రాజకీయాల్లో, ఒక రాజకీయ పార్టీ పై, మరొక రాజకీయ పార్టీ, ఆరోపణలు చేయటం సహజం. అయితే, మన రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి, ఇది వికృత రూపం దాల్చింది. వీరికి తోడుగా ఒక రాజకీయ పత్రిక, ఛానల్ కూడా తయారు అయ్యి, వీళ్ళు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. జరిగిన సంఘటన పై ఆరోపణలు, ప్రత్యారోపణలు అయితే పరవాలేదు కాని, వీళ్ళు మాత్రం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసి, చివరకు ఇంట్లో ఆడవాళ్ళను కూడా వదలకుండా, విష ప్రచారం చేసారు. మొన్నటి ఎన్నికల్లో, సోషల్ మీడియాలో ఈ వికృత ప్రచారం ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, వీరి ప్రచారాన్ని తిప్పి కొట్టి, ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్పటంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలం అవ్వటంతో, అవతలి వారు చెప్పిందే నిజం అని ప్రజలు నమ్మటంతో, తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే.

heritage 21102019 2

అయితే, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారాన్ని, ఇప్పుడు ఎన్నికలు అయిన తరువాత, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వారసత్వం తీసుకునట్టు ఉంది. జనసేన పార్టీ అఫిషియల్ ఫేస్బుక్ పేజిలో, ఈ రోజు చంద్రబాబు కుటుంబం పై వేసిన పోస్టింగ్ చూస్తే ఇదే అనిపిస్తుంది. చంద్రబాబు కుటుంబం ఫోటో వేసి, అప్పట్లో చంద్రబాబు కుటుంబం, హోటల్ లో నివాసం ఉండి, ఆ బిల్లులు అన్నీ ప్రభుత్వం నుంచే చెల్లించారని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని, పోస్టింగ్ వేసారు. ఇదే ప్రచారం, అప్పట్లో వైసీపీ కూడా చేసింది. అయితే, అప్పట్లోనే చంద్రబాబు కుటుంబం, ఇది హెరిటేజ్ కంపెనీ నుంచి బిల్లులు కట్టుకున్నామని, ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు.

heritage 21102019 3

అయినా ఈ వాదన మాత్రం ప్రజల్లోకి వెళ్ళలేదు. వైసిపీ చెప్పిందే నమ్మారు. అయితే, ఈ రోజు జనసేన మళ్ళీ అదే ప్రచారం మొదలు పెడుతూ, చంద్రబాబు కుటుంబాన్ని కూడా లాగటంతో, తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. హెరిటేజ్ నుంచి కట్టిన బిల్లులు వివరాలు పోస్ట్ చేస్తూ, జనసేన పై విరుచుకు పడింది. ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిప్లై "Nara Chandrababu Naidu కుటుంబంపై జనసేన అపనిందలు వెయ్యడాన్ని మేము ఖండిస్తున్నాం. చంద్రబాబు కుటుంబ అవసరాలకోసం ఎప్పుడూ ప్రజాధనాన్ని వాడుకోలేదు, అందుకు శ్రీమతి నారా భువనేశ్వరిగారు చేసిన చెల్లింపులే సాక్ష్యం. ఇప్పటికైనా JanaSena Party సోషల్ మీడియా నిజాలు తెలుసుకుని అసత్య ప్రచారం మానుకోవాలి." అయితే, ఇదే వివారాలు, అప్పట్లోనే వైసీపీ ప్రచారం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బయట పెట్టి ఉంటే, ఇలాంటి ప్రచారాలకి అప్పుడే అడ్డుకట్ట పడేదని, తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు.

ఢిల్లీ వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డికి, ఎదురు చూపులు తప్పటం లేదు. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న జగన్, తన అధికార నివాసం 1-జన్‌పథ్‌కు పరిమితం అయిపోయారు. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తారని చెప్పినా, ఇప్పటి వరకు అమిత్ షా ఆఫీస్ నుంచి, జగన్ కు కబురు రాలేదు. దీంతో మధ్యాహ్నం నుంచి, ఎదురు చూపులకే పరిమితం అయిపోయారు. మరో పక్క, కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తో రేపు, జగన్ కు అపాయింట్‌మెంట్‌ ఉన్నప్పటికీ, ఏ సమయంలో అనేది ఖరారు కాలేదు. మిగతా మంత్రులు కూడా ఎవరూ అందుబాటులో లేకపోవటంతో, జగన్ తన అధికార నివాసానికే పరిమితం అయిపోయారు. ఈ రోజు ఉదయం, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన, పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం తరువాత, గన్నవరం విమానాశ్రయం నుంచి, జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం12.30 ప్రాంతంలో జగన్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు.

shah 21102019 2

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు, ఈ రోజు జరగటంతోనే, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు బిజీగా ఉండడంతోనే, ఇంకా జగన్ కు ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఈ రోజు అపాయింట్మెంట్ దొరకటం కష్టం అని, రేపు ఏమైనా పిలుపు రావచ్చని అంటున్నారు. ఇప్పటికే గత 20 రోజుల్లో, జగన్ కు రెండు సార్లు అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న హస్తిన వచ్చి ప్రధాని మోదీని కలిసినప్పుడే షాతో భేటీ అవ్వాలని అనుకున్నా కుదరలేదు. తరువాత, పోయిన వారం కూడా, అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చే రద్దు చేసారు. మరి ఈ సారి, అమిత్ షా కలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే, జగన్ ఎందుకు, ఇలా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం, పట్టు బడుతున్నారో అర్ధం కావటం లేదు. రాష్ట్రానికి సంబంధించి, ఏమైనా అత్యవసర సమస్య అంటే, అలాంటిది ఏమి కనిపించటం లేదు. దీంతో, ఇది రాజకీయ భేటీగా చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

shah 21102019 3

ముఖ్యంగా రివెర్స్ టెండరింగ్ లో డబ్బులు ఆదా చేసామని, అమిత్ షా కు చెప్పి, ఇదంతా చంద్రబాబు చేసిన స్కాం అని, కళ్ళ ముందే కనిపిస్తుంది అంటూ, అమిత్ షా ని ఒప్పించి, చంద్రబాబు పై ఏదైనా ఎంక్వయిరీ కోసం అడగటానికే, జగన్, అమిత్ షా ని కలుస్తున్నారు అనే వాదన విశ్లేషకులు వినిపిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, జగన్ ఇంతలా అమిత్ షా ని కలవాలి అనుకోటానికి కారణం, సిబిఐ కోర్ట్ లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పిటీషన్ లో రిలీఫ్ కోసమని, సియం హోదాలో, ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్తే, రాజకీయంగా ఇబ్బంది అని భావించి, ఆ విషయం మాట్లాడటానికి, జగన్, అమిత్ షా ని కలవాలని అనుకుంటున్నారని, టిడిపి ఆరోపిస్తుంది. అయితే ఏపి ప్రజలు మాత్రం, ఇవేమీ వద్దు, ఎన్నికల ముందు చెప్పినట్టు, కేంద్రం మెడలు వంచి, ప్రత్యెక హోదా, విభజన హామీలు, సాధించుకుని, జగన్ వస్తే, చూడాలని ఉందని అంటున్నారు.

ప్రతిపక్షంగా ఉన్న ఎవరైనా, అధికార పక్షం మీద పోరాటం చేస్తారు. అదీ కాక, ఇప్పటికి అయుదు నెలలు జగన్ అధికారంలోకి వచ్చి. ఈ అయుదు నెలల్లో, రాష్ట్రం సంక్షోభం వైపు వెళ్తుంది. 40 లక్షల మండి భవన నిర్మాణ కార్మికులకు, ఈ అయుదు నెలల్లో అసలు పని లేదు. రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి రావటం లేదు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. జీవనాడి అయిన పోలవరం పనులు, ఇప్పట్లో మొదలయ్యే అవకాశమే కనిపించటం లేదు. ఇక అమరావతి సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరో పక్క పేదలు అన్నం తినటానికి పెట్టిన అన్న క్యాంటీన్ లు మూత పడ్డాయి. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పధకాలు అన్నీ అరకొరగా లబ్దిదారులకు చేరుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మాత్రం, జగన్ మోహన్ రెడ్డిని వదిలేసి, చంద్రబాబు పై పడ్డారు. వారికి వారే ఊహించుకుని, లేని సమస్య సృష్టించి, చంద్రబాబు మా వద్దకు వస్తే అసలు ఒప్పుకోం అంటున్నారు.

bjp 20102019 2

అసలు చంద్రబాబు మీ దగ్గరకు ఎందుకు వస్తారు అంటే దానికి జవాబు లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనే పార్టీని ఎవరూ గుర్తించటం లేదు కూడా. అటు జగన్ మొహన్ రెడ్డి అయితే, ఏపి బీజేపీ నేతలను పూచిక పుల్ల తీసినట్టు, తీసి అవతల వేస్తున్నారు. ఇక టిడిపికి, ఎలాగూ అవసరం లేదు. రాష్ట్రానికి బీజేపీ చేసిన దుర్మార్గం పై, పోరాడిందే టిడిపి. మొన్న ఎన్నికల్లో, నోటాకి 1.28 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 0.84 శాతం ఓట్లు వచ్చాయి. ఇలాంటి బీజేపీ పార్టీ, 40 శాతం ఓట్లు వచ్చిన టిడిపి పార్టీకి చాలెంజ్ చేస్తూ, మిమ్మల్ని మేము చేర్చుకోం అంటూ బిల్డ్ అప్ ఇస్తున్నారు. అయితే, ఈ వ్యూహం వెనుక, ఉన్న కారణం ఇట్టే అర్ధం చేసుకోవచ్చు అని, విశ్లేషకులు అంటున్నారు. బీజేపీకి ఏపిలో అసలు సీన్ లేదనే విషయం ఆ పార్టీ అధ్యక్షుడు కన్నాని చూస్తేనే అర్ధం అవుతుందని అంటున్నారు. వైసీపీలోకి వెళ్ళే కన్నాను రాత్రికి రాత్రి ఆపి, బీజేపీ అధ్యక్షుడుని చేసారంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుందని అంటున్నారు.

bjp 20102019 3

అయితే, మొన్నటి ఎన్నికలల్లో టిడిపి దెబ్బ తిన్న తరువాత, టిడిపి నాయకులు అందరూ , తమ పార్టీలోకి వచ్చేస్తారని ఆశ పడ్డారు. అయితే కేసులు ఉన్న సుజనా, సియం రమేష్ లాంటి ఎంపీలు నలుగురు వెళ్లారు తప్పితే, తరువాత ఎవరూ వెళ్ళలేదు. దీంతో అయుదు నెలలు అయినా, ఇంకా ఎవరూ రాకపోవటంతో, బీజేపీ నేతలకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది. గతంలో దొంగలు అని విమర్శించిన సుజనాని చేర్చుకున్నా, ఎవరూ రాకపోవటంతో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు పై విమర్శలు మొదలు పెట్టరు. బీజేపీ, టిడిపి, మళ్ళీ కలుస్తాయి అనే ప్రచారం వల్లే, ఎవరూ తమ పార్టీలో చేరటం లేదని ఏపి బీజేపీ నాయకులు భావన. అందుకే, అసలు చంద్రబాబుతో కలవం అని చెప్తూ, టిడిపి శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు. అందుకే 0.84 శాతం ఓటు షేర్ ఉన్న పార్టీ, టిడిపి నేతలను తమ పార్టీలోకి తీసుకు రావాలనే వ్యుహ్యంలో, ఈ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంత ఘోరంగా ఉన్న బీజేపీని, ఏపి ప్రజలు ఆదరిస్తారో లేదో, కాలమే సమాధానం చెప్తుంది.

30 ఇయర్స్ పృథ్వీ మళ్ళీ హర్ట్ అయ్యారు. ఈ మధ్య రాజకీయంగా పృధ్వీ బాగా ఆక్టివ్ అవుతూ, రాజకీయాల వైపే మాట్లాడుతూ వార్తల్లో నిలిస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమా పరంగా, మళ్ళీ హర్ట్ అయ్యి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పదవి అంటే రాజకీయంగా జగన్ ఇచ్చిన, ఎస్వీబీసీ చైర్మెన్ పదవి కాదు, సినిమా వ్యక్తిగా సంపాదించుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవి. ఈ రోజు ఉదయం నుంచి టాలీవుడ్ లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య గొడవ, తీవ్ర వివాదానికి కారణం అయ్యింది. ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అత్యవసర సమావేశం అంటూ ఏర్పాటు చేసారు. అయితే ఈ సమావేశంలో కొంత మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ నిరసన తెలుపుతూ, వాక్ అవుట్ చేసారు. ఈ సమావేశానికి 30 ఇయర్స్ పృథ్వీ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశం జరిగిన తీరు పై ఆయన భగ్గు మన్నారు.

prudhvi 20102019 2

ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ తనకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదని, ఈ పదవికి రాజీనామా చేస్తున్నాని సంచలన ప్రకటన చేశారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరి గోపాలకృష్ణకు ఈ రోజు అవమానం జరిగిందని, పరుచూరి కంటతడి పెడుతూ సమావేశం నుంచి వెళ్లిపోయారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా గెలిచినందుకు ఆనందపడాలో, ఈ గొడవలకు బాధపడాలో తెలియడం లేదన్నారు. సమావేశం ఉందంటే, తిరుపతి నుంచి వచ్చానని, ఇక్కడ రచ్చ రచ్చ చేస్తున్నారని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫీలవుతున్నారని, ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారని పృథ్వీ ఆరోపించారు.

prudhvi 20102019 3

అయితే ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స‌మావేశం అనగానే రచ్చ మొదలైంది. గౌర‌వ స‌ల‌హాదారు హోదాలో కృష్ణంరాజు మా స‌భ్యుల మ‌నోగ‌తం ఏంటో తెలుసుకోటానికి ఈ స‌మావేశం అని చెప్పారు. అయితే దీని వెనుక జీవితా రాజశేఖర్ ఉన్నారని తెలుసుకుని, న‌రేశ్‌, రాజ‌శేఖ‌ర్ వ‌ర్గాల మ‌ధ్య మాట‌ల యుద్ధంతో స‌మావేశం వాడి వేడిగా సాగింది. మా అధ్యక్షుడు నరేష్‌ లేకుండానే రాజశేఖర్‌, జీవితలు జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించటం పై అభ్యంతరం తెలిపారు. అత్యవసర సమావేశం అని సభ్యులకు మెసేజ్‌ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌ పై మా అధ్యక్షుడు నరేష్‌కు మాత్రం సమాచారం లేదు. అయితే నరేష్ తరుపు లయార్, అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్‌ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు. దీని పై స్పదించిన రాజశేఖర్‌, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ మాత్రమే అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read