సహజంగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాల మాట వినటం చాలా అరుదు. వారి డిమాండ్స్ కి తలొగ్గే పరిస్థితి ఏ ప్రభుత్వం అంత సామాన్యంగా చెయ్యదు. ఇక జగన్, చంద్రబాబు లాంటి వైరం ఉన్న నేతల సంగతి అయితే చెప్పే పనే ఉండదు. అదే రాజకీయ కక్షల విషయంలో కూడా తగ్గాల్సిన పరిస్థితి అసలే ఉండదు. అలాంటిది ఇప్పుడు జగన్ ప్రభుత్వం, చంద్రబాబు చేసిన పోరాటానికి తగ్గింది. మూడు నెలల్లోనే ఇది ప్రతిపక్షం, ప్రభుత్వం పై సాధించిన విజయం. జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నేతలను వెంటాడి వెంటాడి దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో 8 మంది చనిపోయారు కూడా. 500 పైగా దాడులు జరిగాయి. అంతే కాదు తోటలు నరకటం, పొలాలు లాక్కోవటం, ఇంటికి వెళ్ళకుండా గోడలు కట్టటం, ఇలాంటి వికృత పనులు కూడా చేస్తున్నారు.

cbn 13092019 2

వీటి పై రెండు నెలల క్రిందటే చంద్రబాబు మొదటిసారిగా ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉద్రిక్తతలు సహజం అని, నెల రోజులు అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదని, చంద్రబాబు పల్నాడు పర్యటన చేసారు. అక్కడ ఒక మహిళను చంపేస్తే, ఆమె కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వాన్ని, పోలీసులను ఈ దాడులు అదుపు చెయ్యాలని కోరారు. తరువాత కొన్ని రోజులుగా, దాడులు తగ్గక పోవటంతో, తెలుగుదేశం పార్టీ తరుపున, స్వయంగా డీజీపీని కలిసి, సమస్యను వివరించి, ఈ దాడులు జరగకుండా చూడాలని, ప్రజలు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారని అన్నారు. అయినా దాడులు ఆగలేదు. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. దాడులు వల్ల, ఊరు వదిలి వెళ్ళిపోయాన వారికి ఆశ్రయం కల్పిస్తూ, స్వయంగా పార్టీ తరుపున శిబిరం నడిపారు.

cbn 13092019 3

దాదపుగా 10 రోజులు ఈ శిబిరం నడిపి, పోలీసులు వచ్చి స్వయంగా వీరిని ఊళ్ళకు తీసుకు వెళ్ళాలని అన్నారు. 10 రోజులు గడువు ఇచ్చి, లేకపోతె మేమే స్వయంగా తీసుకు వెళ్తాం అని అన్నారు. అయితే ప్రభుత్వం తరుపున హోం మంత్రి స్పందిస్తూ, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ చెప్పారు. దీంతో చంద్రబాబు చలో పల్నాడు పిలుపు ఇచ్చారు. ఈ విషయం బాగా పెద్దది అయ్యింది. అక్కడ బాధితులు చేత మాట్లాడించిన మాటలు, మీడియాలో ప్రముఖంగా వచ్చాయి, దీంతో ఇక ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. పైడ్ ఆర్టిస్ట్ లు అన్న వారినే, దగ్గరుండి, వారిని సొంత ఊరిలో పోలీసులు దింపారు. అక్కడ ఉన్న వైరి వర్గానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు ఏదైతే కోరారో అది నెరవేరింది. ప్రభుత్వం చేతే వారిని సొంత ఊళ్ళకు పంపించటంలో చంద్రబాబు పోరాటం సక్సెస్ అయ్యింది. చంద్రబాబు బుధవారం ఆ ఊరు వెళ్లి వారిని పరామర్శించనున్నారు. ఈ విధంగా, మూడు నెలలకు పైగా మొండి వైఖరితో ఉన్న ప్రభుత్వాన్ని, తమ పోరాటంతో దిగి వచ్చేలా చేసి, వారి చేతే వారి తప్పు ఒప్పించేలా చెయ్యటంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వం పై పోరాడి మొదటి విజయం సాధించారు.

వైఎస్ఆర్ వారసుడిని అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ తెగువ మాత్రం చూపించలేక పోతున్నారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ ప్రభుత్వం పై ఎక్కి తొక్కుతున్నాయని, వాటిని కాంగ్రెస్ పార్టీ వారు ఎవరూ చూడద్దు అని చెప్పారు కాని, ఏ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వాటిని బ్యాన్ చెయ్యటానికి చూడలేదు. తన సాక్షి ఛానల్ స్థాపించుకుని, కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అనుకున్నది చెప్పేవారు. అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పై రాజకీయంగా విమర్శలు చేస్తూ ఎదుర్కునే వారు. అయితే ఇప్పుడు ఆయన కొడకు జగన్ మోహన్ రెడ్డి మాత్రం అందుకు బిన్నం. తన చేతిలో ఒక టీవీ, ఛానల్ ఉన్నా, దానితో ప్రతిపక్షం పై, ప్రతి రోజు విషం చిమ్ముతున్నా సరే, మిగతా ఛానెల్స్ విషయంలో జగన్ తట్టుకోలేకపోతున్నారు. తన ప్రభుత్వం పై చిన్న చిన్న విమర్శలు చేసే సోషల్ మీడియా వ్యక్తులను కూడా ఉపెక్షించలేని స్థితిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి,

jagan 130892019 2

ఇప్పుడు తన ప్రభుత్వం పై వ్యతిరేక కధనాలు, తన ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపే ఛానెల్స్ పై కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కుంటే, జగన్ మాత్రం వాళ్ళని ఎదుర్కోలేక, ఆ ఛానెల్స్ ని బ్యాన్ చేసారు. తాజాగా జరిగిన చలో ఆత్మకూరు ఘటన, ప్రభుత్వానికి విపరీతమైన చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. చివరకు ప్రత్యర్ధులు తమ ఇంటికి వెళ్ళకుండా గోడ కట్టారు అంటే, ఆ చిన్న గోడ కూడా తీపించలేని వ్యవస్థలో మనం ఉన్నాం అంటూ ఆ టీవీ ఛానెల్స్ ప్రచారం చేసాయి. అలాగే వైసిపీ మనుషులే కొట్టి, మళ్ళీ బాదితుల పై కేసులు పెట్టటాన్ని కూడా ఈ ఛానెల్స్ బాగా చూపించాయి. చలో ఆత్మకూరు సందర్భంగా, హోం మంత్రి బాధితులను పైడ్ ఆర్టిస్ట్ లు అనటం, అలాగే చంద్రబాబు ఇంటికి తాళ్ళు కట్టటం, ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లి, ప్రభుత్వం ఎంత భయపడుతుందో అనే అభిప్రాయాన్ని కలిగించాయి. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి, ఆ బాధితులు నిజమే అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి కలిగింది.

jagan 130892019 3

దీంతో ఇక ఆ ఛానెల్స్ పని పట్టటానికి సిద్ధం అయ్యారు. ముందుగా తన పై పూర్తీ ఫోకస్ పెట్టిన ఏబీఎస్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానెల్స్ ను రెండు రోజుల నుంచి బ్యాన్ చేసారు. అలాగే ఏపి ఫైబర్ నెట్ లో కూడా వీటిని తొలగించారు. జగన్ అధికారంలోకి రాగానే, ఏబీఎన్ ఛానెల్ ని, 651 నెంబర్ కి మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా బ్యాన్ చేసారు. అయితే, రెండు రోజుల ముందు, మంత్రులు, కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు ఇచ్చి, ఆ రెండు ఛానెల్స్ ఆపేయమని చెప్పటంతో, చాలా మంది ఆపేశారు. అలా చేస్తే ఇబ్బందులు వస్తాయి, ట్రాయ్ నిబంధనలు అడ్డు వస్తాయి అని కొంత మంది చెప్పగా, నీ కేబుల్ లో నుంచి రేపటి నుంచి, ఏపి ఫైబర్ నెట్ వస్తుంది అంటూ బెదిరించారు. దీంతో, వారు కూడా బ్యాన్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి, జగన్ మోహన్ రెడ్డి యువకుడు, ధీటుగా ఎదుర్కుని సమాధానం చెప్తాడు అనుకుంటే, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన చిన్న పిల్లకాయలను నుంచి ఛానెల్స్ వరకు బ్యాన్ చేసుకుంటూ వెళ్తూ, తన వైఖరిని తానే బయట పెట్టుకుంటున్నాడు. రాను రాను ప్రశ్నించే గొంతుని, పాలకులు తట్టుకేలక పోతున్నారు.

మొన్నటి దాకా తెలంగాణా ఎన్నికల్లో హడావిడి చేసిన, నటుడు, నిర్మాత బండ్ల గణేష్, మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. తెలంగాణా ఎన్నికల సమయంలో, హడావిడి హడావిడి చేసి, చివర్లో బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అని చెప్పి, ఫలితాలు రాగానే కనుమరుగు అయిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ దాదపుగా 9 నెలలు తరువత మళ్ళీ రాజకీయాలు గురించి మాట్లాడుతూ, వార్తల్లోకి వచ్చారు. అయితే ఈ సారి తెలంగాణా గురించి కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై స్పందించారు. అటు జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను విమర్శలు చేస్తూనే, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పై సుతి మెత్తగా కౌంటర్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు సడన్ గా బండ్ల గణేష్ మళ్ళీ ఎందుకు హడావిడి చేస్తున్నారు ? పది నెలలు తరువాత, ఇప్పుడు తెలంగాణా రాజకీయాలు వదిలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు వేలు పెట్టారు అనేది చూడాలి.

bandla 11092019 2

బండ్ల గణేష్ మాట్లాడుతూ, ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన చలో ఆత్మకూరు విషయం పై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లోని, పల్నాడులో జరుగుతున్న గొడవలతో, ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసిపోయిందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పనులు చూస్తుంటే, ఆంధ్రా మరో బీహార్‌లా తయారైందనే భావన అందరికీ కలుగుతుందని, బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై మాట్లాడుతూ, పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలను ఆపేసారని, ఎందుకు ఎలా చేసారో అని విమర్శించారు. రాజధానిగా అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారని బండ్ల గణేష్, జగన్ ప్రభుత్వ వైఖరి పై మండిపడ్డారు.

bandla 11092019 3

వైసీపీ పాలనపైనా ఘాటు విమర్శలు చేస్తూ, వంద రోజుల పాలనలో ఏమీ చేయని జగన్ మోహన్ రెడ్డి నిద్రలేవాలి అని బండ్ల గణేష్ అన్నారు. చంద్రబాబు కూడా, జగన్ కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని అన్నారు. మరో పక్క, జెండా, ఎజెండా లేని నాయకులు కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మంచిదని బండ్ల గణేష్ అన్నారు. జనాన్ని కాసేపు మనశాంతిగా ఉండనివ్వండి అంటూ రాజకీయ పార్టీలను విన్నవించారు. ‘‘దగాపడ్డ తెలుగు ప్రజలారా! ఏ నాయకుడినీ నమ్మొద్దు, మీకు సాయం చేసే స్థితిలో నేను లేను, మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలని. భావితరాలకు ఆయనే (భగవంతుడే) దిక్కు’’ అని బండ్ల వ్యాఖ్యానించారు. అయితే జగన్, చంద్రబాబు పై డైరెక్ట్ గా విమర్శలు చేసిన బండ్ల, జెండా, అజెండాలేని నాయకులూ రెస్ట్ తీసుకోవాలని, ఎవరిని ఉద్దేశించి అన్నారో, అన్న చర్చ రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతోంది.

గత మూడు నెలలుగా, వైసీపీ నేతలు చేస్తున్న అరాచకానికి వ్యతిరేకంగా, తమ నిరసన వ్యక్తంచేస్తూ టీడీపీ పిలుపునిచ్చిన “చలో ఆత్మకూర్" నిన్న ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల పిలుపు నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ సీనియర్ నేతల హౌస్ అరెస్ట్లు, అడ్డుకోవడం వంటి చర్యల ద్వారా పోలీసు యంత్రాంగం టిడిపిని అడ్డుకుంది. మరోవైపు గుంటూరు జిల్లాలో టెన్సన్ వాతావరణం నెలకొంది. చలో ఆత్మకూరుకు పిలుపుతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొహరం, వినాయక నిమజ్జనం సాకుగా చూపి, పల్నాడులో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. దీని ద్వారా, అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం కుదరదని, వాటి పై నిషేధం విధిస్తున్నామని చెప్పారు. అయినా టిడిపి ఆత్మకూరు వెళ్తున్నాం అని చెప్పటంతో, ఆత్మకూరులో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామాల్లోకి బయట వారిని వెళ్ళనివ్వకుండా, ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను చూసి పంపించారు.

home 120920219 2

చివరకు ఆత్మకూరులో ఉన్న రైతులను తమ పొలాలకు కూడా వెళ్లనివ్వక పోవడంతో పోలీసులు అడ్డుకోవటంతో, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే ఆత్మకూరుకు రాకపోకల పై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. చివరకు పెళ్ళికి వెళ్లి వస్తున్న బంధువులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక చంద్రబాబు ఇంటి దగ్గర ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చేస్తునట్టు పోలీసులు నోటీసులు అంటించారు. పల్నాడులో 144 సెక్షన్ ఉందని, అక్కడికి వెళ్ళటానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడం పై డీజీపీ గౌతం సవాంగ్ స్పందిస్తూ, ప్రభుత్వ విధానాల పై పోరాడుతున్న కారణంగా, చంద్రబాబు అడ్డుకోలేదని, పల్నాడుకు వెళ్తే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంటుందనే ముందస్తుగా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేసినట్టు సవాంగ్ చెప్పారు. చలో ఆత్మకూరుకు తన ఇంటి నుంచి బయల్దేరుతున్న తనను హౌస్ అరెస్ట్ చేయడం పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

home 120920219 3

తన రాజకీయ జీవితంలో, ఈ పరిస్థితులు చాలా దారుణమని, ఎన్నో పోరాటాలు చేసిన తనను, ఎన్నడూ లేనివిధంగా ఇలా గృహనిర్బంధం చేశారన్నారు. అయితే నిన్న జరిగిన చలో ఆత్మకూరు జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యింది. అన్ని జాతీయ చానల్స్ లో నిన్న మొత్తం ఇవే వార్తలు వచ్చాయి. చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చెయ్యటంతో, మరింత వేడి పెరిగింది. దీంతో కేంద్ర హోం శాఖ కూడా రంగంలోకి దిగింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆత్మకూరులో ఏమి జరుగుతోంది, మొత్తం వివరాలు ఇవ్వాలి అంటూ, డీజీపీని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆత్మకూరులోనే కాక, రాష్ట్రం మొత్తం శాంతి భద్రతల పై నివేదిక కోరామని కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఈ పరిణామం పై జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కేంద్రం జోక్యం చేసుకోవటంతో, డీజీపీ కూడా వాస్తవ పరిస్థితి చెప్పల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం ఏమి జరుగుతుందో.

Advertisements

Latest Articles

Most Read