మూడు రోజుల నుంచి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు, విపక్ష ఎమ్మెల్సీలు లొంగక పోవటంతో, ఇక తప్పక, మండలి విషయంలో, వైసీపీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవటానికి రెడీ అవుతుంది. రేపు, మండలి రద్దుకు ముహూర్తం ఫిక్స్ సెహ్సారు. రేపు ఉదయం 09.30కి ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. మండలి రద్దు తీర్మానానికి కేబినేట్ ఆమోదం తెలపనున్నది. మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ విరమించుకుంది. అంతా అనుకున్నట్టు జరిగితే, విపక్ష ఎమ్మెల్సీలను తమ వైపు లాగేసి, మండలి చైర్మెన్ పై అవిస్వాసం పెట్టి, ఆయన్ను దింపి, తమకు ఇష్టమైన వాళ్ళని పెట్టుకుందామని వైసీపీ భావించింది. ఇలా చేసిన తరువాత, సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ కూడా వారం పది రోజుల్లో ఇచ్చే విధంగా ప్లాన్ చేసింది. గురువారం అసెంబ్లీలో చర్చించిన దగ్గర నుంచి, అధికార పార్టీ అనేక బెదిరింపులకు పాల్పడింది. మండలి రద్దు చేస్తున్నాం అంటూ, ముందు విపక్ష ఎమ్మెల్సీలను బెదిరించింది. టిడిపి కాకుండా, పీడీఎఫ్ సభ్యులను కూడా బెదిరించింది.

cabinet 26012020 2

అయితే ఎవరూ లొంగలేదు. మండలి రద్దు అనైతిక చర్య అని అన్నారు. అలాగే సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చే దాకా ప్రభుత్వం ఆగాలి కదా అని కూడా అన్నారు. ప్రభుత్వం ఏది చేస్తే అది మేము ఆమోదించాలా అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష కు తెర లేపారు. అయితే, మూడు రోజుల నుంచి, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, బెదిరింపులు చేసినా, ఎవరూ లొంగలేదని సమాచారం. ఈ రోజు టిడిపి మీటింగ్ పెడితే, 23 మంది వచ్చారు. 5 గురు వివిధ కారణాల వల్ల రాలేమని ముందే చెప్పారు. దీంతో వైసీపీకి క్లారిటీ వచ్చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కాదని తెలిసి పోయింది. దీంతో, వైసీపీ ప్రభుత్వం మండలి రద్దుకే మొగ్గు చూపుతుంది. మండలి రద్దు చేస్తూ, రేపు క్యాబినెట్ తీర్మానం పెట్టి, అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపుతారు.

cabinet 26012020 3

అయితే, సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఇబ్బంది పడకుండా, జగన్ మరో ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. అదే, జోన్‌ల అభివృద్ధి కమిటీ. మండలిని రద్దు చేసిన తరువాత, జోన్‌ల అభివృద్ధి కమిటీల్లో, నామినేటెడ్‌ సభ్యుల సంఖ్యను పెంచి వారికి ఎమ్మెల్సీ హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో టిక్కెట్ లు ఇవ్వలేని వారికి, మండలిలో అవకాసం ఇస్తాం అని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మండలి రద్దు చేస్తూ ఉండటంతో, దానికి ప్రత్యామ్న్యాయం జగన్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మండళ్ల అభివృద్ధి కమిటీల్లో నామినేటెడ్‌ సభ్యుల సంఖ్యను నాలుగు నుండి 10 లోపు పెంచితే అందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.

వికేంద్రీకరణ బిల్లులు, మండలిలో పరిణామాలపై గవర్నర్ బీబీ హరి చందన్ ఆరా తీసారు. స్పీకర్ తమ్మినేని, మండలి ఛైర్మన్ షరీఫులను పిలిపించిన గవర్నర్ మాట్లాడారు. అసెంబ్లీ, మండలిలో జరిగిన పరిణామాలను స్పీకర్, ఛైర్మన్, గవర్నర్ కు వివరింకాహారు. స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ విడి విడిగా భేటీ అయ్యారు. కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పాలనా వికేం ద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో చోటు చేసు కున్న పరిణామాలపై వ్యుహత్మకంగా వ్యవహ రించనున్నది. మండలిని రద్దు చేసేందుకు ముందస్తు కసరత్తు చేస్తోందనే సమాచారం విస్తృ తంగా ప్రచారంలోకి వచ్చిన సందర్భంలో ప్రభుత్వం మరో ఎత్తుగడను వేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్ర గోప్యంగా ఉంచుతుంది.బయటకు వస్తున్న లీకులకు భిన్నంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఎ బిల్లులకు అడ్డంకిగా వున్న మండలి విషయంలో రద్దుకు పోవడమా?

sharif 26012020 2

మండలిలో ప్రభుత్వానికి అనుగుణంగా ఆకర్ష తంత్రాన్ని ప్రయోగించి తెలుగుదేశం పార్టీ సభ్యులను తనకు మద్దతుగా మలుచుకోవడానికి అడుగులు వేయడమా అనే అంశంపై తీవ్ర ఆలోచనల్లో జగన్ వున్నారంటున్నారు. అందులో భాగంగానే ఆయన శనివారం ఉదయం మండలి రద్దుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తోనే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స, కురసాల కన్నబాబులతో ఆయన సమాలోచన జరిపారు. ఈ సందర్భలో వారి నడుమ శాసనమండలిని రద్దు చేస్తూ చోటు చేసుకునే ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులపై చర్చ జరిగిందంటున్నారు. 2021 నాటికి అధికార పార్టీకి మండలిలో మెజార్టీ లభించే అవకాశా లున్నందున మండలిని రద్దు చేయడం ఉప యుక్తమా! ఆకర్షక మంత్రాన్ని ప్రయోగం చడమా అనే అంశంపై చర్చ జరిగిందంటున్నా రు.

sharif 26012020 3

ఇదే సందర్భంలో శాసనమండలిలో చైర్మన్‌గా వున్న షరీప్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఇంకా సెలెక్ట్ కంపెనీకి పంవలేదని వ్యాఖ్యానించిన అంశం ఆధారంగా అడుగులు ముందుకు వేయడానికి వీలుందా అని ముఖ్యమంత్రి జగన్, ఎజి సుబ్రహ్మణంను అడిగినట్లు సమాచారం. నిన్న శాసనమండలి చైర్మన్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లు ప్రాసెస్ లో ఉన్నందునే సెలక్ట్ కమిటీకి పంపించామని ఆయన స్పష్టం చేశారు. తన విచక్షణాధికారం ఉపయోగించానని షరీఫ్ చెప్పారు. రూల్ 154 కింద సెలక్ట్ కమిటీకి పంపించానని పేర్కొన్నారు. పార్లమెంటరీ చట్టాల వరిధిలో శాసనమండలి చైర్మన్ అభిశంసన చేసే అవకాశాలపై వున్న అవ కాశాలపైన ముఖ్యమంత్రి చర్చించారం టున్నారు. అయితే ఈ గొడవంతటి కన్నా అస్సలు మండలిని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుందామని బుగ్గన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ అనే టాపిక్ నడుస్తుంది. ఒక రాజధాని వద్దు , మూడు ముక్కల రాజధాని కావాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, పరిపాలనా వికేంద్రీకరణ అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. విశాఖపట్నంలో సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూల్ లో హైకోర్ట్ అంటూ వింత వాదన ముందు పెట్టరు. అయితే, దీని పై తెలుగుదేశం పార్టీతో పాటు, వివిధ వర్గాలు కూడా, పరిపాలనా వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించారు. కేంద్రం నుంచి వచ్చే జాతీయ విద్యాసంస్థలు, ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి పెట్టరు. అలాగే విశాఖపట్నంలో, ఐటి, ఫైనానిష్యల్ కంపెనీలు పెట్టించారు. తిరుపతిలో ఎలెక్ట్రోనిక్ హబ్ చేసారు. అనంతపురంలో ఆటోమొబైల్ హబ్ చేసారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెట్టారు. గోదావరి జిల్లాల్లో ఆక్వాని ప్రోమోట్ చేసారు.

amaravati 25012020 2

ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధిని మొదలు పెట్టి, చూపించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం మాత్రం, అవేమీ జరగలేదని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా, మూడు ముక్కల రాజధాని చేస్తేనే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వాదిస్తుంది. కియా లాంటి కంపెనీలు వస్తే ప్రాంతం అభివృద్ధి చెండుతునా, లేక ఒక వంద ఉద్యోగాలు వచ్చే హైకోర్ట్, 50 ఉద్యోగాలు ఉండే అసెంబ్లీ వల్ల అభివృద్ధి చెందుతుందా అని టిడిపి ప్రశ్నిస్తుంది. అయితే, టిడిపి అభివృద్ధి ఏమి చెయ్యలేదు అని చెప్తున్న సమయంలో, అది కూడా అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి, స్మార్ట్ సిటీకి వచ్చిన అవార్డులు, ఇప్పుడు టిడిపి చేసిన పనిని మరోసారి, ప్రజలకు గుర్తు చేస్తున్నాయి. అటు అమరావతికి, ఇటు విశాఖపట్నంకు కూడా, చంద్రబాబు సమానంగా , ఇంకా చెప్పాలంటే, వైజాగ్ నే ఎక్కువ అభివృద్ధి చేసారని చెప్పొచ్చు.

amaravati 25012020 3

శుక్రవారం వంద 'స్మార్ట్' నగరాల మూడవ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇందులో అమరావతికి, వైజాగ్ కి అవార్డులు వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా వైజాగ్ లోని ముడసర్లోవ రిజర్వాయర్ లో, 2 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్కు ‘వినూత్న ఆలోచన అవార్డు’ దక్కింది. ఇక మూడో విడత ఎంపిక చేసిన పది స్మార్ట్‌ సిటీల్లో, ప్రాజెక్టుల అమలులో మెరుగైన ప్రతిభ చూపినందుకు అమరావతికి అవార్డు వచ్చింది. ఇక మొదటి రౌండ్‌లో స్మార్ట్‌సిటీలుగా ఎంపికైన 20 నగరాల్లో విశాఖపట్నం స్మార్ట్‌సిటీకి ఉత్తమ అవార్డు లభించింది. అమరావతి పై ఒక పక్క అనిశ్చితి ఉన్న వేళ, ప్రభుత్వ పెద్దలే, అమరావతిని స్మశానం అని, ఎడారి అని, అలాగే అక్కడ పందులు, కుక్కలు తిరుగుతాయి అంటూ చెప్తున్న వేళ, ఏకంగా కేంద్రమే ఇప్పుడు అమరావతికి అవార్డ్ ఇస్తూ, విశాఖను చంద్రబాబు ఎంతలా అభివృద్ధి చేస్తున్నారో విశాఖకు రెండు అవార్డులు ఇచ్చి, సమాధానం చెప్పింది.

రేపు శాసనమండలి పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం అని చెప్పిన సంగతి తెలిసిందే. గురువారం రోజున, శాసనమండలి అవసరం లేదు అంటూ, జగన్ మోహన్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో చర్చించారు. అదే రోజున శాసనమండలి రద్దు చేస్తూ, బిల్ పెడతారని అందరూ అనుకున్నారు. అయితే, ఎందుకో కాని, గురువారం సభ వాయిదా వేసి, అనూహ్యంగా శుక్రవారం కూడా సెలవు ప్రకటించి, సోమవారం కలుద్దామని జగన్ చెప్పటంతో, స్పీకర్ కూడా దానికి సరే అన్నారు. అయితే ఈ మూడు రోజులు, విపక్ష ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టటానికి, జగన్ ప్రయత్నిస్తున్నారు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. విపక్ష ఎమ్మెల్సీలను తమ వైపుకు తిప్పుకుని, మండలి చైర్మెన్ పై అవిస్వాసం పెట్టి, సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ ని, వారం పది రోజుల్లోనే తీసుకు వచ్చే ప్లాన్ వేసారని తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఈ నేపధ్యంలో, మండలి రద్దు, వైసీపీ ప్రలోభాలు, తదితర అంశాల పై, చంద్రబాబు ఈ రోజు టిడిపి ఆఫీస్ లో, ఎమ్మెల్సీలతో సమావేశం కానుకున్నారు.

mlc 26012020 2

ఈ రోజు మధ్యానం ఒంటి గంటకు, మంగళగిరిలో, ఉన్న తెలుగుదేశం కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎవరైనా గైర్హాజరు అవుతారా, వైసీపీ ప్రలోభాలకు ఎవరైనా లోంగారా అనే విషయం పై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాసం ఉంది. అయితే ఈ సమావేశానికి కంటే ముందే, ఐదుగురు ఎమ్మెల్సీలు తాము గైర్హాజరు అవుతున్నట్టు పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ, ఈ రోజు జరిగే సమావేశానికి రాలేము అంటూ, సమాచారం అందించారు. దీనికి వారు వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు వర్ధంతి కార్యక్రమం ఉందని, తాను ఈ రోజు రాలేనని గాలి సరస్వతి సమాచారం ఇచ్చారు.

mlc 26012020 3

అలాగే, కేఈ ప్రభాకర్ ఇంట్లో, వాళ్ళ మేనత్త కర్మ కార్యక్రమం ఉండటంతో, ఆయన కూడా రాలేనని చెప్పారు. కేఈ ప్రభాకర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి సోదరుడు. ఇక తనకు, అనారోగ్యం ఉన్న కారణంగా రాలేనని శత్రుచర్ల చెప్పారు. ఆయన మొన్న కూడా అనారోగ్యం ఉన్నా సభకు వచ్చారు, సభ ఎప్పుడూ పెడితే అప్పుడు వస్తానని సమాచారం ఇచ్చారు. ఇక తిప్పేస్వామి, తన ఇంట్లో శుభకార్యం ఉందని, పెళ్లి ఉండటంతో రాలేనని కబురు పమించారు. ఇక మరో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, విదేశాల్లో ఉండటంతో, రాలేనని చెప్పారు. అయితే, ఈ ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీకి విధేయతగా ఉండే వారే కాబట్టి, టిడిపి పెద్దగా ఆందోళన చెందలేదు. సమావేశానికి ఇంకా ఎవరైనా హాజరుకాకుండా ఉంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read