనివాసరావు మరియు శ్రీ కె. రాజేష్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ బాధ్యులు. ఆదాయ పన్ను శాఖ పత్రికా ప్రకటనలో ఎవరి పేర్లు చెప్పనప్పటికి వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని పై పేర్లను మేము కూడా ధృవీకరించడం జరిగింది."

"కానీ మీరు మీ పత్రికలో ఆదాయ పన్ను శాఖ వారు ప్రకటించిన 2 వేల కోట్ల రూపాయల చట్ట విరుద్ధ లావాదేవీలన్నీ వీరే చేశారని ప్రముఖంగా బ్యానర్ ఐటమ్ గా ప్రచురించటం చట్ట విరుద్ధం, దుర్మార్గం. రాజకీయ విబేధాలు ఎన్ని ఉన్నప్పటికి పత్రికలు వాస్తవాలు చెప్పాల్సిన నైతిక బాధ్యతను మీరు మరచిపోయి విషప్రచారం చేయటం చట్ట విరుద్ధం. 3వ పేరాలోని పేర్లు చెప్పనప్పటికి మీరు పేర్లు ప్రచురించటం జరిగింది. మరి 3 వ పేరాలోని వ్యక్తుల పేర్లు తెలిసినప్పుడు 3 ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీల పేర్లు మీకు తెలియదా? లేదా వాటిని ప్రచురించే ధైర్యం మీకు లేదా? మీకు తెలియకపోతే ఆదాయ పన్ను శాఖ వారిని అడిగి ప్రచురించవచ్చు. కానీ అది చేయకుండా దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీపై బురదజల్లే ప్రయత్నం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. 3వ పేరాలోని వ్యక్తులపై జరిగిన సోదాలపై పంచనామా నివేదికలు మా వద్ద ఉన్నాయి. వాటిని ప్రకటించే ధైర్యం మీకు ఉందా? ఉంటే నాకు సమాచారం ఇవ్వాలి. లేదంటే మీరు ప్రచురించింది తప్పుడు వార్తలుగా అంగీకరించి క్షమాపణ కోరి వివరణ ఇవ్వాలి. అట్లు కాని యెడల తప్పుడు వార్తలు ప్రచురించినందుకు మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము." అంటూ అశోక్ బాబు, ఆ ఉత్తరంలో రాసారు. మరి సాక్షి దీనికి స్పందిస్తుందో లేదో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read