వైజాగ్.. ప్రశాంతతకు మారు పేరు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు అక్కడ జీవిస్తూ ఉంటారు. నవ్యాంధ్రకు ఆర్ధిక రాజధాని. మొన్నటి దాక అక్కడ నుంచి పెట్టుబడి సదస్సులు, బ్లాక్ చైన్ ఇన్వెస్ట్మెంట్స్, ఐటి పెట్టుబడులు లాంటి వార్తలు వినిపించేవి. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్న పులివెందుల ముఠా అంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అవును ఇది నిజం. వైజాగ్ లో ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని, ఎవరూ అనుకోలేదు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైజాగ్ లో ఒక ఖరీదైన భూమి పై, ఈ ముఠా కన్ను పడింది. దాన్ని తీసుకోవటానికి సిటిల్మెంట్ దందా మొదలు పెట్టారు. సింబియోసిస్‌ టెక్నాలజీస్‌ సీఈఓ ఓరుగంటి నరేశ్‌కుమార్‌ కు సంబంధించి, ఒక భూ వివాదం ఉందని తెలుసుకుని, ఈ ముఠా రంగంలోకి దిగింది. నరేష్ కుమార్ చాలా ఏళ్ళ క్రితం, మర్రిపాలెంలో ఆరెకరాల యూఎల్‌సీ మిగులు భూమి కొన్నారు.

pulivendula 23092019 2

దీని విలువ 100 కోట్లు దాకా ఉంటుంది. ఆ భూమిని ఆనుకుని, ఒక 200 గజాల్లో భూవివాదం నెలకొంది. ఆ భూమిని నరేష్ కుమార్ కొంత పరిహారం ఇచ్చి తీసుకున్నారు. అయితే ఇది వివాదం కావటంతో కోర్ట్ వరకు వెళ్ళటంతో, అక్కడ నరేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే 2013లో హైదరాబాద్‌కు చెందిన బాలకృష్ణ మోహన్‌ అనేవ్యక్తి అవతల పార్టీతో జీపీఏ రాయించుకొని మరో రిట్‌ పిటిషన్‌ వేశారు. అప్పటి నుంచి నానుతూ ఉన్న ఈ విషయం పై, గత ఆదివారం పులివెందుల నుంచి వచ్చిన కొంత మంది నరేష్ కుమార్ ఇంటికి వెళ్లారు. అయుదుగురు సభ్యులు వచ్చారు. ఈ భూమి తమకు అమ్మడానికి 16మంది ముందుకు వచ్చారంటూ డాక్యుమెంట్లు, జీవోలతో ఓ బౌండ్‌ బుక్‌ ఆయనకు చూపించారు. ఆ వివాదం గురించి మాట్లాడాల్సిన పనిలేదని ఇది అంతా సవ్యంగా ఉందని, కావలంటే కోర్ట్ కు వెళ్ళండి అంటూ నరేష్ కుమార్ చెప్పటంతో, అవతలి వ్యక్తులు బెదిరించారు.

pulivendula 23092019 3

ఇలా అయితే ఈ భూమి నీకు దక్కదు, ప్రభుత్వానికి వెళ్ళిపోయేలా చేస్తాం అని వారు బెదిరించారని నరేశ్‌కుమార్‌ చెప్పారు. పులివెందుల నుంచి వచ్చామని, ఒకరు ఎంపీపీ అని, మరొకరు సర్పంచ్‌(మాజీ) అని, సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులమని పరిచయం చేసుకున్నారని తెలిపారు. మీరు సియం పేరు పెట్టి నన్ను బెదిరిస్తే, ఇదే విషయం, నేను ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా కు చెప్తానని నరేష్ కుమార్ చెప్పటంతో, వీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అమిత్ షా పేరు చెప్పగానే, వెళ్లిపోయారని నరేష్ కుమార్ చెప్పారు. అయితే దీని పై పులివెందుల నుంచి వచ్చిన, లింగాల రామలింగారెడ్డి కొన్ని పత్రికలతో మాట్లాడుతూ, మేము అక్కడకు వెళ్లామని, అయితే బాలకృష్ణ మోహన్‌ , తమ భూమికి సంబంధించి ఎదో ఇష్యూ ఉంది, మాట్లాడి రండి అంటే వెళ్ళాం, ఆయన మాకు స్నేహితుడు కాబట్టి వెళ్ళాం, అంతే కాని మేము ఎవరినీ బెదిరించి, పంచాయతీ చెయ్యలేదు అని లింగాల రామలింగారెడ్డి చెప్పారు.

ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానానికి, నిన్న అతి పెద్ద ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-467 విమానం, ప్రయాణం మధ్యలో ఉండగా, భారీ గాలి వాన, ఉరుములు భారీ స్థాయిలో మొదలయ్యాయి. ఈ తాకిడికి విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు గురైంది. ఈ పరిణామంతో, ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే భారీగా కుదుపులు రావటంతో, విమానంలోని, వస్తువులు, ఆహరం కోసం ప్రయాణికులకు వద్ద ఉన్న ప్లేట్స్, కాఫీ గ్లాసులు, అన్నీ విమానంలో చిందరవందరగా పడిపోయాయి. అలాగే కుదుపులు తీవ్రతకు విమానంలో ఉన్న వాష్ రూమ్ లోని కమోడ్ సీటు కూడా ఊడిపోయింది. ఈ పరిణామంతో, విమానంలోని కొంత మంది ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు మొదలు పెట్టారు. ఏమి జరుగుతుందో తెలియక, కొంత మంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

delhi 22092019 2

అయితే పైలట్ అప్రమత్తతతో అంతా సేఫ్ అయ్యారు. సిబ్బంది కూడా ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. అయితే ఈ కుదుపులతో, కొంత మంది విమాన సిబ్బందికి కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి. చివరకు విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకోవటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన పై అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. అయితే ఎప్పుడూ వచ్చే బోయింగ్‌ కాకుండా కొత్త సర్వీసు వచ్చిందని గన్నవరం విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పాత ఫ్లైట్ కాకుండా, కొత్తది వచ్చి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఈ ఘటన పై ఎయిరిండియా మాత్రం, ఎలాంటి ప్రకటనా ఇప్పటి వరకు విడుదల చేయలేదని తెలుస్తుంది.

delhi 22092019 3

ఇక మరో పక్క ఇదే సమయంలో, ఢిల్లీ నుంచి తిరువనంతపురం వస్తున్న, మరో ఎయిర్ ఇండియా విమానం కూడా, ఇలాగే గాలి వానలో చిక్కుకుని, పిడుగుల ధాటిగా కుదుపులకు గురైందని తెలుస్తుంది. అయితే ఈ ఫ్లైట్ కి, విజయవాడ ఫ్లైట్ కంటే ఎక్కువగా కుదుపులు వచ్చాయని, అదీ కాక ఈ ఫ్లైట్ లో 172 మంది ప్రయాణికులు ఉండటంతో, మరింతగా కంగారు పడ్డారు. అయితే ఈ ఘటనలో కూడా ఎవరికీ మేజర్ గాయాలు అవ్వలేదు, ఇక్కడ కూడా స్వల్ప గాయాలతో బయట పడటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు ఘటనల పై అంతర్గత విచారణ కొనసాగుతుంది. రెండు ఫ్లైట్స్ కి కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రభుత్వం మారి మూడు నెలలు దాటింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. తాను సియం పదవి కోసం ఎంతో కష్టపడ్డాను అని, ఇక భారత దేశం మొత్తం, మన వైపు చూసేలా చేస్తానని జగన్ చెప్తూ, 30 ఏళ్ళు నేనే సియంగా ఉంటానని చెప్పారు. ఆయన కాన్ఫిడెన్సు చూసి, ఈయన ఎంత బాగా పని చేస్తాడో, ఎంత అద్భుతంగా పరిపాలన ఉంటుందో అని అందరూ అనుకున్నారు. కాని రాష్ట్రంలో జరుగుతున్న రివర్స్ పనులు లాగే, ఈ సీన్ కూడా రివర్స్ అయ్యింది. జగన్ మార్క్ పాలన సంగతి తరువాత, ఉన్న పనులు కూడా ఆపేసారని, జనాలు గోల పెడుతున్నారు. ఎవరైనా కొత్తగా అధికారంలోకి వస్తే, ముందుగా అయినా మంచి పనులు చేస్తారని, అందులో యువకుడు లాంటి జగన్ నుంచి ఎంతో ఆశించామని, కాని ఇక్కడ ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రజల అభిప్రాయాన్ని పసిగట్టిన వైసీపీ నాయకులు, ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రాను రాను పరిస్థితి ఏంటో అని తలుచుకుని వణికిపోతున్నారు.

vs 22092019 2

ఇదే అభిప్రాయన్ని, పార్టీలోని నెంబర్ 2 అయిన విజయసాయి దగ్గర కుండ బద్దులు కొట్టేసారు. ఏకంగా విజయసాయి రెడ్డికే, ఇలా చెప్పారు అంటే, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. నిన్న విజయసాయి రెడ్డి వైజాగ్ లో పర్యటించారు. విశాఖ కల్లెక్టరేట్ లో వైసిపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులతో విజయసాయి రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో నేతలు తమ ఆవేదనను, విజయసాయి రెడ్డి దగ్గర వెళ్లగక్కారు. గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పటంతో, విజయసాయి రెడ్డి కూడా షాక్ అయ్యారు. అన్ని వ్యవస్థలు గాడి తప్పాయని, ఇవి కనుక చక్కదిద్దక పొతే, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందని, స్థానిక ఎన్నికలు వస్తున్నాయని, గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు ఉన్నాయని, వెంటనే అన్నీ చక్కదిద్దాలని, నేతలు విజయసాయి రెడ్డికి తమ అభిప్రాయలు చెప్పారు.

vs 22092019 3

ఇసుక సరఫరా లేదు, ఇది ఒక పెద్ద తుఫాన్ లా మారే అవకాసం ఉంది, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగటం లేదు , అన్ని అంశాల్లో వెనకబడుతున్నాం. రహదారులు దెబ్బతింటే, అవి పునరుద్ధరించే పరిస్థితి లేదు. రెవిన్యూ కార్యాలయాల్లో పనులు కావడం లేదు. పోలీసు శాఖ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోంది. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లోనూ మందుల కొరత ఉంది. మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయి’ అని వారు ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తెచ్చారు. చంద్రబాబు హయంలో లారీ ఇసుక 20 వేలు ఉంటే, ఇప్పుడు 80 వేలు దాకా ఉందని, ప్రజలు తిడుతున్నారని చెప్పారు. అయితే ఇవన్నీ విన్న విజయసాయి రెడ్డి, తొందరలోనే మార్పులు చూస్తారని, అన్నీ సెట్ అయిపోతాయని చెప్పినట్టు తెలుస్తుంది.

ప్రతి రెండు మూడు రోజులకు, ఏదో ఒక విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పడుతూనే ఉంది. తాజగా, గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష విషయంలో రచ్చ రచ్చ జరుగుతంది. 20 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే, అందులో అతి తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, అందులో ర్యాంకులు వచ్చిన వారిని చూస్తే, అసలు విషయం అర్ధమై పోతుంది. ఇదే విషయంతో ఆంధ్రజ్యోతి ఇచ్చిన కధనంతో, రాష్ట్రమంతా సంచలనం అయ్యింది. ఏపీపీఎస్సీ ఈ పరీక్షలు నిర్వహిస్తే, అక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పని చేసిన వారికి టాప్ ర్యాంక్ రావటం, అందరినీ ఆశ్చర్యపరిచింది. వారికి ముందే పేపర్ వచ్చిందని, వారు వారి చుట్టాలకు ఈ పేపర్ ఇవ్వటంతో, వారు కూడా టాప్ లో నిలిచారు. ఈ విషయం ఇంత రచ్చ జరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించలేదు. ప్రతిష్టాత్మిక సంస్థగా ఉన్న ఏపీపీఎస్సీకి కూడా మచ్చ వచ్చింది.

vsreddy 22092019 2

ఒక పక్క ప్రభుత్వం ఇంత ఇబ్బంది పడుతుంటే, ఈ ఇబ్బందులు తగ్గించాల్సింది పోయి, మరింత ఆజ్యం పోశారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి లాంటి నేత, ఈ సందర్భంలో, ఇలా జగన్ ను ఇబ్బంది పెట్టె పని చెయ్యటంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిన్న వైజాగ్ లోని వైసీపీ పార్టీ ఆఫీస్ లో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ‘ గ్రామ వలంటీర్లుగా 90 శాతం మంది మన వైసీపీ కార్యకర్తలనే తీసుకున్నాం. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగాల్లో కూడా మన కార్యకర్తలు చాలా మంది సెలక్ట్‌ అయ్యారు’ అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరూ అవాక్కయ్యారు. ఒక పక్క ప్రభుత్వం అది తప్పు అని ఎదురు దాడి చేస్తుంటే, కాదు మేమే తీసుకున్నాం, అక్కడ అందరూ మా వాళ్ళే ఉన్నారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చెయ్యటం ఆశ్చర్యపరిచింది.

vsreddy 22092019 3

‘‘ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఇంచుమించుగా ఇప్పటికి 2.65 లక్షలు ఉద్యోగాలు, అంటే మూడు లక్షల మంది వాలంటీర్లని మనం నియమించి, ప్రభుత్వంలోకి తీసుకున్నాం. అయితే నేను కచ్చితంగా చెప్పగలను, నా దగ్గర ఫిగర్స్‌ ఉన్నాయి కాబట్టి, గ్రామ వాలంటీర్లు 90 శాతం వరకు మన కార్యకర్తలకే ఆ వలంటీర్‌ ఉద్యోగాలు వచ్చాయి. ఇవి రాని వారు అసంతృప్తి చెందొద్దు. ఎవరికైతే ఇప్పటి వరకూ న్యాయం జరగలేదో, వారికి కూడా మరింత కాలం ముందుంది. తప్పకుండా న్యాయం చేస్తారు జగన్మోహన్‌ రెడ్డిగారు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. గ్రామ సెక్రటేరియట్‌ జాబ్‌ల విషయానికి వస్తే మనకున్నటువంటి పొలిటికల్‌ కంపల్షన్స్‌ కాదు, లీగల్‌ కంపల్షన్స్‌ వల్ల ఎవరికైతే క్వాలిఫికేషన్స్‌ ఉండి, మంచి మార్కులు వచ్చాయో వారిని మాత్రమే సెలక్ట్‌ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. దానిలో కూడా మన కార్యకర్తలు చాలా మంది సెలక్ట్‌ అయ్యారు’’ అని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisements

Latest Articles

Most Read