జగన్ ప్రభుత్వానికి, రోజుకి ఒకసారి అయినా, అటు కేంద్రం నుంచి కాని, ఇటు కోర్ట్ ల నుంచి కాని ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. చంద్రబాబుని ఇరికించటానికి, చంద్రబాబు హయంలో చేసిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద స్కాం జరిగింది అని తెలియ చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి, జూలై 25న, ఆరు పేజీల లేఖతో, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. అధిక ధరలకు చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నారు అంటూ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. అయితే ఇక్కడ చంద్రబాబుని, కేంద్రం ఇబ్బంది పెడుతుందని ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు అది తనకే రివర్స్ అయ్యింది. ఆ లేఖ పై సమాధానం ఇస్తూ, మీ ఫిర్యాదు తప్పు అంటూ ఝలక్ ఇచ్చారు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్. విద్యుత్ పీపీఏల ఒప్పందాల్లో గతంలో, ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రం తరుపున తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్. అన్ని వివరాలు తెలియచేస్తూ, జగన్‌కు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ లేఖ రాశారు.

jagan 25092019 1 2

గతంలో చంద్రబాబు పై, ఆరు పేజీల లేఖతో, జగన్, ప్రధానికి చేసిన ఫిర్యాదు పై, కేంద్ర మంత్రి స్పందిస్తూ, బదులు లేఖ రాసారు. రాష్ట్రంలో డిస్కంల నష్టానికి, అప్పట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం, అధిక రేట్లు కారణం అంటూ జగన్ చేసిన వాదనను, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కొట్టి పడేసారు. డిస్కింల నష్టానికి, ఈ ఒప్పందాలకు సంబంధం లేదని, డిస్కింల నష్టానికి వేరే కారణాలు ఉన్నాయని, దీనికి ముడి పెట్టవద్దు అంటూ ఆయన స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రేట్లు కంటే, దేశంలోని ఐదు రాష్ట్రాల్లో పీపీఏలకు ఇంతకంటే ఎక్కువ రెట్లు చెల్లిస్తున్నారని అయన లేఖలో వివరాలు వెల్లడించారు. పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర, థార్మికత, ప్లాంట్ సామర్థ్యం పై ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

jagan 25092019 1 3

చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, మూడు కంపెనీలకే 70 శాతం కేటాయింపులు చేశారంటూ మీరు చెప్పిన దాంట్లో, నిజం లేదని ఆయన చెప్పారు. కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలను టేకోవర్ చేయడం వల్లే విద్యుత్ ఉత్పాదకత పెంచుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం థర్మల్ పవర్ రూ.4.20 పైసలకే వస్తోందని, కానీ రాను రాను బొగ్గు నిల్వలు తగ్గిపోతాని, 20 సంవత్సరాల తర్వాత యూనిట్ ధర రూ.22 అవుతుందని అన్నారు. కాని పవన్ విద్యుత్ ఎప్పుడూ రూ.4.80కే లభిస్తుందని, అందుకే మన దేశం వాటికి ఎక్కవు ప్రాముఖ్యత ఇస్తుందని అన్నారు. పీపీఏలపై పునఃసమీక్ష చేస్తే, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టె వారికి, తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ తన లేఖలో పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా జగన్, తన నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి. నిన్నే హై కోర్ట్ కూడా, ప్రభుత్వం ఇచ్చిన జీవో కొట్టేసిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు అధికారంలో ఉండగా, రాష్ట్రంలోని రైతులకు రుణ మాఫీ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కేంద్రం సహకరించకపోయినా, ఆర్ధిక పరిస్థితి బాగోకపోయినా, 24 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించారు. ఇవి అయుదు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించుకుని, మూడు విడతలుగా, దాదపుగా 16 వేల కోట్లు దాకా విడుదల చేసారు కూడా. నాలుగు, అయుదు విడతల రుణమాఫీకి దాదపుగా 7 వేల కోట్లు సిద్ధం చేసి, జీవో కూడా విడుదల చేసారు. ఈ జీవో ఇచ్చిన తరువాత, ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అయితే ఇవి విడుదల చెయ్యకుడదు అంటూ జగన్ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్లారు. ఇది నోటిఫికేషన్ కు ముందే, విడుదల చేసిన జీవో అని, అప్పటి ప్రభుత్వం ఎంత చెప్పినా, నిధులు రెడీ చేసి పక్కన పెట్టినా, రుణ మాఫీ అవ్వకుండా, ఆ నిధులు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. దీంతో అప్పట్లో చంద్రబాబు రుణమాఫీ పూర్తిగా చెయ్యలేక పోయారు.

jagan 25092019 2

అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. అప్పటికే చంద్రబాబు 7 వేల కోట్లు సిద్ధం చేసి ఉండటంతో, ఈ నిధులు జగన్ మోహన్ రెడ్డి రాగానే విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కాని జగన్ ప్రభుత్వం నాలుగు, అయుదు విడతల రుణమాఫీ చెయ్యలేదు. నాలుగు నెలలు అవుతున్నా ఎక్కడా అడ్డ్రెస్ లేదు. దీంతో కిసాన్ సెల్ చైర్మెన్ జెట్టి గురునాద్ రెడ్డి హైకోర్ట్ లో వాజ్యం వేసారు. జీవో నెంబర్ 38 ప్రకారం, నాలుగు, అయుదు రుణ విడతల రుణమాఫీ చెయ్యలని, ఆదేశిస్తూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్ట్ ని కోరారు. దీంతో హైకోర్ట్ ఆగష్టు 31న, జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ, జీవో నెంబర్ 38 ప్రకారం, చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని, ఆ పధకం నిబంధనలు ప్రకారం, తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

jagan 25092019 3

హైకోర్ట్ ఈ ఆదేశాలు ఇచ్చిన 25 రోజులుకు, ఈ రోజు, జగన్ ప్రభుత్వం, ఆ జేవో 38ని రద్దు చేసింది. 4-5 విడతల్లో ఇవ్వాల్సిన రుణమాఫీ నిధులు రూ.7959.12 కోట్లు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 10శాతం వడ్డీని కలుపుతూ గత ప్రభుత్వం జీవో నంబర్‌ 38ని జారీ చేసిన దాన్ని ఆపేసారు. అయితే ఈ చర్యలకు హైకోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ జీవో కనుక, కోర్ట్ కు వెళ్ళక ముందే రద్దు చేసి ఉంటే, వేరే లాగా ఉండేది. కోర్ట్ కి వెళ్ళిన తరువాత, కోర్ట్ ఆ జీవో ప్రకారం పధకాన్ని అమలు చెయ్యండి అని చెప్పిన తరువాత, ఇన్ని రోజులకు జీవో రద్దు చెయ్యటంతో, ఇది కంటెంట్ అఫ్ కోర్ట్ కిందకు వచ్చే అవకాసం ఉందని, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాసం ఉందని అంటున్నారు. మరో పక్క, ఇలా ప్రభుత్వాలు మారినప్పుడు, పధకం మధ్యలో మాకు సంబంధం లేదు అనటం ఏంటి ? నరేంద్ర మోడీ కూడా, ప్రత్యెక హోదాతో, విభజన హామీలతో మాకు ఏమి సంబంధం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అడగండి అంటే, జగన్ గారు ఏమి చేస్తారు ? నిధులు రెడీగా పెట్టి వెళ్ళినా, రుణమాఫీ చెయ్యటానికి, ఇబ్బంది ఏంటి ?

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా, వాటి నుంచి డైవర్ట్ చేయ్యతానికా అన్నట్టు, చంద్రబాబు ఉంటున్న ఇంటికి కూల్చేస్తాం అంటూ ప్రభుత్వం హడావిడి చేస్తుంది. దీని పై, ఆ ఇంటి యజమాని, లింగమనేని రమేష్, జగన్ కు పూర్తీ వివరాలతో ఒక లేఖ రాసారు. తనను చంద్రబాబు బినామీగా పేర్కొంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని మానసిక వ్యథకు గురిచేస్తున్నారని ఆ లేఖలో వాపోయారు. ఇది పూర్తీ లేఖ. "ఈ రోజు ఉదయం నుంచి సీఆర్డీఏ అధికారులు ఉండవల్లి లోని మా ఇంటి వద్ద చేస్తున్న హడావిడి, అక్కడి నిర్మాణాలు కూల్చివేస్తారనే వార్తలు నన్ను ఎంతో ఆందోళనకు గురి చేస్తున్నాయి. కృష్ణా నది కరకట్టపై మా కుటుంబానికి ఉన్న గృహం, నాడు ముఖ్యమంత్రి నివాసానికి ఇవ్వడం గురించి మీకు తెలియచేయాలి. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. విజయవాడ, కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నా ఇక్కడ నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేని పరిస్థితులు నెలకొన్నందున - కరకట్ట మీద ఉన్న మా అతిథి గృహాన్ని చూసి ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసానికి యోగ్యంగా ఉంటుందని అధికారులు భావించారు."

"ఆ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రిగారి కోసం ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించగానే మరో ఆలోచనకు తావు లేకుండా అంగీకారం తెలిపారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత ఆలోచనలు గానీ ప్రతిపాదనలు గాని లేవు. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా స్పందించి - రాష్ట్ర పాలన బాధ్యతలు చూసే ముఖ్యమంత్రికి తగిన నివాసం ఇవ్వడం బాధ్యత గా భావించా. ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మరే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను అదే రీతిలో స్పందించేవాడిని. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివాసానికి నా ఇంటిని ఇచ్చిన కారణముగా నన్ను సదరు చంద్రబాబు నాయుడు గారికి బినామీ గా పేర్కొంటూ కట్టుకధలతో, అవాస్తవిక కధనాలతో రోజుకొక కధనాన్ని ప్రచురిస్తూ నన్నూ నా కుటుంబాన్ని మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. కరకట్టపైన ఉన్న నిర్మాణానికి అనుమతులు లేవు. కూల్చివేస్తాం అని సిఆర్టీ అధికారులు తాఖీదులు ఇస్తూ, పరిశీలనలు చేస్తున్నారు. వారికి ఇప్పటికే ఈ అంశంపై సమాధానం ఇచ్చాం. ఆ నిర్మాణానికి ఉండవల్లి గ్రామ పంచాయతీ నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొంది ఉన్నాం. ఇరిగేషన్ శాఖలోని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుంచి ఎన్.ఓ.సి. కూడా తీసుకున్నాం."

"అప్పటికి అమలులో ఉన్న నిబంధనల మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న పిమ్మటే నదీ తీరాన యజ్ఞాలూ, పూజలూ వగైరా నిర్వహించుకోవడానికి అతిథి గృహాన్ని నిర్మించామని మీకు తెలియచేస్తున్నాను. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వానికి మా నుంచి సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తున్నాం. దివంగత శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రావాల్సిన పెట్టుబడులు, ప్రాజెక్టుల గురించి చర్చించడం జరిగింది. వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించేవారు. ఒక యువ పారిశ్రామికవేత్తగా ఎన్నో దేశాలు పర్యటించాను. ఇతర నగరాలకు దీటుగా మన విజయవాడ-గుంటూరు ప్రాంతం అద్భుతంగా ఎదగాలని కలలుగన్న వాడిలో నేనూ ఒకడిని. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ, ఎంతో రిస్క్ ఉన్న ప్రాజెక్ట్స్ చేపట్టి వాటిని విజయవంతంగా నడిపించే దిశగా వెళ్తున్న మా కుటుంబాన్ని - ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు బాధ కలిగిస్తున్నాయి. చివరిగా మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నది. 2014 వ సంవత్సరము తర్వాత నేను గానీ నా కుటుంబ సభ్యులు గానీ, నా సంస్థలు గానీ ఏ విధమైన కొత్త ప్రాజెక్టులు నిమిత్తం భూ సేకరణ గానీ, నిధుల సమీకరణ గానీ చేసియుండలేదు. ఈ రోజున నాకూ, నా కుటుంబ సభ్యులకు, నా సంస్థలకు ఉన్న ఆస్తులు అన్నియూ 2014 కంటే ముందుగానే సమకూరి యున్నవి. 2014 వ సంవత్సరము తర్వాత నేను అభివృద్ధి చెందినదిగానీ, లబ్ది పొందినదిగానీ, ఏ వ్యక్తి నుండి గానీ, ఏ సంస్థ నుండి గానీ, ఏ ప్రభుత్వము నుండి గానీ పొందియుండ లేదని తెలియజేస్తునాను."

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన్ను బదిలీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కృష్ణబాబుకు కొత్తగా, ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. అయితే సురేంద్ర బాబుకి మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా షాక్ ఇచ్చారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా సురేంద్రబాబును ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్ర బాబు ఆకస్మిక బదిలీ పై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒక పక్క
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తున్న వేళ, ఇలాంటి సీనియర్, సమర్ధత ఉన్న ఆఫీసర్ ని మార్చటం చర్చనీయాంశంగా మారింది. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా సురేంద్ర బాబు ఉన్నారు. ఆయాన్ డీజీపీ ర్యాంకు అధికారి. ఇలాంటి అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఎడి కి రిపోర్ట్ చేయాలని అదేశాలు ఇవ్వటం పై విస్మయం వ్యక్తం అవుతుంది.

surendrababu 25092019 2

ఒక పక్క ఇప్పటికే, గతంలో పని చేసిన, దాదపుగా 10 మంది దాక ఒకే సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వకుండా, వారిని నాలుగు నెలల నుంచి ఖాళీగా కూర్చోపెట్టటం పై, విమర్శలు వస్తున్నాయి. ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ప్రభుత్వం వెళ్తుందనే విమర్శలు వస్తున్న వేళ, ఇప్పుడు మరోసారి సురేంద్ర బాబు లాంటి ఆఫీసర్ ని, బదిలీ చేసి, డీజీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ కు, ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా పక్కన పెట్టటం పై, సర్వత్రా చర్చనీయంసం అయ్యింది. సురేంద్రబాబు, చంద్రబాబు మొదటి సారి సియంగా ఉండగా, విజయవాడ పోలీస్ కమీషనర్ గా చేసారు. ఆ సమయంలో, ఆయన ఎంతో దూకుడుగా వెళ్తూ, బెజవాడ రౌడీజం లేకుండా చేసారు. టిడిపి పార్టీ నేతలు అధికారంలో ఉన్నా, తప్పు చేసారంటే వదిలి పెట్టె వారు కాదు.

surendrababu 25092019 3

ఈ నేపధ్యంలోనే సురేంద్రబాబుకి రాష్ట్రమంతా మంచి ఆఫీసర్ గా పేరు వచ్చింది. ఎలాంటి వేషాలు వెయ్యకుండా రోడీలను కంట్రోల్ చేసే వారు. అయితే చంద్రబాబు మొన్న సియంగా ఉండగా, సురేంద్రబాబుకి డీజీ ర్యాంక్ ఇచ్చి, ఆర్టీసి ఎండీని చేసారు. తరువాత ఆయనకు డీజీపీ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చెయ్యటం వివాదాస్పదం అయ్యింది. చంద్రబాబు ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వరరావుకి, ఇప్పటి వరకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వని సంగతి తెలిసిందే. అలాగే గతంలో డీజీపీగా ఉన్న ఠాకూర్ ని, ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో వేసారు. మరి ఇప్పుడు సురేంద్రబాబుకి ఎప్పటికి పోస్టింగ్ ఇస్తారో, ఎలాంటి శాఖ ఇస్తారో అనేది వేచి చూడాలి.

Advertisements

Latest Articles

Most Read