ఈ నెల 21న జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ల్యాండింగ్ లో నిర్లక్ష్యం వహించిన అంశం పై దర్యాప్తుకు ఆదేశించింది సీఎంఓ. సిఎంఓ ఆదేశాల పై ఈ అంశంలో పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేస్తున్న డీఆర్వో వెంకటేశం, హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు అధికారులకు నోటీసులు పంపించారు. ఈ నెల 21న కర్నూల్ జిల్లా నంద్యాల పర్యటనకు జగన్ వెళ్లారు. వరదలు వచ్చిన సందర్భంలో జగన్ అక్కడ పర్యటించిన సమయంలో, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ పై అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని అభియోగం. సహజంగా, హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలను ఒక క్రమ పద్ధతిలో డిగ్రీలు, మినిట్స్, సెకండ్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. అయితే అక్కడ అధికారులు మాత్రం కేవలం డిగ్రీల్లో ఇచ్చారు. ఈ సందర్భంలో, హెలికాప్టర్ లాండింగ్ సమయంలో, కొంత గందరగోళం ఏర్పడింది. అక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సిఎంఓ సీరియస్ అయ్యింది.

helicopter 27092019 2

ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని తీవ్ర తప్పిదంగా భావించి, దర్యాప్తుకు ఆదేశించింది. నంద్యాలలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో, అక్కడ డ్యూటీలో సరిగ్గా వ్యవహరించలేదని అక్కడ అధికారుల పై సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేసించటంతో, రంగంలోకి దిగిన కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా డీఆర్వో వెంకటేశంను నియమించి, పూర్తీ స్థాయి నివేదిక ఇవ్వమని కోరారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం, విచారణ ప్రారంభించిన డీఆర్వో వెంకటేశం, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఏడుగురు అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న వ్యక్తిగతంగా తమ ముందు హాజరయ్యి, తమకు వివరణ ఇవ్వాలని అ నోటీసులో కోరారు.

helicopter 27092019 3

సర్వే, ల్యాండ్‌ రికార్డు ఏడీ హరికృష్ణ, డ్వామా పీడీ వెంకట సుబ్బయ్య, శిరువెళ్ల, నంద్యాల, ఉయ్యాలవాడ తహసీల్దార్లు నాగరాజు, రమేష్‌బాబు, నాగేశ్వరరెడ్డి, గోస్పాడు ఎంపీడీవో సుగుణశ్రీ, నంద్యాల డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌ వేణులకు గురువారం నోటీసులు అందాయి. నోటీసులు అందజేసి సమాధానం చెప్పాలని, విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. వాతావరణం అనుకూలించక, ఆయన హెలికాప్టర్ కూలిపోయింది. ఆయానతో పాటు, కొంత మంది సిబ్బంది కూడా మరణించారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి, కూడా హెలికాప్టర్ విషయంలో తేడా రావటంతో, ఈ విషయం పై అధికారులు సీరియస్ అయ్యారు.

గత అయుదు సంవత్సరాలుగా చుస్తునే ఉన్నాం. ఎంత మంచి పని చేసినా, ఆ మంచి కనిపించకుండా, ఎదురు బురద చల్లటం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు బురద చల్లుతారు, తెలుగుదేశం నేతలు ఆ బురద మాకు ఎక్కడ అంటుతుందో అని దాన్ని కడుక్కోవటం, అది కడుక్కుంటూ ఉండగానే, మరో బురద చల్లటం.. ఇలా ప్రతి రోజు తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రతి రోజు తెలుగుదేశం నేతలు బురద కడుక్కుంటూనే చేసేవారు. అప్పట్లో బీజేపీ నేతలు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ లాంటి వారికి, ప్రతి రోజు ఇదే పని. అప్పట్లో వాళ్ళు ఆరోపణలు చేసిన ప్రతిది తప్పు అని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయ్యింది. అయినా సరే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతి రోజు చంద్రబాబు పై బురద చల్లే పనిలోనే ఉన్నారు.

kutumbarao 27092019 1

నాలుగు నెలల్లో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ప్రతి రోజు బీజేపీ నేతలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణతో సహా గగ్గోలు పెడుతుంటే, విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం, బీజేపీ అధికార ప్రతినిధిగా కాకుండా, జగన్ మోహాన్ రెడ్డి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తుంది. నిన్న జరిగిన ఒక టీవీ చర్చ కార్యక్రమంలో ఈ విషయం మరోసారి రుజువైంది. విద్యుత్ ఒప్పందాల అంశం పై ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా, ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి లైవ్ లోనే లీగల్ నోటీసులు పంపించారు. ఒక పక్క కేంద్రంలో ఉన్న మంత్రి, గత ప్రభుత్వం తప్పు లేదు, అన్నీ మా పర్యవేక్షణలోనే జరిగాయి, ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్తుంటే, అదే పార్టీకి చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి మాత్రం, తప్పు అంతా చంద్రబాబుదే అని చెప్పారు.

kutumbarao 27092019 1

ఈ సందర్భంగా, చర్చలో ఉన్న కుటుంబరావు పై బురద చల్లే ప్రయత్నం చేసారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రవిరెడ్డి అనే వ్యక్తి, కుటుంబరావులు మధ్యవర్తులుగా వ్యవహరించి, చంద్రబాబుతో కలిసి అనేక అక్రమ ఒప్పందాలు చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. అయితే అందరిలా కాకుండా, దీనిపై వెంటనే స్పందించిన కుటుంబరావు ఆ ఆరోపణలను ఖండిస్తూ, నీకు లీగల్ నోటీస్ పంపిస్తున్నా, అంటూ మొబైల్ నుంచే నోటీస్ పంపించారు. రెండు రోజుల్లో లీగల్ నోటీస్ ఇంటికి పంపిస్తానని, నా పై అనవసర ఆరోపణలు చేసిన నిన్ను కోర్ట్ కి ఈడుస్తా అంటూ చెప్పారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డికి పంపిన లీగల్ నోటీసును కుటుంబరావు చదివి వినిపించారు. అయితే దీని పై సామాన్య ప్రజలు కూడా శభాష్ అంటున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్న వారికి, ఇలా లీగల్ నోటీసులు పంపించి, శిక్ష పడేలా చేస్తే, ఇంకొకరు ఇలా నోటికి వచ్చినట్టు కాకుండా, సబ్జెక్ట్ పై మాట్లాడతారని, ప్రజలకు అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.

ఈ రోజు ఉదయం నుంచి ఒక వార్తా హల్ చల్ చేసింది. జగన్ నివాసంలో, ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందంతో భేటీ అయ్యారు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక వైసీపీ మైనస్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో హడావిడి చేసాయి. 13 మంది పారిశ్రామకవేత్తల బృందం, జగన్ మోహన్ రెడ్డిని కలిసింది, ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు అంటూ ఓ ఊదరగొట్టారు. ఈ ప్రచారం చూసి, సామాన్య ప్రజలు కూడా, ఇంకేముంది, జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు అంత స్పీడ్ గా, పెట్టుబడులు తీసుకువస్తున్నారు, ఏమో అనుకున్నాం, జగన్ కూడా పెట్టుబడులు తేవటంలో దూసుకుపోతున్నారు అని అందరూ అనుకున్నారు. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నారని, ఒక పక్క ఆర్ధిక మాంద్యం ఉన్నా, జగన్ సాధించారని అందరూ అనుకున్నారు.

lokesh 26092019 2

దీనికి సంబంధించి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇక్కడే అసలు గుట్టు అంతా బయట పడింది. తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఈ విషయం పై పూర్తీ ఆధారాలతో బయట పెట్టారు. ఆ ఆధారాలు చూసి అందరూ అవాక్కయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అనుకుంటే, జగన్ తన వ్యాపారాల గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ సెటైర్లు పేలాయి. ఇంతకూ విషయం ఏమిటి అంటే, లోకేష్ బయట పెట్టిన మొదటి ఆధారం, "Sophie Sidos" అనే ఆవిడ జగన్ ని కలిసిన ట్వీట్. జగన ఇంట్లో కలిసి దిగిన ఫోటో ట్వీట్ చేసారు. ఆవిడ ఎవరు అంటే, Vicat అనే ఫ్రెంచ్ సిమెంట్ కంపెనీకి అధిపతి. ఈ Vicat అనే కంపెనీ, జగన్ మోహన్ రెడ్డి భార్య కంపెనీ అయిన భారతీ సిమెంట్స్ లో ప్రధాన వాటాదారు.

lokesh 26092019 3

ఇలా వారి వ్యాపార భాగస్వామిని తీసుకోవచ్చి, రాష్ట్రంలో పెట్టుబడులు అంటూ డబ్బా కొడుతున్నారని, ఇది ఏ రకమైన క్విడ్ ప్రోకోనో అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇది నారా లోకేష్ చేసిన ట్వీట్. "YS Jagan Mohan Reddy గారి విజన్ నచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్ నుంచి పెట్టుబడుల బృందం ఒకటి వచ్చిందని సొంత మీడియాలో సొంత డబ్బా కొడుతుంటే తుగ్లక్ పాలనలో విజన్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోయాం. తీరా ఆరాతీస్తే ఆ వచ్చిన వాళ్ళు fondationlouisvicat అనే సంస్థ ప్రతినిధులు. ఆ సంస్థ గురించి తెలుసుకుంటే అసలు సంగతి బయటపడింది. ఆ సంస్థలో మన జగన్ గారి భారతి సిమెంట్ ఒక భాగస్వామి. అంటే వచ్చింది జగన్ గారి చుట్టాలే. మరో క్విడ్ ప్రో కో లాంటిదేదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అబ్బో ఏం విజన్!" అంటూ ట్వీట్ చేసారు.

నగిరి ఎమ్మెల్యే రోజా, నోటి స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు పై, లోకేష్ పై రాజకీయ వ్యాఖ్యలు కాకుండా, బాడీ షేమింగ్ చేస్తూ, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. లోకేష్ ని అయితే, పప్పు పప్పు అంటూ, పదే పదే మాట్లాడుతూ, అసలు నువ్వు మంత్రిగా ఏమి చేసావ్ అంటూ అనేక సార్లు, రోజా ప్రెస్ ముందు ఇష్టం వాచినట్టు మాట్లాడటం చూసాం. ఈ నేపధ్యంలోనే రోజా ఈ రోజు పెట్టిన ఫేసుబుక్ పోస్ట్ చూస్తే, ఆమె లోకేష్ ని ఇన్ డైరెక్ట్ గా పొగిడినట్టు అనిపించింది అంటూ నెటిజెన్ లు కామెంట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత, రోజాకి మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ షాక్ ఇచ్చారు. అయితే అలిగిన రోజాని బుజ్జగీస్తూ, ఆమెకు ఏపీఐఐసి చైర్మెన్ పదవి ఇచ్చారు జగన్. దీని పై కూడా అనేక విధాలుగా విమర్శలు వచ్చాయి. రోజాకి పెట్టుబడులు తెచ్చే ఏపీఐఐసి చైర్మెన్ లాంటి కీలక పదవి ఎలా ఇస్తారని, ఆమె ఇన్వెస్టర్స్ తో మాట్లాడే సామర్ధ్యం లేదు కదా అని ప్రశ్నించారు.

roja 26092019 2

అయినా ఆమెకు ఏపీఐఐసి పదవి ఇచ్చారు జగన్. ఈ నేపధ్యంలోనే ఆమె, ఈ రోజు ఒక కంపెనీకి భూమి పూజ చేసారు. అది అలాంటి ఇలాంటి కంపెనీ కాదు. టీసిఎల్ అనే పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇది చైనాలో ఒక పెద్ద కంపెనీ. అయితే ఈ కంపెనీకి ఈ రోజు భూమి పూజ చేస్తూ, రోజా ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. ఇది ఆమె పోస్ట్ "ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ TCL ఆంధ్ర ప్రదేశ్ లో 2,200 కోట్లతో తిరుపతిలో రెండు కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వచ్చింది. జగనన్న ఆశీస్సులతో APIIC ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక మొట్ట మొదటి ప్రాజెక్ట్ కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉంది." అంటూ ఆమె ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. అయితే ఆమె ఇలా చెయ్యటంతో, నెటిజెన్ లు ఒకేసారి ఆమె పోస్ట్ పై ట్రోల్స్ చెయ్యటం మొదలు పెట్టారు.

roja 26092019 3

దానికి కారణం లేకపోలేదు. టీసిఎల్ అనే కంపెనీ కోసం, అప్పటి ఐటి మంత్రి లోకేష్ ప్రత్యెక శ్రద్ధ పెట్టి, ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా, స్వయంగా చైనా వెళ్లి, వారిని ఒప్పించి, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలా చేసారు. ఇందుకోసం, తిరుపతిలో 153 ఎకరాలు కేటాయించారు. 22 వేల కోట్ల పెట్టుబడితో, 8 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, ఈ కంపెనీ ఒప్పందం కూడా చేసుకుంది. డిసెంబర్ 20, 2018లో ఈ కంపెనీ భూమి పూజ కూడా చేసారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గున్నారు. అయితే, అప్పట్లోనే భూమి పూజ అయిపోయిన కంపెనీకి, ఇప్పుడు మళ్ళీ రోజా భూమి పూజ చెయ్యటం, అలాగే అప్పట్లో పప్పు పప్పు అని హేళన చేసిన లోకేష్ తెచ్చిన కంపెనీని, ఈ రోజు గొప్పగా చెప్తూ, మా జగనన్న ఆశీసులు అని చెప్పటం చూసి, నెటిజెన్లు రోజా పోస్ట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత పెద్ద కంపెనీ తెచ్చిన లోకేష్ పప్పు అయితే, అదే కంపెనీని ఈ రోజు తమ ఘనతగా చెప్తున్న రోజాని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read