ఆంధ్రుల రాజధాని అమరావతి పై జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి బొత్సా సత్యన్నారాయణ ప్రకటనలు కొనసాగుతున్నాయి. మొన్నటిదాకా అమరావతిలో వరదలు వస్తాయి, అమరావతి పై ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటూ గందరగోళ ప్రకటనలు చేసిన బొత్సా, ఇప్పుడు మళ్ళీ మరొక ప్రకటన చేసారు. చంద్రబాబు హయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చంద్రబాబు గజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటూ బొత్సా ప్రశ్నించారు. గజిట్ ఇవ్వకుండా చంద్రబాబు కావాలని చేసారని, చంద్రబాబుకి అమరావతి మార్చే ఆలోచన ఉండబట్టే, గజిట్ ఇవ్వలేదని బొత్సా అన్నారు. అయితే, ఇక్కడ బొత్సా వ్యాఖ్యల పై కౌంటర్ లు గట్టిగా పడుతున్నాయి. సీనియర్ మంత్రిగా ఉన్న బొత్సాకు ఆమాత్రం కూడా తెలియదా, లేక అధికారులు కూడా కనీసం చెప్పరా, బొత్సా వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్సనంగా నిలుస్తున్నాయి.

botsa 07092019 1

ఏపి రీ ఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం రాష్ట్ర విభజన అయిన తేదీ నుండి పది సంవత్సరాల వరకు హైదరాబాద్ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి రాజధానిగా ఉన్నది అనేది అందరికీ తెలిసిందే. విభజన చట్టంలో ఉన్న రాజధానిని కాదని అమరావతిని నియమిత కాలానికి ముందే గజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తే ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును ఆంధ్రప్రదేశ్ కోల్పోవలసి వస్తుంది. మనం హైదరాబాద్ నుంచి పరిపాలన చెయ్యకపోయినా, కొన్ని వెసులుబాటులు ఉంటాయి. విభజన చట్టంలో పేర్కొన్న ఆస్తుల విభజన జరగకుండా హైదరాబాదును రాజధానిగా వదులుకోవటం రాష్ట్రానికి మంచిదికాదు. అందువల్లనే అనధికారికంగా అమరావతిని రాజధానిగా ప్రకటించి ప్రధానమంత్రితో శంకుస్థాపన చేయించారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

botsa 07092019 1

బొత్స సత్యనారాయణ అనుభవజ్ఞుడైన రాజకీయనాయకుడిగా, మంత్రిగా కూడా వుండి బాధ్యతారాహిత్యంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని గజిట్ నోటిఫికేషన్ ఎందుకు చెయ్యలేదని చంద్రబాబుని ప్రశ్నించడం హాస్యాస్పదం. భారత ప్ర భుత్వం లో ప్రతి రాష్ట్రం కి అధికారిక రాజధాని పెరు ఒకటి ఉంటది. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ పేరుతో నే జరుగుతాయి. అమరావతి ని రాజధానిగా ప్రకటించి దానికి అధికారిక ముద్ర ఇస్తే ఇప్పుడు ఉమ్మడి రాజధాని గా ఉన్న హైద్రాబాద్ రాజధాని గా ఉండటం కుదరదు. అందుకని అమరావతి ని తాత్కాలిక రాజధాని గా ప్రకటిస్తూ భారత ప్రభుత్వం కి తెలియచేశారు. నాటి నుండి భారత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని అమరావతి పెరు తో నడుస్తున్నాయి. సచివాలయం పెరు లో కూడా ఇంటరీమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అని అన్నారు. తాత్కాలిక రాజధాని అన్ని తాత్కాలికమే అని వైసీపీ విమర్శలు చేస్తుంటే నాటి టీడీపీ ప్రభుత్వం వారికి ప్రజలకు సరిగా వివరించలేకపోయింది. ఇప్పుడు అధికారికం గా వైసీపీ అదే విమర్శ చేస్తుంటే ఇప్పుడు సరిగా చెప్పలేక పోతున్నారు.

స్వరూపానంద లాంటి స్వాములు, జగన్ మోహన్ రెడ్డి కోసమే మా శారదా పీఠం పని చేసింది, మా పీఠంలో ప్రతి మొక్క వైఎస్ జగన్ సియం అవ్వటం కోసమే పని చేసింది అని ఓపెన్ గా చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో, ఈ స్టేట్మెంట్ పెద్ద దుమారమే రేపింది. హిందూ ధర్మ పరిరక్షణ చేస్తూ, ప్రభుత్వానికి తగు రీతిలో సూచనలు ఇవ్వకుండా, ఇలా వ్యక్తి భజన చెయ్యటం, ఎలాంటి ధర్మం అంటూ ప్రశ్నించిన వారు ఉన్నారు. అయితే వైసిపీ మాత్రం, దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంది. జగన్ మోహన్ రెడ్డి పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఉందని, కానీ ఆయన హిందూ వ్యతిరేకి కాదని, స్వరూపానంద చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్సనం అని వైసిపీ ప్రచారం చేసుకుంది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ, అటు బీజేపీ, ఇటు కొంత మంది స్వాములు కూడా గళం విప్పుతున్నారు.

kamala 07092019 2

తాజగా స్వామి కమలానందభారతి, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం రెండు మతాలను తృప్తిపరిచేలా జగన్ ప్రభుత్వ పరిపాలన సాగుంతుందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి స్వామి కమలానందభారతి ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న పలు అంశాల పై తన అభిప్రాయాలను తెలిపారు. లౌకిక ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి, అన్ని మతాలను ఒకేలా చూడాలని, ప్రభుత్వాలు అలా నడవాలని అన్నారు. పాస్టర్లకు, మసీదుల్లో పనిచేసేవారికి జీతాలు ఇస్తున్నారని, ఇచ్చుకుంటే ఇచ్చుకోండి కాని, దేవాదాయ, ధర్మాదాయ శాఖలాగే వారికి కూడా ఒకదాన్ని ఏర్పాటు చేసి జీతాలు ఇవ్వాలని సలహా ఇచ్చారు.

kamala 07092019 3

ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ పై సంచలన ఆరోపణలు చేసారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా క్రైస్తవ మత వ్యాప్తి చేసే కుట్రదాగి ఉందని స్వామి కమలానందభారతి ఆందోళన వ్యక్తం చేశారు. దీని పై పోరాటం చేస్తామని అన్నారు. అలాగే దేవాదాయ శాఖలో అన్యమతస్థులు ఉద్యోగాలు చేయకూడదు అని అన్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి, అక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై చట్టాలు కూడా ఉన్నాయని, దేవాదాయ ధర్మాదాయ చట్టంలో ఆ విషయం స్పష్టంగా ఉందన ఆయన తెలిపారు. దేవాలయాల భూములను అప్పనంగా పంచి పెట్టాలని చూస్తున్నారని, వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రయత్నిస్తే కోర్టుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంచటాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. అధిక ఖర్చు, రాజకీయ పునరావాసం తప్ప, దీని వల్ల ఉపయోగం లేదని అన్నారు. ప్రభుత్వాలు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలను ఏదో ఒక విధంగా లోపల వెయ్యటానికి, వైసిపీ ప్రభుత్వం, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. తాజగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చేస్తూ, కధ నడుస్తుంది. మొన్నటి వరకు, కోడెల పై వరుస కేసులు పెట్టించి, ఎలా ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు చింతమనేని పై అలా టార్గెట్ సెట్ చేసారు. అధికారంలో ఉండగా, చింతమనేని దూకుడుతో, కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కాని అయన నియోజకవర్గ ప్రజలు మాత్రం, ఆయన దూకుడు ఎప్పుడూ ప్రజల కోసమే అని, ఆయన స్వార్ధానికి ఎప్పుడూ వాడుకోలేదని, ఆయనకు మద్దతు పలికేవారు. అయితే, ఇప్పుడు ఆయన ఓడిపోయారు, పార్టీ కూడా అధికారం కోల్పోయింది. మొన్నటి వరకు జిల్లా అంతటా ఆధిపత్యం చెలాయించిన చింతమనేని, నిప్పుడు వైసిపీ టార్గెట్ చేసింది. గత మూడు నెలలుగా చింతమనేని పై స్కెచ్ వెయ్యగా, ఇన్నాళ్ళకు ఆయన పై కేసు పెట్టె ఒక ఆధారం దొరికింది.

chintamaeni 06092019 2

ఇసుక ఇబ్బందుల కోసం, ఆగష్టు 30న అన్ని కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది. ఇందులో భగంగా చింతమనేని కూడా ధర్నాకు సిద్ధం అయ్యారు. దీంతో పోలీసులు దుగ్గిరాలలోని చింతమనేని నివాసంలోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చింతమనేనిని బయటకు వెళ్ళనివ్వకుండా చూసారు. ఎప్పటికప్పుడు పై అధికారుల ఆదేశాలు అనుసరిస్తూ, చింతమనేనిని నిలువరించారు. అయితే, మరో రెండు రోజుల తరువాత, మళ్ళీ చింతమనేనిని టార్గెట్ చేసారు. పెదవేగి స్టేషన్‌లో చింతమనేని పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. దీంతో ఆయన, లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఎక్కడికక్కడ వెతుకుతూ, ఏలూరు నగర కూడళ్ళలోను, కోర్టు వద్ద, దుగ్గిరాల సమీపంలోనూ పెద్దఎత్తున మొహరించారు.

chintamaeni 06092019 3

అయితే చింతమనేని అదృశ్యం అవ్వటంతో, పోలీసులు ఖంగుతిన్నారు. తేరుకుని చింతమనేని ఎక్కడకు వెళ్ళిపోయారో తీవ్ర స్థాయిలో ఆరా తీశారు. ఎంత వెతికినా అయన ఆచూకీ మాత్రం తెలవలేదు. ఇదే క్రమంలో, రాజకీయ నేతల అండదండలతో, మరికొంత మంది వచ్చి చింతమనేని పై కేసులు పెట్టారు. దీంతో చింతమనేనిని ఎలా అయినా పట్టుకోవాలి అంటూ, పోలీసు వర్గాలపై ఒత్తిడి పెంచారు. ప్రభాకర్‌ ని అరెస్టు చేయడానికి పోలీసులుసరిగ్గా వ్యవహరించలేదని, ఏలూరు రూరల్‌ సీఐ మూర్తిపై డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ గురువారం సస్పెన్షన్‌ వేటు విధించారు. రాజకీయ ఒత్తిళ్ళకు, సిఐ బలయ్యారు. అయితే జరుగుతున్న పరిణామాల పై, పోలీసు ఉన్నతాధికారులను కలిసేందుకు మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో సహా పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, మరికొందరి నేతలు ప్రయత్నించగా, పోలీసులు ఎవరూ వాళ్ళని కలవటానికి ఇష్ట పడలేదు. దీంతో, టిడిపి నేతలు పోలీసుల ఏకపక్ష వైఖరిని తప్పు బట్టారు.

ప్రస్తుతం దేశం అంతా, ట్రాఫిక్ చాలాన్ల గోల నడుస్తుంది. అధిక ఫైన్ ల రూపంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల పై, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక విధంగా ఈ ఫైన్లు మంచిదే అయినా, ముందు మంచి రోడ్లు వేసి, తరువాత ఫైన్లు తీసుకోండి అనే వారు కూడా ఉన్నారు. నిన్న ఢిల్లీలో, ఒక టు వీలర్ కు, ఫైన్ల రూపంలో 47 వేలు రూపాయలు ఫైన్ వెయ్యటంతో, బండి రేటు కూడా అంత లేదు అంటూ, విరక్తి చెందిన ఆ వ్యక్తి, పోలీసుల ముందే బండి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. గత నాలుగు రోజులుగా ఇలాంటి సంఘటనలో ఎన్నో, ఈ దేశంలో జరుగుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నా, కొంత మంది మాత్రం వీటిని సమర్ధిస్తున్నారు. అయితే ఈ కొత్త ఫైన్ల విధానం ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు రాలేదు. త్వరలోనే మన రాష్ట్రాల్లో కూడా ఈ కొత్త ఫైన్ లు రానున్నాయి. అయితే ఈ తరుణంలో, మన రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

auto 07092019 2

ఆటో నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు అంటూ, వచ్చిన చలాన్ చూసి ఆ ఆటో డ్రైవర్ అవాకయ్యాడు. కొంచెం సేపు విషయం ఏంటో అర్ధం కాక, తల బాదుకున్నాడు. చివరకు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. ఎక్కడైనా చక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ లేకపోతే జరిమానా వేస్తారు కాని, ఆటో డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పి జరిమానా వెయ్యటం, మన రాష్ట్రంలో ఇప్పుడే వింటున్నాయి. ఆటో డ్రైవర్ కి హెల్మెట్ లేకపోవటంతో, జరిమానా విధించారు అని తెలియటంతో, అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడ పోలీసులు నిర్వాకం బయట పడటంతో, ఈ విషయం వైరల్ అయ్యింది.

auto 07092019 3

విజయవాడలోని మూడో పట్టణ ట్రాఫిక్‌ పోలీసులు ఒక ఆటోడ్రైవరుకు హెల్మెట్ లేదు అంటూ, ఈ-చలానా పంపించి అందర్నీ ఔరా అనిపించారు. ఏపీ16టిఎస్‌8597, నంబరు గల ఆటో పై ఐదు ఈ-చలానాలు ఉన్నాయి. ఆటో యజమాని ఈనెల 3న ఏపీ ఆన్‌లైన్‌లో ఆ అపరాధ రుసుమును కట్టటానికి అని వెళ్ళాడు. అయితే వాటిలో ఒక చలానా రూ.135 హెల్మెట్‌ ధరించని కారణంగా వేశామంటూ పేర్కొనడంతో అది చూసి ఆశ్చర్యపోయారు. ఆటో నడుపుకునే నాకు, ఆటో నెంబర్ పై, హెల్మెట్ లేకపోవటం ఏంటి అంటూ ఆశ్చర్య పోయాడు. ఈ క్రమంలో విజయవాడ మూడో పట్టణ ట్రాఫిక్‌ పోలీసుల నిర్వాకం బయటపడింది. అయితే ఈ విషయం పై స్పందించిన అధికారులు, అప్పుడప్పుడు ఇలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, ఒకటి పెట్టబోయి, ఇంకోటి పెట్టి ఉంటారని, ఇలాంటివి మా ద్రుష్టికి రాగానే సరి చేస్తామని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read