శాసనమండలిని రద్దు చేస్తాం, మీ ఎమ్మెల్సీలు ఇంకా రెండు, నుంచి మూడేళ్ళు ఉన్నాయి, ఇప్పుడే పోతాయి అంటూ, ప్రభుత్వం ఎంత బెదిరిస్తున్నా, ఎమ్మెల్సీలు లెక్క చెయ్యటం లేదు. అలాగే మండలి చైర్మెన్ షరీఫ్ ని, వైసీపీ పార్టీ మొత్తం టార్గెట్ చేస్తుంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కూడా, షరీఫ్ ని టార్గెట్ చేసారు. ఎప్పుడూ లేని విధంగా, ఒక స్పీకర్ నిర్ణయాన్ని, మరో సభలో చర్చించి, ఆయన్ను కించ పరచటమే కాక, అసలు ఆ సభనే అవమాన పరిచారు. ఆ సభ అనవసరం అని, అసెంబ్లీలోనే అనేక మంది మేధావులు ఉన్నారని చెప్పారు. ఇలా శాసనమండలిని టార్గెట్ చేసారు. ఇక శాసనమండలి చైర్మెన్ షరీఫ్ ని అయితే, టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మంత్రులు సభలోనే, ఆయన పై దుషించారని, అనరాని మాటలు అన్నారని, బెదిరించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం, ఏకంగా మండలినే రద్దు చేస్తాం అంటూ, బెదిరిస్తుంది. రేపు నిర్ణయం తీసుకుంటామని, రేపు క్యాబినెట్ పెట్టి, క్యాబినెట్ లో తీర్మానం చేసి, రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి, మండలిని రద్దు చేస్తాం అంటుంది.

sharif 260120220 12

అయితే ప్రభుత్వం ఎన్ని ఒత్తిడులు పెడుతున్నా, ఏకంగా మండలి చైర్మెన్ ని టార్గెట్ చేసినా, చైర్మెన్ షరీఫ్ మాత్రం, బెదరటం లేదు కదా, మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఆయన సహజ శైలిలోనే, కూల్ గా ఉంటూనే, చెయ్యల్సింది చేసేస్తున్నారు. ఇప్పటికే తనకు ఉన్న విచక్షణాదికారంతో, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిన షరీఫ్, ఇప్పుడు మరో దూకుడు నిర్ణయం తీసుకున్నారు. సెలెక్ట్ కమిటీకి మెంబెర్స్ పేర్లు ఇవ్వాలి అంటూ, అన్ని పార్టీల, విప్‌లకు మండలి చైర్మన్ షరీఫ్ లేఖలు రాసారు. సెలెక్ట్ కమిటీలో ఎవరు ఉంటారో చెప్పాలి అంటూ, అన్ని పార్టీలను కోరారు. అటు సీఆర్డీఏ బిల్లు, ఇటు వికేంద్రీకరణ బిల్లుకు విడివిడిగా సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.

sharif 260120220 3

ఇందులో, ఒక్కో సెలెక్ట్ కమిటీలో మొత్తం, 9 మంది సభ్యులు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి 5 మంది, వైసీపీ, పీడీఎఫ్, బీజేపీ నుంచి ఒక్కో సభ్యుడు ఈ కమిటీలో ఉంటారు. కమిటీ చైర్మెన్ గా, ఆ శాఖా మంత్రి ఉంటారు. వికేంద్రీకరణ బిల్లుకు బుగ్గన, సీఆర్డీఏ రద్దు బిల్లుకు బొత్సా చైర్మెన్ గా ఉండే అవకాసం ఉంది. ఇక మరో పక్క, ఈ రోజు మండలి చైర్మెన్ షరీఫ్, గవర్నర్ ని కలిసారు. గవర్నర్ రమ్మని కోరటంతో, ఆయన వెళ్లినట్టు తెలుస్తుంది. గవర్నర్ తో భేటీ అనంతరం, షరీఫ్ మీడియాతో మాట్లాడారు. తనను దూషించటం గురించి తాను పట్టించుకొనని అన్నారు. రూల్స్ కి వ్యతిరేకంగా తాను ఏ నిర్ణయం కూడా తీసుకోలేదని అన్నారు. నియమ నిబంధనలకు లోబడే తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మండలి రద్దు పై, తాను ఏమి స్పండించనని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత, అమరావతిని రాజధానిగా చేసుకుని, ముందుకు వెళ్లాం. చంద్రబాబు నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా, అమరావతిని నెంబర్ వన్ సిటీగా చెయ్యటానికి ప్రణాలికలు సిద్ధం చేసారు. పనులు కూడా మొదలు పెట్టరు. అయితే, అమరావతిలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం కోసం, ప్రజలందరికీ అమరావతి మాది అనే విధంగా, అనేక కార్యక్రమాలు చేసారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, మట్టి, నీరు తీసుకోవచ్చి, అమరావతిలో పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే, అమరావతి కోసం, 10 రూపాయలకు ఇటుకు పెట్టి, అమరావతిలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలని, ప్రజలు భావించేలా చేసారు. అలాగే, అమరావతిని నెంబర్ వన్ సిటీ చెయ్యటానికి, మా రాజధాని హైదరాబాద్ కాదు, అమరావతి అని చెప్పటానికి, అమరావతి బ్రాండింగ్ కోసం, అనేక ప్రయత్నాలు చేసారు. ఇందులో భాగంగానే, ఢిల్లీలో ఉన్న ఆంధ్రాభవన్ లో, ఐ లవ్ అమరావతి అంటూ, ఒక బోర్డు పెట్టారు.

amaravati 2612020 2

ఆంధ్రా భవన్ కు వచ్చిన ప్రతి సారి, అందరూ ఈ బోర్డు దగ్గర ఫోటోలు తీసుకుంటూ ఉండేవారు. బయట రాష్ట్రాల వారు కూడా, అమరావతి పై అవగాహన వస్తూ ఉండేది. అయితే, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఆంధ్రా భవన్ లో, ఐ లవ్ అమరావతి అనే బోర్డు మాయం అయ్యింది. ఆదివారం రోజున, ఏపి భవన్ అధికారులు, ఈ బోర్డు ని తొలగించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, ఇచ్చిన ఆదేశాల మేరకే, ఈ బోర్డు తొలగించారని సమాచారం వస్తుంది. పై నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే, అమరావతి అనే మాట ఎక్కడా లేకుండా, తీస్తున్నారని, చెప్తున్నారు. అయితే, ఈ బోర్డు ఎందుకు తొలగించారు అని మీడియా, ప్రతినిధులు, అక్కడ ఆంధ్రా భవన్ లో ఉన్న అధికారులని ప్రశ్నించగా, వారి నుంచి వింత సమాధానం వచ్చింది.

amaravati 2612020 3

కోతుల బెడత ఎక్కువగా ఉందని, కోతులు ఈ బోర్డు ని నాశనం చేస్తున్నాయని, అందుకే తొలగించామని, అధికారులు చెప్తున్నారు. కోతుల వల్ల, బోర్డు తొలగించటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. కోతులకు, ఈ బోర్డు కు సంబంధం ఏమిటని అడుగుతున్నారు. అమరావతి అనే పేరు ఇష్టం లేక, ఇలా చేస్తున్నారని, పలువురు మండి పడుతున్నారు. అమరావతి అనే పదం వింటేనే, అసహనంతో ఊగిపోతున్నారని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇలా చెయ్యటం తగదని వాపోతున్నారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. అమరావతి పేరుతొ, ప్రభుత్వం అత్యాధునిక ఆర్టీసీ బస్సులు కూడా తిప్పుతుందని, రేపు వాటి పేరు కూడా మార్చేస్తారేమో అని వాపోతున్నారు.

తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఈ రోజు సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో, రేపు జరిగే అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ కీలకనిర్ణయం తీసుకుంది. రేపు మండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో చర్చ చేస్తాం అంటూ, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే, మండలిలో జరిగే విషయాల పై, శాసనసభలో చర్చ చెయ్యటం, రాజ్యంగ విరుద్ధమని, తెలుగుదేశం పార్టీ అభిప్రాయ పడింది. ఏకంగా మండలి చైర్మెన్ ను కించ పరుస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఆయన ప్రసంగం అసెంబ్లీలో వేసి, ఆయన్ను అవమానించిన తీరుని తెలుగుదేశం పార్టీ ఖండించింది. అలాగే బయట మంత్రులు, మండలి చైర్మెన్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టటం పై కూడా తెలుగుదేశం పార్టీ అభిప్రాయం పడింది. దీంతో ఈ రోజు సమావేశం అయిన తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ, రేపు జరిగే మండలి మీద చర్చకు, అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. అక్కడకు వెళ్ళినా, మాట్లాడే అవకాసం ఇవ్వరని, అడిగితే సస్పెండ్ చేస్తారని, అక్కడకు వెళ్ళిన ఉపయోగం లేదని, అందుకే రేపు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు.

tdlp 26012020 2

ఇక ఎమ్మెల్సీలు ఎవరూ, ప్రభుత్వం పెట్టిన ప్రలోభాలకు లొంగకపోవటం పై, చంద్రబాబు, అందరినీ అభినందించారు. మీ పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులు చేసినా, ఎవరూ లొంగ లేదని, అందుకే జగన్ మోహన్ రెడ్డి, ఈ సమావేశానికి అందరూ వచ్చారని తెలుసుకుని, ఇక మండలి రద్దుకే మొగ్గు చూపారని, అందుకే రేపు ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశ పెట్టి, అక్కడ తీర్మానం పెట్టి, ఆ బిల్ ను, రేపు అసెంబ్లీలో పెట్టటానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ అభ్యర్ధులు ఎవరూ, ఈ మూడు రోజోల్లో లొంగలేదని, అందుకే , జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఒక తప్పు కోసం, పది తప్పులు చేస్తున్నారు, ఈ క్రమంలో రాష్ట్రం నష్టపోతుంది అంటూ, తెలుగుదేశం నేతలు అభిప్రాయ పడుతున్నారు.

tdlp 26012020 3

అయితే ఈ సమావేశంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జగన్ మోహన్ రెడ్డి పరిపలన చూసిన మొదట్లోనే, తెలుగుదేశం పార్టీ, జగన్ ను తుగ్లక్ తో పోలుస్తూ వచ్చింది. జగన్ నిర్ణయాలు అన్నీ రివర్స్ లో ఉన్నాయని, అప్పటి తుగ్లక్ పాలన గుర్తు చేస్తుంది అంటూ, టిడిపి ఆరోపిస్తుంది వస్తుంది. ఈ నేపధ్యంలోనే, తుగ్లక్‌, హింసించే 23వ రాజు పులికేసి సినిమాలోని కొన్ని సీన్లు, ఈ రోజు టీడీఎల్పీలో, టిడిపి సిబ్బంది వేసి, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చూపించింది. ఆ సినిమాల్లోని సన్నివేశాలు, ఇప్పటి జగన్ పాలన లాగే ఉన్నాయని నవ్వుకున్నారు. ముఖ్యంగా తుగ్లక్ సినిమాలో, రాజధానిని ఒకసారి మార్చటం, మళ్ళీ వెంటనే వేరే చోటుకి మార్చటం, అదేమిటి అంటే, నా ఇష్టం అంటూ, తుగ్లక్ చెప్పిన సీన్ చూసి, అందరూ నవ్వుకున్నారు. సినిమాలు చూసి నవ్వుకున్నా, మన రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తుందని అంటున్నారు.

రేపటి అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో టిడిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ రేపటి అసెంబ్లీ అజెండాయే రాజ్యాంగ విరుద్దం. ఒక సభ గురించి మరో సభలో చర్చించడం పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కు విరుద్దం, ఇది ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థలను కించపర్చడం. ఇప్పటికే అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారు. రేపటి అసెంబ్లీలో మరో ఉల్లంఘనకు తెరదీశారు. కౌన్సిల్ గురించి మొన్న అసెంబ్లీలో చర్చించడమే ఒక ఉల్లంఘన కాగా, రేపు మళ్లీ చర్చిస్తామన్న అసెంబ్లీ అజెండా మరో ఉల్లంఘన. ఒక తప్పుకాదు, తప్పు మీద తప్పులు చేస్తున్నారు. దురుద్దేశాలతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను లాక్కున్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ప్రలోభాలు-బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారు. 22మంది మంత్రులంతా వచ్చి ఛైర్ పర్సన్ పై దౌర్జన్యానికి దిగారు, కులం, మతం పేరుతో దూషించారు, మనవళ్ల పేరుతో బెదిరించారు. కౌన్సిల్ లో మంత్రుల వల్గర్ బిహేవియర్ రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులు ఈ స్థాయిలో దుష్ప్రవర్తన గతంలో ఎప్పుడూ లేదు. మంత్రులు పోడియం బల్లలు ఎక్కడం, బాటిల్స్ విసిరేయడం, పేపర్లు చించి ఛైర్ పర్సన్ పై విసిరేయడం, కొట్టడానికి టిడిపి ఎమ్మెల్సీలపైకి రావడం, ఛైర్ పర్సన్ పై దాడికి పాల్పడటం, దుర్భాషలాడటం ఎక్కడా చూడలేదు’’ అని ఆవేదన చెందారు.


టడిపి ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘ మున్నెన్నడూ లేనంత ఇమేజి పార్టీకి మీ వల్ల వచ్చింది. నాయకుడిగా నా ఇమేజిని మరింత పెంచారని’’ అన్నారు. ఇప్పుడు ఏ చొరవ చూపారో అదే స్ఫూర్తి ఇకపై కూడా చూపాలని, పార్టీ అధ్యక్షుడిగా మీకు అన్నివిధాలా అండగా ఉంటానని పేర్కొన్నారు. అసెంబ్లీ ఈయన (సీఎం జగన్) చెప్పినట్లు జరగాలి.. మెజారిటి లేకపోయినా కౌన్సిల్ కూడా ఈయన చెప్పినట్లే జరగాలంటారు.. పెడ ధోరణులతో రాష్ట్రాన్ని పతనం చేస్తున్నారు. అక్కడ(అసెంబ్లీలో) స్పీకర్ విచక్షణాధికారం ఉపయోగించడం కరెక్ట్ అంటారు, ఇక్కడ(కౌన్సిల్ లో) ఛైర్ పర్సన్ విచక్షణాధికారం ఉపయోగించడం కరెక్ట్ కాదంటారు. అసెంబ్లీలో రింగు గీసి, అది దాటివచ్చిన వాళ్లను బైట పడేయమంటారు మార్షల్స్ తో..అదే కౌన్సిల్ లో వైసిపి మంత్రులే పోడియం బల్లలెక్కినా వాళ్లను అడ్డుకోరు మార్షల్స్..తన రూమ్ లో కరెంట్ కట్ చేస్తే, టివి ఆపేస్తే, ఇంటర్నెట్ బంద్ చేస్తే, కౌన్సిల్ గ్యాలరీకి వెళ్లిన మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేతను బైటకు వెళ్లమని అంటారు. శాసన మండలి ఇప్పటివరకు అనేక బిల్లులను ఆమోదించి పంపింది. 3 రాజధానులపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, 13జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ఈ 2 బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపింది. ప్రభుత్వ విధానం ప్రజాకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే, రూల్ 71 ద్వారా ఆ పాలసీకి అననుకూలంగా శాసన మండలి తీర్మానించింది.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టేందుకు ఎమ్మెల్సీలు దృఢంగా నిలబడ్డారు. మంత్రుల దుర్భాషలను, దౌర్జన్యాలను ప్రతిఘటించారని’’ చంద్రబాబు ప్రశంసించారు.

"స్వయంగా వైఎస్ లోక్ సభ గ్యాలరీలో కూర్చుని ఎంపిల కొనుగోళ్లకు పాల్పడ్డారు. తనకు డబ్బు లేకపోయినా కేరక్టర్ ఉందని చలపతిరావు అప్పట్లో ధీటుగా జవాబిచ్చి పార్టీ కోసం ధృఢంగా నిలబడ్డారు. అదే స్ఫూర్తితో ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా పార్టీ కోసం ధీటుగా నిలబడ్డారు. ప్రలోభాలను తట్టుకుని, బెదిరింపులను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడ్డ ఎమ్మెల్సీలంతా హీరోలు. ఏ పరిస్థితుల్లో పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చామో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. ‘‘పరిటాల రవి అనుచరులుగా అండర్ గ్రవుండ్ లో కష్టాలు పడ్డారనే చమన్, పోతుల సురేష్ లను టిడిపి అధికారంలోకి రాగానే గౌరవించాం. సీతక్క, పోతుల సునీత ప్రజా క్షేత్రంలోకి రాగానే ఎన్నికల్లో టిక్కెట్లిచ్చి ప్రోత్సహించాం. సునీతకు జడ్ పిటిసి ఇచ్చాం. ఆలంపూర్ లో, చీరాలలో టిక్కెట్టిచ్చినా ఓడిపోయింది. అయినా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాం, టిడిపి మహిళా అధ్యక్షురాలిని చేశాం. ఇన్నివిధాలా గౌరవించినా ఆమె వెళ్లిపోవడం బాధాకరం. ఇది ముందే తెలిసి భార్యాభర్తలను పిలిచి మాట్లాడినా వెళ్లిపోయారు. తమపై దౌర్జన్యాలను వివరించిన బిటి నాయుడు, బుద్దా నాగ జగదీశ్వర రావు హైదరాబాద్ లో ‘దిశ’పై జరిగినట్లే, అమరావతిపై వైసిపి నేతలు అఘాయిత్యం చేశారన్న తన వ్యాఖ్యలతో కక్షకట్టిన మంత్రి బుగ్గన తన ఇంటిపైకి 50మందిని దాడికి పంపారని బిటి నాయుడు చెప్పారు.

ఎమ్మెల్సీ ఇంటిపై దాడిచేసిన వాళ్లపై కేసు పెట్టాలని కోరినా, బాధితులపైనే అక్రమ కేసులు కట్టారని తెలిపారు. మీ(చంద్రబాబు) అండతో ఇటువంటి దాడులు ఎన్నైనా ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నామని బిటి నాయుడు చెప్పారు. అనకాపల్లిలో తమ కోల్డ్ స్టోరేజిని సీజ్ చేశారని, అందులో రైతులు నిల్వచేసిన ఉత్పత్తులు తీసుకెళ్లేందుకు కూడా అనుమతించ లేదని బుద్దా నాగ జగదీశ్వర రావు తెలిపారు. ఆర్ధిక మూలాలు దెబ్బకొట్టాలని వైసిపి చేస్తున్న దుష్ప్రయత్నాలను ప్రజాకోర్టులోనే ఎండగడతాం అంటూ, ళ్ల బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
తెనాలిలో జెఏసి దీక్ష శిబిరానికి నిప్పుపెట్టడం, మహిళలను భయభ్రాంతులను చేయడం, టిడిపి ముస్లిం నేత ఖుద్దూస్ పై దాడి చేయడాన్ని ఎమ్మెల్సీలు అంతా ఖండించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ,‘‘ ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో కూడా దాడులకు పాల్పడ్డారు. అక్కడి ప్రజలు హింసావిధ్వంసాలను సహించరు. అలాంటిది ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద కొందరిని రెచ్చగొట్టి టిడిపి నాయకులపై దాడులు చేసి గాయపర్చడం హేయం’’గా ధ్వజమెత్తారు.

Advertisements

Latest Articles

Most Read