ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, కధనాలు ప్రసారం చేస్తున్న ఛానెల్స్ ని తట్టుకులేక, వాటిని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానల్స్ ను బ్యాన్ చేస్తూ అనధికారిక ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సిటి కేబుల్ తో పాటుగా, ఏపి ఫైబర్ నెట్ లో కూడా ఈ రెండు ఛానల్స్ ఆపేశారు. అయితే, అప్పటి నుంచి ఈ రెండు చానల్స్ విషయంలో, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జర్నలిస్ట్ సంఘాలతో పాటుగా, ప్రజలు కూడా ఈ ఛానల్స్ ఇవ్వాలి అంటూ ఆందోళన చేస్తున్నారు. దీని పై కొంత మంది ప్రేక్షకులు, ట్రాయ్ కి కంప్లైంట్ ఇవ్వటం కూడా చేసారు. మరో పక్క ఈ విషయం పై ప్రభుత్వం మాత్రం ఏమి స్పందించటం లేదు. జర్నలిస్ట్ సంఘాలు ఎంత ఆందోళన చేసినా, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా, ప్రభుత్వం మాత్రం, ఈ విషయంలో, గత 15 రోజుల నుంచి స్పందించటం లేదు.

abn 24092019 2

అయితే ప్రభుత్వం అకారణంగా తమ ఛానల్ ని బ్యాన్ చేసిందని చెప్తూ, టెలికామ్ వివాదాల పరిష్కార సంస్థ (ది టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పీలేట్ అథారిటి)లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదు చేసింది. ఈ రోజు ఈ విషయం పై విచారణ జరిపిన ట్రిబ్యునల్, ఆంధ్రజ్యోతికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కనీసం నోటిసులు కూడా ఇవ్వకుండా ఛానెల్ ప్రసారాలు ఎలా నిలిపేస్తారని, ఏబిఎన్ తన పిటీషన్ లో పేర్కొంది. పిటిషన్ విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్, నోటీసులు కూడా ఇవ్వకుండా ఎందుకు ఆపారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీఎన్ ప్రసారాలను రెండు రోజుల్లోగా పునరుద్దరించాలంటూ ప్రభుత్వానికి సంబందించిన ఫైబర్ నెట్‌కు, ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

abn 24092019 3

అయితే ఫైబర్ నెట్ తరుపున న్యాయవాదాలు వాదిస్తూ, కావలని చెయ్యలేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని, అందుకే కొంచెం అంతరాయం కలిగింది అంటూ, కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చెయ్యగా, ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీఎన్‌ ప్రసారాల నిలిపివేతలో నిబంధనలు పాటించలేదని ట్రిబ్యునల్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేసింది. సాంకేతిక సమస్యలంటూ సాకులు చెప్పొద్దని, రెండు రోజుల్లో ఛానెల్ ప్రసారాలు ప్రారంభం కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్స్‌ కన్నా న్యూస్ చానెళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల గొంతు వినిపించే చానెల్స్‌ విషయంలో మరింత జాగ్రత్త వహించాలని ఫైబర్ నెట్‌కు టీడీ శాట్‌ చైర్మన్‌ శివకీర్తి సింగ్ సూచించారు.

పోలవరం ఇరిగేషన్‌, పవర్‌ ప్రాజెక్ట్‌ల వ్యవహారంలో జగన్మోహన్‌రెడ్డి రోజుకో విధంగా చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారని, హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడాల్సిన ఏపీ జెన్‌కో అధికారులు, మంత్రులు తెల్లమొహాలు వేసుక్కూర్చుంటే, ముఖ్యమంత్రేమో కాంట్రాక్టర్లతో కలిసి కేసీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత, మాజీ మంత్రి, దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులు పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ), కేంద్ర జలవనరుల శాఖ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీవీసీ), డ్యామ్‌డిజైన్‌ రివ్యూప్యానెల్‌ ఆధ్యర్యంలో జరుగుతుండగా రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ (ఢిల్లీ) రుణసాయంతో, ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో, 960 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులు జరుగుతున్నాయని ఉమా పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి రివర్స్‌టెండరింగ్‌ పేరుతో డ్రామాలాడిన రాష్ట్ర ప్రభుత్వం, జీవో-67లోని నిబంధనలకు విరుద్ధంగా, సింగిల్‌ టెండర్‌ను పరిగణనలోకి తీసుకొని, ప్రాజెక్ట్‌నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం, అర్హతలేని 'మెగా' కంపెనీని ఎలా ఎంపిక చేసిందో, ఎవరి ప్రమేయంతో ఎంపిక చేసిందో ఇరిగేషన్‌, జెన్‌కో అధికారులు, సంబంధిత మంత్రులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి టర్బైన్ల పనులన్నీ చివరి దశకొచ్చిన సమయంలో, మరో రెండేళ్లలో విద్యుత్‌ ఫలాలు రాష్ట్రానికి అందుతున్న వేళ, పోలవరం విద్యుత్‌ పవర్‌ప్రాజెక్ట్‌ పనులకు మళ్లీ టెండర్లు పిలిచి, 58నెలల కాలవ్యవధితో వేరేసంస్థకు పనులప్పగించడం, తెలివిగల జగన్‌కే సాధ్యమైందని మాజీమంత్రి దెప్పిపొడిచారు. గతప్రభుత్వంలో పవర్‌ప్రాజెక్ట్‌ పనులు పొందిన సంస్థ, 2022 ఫిబ్రవరి నాటికి పూర్తిచేస్తామని, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేస్తే, దాన్ని కాదని వేరేసంస్థకు అవేపనులు, ఇంకాఎక్కువ సమయంతో కట్టబెట్టడానికి జగన్మోహన్‌రెడ్డి ఎందుకు ఉవ్విళ్లూరారో సమాధానం చెప్పాలని దేవినేని నిగ్గదీశారు. ఆసంస్థకు ఎక్కువ సమయమివ్వడం వల్ల దాదాపు 15,484 మిలియన్‌యూనిట్లను, యూనిట్‌ రూ.4 చొప్పున కొనుగోలు చేసినా, 15,484 యూనిట్లకు రూ.6193 కోట్లను రాష్ట్రప్రభుత్వం నష్టపోనుందని ఆయన స్పష్టంచేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి నీటిని ఎలా శ్రీశైలానికి తీసుకెళ్లాలని చర్చిస్తుంటే, సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్‌మంత్రి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

వేమిరెడ్డి, వైవీ.సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి అనే కాంట్రాక్టర్లతో కలిసి జగన్మోహన్‌రెడ్డి జరిపిన చర్చల్లో ఎక్కడా కూడా రాష్ట్రసాగునీటి విభాగం అధికారులుగానీ, విద్యుత్‌శాఖాధికారులు గానీ, సదరు శాఖల మంత్రులుగానీ లేకపోవడం విడ్డూరంగా ఉందని ఉమా చెప్పారు. చర్చల్లో కాంట్రాక్టర్లమయం తప్ప, అధికారులు, మంత్రులు మచ్చుకైనా లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగుగంటలు చర్చించడం జరిగిందన్నారు. వీరంతా కలిసి, గోదావరి నీళ్లను శ్రీశైలానికి తరలిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు గంటలపాటు ఏఏ అంశాలపై చర్చించారో ఎందుకు బహిర్గతం చేయడంలేదన్నారు. ఇరురాష్ట్రాల మధ్యగల విద్యుత్‌ సమస్యలపై చర్చించారో, తెలంగాణ నుంచి రావాల్సిన రూ.5వేలకోట్ల విద్యుత్‌ బకాయిల గురించి చర్చించారో, షెడ్యూల్‌9-10లోని అంశాల గురించా... లేక ఢిల్లీలోని ఏపీభవన్‌ ఆస్తులగురించి మాట్లాడారో, లేక గోదావరిజలాలు తెలంగాణలో పారించడానికి ఎన్నికిలోమీటర్లు కాలువలు, టన్నెల్స్‌ తవ్వాలి.. ఆ పనులు రూ.లక్షా40వేల కోట్ల పోలవరంపనుల్ని ఏసంస్థకైతే అప్పగించారో అదేసంస్థకు ఇవ్వడానికి ఆలోచనలు చేశారో జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు చెప్పాలని దేవినేని డిమాండ్‌చేశారు.

ఇవేవీ కాకుండా గత ఎన్నికల్లో కేసీఆర్‌ చేసిన సాయానికి ప్రతిఫలంగా జగన్మోహన్‌రెడ్డి ఏం సాయం చేయబోతున్నాడని చర్చించారా.. లేక రాబోయే ఎన్నికల గురించి చర్చలు జరిపారో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించాలని ఉమా డిమాండ్‌ చేశారు. నిన్నటి సమావేశానికి కూడావెళ్లని రాష్ట్ర జలవనరుల మంత్రి, అధికారంలోకి వచ్చి 4 నెలలైనా పోలవరం పనుల్లో ఒక్కబొచ్చె కూడా సిమెంట్‌ వేయడం చేతగాని ఆయనకు, 30లక్షల క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయించిన నాపై ఆరోపణలు చేయడానికి ఏంఅర్హత ఉందని ఉమా ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి పోలవరం వెళ్లినప్పుడు, పనులుచేస్తున్న సంస్థ చాలా స్పష్టంగా 2020కి పనులన్నీ పూర్తి చేస్తామని చెప్తే, లేదు.. లేదు..అలా వద్దు 2021జూన్‌కి పూర్తి చేయాలని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని మాజీ మంత్రి గుర్తుచేశారు. 2017 సెప్టెంబర్‌లో నవయుగ కంపెనీ రూ.3220కోట్లకు పవర్‌ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తిచేస్తామంటే, మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ సంస్థ, రూ.3455 కోట్లకు కడతామని చెప్పడం జరిగిందన్నారు. రూ. 235కోట్లు ఎక్కువ అడిగిన అదే మెగా సంస్థ, 2019 సెప్టెంబర్‌లో రూ.2810 కోట్లకు పనులు చేయడానికి సిద్ధపడటం వెనుక ఉన్న లోగుట్టు ఏమిటో జగన్మోహన్‌రెడ్డి తెలియచేయాలన్నారు.

అప్పటికి, ఇప్పటికీ రూ.645కోట్ల తక్కువకు మెగా కంపెనీ ఎలా టెండర్లు వేసిందన్నారు. రెండేళ్లలో కాళేశ్వరం పనులు చేస్తున్న  మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ పోలవరం హైడ్రోప్రాజెక్ట్‌ పనుల్ని తక్కువ మొత్తానికి చేయడానికి, అంతే తక్కువకు టెండర్లు వేయడానికి ఎందుకు సిద్ధపడిందో, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గిందో చెప్పాలని ఉమా కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించాలని కేసీఆర్‌ శాసనసభలో చెప్తే, జగన్మోహన్‌రెడ్డి దాన్ని ఎందుకు ఖండించలేదన్నారు? కేసీఆర్‌ చెప్పింది తప్పు, దానికి నేను ఒప్పుకోను అని జగన్మోహన్‌రెడ్డి ఎందుకు అనడం లేదని ఉమా నిలదీశారు. పోలవరం జలాలను ఆంధ్రప్రదేశ్‌ భూభాగం నుంచే రాయలసీమకు, నెల్లూరుకు తీసుకెళ్తామనే మాట జగన్‌ నోటినుంచి ఎందుకు రావడం లేదన్నారు? కేసీఆర్‌తో లాలూచీపడి గత ఎన్నికల్లో లబ్దిపొందిన జగన్మోహన్‌రెడ్డికి, ఆంధ్రరాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టుపెట్టే హక్కు ఎవరిచ్చారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రూ.235 కోట్లు ఎక్కువ కావాలని అడిగిన మెగా సంస్థ,  రాష్ట్రప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1800 కోట్ల పాతబిల్లుల కోసం, ఇప్పుడు జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా తక్కువకు టెండర్లు వేసిందన్నారు. తక్కువకు వేస్తేనే బిల్లులు ఇస్తామని బెదిరించీ మరి, రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీల మెడలు వంచిందన్నారు.

ఎన్నికల్లో పంచినపుస్తకాల్లో , సాక్షి మీడియాలో విషం చిమ్ముతూ, పోలవరం పనుల్లో రూ.20175కోట్ల అవినీతి చేశామని మాపై బురదజల్లిన జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమిచ్చే అవార్డులు తీసుకోవడానికి ఏముఖం పెట్టుకొని వెళతాడని దేవినేని నిలదీశారు. జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగే వారిని పోలవరం పనులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం నియమించడం దురదృష్టకరమన్నారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసి, పోలవరం ప్రాజెక్ట్‌పై 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ వెంకటేశ్వరరావును జగన్‌ ఎందుకు తొలగించాడన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు పనులప్పగించడం కోసం, గత ప్రభుత్వంపై బురదజల్లడానికి సహకరించని అధికారులను  తొలగించి, తన అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని నియమించడంలోని ఆంతర్యమే మిటని ఉమా ప్రశ్నించారు. విజిలెన్స్‌ కేసుల్లో ఉన్న అధికారిని పోలవరం డ్యామ్‌ పనుల్లో ముఖ్యఅధికారిగా నియమించారన్నారు. సింగిల్‌ టెండర్‌ విధానంలో, ఏ విధమైన సడలింపులు, వెసులుబాట్లతో మెగా సంస్థకు ఎలా పనులు అప్పగించారో, ఇదే సంస్థ గతంలో రూ.235 ఎక్కువ కావాలని చెప్పి, ఇప్పుడు రూ.645 కోట్లకు తక్కువగా ఎలాటెండర్లు వేసిందో, జలవనరులశాఖ, ఏపీజెన్‌కో అధికారులు స్పష్టం చేయాలన్నారు.

మొన్నటి దాకా జగన్ అక్రమాస్తుల కేసులో అందరికీ ఊరటలు లభిస్తూ వచ్చాయి. దీని పై రాజకీయ పార్టీలు అనుమానాలు కూడా వ్యక్తం చేసాయి. బీజేపీకి, జగన్ దగ్గర అవ్వటంతోనే, ఇలా జరుగుతూ వస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. సిబిఐ, ఈడీ కూడా అంత సీరియస్ గా పట్టించుకోవటం లేదని, కోర్ట్ ల్లో సమర్ధవంతంగా వాదించటం కాని, పై కోర్ట్ ల్లో అపీల్ కూడా చెయ్యటం లేదని, ఆరోపణలు వస్తూ వచ్చాయి. ఇక జగన్ కేసులు, నెమ్మదిగా నీరుగారి పోతాయని అందరూ అనుకుంటున్న టైంలో, సిబిఐ మళ్ళీ ఆక్టివేట్ అయ్యింది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ ఆదిత్య నాద్ దాస్ ను జగన్ కేసుల నుంచి తప్పిస్తూ, ఇచ్చిన తీర్పు పై, సిబిఐ సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసింది. దీంతో సుప్రీం కోర్ట్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కేసు నుంచి ఆదిత్యనాద్ ను తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

supreme 23092019 2

సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల బెంచ్‌ శుక్రవారం దీనిపై విచారణ చేపట్టి, ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు ఈ విషయం పై ఆదిత్యనాద్ దాస్ కు నోటీసులిచ్చింది. ప్రస్తుతం, ఆదిత్యనాథ్‌ దాస్‌ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పాటు, ఆదిత్యనాథ్‌ దాస్‌ దూకుడు పై కూడా కేంద్రం గుర్రుగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ లోపే ఇటు కోర్ట్ నుంచి కూడా ఆదిత్యనాథ్‌ దాస్‌ కు మళ్ళీ నోటీసులు రావటంతో, ఆయనకు మరింత ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఆదిత్యనాథ్‌ దాస్‌ ఇచ్చే సమాధానం బట్టి, సుప్రీం కోర్ట్ ఒక నిర్ణయం తీసుకోనుంది.

supreme 23092019 3

అభియోగాలివీ.. రాజశేఖర్ రెడ్డి సియంగా ఉన్న సమయంలో, నిబంధనలకు విరుద్ధంగా ఇండియా సిమెంట్స్‌కు అదనపు నీటిని కేటాయించారని, దీనికి అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యులని ఆరోపించింది. దీనికి ప్రతి ఫలంగానే, ఇండియా సిమెంట్స్‌ జగన్‌ సంస్థల్లో 140 కోట్లు పెట్టుబడులు పెట్టిందని ఈడీ పేర్కొంది. ఆదిత్యనాథ్‌ దాస్‌ రూల్స్ కి వ్యతిరేకంగా పని చేసారని, ఒత్తిళ్ళకు లొంగి, నిబంధనలు పక్కన పెట్టి పని చేసారని, సిబిఐ కేసు ఫైల్ చేసింది. మరో పక్క, పోయిన వారం, పెన్నా సిమెంట్స్‌ కేసులో అదనపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది సిబిఐ. అయితే సిబిఐ ఈ కేసులో మళ్ళీ ఆక్టివేట్ అవ్వటం పై, జగన్ కేసుల్లో ఉన్న వారికి ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే ఆందోళన మొదలైంది.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి టైం అసలు కలిసి రావటం లేదు. అటు కేంద్రం కాని, ఇటు కోర్ట్ లు కాని, ఏవి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించటం లేదు. కేవలం చంద్రబాబుని ఇరికిద్దాం అంటూ జగన్ వేస్తున్న అడుగులు, ప్రతి సారి రివెర్స్ అవుతున్నాయి. చంద్రబాబు పై అవినీతి మరకలు వెయ్యటం ఏమో కాని, రాష్ట్ర పరువు అటు కేంద్రం దగ్గర, ఇటు కోర్ట్ ల్లో కూడా పోతుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే, చంద్రబాబు విద్యుత్ కొనుగోల్లలో పెద్ద ఎత్తున అవినీతి చేసారని, ఆ అవినీతి అంతా బయటకు తీస్తాం అంటూ కొన్ని చర్యలు తీసుకున్నారు. విద్యుత్ ఒప్పందాలు సమీక్ష చేస్తున్నాం అంటూ ఒక కమిటీ వేసారు. అంతే కాదు, రెట్లు అన్నీ సమీక్ష చేస్తున్నాం అంటూ ఒక జీవో కూడా విడుదల చేసారు. దీని పై అటు పెట్టుబడి పెట్టిన కంపెనీలు కాని, ఇటు కేంద్ర ప్రభుత్వం కాని తీవ్ర అభ్యంతరం చెప్పాయి. కేంద్ర ప్రభుత్వం అయితే, ఒకింత గట్టిగానే సమాధానం ఇచ్చింది.

court 24092019 2

మీ ఇష్టం వచ్చినట్టు సమీక్ష చెయ్యటం కుదరదు, అన్నీ సక్రమంగానే జరిగాయి, అసలు రేట్లు నిర్ణయించేది రాష్ట్రం కాదు అంటూ గట్టిగా చెప్పింది. మొన్న కేంద్ర మంత్రి కూడా, జగన్ అన్నీ అసత్యాలు చెప్తున్నారు అంటూ, ఏకంగా ప్రెస్ ముందే చెప్పారంటే, ఈ విషయంలో కేంద్ర వైఖరి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అయితే కేంద్రం ఎంత హెచ్చరిస్తున్నా, బిజినెస్ అనలిస్ట్ లు ఎంత హెచ్చరించినా, జగన్ మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. దీంతో దాదాపుగా 42 విద్యత్ కంపెనీలు హైకోర్ట్ తలుపు తట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల పై కోర్ట్ కు నివేదించాయి. ఈ విషయం పై, ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్ట్, ఫైనల్ తీర్పు కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది.

court 24092019 3

విద్యుత్ ఒప్పందాల పై పీపీఏల పునఃసమీక్ష పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు జీవోను హైకోర్టు కొట్టి వేసింది. అలాగే గత నాలుగు నెలలుగా విద్యుత్‌ సంస్థలకు చెల్లింపులు చెయ్యటం లేదని తెలియటంతో, వారికి చెల్లింపులు కూడా చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారి నుంచి ప్రభుత్వం విద్యుత్ తీసుకోవటం లేదని తెలిసి, అది తక్షణమే విద్యుత్ కూడా తీసుకోవలాని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా పీపీఏల టారిఫ్‌ వ్యవహారాన్ని 6 నెలల్లో పరిష్కరించాలని ఈఆర్‌సీని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదాన్ని ఇక కోర్ట్ లో కాకుండా ట్రిబ్యునల్ లో పరిష్కరించుకోవాలని కోరింది. మొత్తానికి, విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్ట్ తప్పుబట్టింది.

Advertisements

Latest Articles

Most Read