ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వైసీపీ సోష‌ల్ మీడియా సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ కోసం ప‌నిచేసిన వారు చాలా మంది దూరం అయ్యారు. పేటీఎం పేమెంట్ల‌కీ లొంగ‌కుండా చాలా మంది మొఖం చాటేశారు. కొత్త‌గా ర‌క‌ర‌కాల ఆఫ‌ర్లు పెట్టి వైసీపీ సోష‌ల్ మీడియా సైన్యాన్ని రంగంలోకి దింపాల‌ని యోచిస్తోంది. కూప‌న్లు, పోస్టుకి పేటీఎం బేల‌న్స్ ఇలా ర‌క‌ర‌కాల ఆఫ‌ర్ల‌తో ఆక‌ట్టుకునే య‌త్నాలు ఆరంభించారు. వైసీపీ కోసం ప‌నిచేసే ల‌క్ష మందిని తెస్తామంటున్నారు వైసీపీ సోష‌ల్ మీడియా ఇన్చార్జి స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డి. మ‌రోవైపు టిడిపిపై అభిమానంతో స్వ‌చ్ఛందంగా ప‌నిచేస్తున్న‌వారిని కేసులు, అరెస్టుల పేరుతో వేధించి భ‌య‌పెట్టాల‌ని చూస్తున్నారు. కేవ‌లం ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించార‌నే కార‌ణంగా నిన్న గుంటూరులో క‌ర‌ణం ప్ర‌భాక‌ర్‌ని, నేడు తెనాలిలో వేమూరు మదన్ కు నోటీసులు ఇచ్చారు. వీరిద్ద‌రూ ఎటువంటి ఫేక్, మార్ఫింగ్, వ‌ల్గ‌ర్ వ్యాఖ్య‌లు చేయ‌లేదు. పోస్టులు పెట్ట‌లేదు. కేవ‌లం ప్ర‌భుత్వం చేత‌కానిత‌నాన్ని ప్ర‌శ్నించార‌నే వీరి ఇళ్ల‌పైకి పులివెందుల పోలీసులు వ‌చ్చారు. ఇది టిడిపి సోష‌ల్ మీడియా సైనికుల్ని భ‌య‌పెట్టే ప్ర‌య‌త్న‌మేనంటున్నారు టిడిపి నేత‌లు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి అయిన పోల‌వ‌రాన్ని ప్ర‌శ్నార్థ‌కం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. గ‌ద్దెనెక్కిన కొద్ది రోజుల్లోనే రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటూ న‌వ‌యుగ‌ని త‌రిమేసి త‌న బినామీ అయిన మేఘా సంస్థ‌ని దింపారు. అప్ప‌టి నుంచి పోల‌వ‌రంలో ప్ర‌గ‌తి ఒక అడుగు ముందుకు మూడడుగుల వెన‌క్కి చందంగా ఉంది. టిడిపి హ‌యాంలో 70 శాతం పూర్త‌యిన పోల‌వ‌రం నాలుగేళ్ల వైసీపీ పాల‌న‌లో 7 శాతం కూడా పూర్తి కాలేదు. పోల‌వ‌రం 2020లోనే పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించిన వైసీపీ ప్ర‌భుత్వం..ఇప్పుడు 2025 అంటోంది. అది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇటువంటి ప‌రిస్థితుల్లో పోల‌వ‌రం క‌మీష‌న్ల వ‌రంగా పొందిన మేఘా, కొత్త స్కెచ్ వేస్తోంది. విశాఖ‌లో సీఎం రుషికొండ‌ని కొట్టేస్తే, తామేమి త‌క్కువ తిన్నామంటూ పోల‌వ‌రం ప‌క్క కొండ‌పై మేఘా క‌న్నేసింది. దీనికి ఓ అందమైన ప్ర‌తిపాద‌న కూడా సిద్ధం చేసింది. పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్ కట్టేందుకు త‌మ‌కి ఆ కొండ ఇచ్చేయాల‌ని మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సీఎం జ‌గ‌న్ రెడ్డికి ప్ర‌తిపాదించారు. ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే ఫైవ్ స్టార్‌ హోటల్‌ నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రిని కోరారు. ఎప్పటి నుంచో తాము కొండపై స్థలం కోరుతున్నామని మేఘా కృష్ణారెడ్డి అన్నారంటే, పోల‌వ‌రం కంటే ముందు ఈ కొండ‌ని కొట్టేసేందుకు ప్లాన్ చేశార‌నేది స్ప‌ష్టం అవుతోంది. అయితే మేఘా అడిగితే వేల‌కోట్ల పోల‌వ‌రం ప్రాజెక్టునే ధారాద‌త్తం చేసిన సీఎం ఈ కొండ‌ని ఇవ్వ‌కుండా ఊరుకుంటాడా అనే రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. మేఘా కృష్ణారెడ్డి అడిగిన  కొండ ఇచ్చేందుకు ఏర్పాట్లు చూడాల‌ని అధికారుల‌ని సీఎం ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

ప‌ట్టు విడ‌వ‌కుండా పోరాడేవారిని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు అంటారు. న్యాయం కోసం, త‌న తండ్రి హంత‌కుల‌ని చ‌ట్టం ముందుకు నిల‌బెట్ట‌డానికి ఒక్క మ‌హిళ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కురాలిలా పోరాడుతోంది సునీతారెడ్డి. అన్న‌లే గ‌న్‌లు ఎక్కుపెట్టి బెదిరిస్తున్నా, కాపాడాల్సిన వారే కాటేయ‌జూస్తున్నా వెన‌క్కి త‌గ్గ‌ని ధీర వ‌నిత వైఎస్ సునీతారెడ్డి మ‌రో సంచ‌ల‌న పిటిష‌న్ సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసింది. పులివెందుల పోలీస్ స్టేష‌న్ నుంచి సీబీఐ దాకా నిందితుల్ని కాపాడుకుంటూ, అరెస్టు కాకుండా మేనేజ్ చేస్తూ వ‌స్తున్న అన్న‌పై న్యాయ‌పోరాటానికి అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌లుపు మ‌రోసారి త‌ట్టింది. త‌న తండ్రి వివేకానంద‌రెడ్డి హత్య కేసులో క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో  సునీతారెడ్డి పిటిష‌న్ వేసింది. మే 31న అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు లో సవాల్ చేసింది. తన తండ్రి హత్య కేసులో అవినాశ్ రెడ్డిపై మోపినవి కీలక అభియోగాలని, హైకోర్టు తీర్పులో లోపలున్నాయన్న సునీతారెడ్డి పిటిష‌న్‌లో పేర్కొన్నారు. సీబీఐ అభియోగాలు హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని కోర్టుకి విన్న‌వించింది. రేపు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.  సుప్రీంకోర్టుకి సునీతారెడ్డి చేర‌డంతో మ‌ళ్లీ లాబీయిస్టు విజ‌య‌కుమార్ ద‌గ్గ‌ర‌కి వైఎస్ జ‌గ‌న్ రెడ్డి టీము భేటీ అయ్యే అవ‌కాశాలున్నాయి.

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కే ముఖ్య‌మంత్రి మొగ్గుచూపుతున్నార‌ని అనుకూల‌, ప్ర‌తికూల మీడియా కోడై కూస్తోంది. సీఎం నిర్ణ‌యాలు కూడా ఆ దిశ‌గానే తీసుకోవ‌డం చ‌ర్చ‌లు ముంద‌స్తు చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రాంతాల‌కు అతీతంగా, కుల‌మ‌తాల ప్ర‌స్తావ‌న లేకుండా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై పీక‌ల్లోతు కోపంతో ఉన్నారు. ఏ తాయిలాలు ప‌నిచేసేలా లేవు. ముంద‌స్తు వ‌చ్చినా, షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగినా వైసీపీ దారుణ ప‌రాజ‌యం ఖాయ‌మ‌ని ఆ పార్టీలో సీనియ‌ర్ల‌కి తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్యం. ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్ర‌త‌కి సంకేతంగా పోల్ మేనేజ్మెంట్, డ‌బ్బు పంపిణీ, దొంగ ఓట‌ర్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మూడు ప్రాంతాల్లో వైసీపీని కాపాడ‌లేక‌పోయాయి. ఈ స్థాయి జ‌నాగ్ర‌హంలో ఇప్పుడు ఎన్నిక‌ల‌కి వెళ్లినా, షెడ్యూల్ ప్ర‌కారం వెళ్లినా ఓట‌మి త‌ప్ప‌న‌ప్పుడు ముందుగా ఎందుకు అధికారాన్ని వ‌దులుకోవాల‌నే ఆలోచ‌న వైసీపీ పెద్ద‌ల్లో మొద‌లైంది. సాధ్య‌మైనంత వ‌ర‌కూ అధికారం అనుభ‌వించి, అనుయాయుల‌కి మేలు చేకూర్చే అవ‌కాశం వ‌దులుకోవ‌డం ఎందుకు అనే ప్ర‌తిపాద‌న‌కే అంద‌రూ ఓకే అన‌డంతో ఇక ముంద‌స్తుకి వెళ్లే ఆలోచ‌న‌ని విర‌మించుకున్నార‌ని స‌మాచారం. దీనిని ధ్రువీక‌రిస్తూ ఇటీవ‌లే కేబినెట్‌లో ప‌వ‌ర్ ఫుల్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జ‌రుగుతాయ‌ని పెద్దిరెడ్డి చెప్ప‌డంతో ముంద‌స్తుకి వెళ్లే విష‌యంలో జ‌గ‌న్ రెడ్డి వెన‌క‌డుగు వేశార‌ని తేలిపోయింది.

Advertisements

Latest Articles

Most Read