మొన్నటి వరకు ఆ అవార్డ్ వచ్చింది, ఈ అవార్డ్ వచ్చింది అని , ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకునే వారు. 2014 నుంచి 2019 మధ్య, దాదపుగా 700 పైన అవార్డ్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. అంతే కాదు, వరుసుగా, మూడు ఏళ్ళు, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలిచింది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారింది, వాటి విధానాలు మారాయి, దీంతో మన ర్యాంకు కూడా మారిపోయింది. అన్నిట్లో టాప్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ పరిస్థతి ఘోరంగా తయారయ్యింది. నీతి ఆయోగ్‌ రూపొందించిన ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌-2019లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 10వ ర్యాంకు వచ్చింది. అదే తెలంగాణా రాష్ట్రానికి మాత్రం, నాలుగువ ర్యాంకు వచ్చింది. పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ర్యాంకులను విభజించి ప్రకటించారు. పెద్ద ర్యాంకులు ఉన్న రాష్ట్రాల్లో 17 ఉండగా, ఆంధ్రప్రదేశ్ 10 వ స్థానంలో నిలిచింది. ఇందులో కర్ణాటక దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.

niti 18102019 2

టాప్‌ 10లో తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిల్లీ తొలి స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఈ నివేదికను విడుదల చేసిన అనంతరం రాజీవ్ కుమార్ మాట్లాడుతూ భారత దేశం పోటీతత్త్వం నిండిన సుపరిపాలనకు మారుతుందని చెప్పారు. నవ కల్పనల వాతావరణంలో వివిధ వర్గాల మధ్య సమన్వయం సాధించడానికి ఈ సూచీ దోహదపడుతుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవ కల్పనల వాతావరణాన్ని నిరంతరం మదింపు చేయడానికి విస్తృత నిబంధనావళిని రూపొందించడానికి ఈ ప్రయత్నం జరిగిందని తెలిపారు.

niti 18102019 3

అంశాలవారీగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య ర్యాంకులు.. ఓవరాల్ ర్యాంక్ లో, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా, తెలంగాణా 4వ స్థానంలో ఉంది. సానుకూల వాతావరణంలో, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉండగా, తెలంగాణా 9వ స్థానంలో ఉంది. పనితీరులో, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా, తెలంగాణా 4వ స్థానంలో ఉంది. మానవ వనరులులో, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉండగా, తెలంగాణా 9వ స్థానంలో ఉంది. పెట్టుబడులులో, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా, తెలంగాణా 7వ స్థానంలో ఉంది. నైపుణ్య కార్మికులలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండగా, తెలంగాణా 5వ స్థానంలో ఉంది. వాణిజ్య వాతావరణంలో, ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉండగా, తెలంగాణా 4వ స్థానంలో ఉంది. సురక్ష చట్టబద్ద వాతావరణంలో, ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉండగా, తెలంగాణా 16వ స్థానంలో ఉంది. నాలెడ్జ్ అవుట్ పుట్ లో, ఆంధ్రప్రదేశ్ 14 వ స్థానంలో ఉండగా, తెలంగాణా 4వ స్థానంలో ఉంది. విజ్ఞాన విస్తరణలో, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా, తెలంగాణా 5వ స్థానంలో ఉంది.

ప్రతి శుక్రవారం తనకు సిబిఐ కోర్ట్ కు రావటం ఇబ్బందిగా ఉందని, శుక్రవారం శుక్రవారం మినహాయింపు ఇవ్వాలని, జగన్ మోహన్ రెడ్డి, సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై, ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా, సిబిఐ ఫైల్ చేసిన కౌంటర్ పై, జగన్ తరుపు వాదనలు వినిపించారు, లాయర్ నిరంజన్‌రెడ్డి. అయితే ఈయన వాదనలు వినిపించే సమయంలో, జగన్ ని ఇష్టం వచ్చినట్టు సిబిఐ సంబోదిస్తుందని, జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, గౌరవనీయ ముఖ్యమంత్రి అని సిబిఐ, జగన్ ని సంబోధించాలని సూచించారు. అలా కాకుండా, సిబిఐ, జగన్ పై ఘాటైన పదజాలాన్ని ఎలా వాడతారంటూ నిరంజన్ రెడ్డి, సీబీఐ పిటిషన్‌ను తప్పుబట్టారు. అయితే సిబిఐ దీని పై ఎలా స్పందించో చూడాలి. చట్టం ముందు ఎవరైనా సమానమే, అని ఇది వరకే సిబిఐ తన సీబీఐ పిటిషన్‌ లో పేర్కున్న సంగతి తెలిసిందే.

cbi 18102019 2

ఇక మరో పక్క, నిరంజన్ రెడ్డి, జగన్ మొహన్ రెడ్డికి, ఎందుకు మినహాయింపు ఇవ్వాలో కూడా వాదనలు వినిపించారు. ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, ఆయన ప్రతిసారి విజయవాడ, నుంచి హైదరాబాద్ కు విచారణకు హాజరు కావాలంటే, ప్రతి వారం రెండు రోజులు టైం పోతుందని, ఆయన పనులు అన్నీ ఆగిపోతాయని అన్నారు. అంతే కాక, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా భారం అవుతుందని, జగన్‌ తరపున హైకోర్టు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే జగన్ స్థానంలో, ప్రతి వారం, ఆయన తరపున న్యాయవాది కోర్టుకు హాజరవుతారని తెలిపారు. జగన్ ని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారని కూడా చెప్పారు. ఈ సందర్భంగా హాజరు మినహాయింపు పై సుప్రీంకోర్టు తీర్పులను నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు.

cbi 18102019 3

మరో పక్క, తాను హాజరుకాకపోతే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ తెలపాలని, జగన్ తరుపున ఆయన లాయర్ కోరారు. గత ఆరేళ్లలో ఎప్పుడూ కేసుల వాయిదా కోరలేదని, ఇప్పుడు అవసరం కాబట్టి అడుగుతున్నామని అన్నారు. గతంలో పాదయాత్ర కోసం మినహాయింపు కోరితే, రాజకీయ అవసరాల కోసం ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని, కాని ఇప్పుడు సీఎంగా పరిపాలన చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఉందని జగన్ తరుపు లాయర్ కోర్ట్ కు తెలిపారు. సిబిఐ లాయర్ వాదనలు వినిపిస్తూ, గతంలో ఇవన్నీ చర్చకు వచ్చాయని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు, హైకోర్టు జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించాయన్నారు. జగన్ హోదా మారింది ఏమో కాని, కేసులు అలాగే ఉన్నాయని అన్నారు. అంతగా పనులు ఉంటే ఆ రోజు మినహాయింపు కోరోచ్చని అన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్ట్, తీర్పును నవంబర్‌ 1కి వాయిదా వేసింది.

జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అమరావతి పై, ప్రతి రోజు ఏదో ఒక కన్ఫ్యూషన్ ఉంటూనే ఉంది. ఎంత మంది, ఎన్ని మాట్లాడినా, మంత్రులు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నా, జగన్ మాత్రం, అమరావతి ఇక్కడే ఉంటుందని కాని, అమరావతి ఇక్కడ ఉండదు అని కానీ, ఏదీ క్లారిటీ ఇవ్వటం లేదు. మరో పక్క ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రకటనలతో, రాజధాని అమరావతి రైతులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.భవిష్యత్తు ఏంటో అర్ధం కాక, ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియక, వారు ప్రతి రోజు ఆందోళనతో గడుపుతున్నారు. అయితే అమరావతి మార్చేస్తాం అని ప్రభుత్వంలోని మంత్రులు ఇస్తున్న లీకులుకు బలం చేకూరుస్తూ, ఇప్పుడు మరో పిడిగు లాంటి వార్త అమరావతి వాసులకు, అమరావతిని అభిమానించే వారికి, వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న మీడియాతో మాట్లాడుతూ, చేసిన వ్యాఖ్యలు, అమరావతి మార్పు పై సంకేతం ఇచ్చేలా ఉన్నాయి.

amaravati 18102019 2

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషమై, అధ్యయనానికే నిపుణుల కమిటీని నియమించామని బొత్సా చెప్పారు. ఈ కమిటి, రాష్ట్రమంతా తిరిగి, రాజధాని ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఏ ప్రాంతాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాల పై, రీసెర్చ్ చేసి, ఒక నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ కమిటీ మరో 3, 4 రోజుల్లో తన పని మొదలు పెడుతుందని, రాష్ట్రమంతా పర్యటన చేస్తుందని, బొత్సా చెప్పారు. కమిటీ సూచనలు, సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించి, ప్రజాభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వపరంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని పై నిర్ణయం తీసుకుంటామని బొత్స చెప్పారు. హైకోర్ట్ విషయంలో కూడా, కొన్ని ఉద్యమాలు జరుగుతున్నాయని, రాయలసీమలో పెట్టాలని కొందరు, అమరావతిలోనే కొనసాగించాలని మరికొందరు, ఉత్తరాంధ్రలో పెట్టాలని ఇంకొందరు ఆందోళన చేస్తున్నారని, దీని పై కూడా ఈ కమిటి ఒక నిర్ణయం తీసుకుంటుందని బొత్సా చెప్పారు.

amaravati 18102019 3

శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా, చంద్రబాబు అమరావతిని ఫైనల్ చేసారని, అక్కడ రాజధాని ఏ విధంగా సౌకర్యంగా లేదని, ఇప్పుడు ఉన్న సచివాలయమున్న ప్రాంతం వర్షం పడితే ముంపునకు గురయ్యే ప్రమాదముంది. ఒక భవనం నిర్మించాలి అంటే, ఇక్కడ చాలా ఖర్చు అవుతుందని బొత్సా అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటి అన్నిటినీ, ఆ కమిటి పరిశీలిస్తుందని, చెప్పారు. అయితే బొత్సా మాటలను ప్రకారం చూస్తుంటే, రాజధాని మార్పు తధ్యం అనే అనుమానాలు వస్తున్నాయి. రాజధానిని మార్చటం అంత తేలిక కాదని, మరో వాదన కూడా జరుగుతుంది. ఇదంతా సమస్యల నుంచి పక్క దోవ పట్టించి, ప్రజలను అసలు ఇబ్బందులు నుంచి డైవర్ట్ చెయ్యటానికి అనే వాదన కూడా వినిపిస్తుంది. చూద్దాం మరి జగన్ ఏమి చేస్తారో.

ఆయన పేరు పీఆర్ మోహన్. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న అందరికీ సుపరిచితుడు. ఎన్టీఆర్ ఉన్న టైం దగ్గర నుంచి, పార్టీ ఆఫీస్ కే సేవలు అందిస్తూ వస్తున్నారు. చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర కాని, ఎలాంటి ప్రజా పోరాతమైనా, ఆయన అన్నీ ముందుండి చూసుకునే వారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా శాప్ చైర్మెన్ గా కూడా చేసారు. ఇప్పుడు అధికారం పోవటంతో, మళ్ళీ పార్టీ ఆఫీస్ లోనే సేవలు అందిస్తున్నారు. ఈ రోజు పీఆర్ మోహన్ పుట్టిన రోజు సందర్భంగా, అధినేత చంద్రబాబు వద్దకు వచ్చి, 5 వేల రూపాయిలు, కార్యకర్తల నిధికి విరాళం ఇచ్చారు. ఈ డబ్బులు కష్టాల్లో ఉన్న కార్యకర్తకు ఎవరికైనా ఇవ్వమని కోరారు. అయితే ఆయాన చూపిన చొరవ పై చంద్రబాబు ముగ్ధులు అయ్యారు. అయన అధికారం ఉన్నా లేకపోయినా, ఎన్టీఆర్ టైం దగ్గర నుంచ, పార్టీ నుంచి ఏమి ఆశించకుండా సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

gift 18102019 2

ఈయనేమో ఇక్కడే ఉంటారనే, ఆయన భార్య లాయర్ అని, ఆవిడను అడిగి మరీ, 5 వేలు రూపాయిలు, కార్యకర్తలు కోసం ఇచ్చారని, అభినందిస్తున్నాని చంద్రబాబు అన్నారు. అయితే ఈ సందర్భంలో, చంద్రబాబు, పీఆర్ మోహన్ కు ఏమి గిఫ్ట్ ఇవ్వాలో తెలియక, తన జేబులోని పెన్ను తీసి, పీఆర్ మోహన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వార్ల రామయ్య, నక్కా ఆనందబాబు తదితర నేతలు, పీఆర్ మోహన్ ను అభినందిస్తూ, చంద్రబాబు గారి పెన్ తీసుకునే అదృష్టం మీకు వచ్చింది అంటూ, అభినందించారు. ఇక అంతకు ముందు చంద్రబాబు విలేఖరుల సమావేశంలో ప్రభుత్వం పై మండి పడ్డారు. జగన్ అవలంభిస్తున్న విధానాల పై, విమర్శలు గుప్పించారు.

gift 18102019 3

"రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు పెట్టడం, జర్నలిస్ట్ లను బెదిరించడం దారుణం. మీడియాపై ఆంక్షలు విధిస్తూ జీవో 938ను మరింత పదును పెడుతూ కేబినెట్ లో నోట్ తీసుకురావడాన్ని ఖండిస్తున్నాం. 5నెలల్లో అన్నిరంగాల్లో వైసిపి నేతలు విఫలం అయ్యారు. ప్రజల్లో విశ్వాసం పోయింది. ఇసుక కృత్రిమ కొరత తెచ్చారు. ఊళ్లో కళ్లెదురుగా ఉన్న ఇసుక తెచ్చుకునే వీల్లేకుండా చేశారు. నియంత్రణ పేరుతో ఇసుక దొరికే పరిస్థితే లేకుండా చేశారు. 30లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రిజర్వాయర్లు నిండుగా ఉన్నప్పటికీ, కరెంట్ కోతలు తెచ్చారు. మద్యంపై జె ట్యాక్స్ విధించి రేట్లు విపరీతంగా పెంచేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల ప్రవేశ పరీక్షాపత్రం టైపిస్ట్ లకే ఫస్ట్ ర్యాంకులు వస్తే, కోచింగ్ సెంటర్లకు ముందే లీకేజి అయితే, దానిని ప్రశ్నిస్తే నేరమా..? దానిపై రాస్తే జర్నలిస్ట్ లపై కేసులు పెడతారా..? అన్నా కేంటిన్లు రద్దు చేస్తారా..? సంక్షేమ పథకాలు నిలిపేస్తారా..? అదేమని అడిగితే కేసులు పెడతారా..? నరేగా, నీరు చెట్టు బిల్లులు నిలిపేస్తారు, 5నెలల్లో తట్ట మట్టి వేసిన పాపాన పోలేదు. టిడిపి కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు అంతేలేదు. ఇప్పుడు జర్నలిస్ట్ లపైనే దాడులు చేస్తున్నారు. " అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read