రాజకీయాల్లో ఒక వ్యక్తీ క్యారక్టర్ ను చంపేస్తే, మానం, అభిమానం ఉన్న వ్యక్తులు, అవి ఎదుర్కోలేక, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే వికృత క్రీడ మన రాష్ట్రంలో నడుస్తుంది. ఇలాగే కోడెల లాంటి నాయకుడుని, టిడిపి కోల్పోయింది. ఇప్పుడు ఇదే రకమైన ప్రచారం టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై చేస్తున్నారు. లోకేష్ పై అనేక అవినీతి ఆరోపణలు చేసి, ఏది నిరూపించలేక, వైసిపీ ఎన్ని పాట్లు పడుతుందో చూసాం. అందుకే ఆయన ఏదైనా స్పీచ్ ఇస్తే మాటల్లో జరిగిన తప్పులు ఎత్తి చూపుతూ, సంతోష పడుతూ ఉంటారు. అవినీతి ఎలాగూ నిరూపించలేం అని తెలుసుకున్న వైసీపీ, ఇప్పుడు లోకేష్ చిరుతిండి ఖర్చు అంటూ ప్రచారం మొదలు పెట్టింది. లోకేష్ మంత్రి అయిన తరువాత, కేవలం వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోని ఒక రెస్టారెంట్ లో, 25 లక్షల ఖర్చు చేసే, చిరుతిండి తిన్నారు అంటూ వైసీపీ తన సొంత మీడియాలో వేసుకోవటం, అది పట్టుకుని, మరి కొన్ని అనుకూల మీడియాలో కధనాలు రావటం, వైసిపీ దాన్ని ప్రచారం చెయ్యటం జరుగుతుంది.

lokesh 23102019 2

అయితే దీని పై తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలతో క్లారిటీ ఇచ్చింది. వైజాగ్ ఎయిర్ పోర్ట్ రెస్టారంట్ లో, ప్రోటోకాల్ ప్రకారం, సియం, కేంద్ర/రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ అతిధులు, ప్రతిపక్ష నేత, ఎంపీలు, ఇలా అనేక మందికి ప్రోటోకాల్ ప్రకారం, ఆ ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ లో, రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆతిధ్యం ఇస్తారని, అందరి ఖర్చు, లోకేష్ ఖర్చు గా చూపిస్తున్నారని టిడిపి అంటుంది. అసలు ఇంకో విషయం ఏమిటి అంటే, వైసిపీ ప్రచారం చేస్తున్న ఆ తేదీలిలో, అసలు లోకేష్ వైజాగ్ లోనే లేరని, ఆయన అమరావతిలో, హైదరబాద్ లో, అమెరికాలో , ఢిల్లీలో ఇలా వివిధ చోట్ల ఉన్నారని, ఆధారాలు చూపిస్తి, ఈ వికృత ప్రచారాన్ని టిడిపి ఖండించింది. అసలు లోకేష్ వైజాగ్ లోనే లేకపోతే, ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో, పూర్తీ ఆధారాలతో, కేసు వేయటానికి, లోకేష్ సిద్ధమయ్యారు.

lokesh 23102019 3

ఇది టిడిపి విడుదల చేసిన వివరాలు...15-08-2017 - సాక్షి రాసింది: 83,816 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, సుజనా చౌదరి కూతురు ఎంగేజ్మెంట్ లో ఉన్నారు; 31-10-2017 - సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో; 31-10-2017 - సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో; 18-11-2017 - సాక్షి రాసింది: 31,322 రూపాయల బిల్ చేసారని,లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉన్నారు: ఈ ఒక్క రోజు మాత్రమే విశాఖపట్నంలో, ఆగ్రీ టెక్ సమ్మిట్ లో; 20-11-2017 - సాక్షి రాసింది: 59,818 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, ఎంప్లాయిమెంట్ గారంటీ స్కీం పై ప్రసంగం; 05-12-2017 - సాక్షి రాసింది: 21,098 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ; 05-12-2017 - సాక్షి రాసింది: 10,466 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ; 31-12-2017 - సాక్షి రాసింది: 45,234 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో; 04-02-2018 - సాక్షి రాసింది: 67,096 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: అమెరికాలోని న్యూజర్సీలో, ఎన్ఆర్ఐ టిడిపి శ్రేణుల మధ్య మాట్లాడుతూ; 28-02-2018 - సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ;

lokesh 23102019 4

28-02-2018 - సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ; 30-04-2018 - సాక్షి రాసింది: 47,040 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: తిరుపతిలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం; 31-05-2018 - సాక్షి రాసింది: 48,878 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, నిరుద్యోగ బృతి ప్రకటన; 30-06-2018 - సాక్షి రాసింది: 44,122 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: కడపలో జరిగిన, సియం రమేష్ ఉక్కు దీక్షలో ప్రసంగం; 31-07-2018 - సాక్షి రాసింది: 56,742 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, stanford పూర్వ విద్యార్ధుల కలియికలో ; 26-08-2018 - సాక్షి రాసింది: 74,392 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ నివాసంలో.; 30-09-2018 - సాక్షి రాసింది: 63,452 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, యువనేస్తం పై రివ్యూ; 30-10-2018 - సాక్షి రాసింది: 79,170 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం; 31-01-2019 - సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ ; 31-01-2019 - సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ ; 20-03-2019 - సాక్షి రాసింది: 3,928 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: తాడేపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో; 31-03-2019 - సాక్షి రాసింది: 7,246 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: మంగళగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో; 30-04-2019 - సాక్షి రాసింది: 3,108 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఎన్నికలు అయిపోయాయి, హైదరాబాద్ నివాసంలో; 31-05-2019 - సాక్షి రాసింది: 10,396 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఈ మధ్య కాలంలో, రెండూ ఏకం అయిపోయి, రాజకీయ వ్యవస్థ పతనం వైపు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే, కొంత మంది నేతలు, రెండూ వేరు వేరుగా చూస్తూ, రాజకీయ వేడి తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు పై ఎంత వైరం చూపిస్తారో, ఎలాంటి వ్యక్తిత్వ హననం చేస్తారో, చూస్తూనే ఉంటాం. అయితే చంద్రబాబు సియంగా ఉండగా, గత మూడేళ్ళ నుంచి, జగన్ మొహన్ రెడ్డి పుట్టిన రోజు నాడు, చంద్రబాబు ఆయన్ను ట్విట్టర్ ద్వరా విష్ చేసే వారు. ఒక మంచి వాతావరణం వైపు అడుగులు వేసేవారు. అలాగే బీజేపీ పార్టీతో అంత పోరాటం చేసినా, ప్రధాని మోడీకి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేసావారు. అయితే ఇప్పుడు అమిత్ షా హోం మంత్రి కావటంతో, ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావటంతో, చంద్రబాబు ఆయనకు ట్విట్టర్ ద్వారా విషెస్ పంపించారు.

shah 22102019 21

"Happy Birthday @AmitShah Ji Wishing you a memorable day and a wonderful year ahead with good health and happiness. " అంటూ చంద్రబాబు ఈ రోజు ట్వీట్ చేసారు. అయితే, చంద్రబాబు చేసిన ట్వీట్ కి, అమిత్ షా కూడా రిప్లై ఇచ్చారు. "Thank you for your wishes. @ncbn" అంటూ అమిత్ షా స్పందించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అంటూ, బీజేపీ పై, చంద్రబాబు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అటు బీజేపీ కూడా, తమకు ఎదురు లేదు అనుకుంటున్న టైంలో, చంద్రబాబు ఎదురు తిరిగారు కాబట్టి, ఆయన్ను రాజకీయంగా దెబ్బ తియ్యటం కోసం, చంద్రబాబు ఓటమికి అన్ని విధాలుగా సహకరించారు.

shah 22102019 3

అయితే, రాజకీయం ఎలా ఉన్నా, అది వ్యక్తిగత వైరం కాదని, మొన్న జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎలా చెప్పారో, ఈ రోజు అమిత్ షా కి కూడా అలాగే విషెస్ చెప్పారని, టిడిపి అంటుంది. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయం పై పోరాడామని, పోరాడుతూనే ఉంటామని, అలాగే జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడతామని టిడిపి అంటుంది. తమ్ముడే తమ్ముడే, పేకాట పేకాటే అంటుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, కేంద్రం పై ఒత్తిడి తెస్తూనే ఉంటామని టిడిపి అంటుంది. అయితే, అమిత్ షా, చంద్రబాబుకి రిప్లై ఇవ్వటం పై మాత్రం, వైసిపీ గమనిస్తుంది. ఒక పక్క సియం హోదాలో ఉన్న జగన్ కు, ఢిల్లీ పర్యటన సాఫీగా సాగాకపోవటంతో, చిరాకులో ఉన్న వైసీపీకి, ఇది మరింత చికాకు తెప్పించే అంశం.

జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన, ఆశాజనకంగా జరగలేదు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో, వివిధ కేంద్ర మంత్రులను కలవాలని జగన్ నిర్ణయం తీసుకుని, నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. నిన్నంతా ఢిల్లీలో తన అధికార నివాసానికి పరిమితమైన జగన్ మోహన్ రెడ్డి, అమిత్ షా ఆఫీస్ నుంచి పిలుపు కోసం ఎదురు చూసారు. అయితే, నిన్నంతా జగన్ కు కబురు రాకపోవటంతో, ఆయన తన అధికార నివసానికే పరిమితం అయ్యారు. అయితే, ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో, జగన్, అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. జగన్ మోహన్ రెడ్డితో పాటు, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమి రెడ్డి తదితరులు కూడా, జగన్ వెంట వెళ్లారు. అయితే అమిత్ షా తో, జగన్ భేటీ పై, సిఎంఓ ఇచ్చిన ప్రకటనలో, 40 నిమిషాల పాటు భేటీ జరిగిందని, వివిధ సమస్యల పై ఇరువురూ చర్చించుకున్నారని తెలిపారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, అంత సేపు భేటీ జరగలేదని తెలుస్తుంది.

jagan 22102019 2

కొన్ని తెలుగు మీడియా ఛానెల్స్ లో ఈ విషయం పై, వార్తలు వస్తున్నాయి. ఈ రోజు అమిత్ షా పుట్టిన రోజు కావటంతో, ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. ఆయనకు శుభాకాంక్షలు చెప్పటానికి, సహచర మంత్రులు, నేతలు, కార్యకర్తలు రావటంతో, ఆయన కార్యాలయం సందడిగా మారింది. ఇదే సమయంలో జగన్ తో పాటు, ఇతర వైసీపీ నేతలు, అమిత్ షా కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, వచ్చేసారని, జగన్ మోహన్ రెడ్డి, సమస్యల పై ఒక మెమోరాండం ఇచ్చారని సమాచారం. 11 గంటలకు, అదీ అమిత్ షా పుట్టిన రోజు నాడు, అంత కోలాహలంగా ఉన్న చోట, జగన్ తో 40 నిమిషాలు భేటీ అనేది, కుదిరే పని కాదని అంటున్నారు. దీంతో అమిత్ షా తో పూర్తీ స్థాయి సమావేశం జరగలేదని, కేవలం విష్ చేసి, మెమోరాండం ఇచ్చి వచ్చేసారని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.

jagan 22102019 3

అయితే, జగన్ తో, అమిత్ షా భేటీ జరగలేదు అని తెలియగానే, కేంద్ర మంత్రులు రవిశంకర్‌, ప్రహ్లాద్‌జోషి కూడా జగన్ తో అపాయింట్మెంట్ రద్దు చేసుకోవటం, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 12:30 గంటలకు కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్‌ తో, అలాగే కేంద్ర బొగ్గు శాఖా మంత్రి, ప్రహ్లాద్‌జోషితో, 3 గంటలకు జగన్ కు అపాయింట్మెంట్ ఉంది. ఇవి రెండు రద్దు కావటం సంచలనంగా మారింది. మరో పక్క కేంద్ర జల శక్తి మంత్రిని, కేంద్ర విద్యుత్ శాఖా మంత్రిని కలవాలి అనుకున్నా, వారు ముందు నుంచి అందుబాటులో లేరు. అయితే ఈ సారి జరిగిన ఢిల్లీ పర్యటన పై జగన్ పూర్తీ అసంతృప్తిలో ఉన్నారని, రెండు రోజులు ఎదురు చూసినా, పూర్తిస్థాయి మీటింగ్ జరగలేదనే అసహనంతో జగన్ ఉన్నారని తెలుస్తుంది. ఈ పరిణామాలతో, అర్థాంతరంగా పర్యటన ముగించుకున్న జగన్, మరికాసేపట్లో ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయలుదేరి రానున్నారు.

జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పర్యటన సక్సెస్ కాలేదని, అట్టర్ ఫ్లోప్ అయ్యింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. నిన్న 12 గంటలకు ఢిల్లీ చేరినా, నిన్నంతా జగన్ కు ఎవరి అపాయింట్మెంట్ దొరకలేదు. అమిత్ షా పిలుస్తారని వేచి చూసినా, పిలుపు రాలేదు. అయితే ఈ రోజు అమిత్ షా పుట్టిన రోజు కావటంతో, అయన కార్యాలయానికి, అందరూ వచ్చి విష్ చేసారు. ఇదే సమయంలో, 11 గంటల ప్రాంతంలో, జగన్ మోహన్ రెడ్డి కూడా అక్కడకు చేరుకొని, అమిత్ షా ని కలిసారు. అయితే, కేవలం మర్యాద పూర్వకంగా కలిసి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, మెమోరాండం ఇచ్చి వచ్చేశారని, మీడియాలో వార్తలు వచ్చాయి. తరువాత అపాయింట్మెంట్ ఉన్న కేంద్ర మంత్రులు కూడా, జగన్ తో అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారని, దీంతో, జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని, విశాఖ వచ్చేసారని, వార్తలు వచ్చాయి.

ycp 22102019 2

అయితే, ఈ ప్రచారం పై వైసిపీ స్పందించింది. ఇదంతా తెలుగుదేశం కుట్ర అని, టిడిపి అనుకూల మీడియాలో, అనవసరంగా ఏదో జరిగిపోయిందనే హడావిడి చేస్తున్నారని, నిజానికి అమిత్ షా తో సమావేశం బ్రహ్మాండంగా జరిగిందని, వైసిపీ చెప్తుంది. ముఖ్యంగా పోలవరం రివర్స్ టెండరింగ్ లో, డబ్బులు ఆదా చెయ్యటంతో, అమిత్ షా చాలా సంతోషంగా ఉన్నారని, అమిత్ షా, జగన్ ను అభినందించారని వైసిపీ అంటుంది. అయితే, మరో పక్క రివర్స్ టెండరింగ్ ను, కేంద్ర జల శక్తి మంత్రితో పటు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా తప్పు పట్టిన విషయం తెలిసిందే, మరో పక్క హైకోర్ట్ కూడా దీని పై స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి కోర్ట్ లో ఉన్న అంశం పై, ఏకంగా దేశ హెం మంత్రి శభాష్ అని అన్నారు అంటే, ఇది వైసిపీ విజ్ఞతకే వదిలెయ్యాలి.

ycp 22102019 3

మరో పక్క, ఈ రోజు జగన్ మరో ఇద్దరు మంత్రులను కలవాల్సి ఉంది. న్యాయ శాఖా మంత్రి, బొగ్గు శాఖా మంత్రితో, జగన్ కు అపాయింట్మెంట్ ఉంది. అయితే, ఎందుకో కాని, ఉన్నట్టు ఉండి, వారు అపాయింట్మెంట్ రద్దు చేసారనే వార్తలు వచ్చాయి. అయితే, దీని పై కూడా వైసిపీ వివరణ ఇస్తూ, వాళ్ళు రద్దు చెయ్యలేదని, జగనే వెళ్లలేదని అంటున్నారు. దీనికి కారణం చెప్తూ, అమిత్ షా భేటీలో, నేను వారితో మాట్లాడతానని చెప్పారని, ఏపీ సమస్యలపై తాను ఇతర శాఖల మంత్రులతో మాట్లాడతానని అమిత్‌షా హామీ ఇచ్చారని, ఆ తర్వాతనే మంత్రులను కలవాలని ఆయన జగన్‌కు సూచించారని, అందుకే మంత్రులతో భేటీ వాయిదా పడిందని, వైసిపీ చెప్తుంది. అమిత్ షా పుట్టిన రోజు నాడు, బిజీగా ఉండి కూడా, 45 నిమిషాలు మాట్లాడారు అంటే, అమిత్ షా, జగన్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలుస్తుందని, వైసిపీ అంటుంది.

Advertisements

Latest Articles

Most Read