ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలు, ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ విధానంతో, వచ్చే ఆదాయం కూడా తగ్గిపోవటంతో, జీతాలకు, పెన్షన్లకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. కేంద్రాన్ని గట్టిగా అడిగే అవకాసం ఇక్కడ ప్రభుత్వానికి లేకపోవటంతో, విభజన హామీలు ఒక్కటి కూడా అమలు అయ్యే అవకాసం లేదు. ఇక తెలంగాణా విషయానికి వస్తే, రిచ్ స్టేట్ అనుకున్న తెలంగాణా కూడా, ఈ ఏడాడి చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఆర్ధిక మాంద్యం అని చెప్పి, బడ్జెట్ ని తగ్గించి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు, ఇప్పుడు కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం షాక్ కి గురి చేసేలా ఉంది. ఈ నిర్ణయం కనుక అమలు అయితే, రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది.

modi 27092019 2

నిన్న కేంద్ర ప్రభుత్వం, 15వ ఆర్థిక సంఘానికి, ఒక మెమోరాండెం సమర్పించింది. రాష్ట్రానికి తిరిగి ఇచ్చే పన్నుల వాటాలు తగ్గించాలని, 15వ ఆర్థిక సంఘాన్ని కోరింది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలు 42 శాతం ఉంది. అయితే దీన్ని తగ్గించి, 32 నుంచి 34 శాతానికి తేవాలని కేంద్రం యోచిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అర్ధిక సంక్షోభం నుంచి, బయట పడటానికి, ఈ చర్య ఉపయోగ పడుతుందని, కేంద్రం భావిస్తుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కటానికి, రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటాను తగ్గించాలని, కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే రాష్ట్రాల ఆదాయాలు తగ్గటం మొదలైన సందర్భంలో, ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న చర్యతో, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచనలో పడ్డాయి.

modi 27092019 3

ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం విధానాలు, దక్షినాది రాష్ట్రాలకు ఇబ్బందిగా ఉన్నాయని, చంద్రబాబు ఉన్న సమయం నుంచి ఆందోళన తెలుపుతున్నారు. ఇప్పుడు కేంద్రం కనుక ఈ చర్య తీసుకుంటుంటే, మరిన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పధకాలు పెట్టారు, ఇవన్నీ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. పన్నుల వాటా తగ్గిస్తే, ఇక కేంద్రమే రంగంలోకి దిగి, ప్రజాకర్షన్ పధకాలు, తన ద్వారా చేపట్టే అవకాసం కూడా లేకపోలేదు. రాష్ట్రాలకు ఆర్ధిక స్వేచ్చ మరి కొంత తగ్గించి, ఇక కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటే, రాజకీయంగా కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశం. మరి ఈ పరిణామాలను, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన సలహాదారుడుగా ఉన్న అజేయ కల్లాం రెడ్డి పై, ఈ రోజు చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ప్రధాని మోడీ కార్యాలాయానికి తప్పుడు సమాచారం పంపించి, ఏదో జరిగిపోయింది అనే భ్రమ కలిపిస్తున్నారని, ఇలాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే, ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అధికారం ఉంది కదా, ఏమి చేసినా చెల్లిపోతుంది అని విర్రవీగితే, జగన్ కేసుల్లో కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్న అధికారులను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ, చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డైరెక్ట్ గా అజయ్ కల్లం రెడ్డి పేరు ఎత్తక పోయినా, ఆయన ప్రధానికి లేఖ రాసిన విషయం చదివి వినిపిస్తూ, ఇలాంటి తప్పుడు సమాచారం ప్రధాని కార్యాలయానికి పంపిస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోజు విద్యుత్ ఒప్పందాల పై, గుంటూరు పార్టీ ఆఫీస్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు పాల్గున్నారు.

ajaykallam 27092019 2

విద్యత్ ఒప్పందాల విషయంలో, ప్రధాని కార్యాలయానికి తప్పుడు సమాచారం ఇచ్చి, ప్రధానినే తప్పుదోవ పట్టించే పని చేసారని, ఇలాంటి అధికారుల పై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. జగన్ ఒత్తిడి తెస్తున్నారు కదా అని, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే, శిక్ష అనుభవించక తప్పదని, అధికారులను హెచ్చరించారు. పీఏలపై ప్రధానికి జగన్‌ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఈ రంగంలోని నిపుణులు, కేంద్రం, కోర్ట్ లు చెప్తున్నా, వీరు వినటం లేదని, మీడియా సమావేశాలు పెట్టి అధికారులే, రాజకీయ నాయకులు లాగా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే చంద్రబాబు టార్గెట్ చేసినై అజయ్ కల్లం రెడ్డిని అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. విద్యుత్ ఒప్పందాల విషయంలో ఎదో జరిగిపోయిందని, ఈయనే జగన్ కు చెప్తూ వస్తున్నారు.

ajaykallam 27092019 3

అజయ్ కల్లం రెడ్డి, రెండు నెలలు పాటు చంద్రబాబు హయంలో, చీఫ్ సెక్రటరీగా చేసారు. తరువాత జగన్ దగ్గర చేరి, రాజకీయలు మొదలు పెట్టారు. జగన్ అధికారంలోకి రాగనే, సలహాదారు అయిపోయారు. విద్యుత్ పీపీఏ ల విషయం, మొత్తం కర్మ, క్రియ అంతా ఆయనే. ఈ విషయం పై జగన్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాల సమీక్షకు వేసిన కమిటీని కూడా ఆయనే లీడ్ చేస్తున్నారు. కేంద్రానికి ఇచ్చే సమాచారం అంతా అజయ్ కల్లం రెడ్డే తయారు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఈ లేఖల సమాచారం అంతా తప్పు అని, ప్రధాని కార్యాలయాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారని, మొత్తం వివరంగా చెప్పారు. ఇప్పడు ఈ విషయం పై కేంద్రం ఎలా స్పందిస్తుంది. తప్పుడు సమాచారం పంపించిన అధికారుల పై చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.

గత అయుదు సంవత్సరాలుగా చుస్తునే ఉన్నాం. ఎంత మంచి పని చేసినా, ఆ మంచి కనిపించకుండా, ఎదురు బురద చల్లటం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు బురద చల్లుతారు, తెలుగుదేశం నేతలు ఆ బురద మాకు ఎక్కడ అంటుతుందో అని దాన్ని కడుక్కోవటం, అది కడుక్కుంటూ ఉండగానే, మరో బురద చల్లటం.. ఇలా ప్రతి రోజు తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రతి రోజు తెలుగుదేశం నేతలు బురద కడుక్కుంటూనే చేసేవారు. అప్పట్లో బీజేపీ నేతలు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ లాంటి వారికి, ప్రతి రోజు ఇదే పని. అప్పట్లో వాళ్ళు ఆరోపణలు చేసిన ప్రతిది తప్పు అని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయ్యింది. అయినా సరే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతి రోజు చంద్రబాబు పై బురద చల్లే పనిలోనే ఉన్నారు.

kutumbarao 27092019 1

నాలుగు నెలల్లో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ప్రతి రోజు బీజేపీ నేతలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణతో సహా గగ్గోలు పెడుతుంటే, విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం, బీజేపీ అధికార ప్రతినిధిగా కాకుండా, జగన్ మోహాన్ రెడ్డి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తుంది. నిన్న జరిగిన ఒక టీవీ చర్చ కార్యక్రమంలో ఈ విషయం మరోసారి రుజువైంది. విద్యుత్ ఒప్పందాల అంశం పై ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా, ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి లైవ్ లోనే లీగల్ నోటీసులు పంపించారు. ఒక పక్క కేంద్రంలో ఉన్న మంత్రి, గత ప్రభుత్వం తప్పు లేదు, అన్నీ మా పర్యవేక్షణలోనే జరిగాయి, ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్తుంటే, అదే పార్టీకి చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి మాత్రం, తప్పు అంతా చంద్రబాబుదే అని చెప్పారు.

kutumbarao 27092019 1

ఈ సందర్భంగా, చర్చలో ఉన్న కుటుంబరావు పై బురద చల్లే ప్రయత్నం చేసారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రవిరెడ్డి అనే వ్యక్తి, కుటుంబరావులు మధ్యవర్తులుగా వ్యవహరించి, చంద్రబాబుతో కలిసి అనేక అక్రమ ఒప్పందాలు చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. అయితే అందరిలా కాకుండా, దీనిపై వెంటనే స్పందించిన కుటుంబరావు ఆ ఆరోపణలను ఖండిస్తూ, నీకు లీగల్ నోటీస్ పంపిస్తున్నా, అంటూ మొబైల్ నుంచే నోటీస్ పంపించారు. రెండు రోజుల్లో లీగల్ నోటీస్ ఇంటికి పంపిస్తానని, నా పై అనవసర ఆరోపణలు చేసిన నిన్ను కోర్ట్ కి ఈడుస్తా అంటూ చెప్పారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డికి పంపిన లీగల్ నోటీసును కుటుంబరావు చదివి వినిపించారు. అయితే దీని పై సామాన్య ప్రజలు కూడా శభాష్ అంటున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్న వారికి, ఇలా లీగల్ నోటీసులు పంపించి, శిక్ష పడేలా చేస్తే, ఇంకొకరు ఇలా నోటికి వచ్చినట్టు కాకుండా, సబ్జెక్ట్ పై మాట్లాడతారని, ప్రజలకు అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.

ఈ నెల 21న జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ల్యాండింగ్ లో నిర్లక్ష్యం వహించిన అంశం పై దర్యాప్తుకు ఆదేశించింది సీఎంఓ. సిఎంఓ ఆదేశాల పై ఈ అంశంలో పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేస్తున్న డీఆర్వో వెంకటేశం, హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు అధికారులకు నోటీసులు పంపించారు. ఈ నెల 21న కర్నూల్ జిల్లా నంద్యాల పర్యటనకు జగన్ వెళ్లారు. వరదలు వచ్చిన సందర్భంలో జగన్ అక్కడ పర్యటించిన సమయంలో, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ పై అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని అభియోగం. సహజంగా, హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలను ఒక క్రమ పద్ధతిలో డిగ్రీలు, మినిట్స్, సెకండ్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. అయితే అక్కడ అధికారులు మాత్రం కేవలం డిగ్రీల్లో ఇచ్చారు. ఈ సందర్భంలో, హెలికాప్టర్ లాండింగ్ సమయంలో, కొంత గందరగోళం ఏర్పడింది. అక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సిఎంఓ సీరియస్ అయ్యింది.

helicopter 27092019 2

ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని తీవ్ర తప్పిదంగా భావించి, దర్యాప్తుకు ఆదేశించింది. నంద్యాలలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో, అక్కడ డ్యూటీలో సరిగ్గా వ్యవహరించలేదని అక్కడ అధికారుల పై సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేసించటంతో, రంగంలోకి దిగిన కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా డీఆర్వో వెంకటేశంను నియమించి, పూర్తీ స్థాయి నివేదిక ఇవ్వమని కోరారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం, విచారణ ప్రారంభించిన డీఆర్వో వెంకటేశం, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఏడుగురు అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న వ్యక్తిగతంగా తమ ముందు హాజరయ్యి, తమకు వివరణ ఇవ్వాలని అ నోటీసులో కోరారు.

helicopter 27092019 3

సర్వే, ల్యాండ్‌ రికార్డు ఏడీ హరికృష్ణ, డ్వామా పీడీ వెంకట సుబ్బయ్య, శిరువెళ్ల, నంద్యాల, ఉయ్యాలవాడ తహసీల్దార్లు నాగరాజు, రమేష్‌బాబు, నాగేశ్వరరెడ్డి, గోస్పాడు ఎంపీడీవో సుగుణశ్రీ, నంద్యాల డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌ వేణులకు గురువారం నోటీసులు అందాయి. నోటీసులు అందజేసి సమాధానం చెప్పాలని, విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. వాతావరణం అనుకూలించక, ఆయన హెలికాప్టర్ కూలిపోయింది. ఆయానతో పాటు, కొంత మంది సిబ్బంది కూడా మరణించారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి, కూడా హెలికాప్టర్ విషయంలో తేడా రావటంతో, ఈ విషయం పై అధికారులు సీరియస్ అయ్యారు.

Advertisements

Latest Articles

Most Read