మెగాస్టార్ చిరంజీవి, తన తదుపరి భారీ బడ్జెట్ సినిమా, సైరా నరసింహారెడ్డి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయాన అనేక చోట్ల ప్రమోషన్లు చేస్తూ , సినిమాని ప్రోమోట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన ఆనంద వికటన్ అనే ఒక ప్రముఖ తమిళ్ మ్యాగజైన్ కి ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలతో పాటుగా, ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేసారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వైఫల్యంగా గురించి వ్యాఖ్యలు చేసారు. డైరెక్ట్ గా చెప్పకపోయినా, తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్ లకు తన సూచనగా, జనసేన, పవన్ కళ్యాణ్ వైఫల్యం గురించి చెప్పారు. అయితే ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో, అటు పవన్ కళ్యాణ్ కి కూడా ఇవే సూచనలు ఇన్ డైరెక్ట్ గా చేసారా అని ఫాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

chiranjeevi 26092019 2

చిరంజీవి మాట్లాడుతూ, "నేను రజనీకాంత్, కమలహాసన్ లకు ఒకే సలహా ఇస్తున్నా, మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి. ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇస్తున్నా. నేను పార్టీ పెట్టాను, నా తమ్ముడు పార్టీ పెట్టాడు, మా ఇద్దరినీ ఈ కులం, ధనమే ఓడించాయి. ఓటమి, అవమానాలు, ఇలాంటివి అందరూ పేస్ చెయ్యాల్సిందే. కాని నా లాంటి సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఇది ఎదుర్కోవటం కష్టం. నా లాంటి వాడే రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టె పరిస్థితి. ఇలాంటివి నా వళ్ళ కాదు." అంటూ తాను, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓడిపోవటానికి కారణాలు చెప్తూ, రాజకీయాల్లోకి రావద్దు అంటూ, చిరంజీవి చెప్పుకొచ్చారు.

chiranjeevi 26092019 3

కమలహాసన్ ఇప్పటికే మక్కల్ నీధి మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ త్వరలోనే తన పార్టీని ప్రకటించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన మిత్రులిద్దరికీ చిరంజీవి ఈ మేరకు సలహా ఇచ్చారు. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, చివరకు కాంగ్రెస్ లో కలిపేసారు. తన కేంద్ర మంత్రి పదివి పోగానే, రాజకీయాలకు దూరం అయిపోయి, మళ్ళీ సినిమాలు తీసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టి, ఎన్నో మాటలు చెప్పి, మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే తెచ్చుకున్నారు. అటు చిరంజీవి పార్టీ వల్ల కాని, ఇటు పవన్ పార్టీ వల్ల కాని, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దెబ్బ పడి, అప్పట్లో వైఎస్ఆర్, మొన్న జగన్ గెలిచిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ ఒక పక్కన మమ్మల్ని టార్గెట్ చేసారు, రాజకీయంగా వేధిస్తున్నారు అని ఆరోపిస్తున్నా, జగన్ ప్రభుత్వం మాత్రం, రాజకీయ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే కోడెల, చింతమనేని, కూన రవి కుమార్, సోమిరెడ్డి, ఇలా అనేక మంది సీనియర్ నేతల పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇవేమన్నా అవినీతి కేసులు, మర్డర్ కేసులా అంటే, రాజకీయ ప్రేరేపితమైన ఎస్సీ ఎస్టీ కేసులు. ఇందులో అరెస్ట్ చేస్తే, బెయిల్ తొందరగా రాదనీ, ఈ సెక్షన్ వాడి, తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ ను, ఇదే ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ చేసారు. ఇప్పుడు మరో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పై, అదే ఎస్సీ ఎస్టీ కేసు వాది, అరెస్ట్ చేసారు. అది కూడా 2014లో కేసును తిరగదోడి, ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసి, తీసుకువెళ్ళారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీస్ కూడా ఇవ్వకుండా, ఒకేసారి వచ్చి తీసుకు వెళ్ళిపోయారు.

kodumuru 26092019 1

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న డి.విష్ణువర్ధన్‌రెడ్డిని నిన్న సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులో 2014లో ఆయన పై ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదును, ఇప్పుడు తిరగదోడి వచ్చి అరెస్ట్ చేసారు. ఆ ఫిర్యాదు మేరకు, విష్ణువర్ధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు బుధవారం స్థానిక ప్రకాశ్‌నగర్‌లోని స్వగృహంలో ఉన్న ఆయన ఇంటికి ఒకేసారి వచ్చి, అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన తరువాత ఆయన్ను కర్నూలు టు టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన్ చేపట్టాయి. . కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

kodumuru 26092019 1

విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్టును తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. "తెలుగుదేశం నాయకులను వైసిపి టార్గెట్ చేయడంపై మండిపాటు. పవిత్రమైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఆత్మకూరులో 150దళిత కుటుంబాలను నెలల తరబడి గ్రామ బహిష్కారం చేసినా చర్యలు లేవు. వారి తరఫున పోరాడుతున్న తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని పోరాడే టిడిపి నేతలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడంకన్నా దారుణం ఇంకోటి లేదు. టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు 12మందిపై అక్రమ కేసులు బనాయించారు. అచ్చెన్నాయుడిపై ఒకే అంశంపై తాడేపల్లిలో, టెక్కలిలో 2కేసులు పెట్టారు. మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ,ఎస్టీ అక్రమ కేసు బనాయించారు. 43ఏళ్ల క్రితం అంశంపై సోమిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారు. బెందాలం అశోక్, బాల వీరాంజనేయ స్వామి, కరణం బలరామ్, కూన రవికుమార్ తదితరులపై అక్రమంగా కేసులు పెట్టారు. కుటుంబరావు భూమి 37ఏళ్ల అంశంపై సుప్రీంకోర్ట్ స్టేటస్ కో ఆదేశాలున్నా ప్రహరీగోడలు కూల్చేశారు. 19 తప్పుడు కేసులు పెట్టి కోడెలను బలితీసుకున్నారు. వైసిపి ప్రభుత్వ వేధింపులకు అంతేలేకుండా పోయింది. వైసిపి నేతల అరాచకాలను ప్రజలే నిరసించాలి. మేధావులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు వీళ్ల ఆగడాలను ఖండించాలి." అని చంద్రబాబు అన్నారు.

గోదావరిలో పడవప్రమాదం జరిగి 26మంది చనిపోతే, ఆ దుర్ఘటనపై ప్రభుత్వం కిందిస్థాయి అధికారులు, పోలీసులతో తూతూమంత్రపు ప్రకటనలు చేయిస్తూ, ప్రమాదానికి కారకులైన అసలు దొంగలను కాపాడాలని చూస్తోందని మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తమవారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న పడవ ప్రమాదబాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితోనే వ్యవహరిస్తోందన్నారు. తమవారి మృతదేహాలు అప్పగించాలని కోరుతూ మృతుల కుటుంబాలు కన్నీళ్లతో వేడుకుంటున్నా, అధికారులు మంత్రులు స్పందించకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చినరాజప్ప చెప్పారు. ప్రమాదం జరిగి రెండు వారాలవుతున్నా కూడా ప్రభుత్వం నీళ్లల్లో మునిగిన పడవను బయటకు తీయలేకపోయిందన్న ఆయన అన్నారు.

chinrarappa 25092019 1

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి 21మంది చనిపోతే, రెండ్రోజుల్లోనే పడవను వెలికితీసి, మృతుల కుటుంబాలకు రూ.20లక్షల వంతున (ఒక్కో కుటుంబానికి) పరిహారం అందించి న్యాయంచేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగితే మంత్రులుగానీ, ముఖ్యమంత్రి గానీ ఏ విధమైన చర్యలు తీసుకోకుండా కంటితుడుపు చర్యలతో సరిపెట్టారని నిమ్మకాయల తెలిపారు. పడవ ప్రమాదంపై పర్యాటకశాఖా మంత్రి రోజుకోలా మాట్లాడితే, జలవనరుల శాఖా మంత్రేమో, ప్రమాద ప్రాంతంలో ఒక్కరోజు హడావుడి చేసి కనిపించకుండా పోయాడని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. ప్రమాదానికి గురైన పడవను వెలికితీయడం చేతగాని ప్రభుత్వం, దాన్ని తీసేవారు ఎవరైనాఉంటే ఆ జిల్లా అధికారులను కలవాలని కోరుతూ సోషల్‌మీడియాలో ప్రకటనలివ్వడం రాష్ట్రప్రభుత్వ అసమర్థతకు సంకేతం కాదా అని నిమ్మకాయల ప్రశ్నించారు.

chinrarappa 25092019 1

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైనా దుర్ఘటనలు, ప్రమాదాలు, ప్రకృతివిపత్తులు జరిగితే ప్రభుత్వాలపై నిందలు వేసే జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అదేపద్ధతిని కొనసాగించడం ఆయనలోని మానసిక జాడ్యాన్ని సూచిస్తోందన్నారు. గోదావరిలో మునిగిన పడవను తీయడంచేతగాని రాష్ట్రజలవనరుల మంత్రి అనిల్‌, పోలవరం ప్రాజెక్ట్‌ని అప్పుడు పూర్తిచేస్తాం... ఇప్పుడు పూర్తిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చినరాజప్ప దెప్పిపొడి చారు. పోలవరంలో 75శాతం పనులు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తిచేశాక, ఇప్పుడొచ్చిన వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలమైన సంస్థలకు పనులు అప్పగించడానికి వాటితో చీకటి ఒప్పందాలు చేసుకుంటోందన్నారు. పోలవరం పనుల్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న మంత్రి అనిల్‌, నవయుగ సంస్థను కాదని, అనుభవం లేని మెగాసంస్థకు ప్రాజెక్ట్‌ పనులు అప్పగించడం వెనకున్న లోగుట్టుని ప్రజలకు తెలియచేయాలని మాజీహోం మంత్రి సూచించారు.

సురేంద్ర బాబు ఐపీఎస్... ఈ పేరు వింటేనే, నేరస్థులు పారి పోతారు. రాజకీయ నాయకులు గడగడలాడతారు. బెజవాడలో రౌడీలు రెచ్చిపోతున్న టైంలో, తాట తీసి, అందరినీ లైన్ లో పెట్టారు. తనమన అనే బేదాలు ఉండవు. అధికార పక్షం అని కూడా చూడరు. కేవలం రూల్స్ తో పని చేస్తూ, నిజాయితీగా నిష్పక్షపాతంగా పని చేసే నైజం ఆయనది. ప్రతి ఒక్క యంగ్ ఐపీఎస్ కి ఆయాన ఆదర్శం. చంద్రబాబు హయంలో డీజీ ర్యాంక్ వచ్చింది. చంద్రబాబు ఆయన్ను ఆర్టీసీ ఎండీగా చేసారు. తరువాత డీజీపీ కూడా చేస్తారనే వార్తలు వచ్చాయి, కాని ఈ లోపే ప్రభుత్వం మారింది. ఆర్టీసి ఎండీగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అలాగే కార్మికులకు, రిటైర్మెంట్‌ రోజే సెటిల్‌మెంట్లు ఇవ్వటం, పే స్కేలు చెయ్యటంతో కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వటంతో కార్మికులకు కూడా దగ్గర అయ్యారు. అలాగే, ఆర్టీసిని అప్పుల నుంచి గట్టెక్కించే సంస్కరణలు కూడా చేసారు.

surendrababu 26092019 2

అయితే రాత్రికి రాత్రి జగన ప్రభుత్వం, సురేంద్ర బాబుని తప్పించటం పై, ఈ రోజు వార్త పత్రికల్లో పలు కధనాలు వచ్చాయి. సురేంద్ర బాబు లాంటి సీనియర్ ఆఫీసర్ ని, డీజీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ని తప్పించి, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవటం పై, అందరూ ఆశ్చర్యపోతున్న వేళ, ఈ కధనాలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న,ఆర్టీసి బస్సుల స్థానంలో, ఎలేక్టిక్ బస్సులు తేవటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బస్సులను కొనకుండా, అద్దెకు తీసుకుంటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి, ఈ నెల 11న టెండర్లు పిలిచారు. అయితే ఈ టెండర్ లో పెద్ద పెద్ద కంపెనీలు అయిన, టాటా, అశోక్‌ లేలాండ్‌, ఐషర్‌ మోటార్స్‌ వంటి సంస్థలు పాల్గొంటాయని అందరూ భావిస్తే, కేవలం గోల్డ్‌స్టోన్‌ అనే సంస్థ మాత్రమే పాల్గుంది. ఈ గోల్డ్‌స్టోన్‌ పై ఇప్పటికే తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది. ఇది మేఘా సంస్థ అని, పోలవరంలో మిగిలింది, ఇక్కడ కవర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టే, ఇక్కడ కేవలం గోల్డ్ స్టోన్ మాత్రమే టెండర్ వేసింది.

surendrababu 26092019 3

అయితే ఈ అద్దెను రూ.60కి తగ్గకుండా ఇవ్వాలన్న ప్రతిపాదన, ఈ కంపెనీ ఆర్టీసి ముందు పెట్టింది. అయితే ఇందుకు, ఆర్టీసి ఎండీగా ఉన్న సురేంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు. ప్రుస్తుతం ఉన్న అద్దె బస్సులకు కిలోమీటరుకు రూ.38 ఇస్తున్నాం అని, అయినా ఇక్కడ 5 రూపాయల నష్టం వస్తుందని, అలాగే ఎలక్ట్రిక్‌ బస్సుల అద్దె తెలంగాణలో రూ.36తో గోల్డ్‌ స్టోన్‌ సంస్థ ఇప్పటికే దక్కించుకుందని తెలిపారు. మనకు అంతకంటే ఎక్కువకు నేను ఒప్పుకోను, టెండర్ వెయ్యండి, ఎవరు తక్కువకు వస్తే వాళ్ళకు ఇస్తాం అని సురేంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించి కీలక చర్చలు ఈ రోజు జరగనుంది. అయితే అనూహ్యంగా, సురేంద్ర బాబు నిన్నే బదిలీ అయిపోయారు. సహజంగా ఇలాంటి పెద్ద డీల్ జరుగుతునప్పుడు, ఆ చీఫ్ నే బదిలీ చెయ్యటం జరగదు. కాని ఇక్కడ పై నుంచి ఒత్తిడులు రావటంతో సురేంద్రబాబుని రాత్రికి రాత్రి బదిలీ చేసి, ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ విషయమై ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు పెద్దలు మంగళవారం సురేంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయి చర్చించినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. సురేంద్ర బాబు ఉంటే, తాము అనుకున్న రేట్లకు టెండర్ రాదనీ, కొంత మంది ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, సురేంద్రబాబుని బదిలీ చేసారని ఈ రోజు పత్రికల్లో కధనాలు వచ్చాయి.

Advertisements

Latest Articles

Most Read