కేంద్రం వార్నింగ్ ల ఫలితంతో, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఏకంగా ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగటం, కేంద్ర మంత్రి ఏకంగా జగన్ మోహన్ రెడ్డినే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పటంతో, రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలపై మొన్నటి వరకు మొండి పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలక దిగొచ్చింది. ఇదివరకు ప్రభుత్వంలో చేసుకున్న పీపీఏల జోలికి వెళ్లబోమని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఖరారు కాని ఒప్పందాలపైనే దృష్టి పెడతామని కేంద్రానికి రాసిన లేఖలో తెలిపింది. పాత ఒప్పందాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఏమైనా ఉంటే, వాటిని మాత్రమే సమీక్షిస్తామని కేంద్రానికి చెప్పింది. ఇక పై కొత్తగా ఒప్పందం చేసుకునే విద్యుత్ ఒప్పందాలలో కొత్త ధరలు నిర్ణయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్పింది.

ppa 11092019 2

ఇప్పటికే పీపీఏల పై ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. పవర్ ప్రాజెక్టుల పై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ రెండు రోజుల క్రిందటే విమర్శలు గుప్పించారు. సరైన ఆధారాలుంటే విద్యుత్ రంగంలో పెట్టుబడులు వస్తాయని, అలా కాకుండా గుడ్డిగా వెళ్తున్నారని అన్నారు. తాము చెప్పినా జగన్ వినడం లేదని, కేంద్రం తరుపున అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరో పక్క ఇప్పటికే 42 కంపెనీలు హైకోర్ట్ కు వెళ్ళాయి. ప్రభుత్వం తమను వేధిస్తుందని, ఇప్పటికే అయిపోయిన ఒప్పందాల గురించి, ఇబ్బంది పెడుతుంది అంటూ, హైకోర్ట్ కు వెళ్ళటంతో, హై కోర్ట్ కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.

 

ppa 11092019 3

మరో పక్క ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. అలాగే జపాన్ ప్రభుత్వం, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఘాటు లేఖ రాసింది. మీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల, మా పెట్టుబడిదారులు ఇబ్బంది పెడుతున్నారు, ఇలాగే కొనసాగితే మేము మీ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించే పరిస్థితి ఉంది అంటూ, లేఖ కూడా రాసింది. కేంద్రం ఎన్న సార్లు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమి అధికారం ఉండదు, అంతా ట్రిబ్యునల్ చూస్తుంది, అనవసరంగా అపోహలు వద్దు, ఇలా అయితే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎలాంటి పెట్టుబడులు రావు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల నుంచి చంద్రబాబుని ఎలా అయినా ఇరికించాలి అని తీవ్ర ప్రయత్నాలు చేసిన జగన్, ఎట్టకేలకు , ఏమి లేదు అని తేలటంతో, వెనక్కు తగ్గారు.

ఈ రోజు చలో ఆత్మకూరు పిలుపుతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామాల్లో ఉండనివ్వకుండా, వికృతంగా ప్రవర్తించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, గ్రామాల నుంచి తరిమేసిన వైసీపీ పై, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చలో ఆత్మకూరు నిర్వహించారు. ఈ క్రమంలో, చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఉదయం చంద్రబాబును కలిసేందుకు వస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకురు. వచ్చిన వారిని వచ్చినట్టు చంద్రబాబు నివాసం దగ్గరే అరెస్ట్ చేసి తరలించేసారు. ఇదే క్రమంలో, చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే అనితలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్ట్ చేసే ప్రయత్నం చెయ్యటంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాట మాట పెరిగింది.

nannapaneni 11092019 2

ఈ వాగ్వాదం జరిగిన క్రమంలో, టీడీపీ నేతలు తనను కులం పేరుతో దూషించారంటూ మహిళా ఎస్సై అనురాధ ఆరోపించారు. తరువాత నన్నపనేని రాజకుమారితో పాటు, మాజీ ఎమ్మెల్యే అనితను చేబ్రోలు పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. అయితే ఈ క్రమంలో వైసిపీ నేతలు, వాళ్ళ అనుకూల మీడియా, రాజకుమారి, మహిళా పోలీస్ ని కులం పేరుతొ దూషించారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. కాని అలనాటి వీడియో మాత్రం వెయ్యలేదు. వివాదం జరిగిన క్రమంలో మహిళా పోలీస్ ఆగ్రహం వ్యక్తం చేసిన మాటలు చూపించారు కాని, నన్నపనేని అన్న మాటలు ఎక్కడా వెయ్యలేదు. మహిళా పోలీస్ కూడా, ఎక్కడా కులం పేరుతొ దుషించినట్టు ఆ వీడియోలో లేదు. అయిన వైసీపీ ఇలా ప్రచారం చేసింది. దీంతో విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి కన్నీటి పర్యంతమయ్యారు.

nannapaneni 11092019 3

70 ఏళ్ళ వయస్సులో ఉన్న నన్ను, తమ అధినేత దగ్గరకు వెళ్తుంటే అరెస్ట్ చేసారని, అలా ఇబ్బంది పెట్టవద్దు ‘మీకు దండం పెడతాను.. నన్ను వదిలేయండి’ అని పోలీసులను వేడుకున్నా వదలలేదని అన్నారు. జగన్ ప్రభుత్వం తనను మానసిక ఒత్తిడికి గురిచేసి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయించిందని ఆమె సంచలన ఆరోపణ చేశారు. మహిళా పోలీసు తన పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తాను అవమానకరంగా మాట్లాడినట్లు నిరూపిస్తే ఆత్మహత్యకు సిద్ధమని ఆమె సవాల్ చేశారు. ఆమె ఏ కులమో తనకు ఎలా తెలుస్తుందని, ఆమె పోలీస్ ఉనిఫోరం లో ఉంటుంది కదా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం దళితులను వాడుకోవడం సిగ్గుచేటు అని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. జరగని విషయాన్ని పదే పదే చెబితే నిజం కాదన్నారు. తాను కూడా దళిత మహిళానేనని చెప్పారు. తాను గర్వంగా దళితురాలినని చెప్పుకుంటానన్నారు. మహిళా పోలీసు దళితురాలు అని ఎలా తెలుసుందన్నారు. మహిళా పోలీసును టీడీపీ నేతలు దూషించినట్లుగా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదని సూచించారు.

రాష్ట్రంలో రాజకీయం వేగంగా మారిపోతుంది. మొన్నటి దాక బీజేపీ, వైసీపీ భాయ్ భాయ్ అంటూ కలిసి తిరిగాయి. కలిసి పని చేసాయి. కలిసి చంద్రబాబుని దింపి, జగన్ మోహన్ రెడ్డిని ఎక్కించారు. ఇక విజయసాయి రెడ్డి గారు అయితే, ఢిల్లీలో చెయ్యని లాబాయింగ్ లేదు. ఎన్నికల ముందు వరకు, ఆయన ప్రతి రోజు ప్రధాని కార్యాలయంలో ఉంటున్నారు అంటూ వార్తల్లో వచ్చిన కధనాలు చూసాం. విజయసాయి రెడ్డి, మోడీ, అమిత్ షాలకు బాగా క్లోజ్ అయిపోయారు. జగన్ మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా, ఎన్నికల్లో సహకారం ఇచ్చారు. అయితే ఎన్నికలు అయిన తరువాత, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ప్రధాని మోడీ కూడా, హలో విజయ్ గారు అనేంత సన్నిహితం చూసాం. అయితే గత నెలా రెండు నెలలుగా, వాతావరణం మారిపోతూ వస్తుంది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, పోలవరం విషయంలో కేంద్రం, జగన్ ప్రభుత్వం పై,

vsreddy 10092019 2

తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో, విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విషయంలో మాకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయంటూ, వీళ్ళ తప్పులని, వాళ్ళ పై తోసేసే ప్రయత్నం చేసారు. అయితే, దీని పై కేంద్రం సీరియస్ అయ్యి, విజయసాయి రెడ్డిని పిలిచి చీవాట్లు పెట్టారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలోనే బీజేపీ నేతలు, విజయసాయి రెడ్డి పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి, సంచలనం రేపారు. విజయసాయిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డిని, ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతిని కోరారు బీజేపీ నేతలు.

vsreddy 10092019 3

జయాబచ్చన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రామకోటయ్య రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఆ పదవి లాభదాయక పదవుల కిందకు వస్తుందని భయపడి జీవోను రద్దు చేశారని అన్నారు. ఈసీ కూడా వెంటనే స్పందించాలని కోరారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా రామకోటయ్య తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ వంద రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేసిన ఘనత జగన్‌కే సొంతమవుతుందన్నారు. రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు 151 సీట్లను ఇస్తే.. ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక విధానంతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వైసీపీ వంద రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయటం పై డీజీపీ గౌతం సవాంగ్‌ మీడియాతో స్పందించారు. చంద్రబాబు గారిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో చెప్తూ ఆయన కారణాలను ఆయన వెల్లడించారు. ప్రభుత్వ విధానాల పై పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబుని అడ్డుకోలేదని చెప్తూనే, పల్నాడులో 144 సెక్షన్ ఉందని, అందుకే అడ్డుకున్నామని చెప్పారు. అక్కడ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి, అక్కడ 144 సెక్షన్ పెట్టమని, చంద్రబాబు అక్కడకు వెళ్తున్నారని తెలిసి, ముందస్తుగా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేసామని సవాంగ్‌ చెప్పారు. అయితే అక్కడ 144 సెక్షన్ పెట్టింది, మొహరం, గణేష్ నిమజ్జం కోసమని, పోలీస్ సర్కులర్ లో క్లియర్ గా ఉంది. కాని, ఇక్కడ డీజీపీ గారు మాత్రం, అక్కడ ఉద్రిక్తతలు ఉన్నాయని అంటున్నారు.

dgp 11092019 2

డీజీపీ గారు ఇలా అంటుంటే, హోం మంత్రి గారేమో, రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, పల్నాడు ఇంకా ప్రశాంతంగా ఉంది, అక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ పైడ్ ఆర్టిస్ట్ లు మాత్రమే హడావిడి చేస్తున్నారని తీసి పడేసారు. ఈ రోజు చంద్రబాబు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపు ఇవ్వటంతో, ఉదయం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారించి. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు బయల్దేరిన చంద్రబాబును పోలీసులు ఆయన ఇంటి వద్దే అడ్డుకున్నారు. గేటుకు తాళ్ళు కట్టి ఆయనను బయటకు వెళ్లనీయకుండా భారీగా పోలీసులు మోహరించారు. తనను నిర్బంధించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నిర్బంధాలతో తమ పోరాటాన్ని ఆపలేరని, చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్లి తీరుతామని అన్నారు. ఎన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేస్తారో చేసుకోండని అన్నారు.

dgp 11092019 3

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు పెరిగిపోతున్నాయని, టిడిపి ఆరోపిస్తుంది. ఇదేదో ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. చంద్రబాబు అక్కడకు రెండు నెలల క్రిందటే వెళ్లి, పోలీసులకు వార్నింగ్ ఇచ్చి వచ్చారు. అలాగే టిడిపి నేతలు, డీజీపీని కలిసారు. దాడులను ఆపమన్నారు. ప్రభుత్వానికి జరుగుతున్నని అన్నీ చెప్పారు. చివరకు అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు కూడా స్పందించక పోవటంతో, చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి, తెలుగుదేశం పార్టీ తరుపున పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి, పోలీసులకు మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చి, వీరిని సొంత ఊళ్ళకు తీసుకువెళ్ళమన్నారు. అప్పటికీ వారు స్పందించకపోవటంతో, చంద్రబాబు స్వయంగా వారిని తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుని, చలో ఆత్మకూరుకు పిలుపిచ్చారు.

Advertisements

Latest Articles

Most Read