చంద్రబాబు తన స్టైల్ మార్చేశారు. పంచ్కి పంచ్. యాక్షన్కి రియాక్షన్. కౌంటర్ వేస్తే ఎన్ కౌంటర్ ఇదే స్టైల్ ఫాలో అవుతూ కేడర్లో జోష్ నింపుతున్నారు. టిడిపి సోషల్ మీడియా సైన్యంలో ఉత్సాహం నింపుతున్నారు. చంద్రబాబు ప్రెస్మీట్ మాట్లాడితే గణాంకాలు, తన హయాంలో సాధించిన నిధులు, తెచ్చిన ప్రాజెక్టులు, ఇప్పుడు వెళ్లిపోయిన ప్రాజెక్టులు ఇలా పద్ధతిగా చెప్పుకుంటూ పోతారు. ఇవి ప్రధాన మీడియాలో వార్తలుగా పనికొస్తాయి. సోషల్మీడియాలో ఉండాల్సిన విరుపు-మెరుపు బాబు స్పీచుల్లో దొరికేవి కావు. సంప్రదాయబద్ధమైన శైలి భాష, భావం వల్ల సోషల్ మీడియాలో సీబీఎన్ డైలాగ్స్ పెద్దగా వైరల్ కావు. ఇటీవల ట్రెండ్ మార్చిన బాబు సెటైర్లు, పంచ్ డైలాగులతో చెలరేగిపోతున్నారు. టిడిపి సోషల్ మీడియాకి మంచి కంటెంట్ అందిస్తున్నారు. సీబీఎన్ స్పీడు చూస్తే సోషల్మీడియాలో ట్రోలర్స్ కంటే దారుణంగా జగన్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తున్నారు. టిడిపి మేనిఫెస్టో గురించి జగన్ మాట్లాడిన దానిపై స్పందిస్తూ.. జగన్ ప్రపంచ మేధావి అనీ, వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీలో చదివాడు, కానీ ఆ వర్సిటీ ఎక్కడో చెప్పలేడంటూ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. జగన్ గొప్ప సంఘ సంస్కర్త అనీ, జగన్ సంఘ సంస్కరణ ఏంటో తెలుసా బాబాయ్ని గొడ్డలితో లేపేయడం అని బాబు వేసిన చురకలు సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ష్ అయి తెగ తిరుగుతున్నాయి. 2 వేల నోటు రద్దు ఐడియా తనకు రానిది, చంద్రబాబుకి ఎలా వచ్చిందని జగన్ అంటున్నాడని..ఆయనకి 2 వేల రద్దు చేయాలనే ఐడియా రాదు కానీ, 2 వేల దొంగ నోట్లు ప్రింట్ చేయడం వచ్చని ఒక రేంజులో ఎద్దేవ చేశారు. టిడిపి మేనిఫెస్టోని జగన్ పులిహోర, బిస్బిల్లా బాత్ అంటూ వెటకారం చేశారని..పులిహోర రుచి, బిసిబిల్లా బాత్ పోషకాలుంటాయని..అంటే జగన్ టిడిపి మేనిఫెస్టో బాగుందని అంటున్నారని చెణుకులు విసిరారు చంద్రబాబు. ప్రసంగం మొత్తం జగన్ రెడ్డిపై వ్యంగ్యబాణాలు సంధించేందుకు చక్కగా వాడుకుని బాబు ట్రోలర్లు కంటే ఎక్కువగా జగన్ ని ర్యాగింగ్ చేశారు.
news
ఏబీఎన్ ఆర్కే కొత్త పలుకు మరోసారి నిజమైంది
అంబ పలుకు..ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ పలుకు అంటున్నారు తెలుగు ప్రజలు. రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారు న్యూస్ పేపర్ చదవగలిగే వారు రాధాకృష్ణ పలుకు తప్పనిసరిగా చదువుతారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారం వారం తన పత్రికలోనూ, చానల్లోనూ వినిపించే కొత్త పలుకు ఇప్పుడు అత్యంత విశ్వసనీయమైనది నిలిచింది. ఆంధ్రజ్యోతి అంటే అక్కసు వెళ్లగక్కేవారు సైతం ఆర్కే కొత్త పలుకుకి అభిమానులైపోతున్నారు. ఆయన చెప్పినది ఏ ఒక్కటీ తప్పుకాలేదు. రాసిన ప్రతీది అక్షరసత్యమైంది. మే 7వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో అరబిందో శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్గా మార్చేందుకు జగన్ రెడ్డి ఒప్పుకున్నారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. సరిగ్గా నెలరోజులు తిరగకముందే అక్షరం పొల్లు పోకుండా ఏబీఎన్ ఆర్కే చెప్పినట్టే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిపోయారు. బాబాయ్ హత్యకేసులో అడ్డంగా సీబీఐకి బుక్కయిన కడప ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు తానూ ఈ కేసు నుంచి బయటపడటానికి ఏం చేయాలో చెప్పాలంటూ జగన్ రెడ్డి కేంద్రంలో పెద్ద తలకాయ కాళ్లపై పడ్డారని, మీరేమి చెప్పినా చేస్తానని తన తలని ఆ పెద్దకి అప్పగించేశారని సమాచారం. తన విధేయత, ఇప్పటివరకూ చేసిన సాయం గుర్తుంచుకుని సీబీఐ కేసునించి తమ్ముడిని, తనని బయటపడేస్తే చాలు విశ్వాసిగా పడి ఉంటానని సరెండర్ అయిపోయాడు జగన్. ఇదే విషయాన్ని ఆర్కే తన కొత్త పలుకులో రాశారు. ఆయన రాసి నెలరోజులు కాలేదు. సీబీఐ అవినాష్రెడ్డిని అరెస్టు చేయకుండా వెసులుబాట్లు ఇస్తూ, ముందస్తు బెయిల్ వచ్చేందుకు కావాల్సిన సమయం ఇచ్చిందనే ఆరోపణలున్నాయి. అటు అవినాష్ రెడ్డికి రిలీఫ్ లభించగానే ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారుతున్నట్టు ప్రకటించారు. అటు అవినాష్ రెడ్డిని బయటపడేసేందుకు విజయసాయిరెడ్డి అల్లుడి అన్నని లిక్కర్ స్కాములో బలిపశువుని చేయడానికి అందరినీ ఒప్పించుకున్నారని ప్రచారం సాగుతోంది. తాను సేఫ్ అనీ, సాయిరెడ్డి ఆయన కుటుంబం ఆ లిక్కర్ కేసునించి బయటపడే దారి వారికి వారే చూసుకుంటారనే ధోరణిలో జగన్ రెడ్డి ఉన్నారని సమాచారం.
జగన్ కు కలిసి షాక్ ఇవ్వటానికి రెడీ అవుతున్న, షర్మిల, సునీత
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా బీజేపీ మనిషి అని తేలిపోయింది. బీజేపీ కోసం ఏం చేయడానికైనా వైకాపా రెడీ అయ్యింది. వైసీపీ నేతల్ని కేసుల్నించి కాపాడటం, అప్పులు ఇప్పించడం వంటి బాధ్యతలు కేంద్రంలో పెద్దలు చూసుకుంటున్నారు. వైఎస్ జగన్ రెడ్డి బీజేపీ అనుబంధం అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ కి చాలా ప్రతిబంధకంగా మారింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా బీజేపీ పోల్ మేనేజ్మెంటు కోసం ఏపీ నుంచి వైఎస్ జగన్ రెడ్డి నిధులు సర్దుతున్నారని కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. వైకాపా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని, ఏపీలో వైసీపీ ఓటుబ్యాంకు క్యాప్చర్ చేసేందుకు కాంగ్రెస్కి అనువైన పరిస్థితులున్నాయని హస్తం పెద్దల ఆలోచన. ఈ దిశగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ని గద్దెనెక్కించిన డీకే శివకుమార్ని ఏపీ-తెలంగాణలో హస్తం హవా సాగించేలా పావులు కదపాలని బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నా..వచ్చే ఎన్నికల నాటికి ఏపీ కాంగ్రెస్కి షర్మిలని పెద్ద దిక్కుగా పెట్టి వైసీపీ ప్లేసులోకి రావాలని ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు షర్మిల, ఇటు సునీత ఇద్దరి చెల్లెళ్లను చేరదీసి కాంగ్రెస్లో కీలకపదవులు కట్టబెట్టి బీజేపీ పావుగా వాడుతోన్న అన్న జగన్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహం దిశగా అడుగులు పడుతున్నాయని డీకే శివకుమార్ ఎత్తుగడలు స్పష్టం చేస్తున్నాయి
కడప గడపల్లో అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ నినదించిన లోకేష్
బాబాయ్ని చంపాం..బెయిల్ తెచ్చుకున్నామని సంబరాలు చేసుకుంటున్న అబ్బాయిలకి నారా లోకేష్ చుక్కలు చూపిస్తున్నాడు. సొంత బాబాయ్ని చంపేసి, నారాసుర రక్తచరిత్ర అంటూ తమకి రక్తం అంటించే కుతంత్రాలని అప్పట్లోనే ఎండగట్టిన నారా లోకేష్ తాజాగా తన యువగళం పాదయాత్ర వేదికగా అబ్బాయిల రక్తచరిత్రని కడప గడపలకి తీసుకెళుతున్నాడు. ప్రొద్దుటూరు పాదయాత్రలో హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు టిడిపి కేడర్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిఎస్పీ వచ్చి ప్లకార్డులు పట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎందుకు అని నిలదీసిన నారా లోకేష్ తో డిఎస్పీ వాగ్వాదానికి దిగారు. దీంతో అబ్బాయిలే బాబాయ్ని చంపారనే ప్లకార్డులు లోకేష్ పట్టుకుని మరీ చూపించారు. హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్ ని లేపేసింది ఎవరు అంటూ ప్రజలని అడుగుతుంటే, అబ్బాయిలే చంపేశారనంటూ జనం రియాక్షన్స్తో యువగళం దద్దరిల్లిపోయింది. అదే ప్రొద్దుటూరులో వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని వైకాపా ఉత్సవాలు చేసింది. అదే ప్రొద్దుటూరులో బాబాయ్ని చంపింది ఎవరంటూ జనం నుంచే అబ్బాయిలే అని సమాధానంతో కడప గడపల్లో అబ్బాయిల నేరచరిత్రని బట్టబయలు చేయడంలో లోకేష్ మొండిగా మరో అడుగు ముందుకేశాడు.