దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ఆపరేషన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తర భారతం అంతటా బీజేపీ విస్తరించింది. ఈశాన్య భరతం, పశ్చిమ, మధ్య భారతంలో కూడా బీజేపీ పార్టీ నిలిచింది. ఇక మిగిలింది దక్షిణ భారతం. ఇందులో కర్ణాటక మినహా, బీజేపీకి ఎక్కడా బలం లేదు. తెలంగాణాలో కొద్దిగా ఉంది. అయితే వీటిని చూపిస్తూ, మేము మీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటూ, ప్రచారం మొదలు పెట్టారు. ఆ నాయకుడు వస్తున్నాడు, ఈ నాయకుడు వస్తున్నాడు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా, తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను లాక్కుని, అప్పటి నుంచి నేతల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చెప్పుకోతగ్గ నేత ఎవరూ బీజేపీ పార్టీలో చేరలేదు.

bjp 199072019 1

అయినా సరే, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మాత్రం హడావిడి ఆపలేదు. ఇప్పుడు గవర్నర్ ని మార్చటం, ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతను గవర్నర్ గా వెయ్యటంతో, బీజేపీ తన లక్ష్యం ఏంటో చెప్పకనే చెప్పింది. అయితే మొన్నటి దాక తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నాం, వారిని మూసేస్తున్నాం, చంద్రబాబు విదేశాల నుంచి వచ్చే లోపు, పార్టీ అయిపోతుంది అని ప్రకటించిన బీజేపీ నేతలు, లంకా దినకర్ లాంటి స్పోకస్ పర్సన్ ని మాత్రమే తీసుకోగలిగారు. దీంతో తెలుగుదేశం పార్టీ పేరు రోజు చెప్తే ప్రజలు నమ్మటం లేదు అనుకున్నారో ఏమో, ఇప్పుడు రూటు మార్చి కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్తున్నారు. వీరు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కాని, బీజేపీ హడావడి మాత్రం మాములుగా లేదు.

bjp 199072019 1

ఈ రోజు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, బాంబు పేల్చారు. ఎవరూ ఊహించని వ్యక్తితో బీజేపీ టచ్ లో ఉందని, అయానే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అని చెప్పారు. అంతే కాదు, మొన్నటి దాక, ప్రస్తుతం మంత్రులగా ఉన్న, బొత్స సత్యనారాయణ, ధర్మాన కూడా మాతో టచ్ లో ఉన్నారని మధావ్ అన్నారు. ఆగష్టు తరువాత ఏపి రాజకీయాలు మొత్తం మారిపోతాయని అన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, కాకపోతే పార్టీ మారగానే అనర్హత వేటు వేస్తాం అని జగన్ చెప్పటంతో, వారిని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాం అని అన్నారు. మొత్తానికి అన్ని పార్టీల నేటు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమా పార్టీలో చేరిపోతున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇంతకీ మొన్న ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పోటీ పడిందో తెలుసా ?నోటా తో పోటీ పడ్డారు. చివరకు కాంగ్రెస్ కు కూడా నోటా కంటే ఎక్కువ ఓట్లు వస్తే, నోటా కంటే తక్కువ ఓట్లతో బీజేపీ ఉంది.

వైసిపీ ప్రభుత్వం వచ్చిన రెండు నెలలుగా రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో, ఇద్దరిని చంపటమే కాకుండా, ఆస్థులు ధ్వంసం చెయ్యటం, చీని చెట్లు నరకటం వంటివి చేస్తూ, ప్రత్యర్ధులను భయపెడుతున్నారు. చంద్రబాబు కూడా 15 రోజుల క్రిందట తాడిపత్రిలో పర్యటించి, చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ నేపధ్యంలో, అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ కూడా బాధితులుగా ఉన్నా, ఇప్పటి వరకూ భరిస్తూ వచ్చారు. ఇక మీదట చూస్తూ ఊరుకోమని, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా తాడిపత్రిలో, వైసీపీ ఎమ్మె ల్యే పెద్దారెడ్డి ఆగడాలు రోజు రోజుకీ పెరిగి పోతున్నాయని, రాజకీయ కక్ష సాధింపులే కాకుండా, అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

jc 19072019 2

తాడిపత్రిలో పరిశ్రమలు పెట్టిన వారిని ఇబ్బంది పెడుతున్నారని, తాడిపత్రి అభివృద్ధి చెందింది అంటే, పరిశ్రమల వల్లే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. వైసీపీ ఎమ్మె ల్యే పెద్దారెడ్డి తాడిపత్రి ప్రాంతంలోని, అర్జాస్‌ స్టీల్‌ప్లాంట్‌, సాగర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ, పెన్నాసిమెంట్‌ ఫ్యాక్టరీ, అలా్ట్రటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీల్లోని లారీల ట్రాన్స్‌పోర్టులను కమిషన్ కోసం బెదిరిస్తున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని అన్నారు. పరిశ్రమల పై దాడులు చేసి,వ్ ఆరిని బెదిరిస్తే , ఇక నుంచి చూస్తూ ఊరుకోమని అన్నారు. రెండు నెలలుగా అన్నీ భరిస్తున్నాం అని, పధ్ధతి మార్చుకుంటారు అని చూసామని, ఇక మాకు ఓపిక లేదు, తాడిపత్రికి అన్యాయం చెయ్యాలని చూస్తే, కుదరదని అన్నారు. మీ పై ఎవరైనా ఎదురు మాట్లాడితే, అక్రమ కేసులు పెట్టి, లోపల వేయిస్తున్నారని, ఇలాంటి చర్యలకు ఎవరూ భయపడరని అన్నారు.

jc 19072019 3

మీరు సంపాదించుకోవటానికి రాజకీయాల్లోకి వచ్చారు, ఇద్దరు కొడుకుల చేత కంపెనీలు పెట్టించావ్, సంపాదించుకొండి, కాని వేరే పరిశ్రమల జోలికి వెళ్లి దందాలు చేస్తే మాత్రం ఊరుకోనని హెచ్చరించారు. గతంలో తాడిపత్రి పట్టణంలో, ప్రతి చికెన్ షాప్, కిలో 140 రూపాయలకు అమ్మాలని సూచిస్తే, అందరూ అలాగే అమ్మారని, అప్పుడు పెద్దారెడ్డి, కిలోకి 20 రూపాయలు నాకు కమిషన్ ఉందని ఆరోపించారని, ఇప్పుడు కిలో చికెన్ 200కు అమ్ముతున్నారని, అంటే, పెద్దారెడ్డికి, కిలో 80 రూపాయలకు కమిషన్ వస్తుందా అని ప్రశ్నించారు. నీ చెంచాలను అడ్డు పెట్టుకుని, తమ పై ఏవో ఆరోపణలు చేస్తే, మేము ఏమి బెదిరిపోమని మాజీ ఎమ్మెల్యే జేసీప్ర భాకర్‌రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యి, ఈ రోజుకి ఏడు రోజులు అయ్యింది. ఈ రోజు కూడా సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలవరం పై తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నకు, ఇరిగేషన్ మంత్రి అనిల్ సమాధానం చెప్తూ, వాళ్ళు చేసేది ఏంటో చెప్పకుండా, చంద్రబాబు ఇలా చేసారు, అలా చేసారు అని చెప్పుకొచ్చారు. మొదటి మూడు ఏళ్ళు పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు అసలు పట్టించుకోలేదని, చివరి రెండు సంవత్సరాలు ఎదో షో చేసారని అనిల్ అన్నారు. పునరావాసం విషయంలో అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏమి పని చెయ్యలేదని, వాళ్ళను మోసం చేసారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ లో అప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిన పని తరువాత, చంద్రబాబు చేసింది ఏమి లేదని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారని అన్నారు.

assemby 19072019 2

పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికైనా మేమే పూర్తీ చేస్తాం అని అనిల్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభం జరుగుతుందని అన్నారు. దీని పై తెలుగుదేశం సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమాధానం చెప్తూ ఉండగా, వైసిపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రతి రోజు క్వస్చిన్ హావర్ వేస్ట్ చేస్తున్నారని, స్పీకర్ తెలుగుదేశం సభ్యుల పై అసహనం వ్యక్తం చేసారు. ఈ దశలో జగన్ మోహన్ రెడ్డి మైక్ అందుకుని, గత మూడు రోజులుగా పోలవరం పై కావాలని చర్చ చేసే విధంగా తెలుగుదేశం సభ్యులు చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఇటీవలే సందర్శించాను అని, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోవటానికి కారణం చంద్రబాబు చేసిన నిర్వాకాలే అంటూ, చెప్పుకొచ్చారు. మేము నవంబర్ 1 నుంచి పోలవరం ప్రాజెక్ట్ మొదలు పెడతామని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఒక పేద స్కాం అని, దానిలో చంద్రబాబు విపరీతంగా సంపాదించారని జగన్ అన్నారు.

assemby 19072019 3

దీని పై ఒక కమిటీ వేశామని, మరో 15 రోజుల్లో ఆ కమిటీ చంద్రబాబు ఎంత దోచింది చెప్తుందని, అప్పుడు చంద్రబాబు సంగతి చూస్తాం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఈ విషయం చెప్తుంటే, చంద్రబాబు ఒక నవ్వు నవ్వి, జగన్ అజ్ఞానాన్ని తెలియపరిచారు. నిజానికి పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రతి పైసా కేంద్రం విడుదల చేస్తుంది. గతంలో చంద్రబాబుని ఆ డబ్బులు ఇవ్వటానికి కేంద్రం ఎన్ని కమిటీలు వేసి, పనులు అన్నీ చూసి , డబ్బులు వదిలిందో చూసాం. అంతే కాదు, రెండు రోజుల క్రితం రాజ్యసభ సాక్షిగా, ఇదే విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు, పోలవరంలో అవినీతికి ఆస్కారం లేదని, సిబిఐ విచారణ అవసరమే లేదని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏ టెండర్ అయినా, ఏ పని అయినా కేంద్రం ఆధీనంలో జరుగుతుందనే విషయం కూడా తెలియకుండా, జగన్ ఓవర్ గా రియాక్ట్ అవ్వటం చూసి, చంద్రబాబు నవ్వుకుంటూ, నువ్వు ఇంత అజ్ఞానివి ఏంటి అన్నట్టు చూసారు. నిన్నటికి నిన్న కూడా కరెంట్ ఒప్పందులు విషయంలో, ప్రభుత్వానికి ట్రిబ్యునల్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుని దించి, వైసిపీని ఎక్కించటంలో బీజేపీ పాత్ర అందరికీ తెలిసిందే. అయితే ఫలితాలు వచ్చి రెండు నెలలు అయ్యిందో లేదో, బీజేపీ తన ప్లాన్ మొదలు పెట్టింది. అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ, ఏపి పై కూడా ఫోకస్ పెట్టింది. చంద్రబాబుని ఎలాగూ తప్పించాం, ఘోర ఓటమి అయ్యేలా చూసాం, ఇక చంద్రబాబు పార్టీలో ఉన్న స్క్రాప్ అంతా చేర్చుకుని బలపదిపోతున్నాం అని భ్రమల్లో ఉన్న బీజేపీ, ఇప్పుడు వైసిపీ పై తన ఫోకస్ పెట్టింది. గత పది రోజులుగా, కొన్ని అంశాల పై సుతి మెత్తగా వైసిపీ ప్రభుత్వాన్ని, బీజేపీ విమర్శిస్తుంది. అయితే, ఇటు వైసిపీ నుంచి మాత్రం, ఎవరూ బీజేపీ పై విమర్శలు చేసే సాహసం చెయ్యటం లేదు. కారణం ఏంటో అందరికీ తెలుసు అనుకోండి.

bjp 19072019 2

అయితే ఈ క్రమంలో, జగన్ ప్రభుత్వం, వైజాగ్ లో ఇచ్చిన ఉత్తర్వులు, బీజేపీకి మంచి పాయింట్ తెచ్చి పెట్టాయి. వైజాగ్ లో, అన్ని చర్చిలకు సెక్యూరిటీ పెంచాలాని, నిరంతరం నిఘా ఉంచలాని, క్రైస్తవుల పై దాడులు జరగకుండా చూడాలని, వైజాగ్ పోలీస్ కమీషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, సామాన్య ప్రజలు మాత్రం, ఈ ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారో అని ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే, ఎప్పుడూ వైజాగ్ లో మత ఘర్షణలు జరిగింది లేదు. ఆ మాటకు వస్తే, మన రాష్ట్రంలోనే గత కొన్నేళ్లుగా మాట ఘర్షణలు అనే మాటే లేదు. అయితే, ఈ ఉత్తర్వులు మాత్రం బీజేపీకి అంది వచ్చిన అవకాసం లాగా అయ్యింది. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చెయ్యటం, బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వుల పై బీజేపీ ఆందోళనకు రెడీ అయ్యింది.

bjp 19072019 3

జగన్ మోహన్ రెడ్డి ఒక మతానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఆరోపించారు. ఇస్తే అన్ని దేవాలయాలకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలని, ఇలా ఒక్క చర్చిలకు మాత్రమే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ, జగన్ ప్రభుత్వం ఇలా వ్యవహరించకూడదు అని అన్నారు. ఇలాంటి చర్యల వల్లే ఘర్షణలు జరుగుతాయని అన్నారు. బీజేపీ ధార్మిక సెల్‌ మరింత ముందుకు వెళ్లి, జగన్ ప్రభుత్వానికి 48 గంటలు టైం ఇచ్చింది. ఈ ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని కోరింది. మత మార్పిడులు చేస్తున్న పాస్టర్ లను అడ్డుకుంటున్నామనే , ఈ ఉత్తర్వులు ఇచ్చారని మండి పడ్డారు. రాష్ట్రమంతా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వటానికి రెడీ అయ్యారని అన్నారు. తాను నమ్మే మతాన్ని అనుసరించేవారికే రక్షణ కల్పిస్తామని జగన్ చెప్పకనే చెప్తున్నారని అన్నారు. ఈ ఉత్తర్వులు రద్దు చెయ్యకపోతే, రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read