మహానాడులో తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించనున్నారు. ఇది ఏపీలో పెను సంచలనానికి దారి తీయనుంది. మేనిఫెస్టో ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో పాదయాత్రలో నారా లోకేష్ హింట్ ఇచ్చారు. మహానాడులో యువతకి చంద్రబాబు యువతకి అద్భుతమైన వరం ప్రకటించబోతున్నారని లోకేష్ చెప్పకనే చెప్పారు. ఈ సారి టిడిపి మేనిఫెస్టో మహిళలు, రైతులు, యువతకు ప్రయోజనం చేకూర్చేలా ఉండబోతోందని సమాచారం. పూర్తిస్థాయి మేనిఫెస్టో మహానాడులో ప్రకటించకపోయినా, ప్రధానమైన హామీలు మాత్రం అధినేత ప్రకటిస్తారని తెలుస్తోంది. టిడిపి ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తికావడం, ఇదే ఏడాది వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం కావడంతో తెలుగుదేశం పార్టీ పండగ మహానాడుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకటించే మేనిఫెస్టో ప్రధాన అంశాలపై పూర్తి కసరత్తు జరిగిందని తెలుస్తోంది. అధినేత చంద్రబాబు వరాల జల్లు కురిపించేలా ప్రధాన హామీలు వేదికపై నుంచి ఎనౌన్స్ చేయనున్నారు. మహానాడులో 25కి పైగా తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 15, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 6 తీర్మానాలు, 4 ఉమ్మడి తీర్మానాలు ఉంటాయి. ఈ నెల 27న ప్రతినిధుల సభలో తీర్మానాలు ప్రవేశపెడతారు. 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా భారీ బహిరంగ సభకి 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ బహిరంగసభలోనే మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను ప్రకటించనున్నారు.
news
గంగవ్వ ఎపిసోడ్ వెనక జగన్ మీడియా... ఇన్ని కుట్రలా ?
వైసీపీకి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా వేల మంది సైన్యం ఉంది. దీనికి తోడు ఆర్జీవీ, పోసాని, శ్రీరెడ్డి వంటి వారు వైసీపీ బూతు ఎటాక్స్కి అదనపు బలం. ఇన్ని ఉన్నా ప్రజావ్యతిరేకత తీవ్రరూపు దాల్చింది. వైసీపీ పెయిడ్, పేటీఎం ప్రచారాలని జనం నమ్మడంలేదు. సాక్షిలో స్టోరీ వేస్తే వైసీపీ వాళ్లే చూడటంలేదు. దీంతో వైసీపీకి చెందిన బ్లూ చానల్స్గా ముద్రపడిన ఎన్టీవీ, టీవీ9 వంటివి టిడిపిని బద్నాం చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాయి. జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసం ఎన్టీవీ తన తోక చానల్ వనిత టివిలో గంగవ్వతో ఓ ప్రోగ్రాం చేశారు. ఎన్టీవీ రాసిన స్క్రిప్టు ప్రకారం చంద్రబాబు, లోకేష్ ఫొటోలు గంగవ్వకి చూపించి జాతకం చెప్పమనడం, జాతకాలను తాను చెప్పలేననడం, మళ్లీ రెట్టించి అడిగి ''చంద్రబాబుకు గ్రహణం పట్టింది'' అని గంగవ్వతో చెప్పించడం అనే ఓ ప్రోగ్రాం ఎన్టీవీ చేసింది. ఇది ఎవరూ చూడకపోవడం వైసీపీ-ఎన్టీవీకి ఉన్న ప్రజాదరణని చాటిచెబుతోంది. అయితే టిడిపి కేడర్ చాలా రోజుల క్రితం చేసిన ఈ పెయిడ్ స్క్రిప్టెడ్ ప్రోగ్రాంని ఇప్పుడు చూసి చాలా బాధపడ్డారు. అమాయకమైన గంగవ్వ ఇలా చేసి ఉండదని అందరూ అనుమానించారు. గంగవ్వకి టిడిపి అభిమానులు ఫోన్లు చేస్తే...అసలు విషయం చెప్పేసింది గంగవ్వ. తనకు చదువు రాదని..ఆ చానల్ వాళ్లు చెప్పినట్టు చేస్తే, డబ్బులిస్తామని ఇలా చేశారని జగన్ బ్లూ మీడియా గుట్టు విప్పేసింది. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలపట్ల బాధపడుతున్నానని, టీవీ ఛానెల్ వాళ్లు అనమంటేనే తాను అన్నానని, ఆ విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పారు. చంద్రబాబును క్షమాపణలు కోరారు.
వైసీపీలో సునీతారెడ్డి టెన్షన్..మొన్నం బేగం పిన్ని..నేడు విమలత్త
సొంత పెదనాన్న కొడుకు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. తన తండ్రిని చంపిన హంతకులకి మద్దతుగా నిలుస్తున్నాడు. ఆయనకి కేంద్రం అండదండలున్నాయి. వ్యవస్థలని మేనేజ్ చేయడానికి స్వామీజీలు, లాబీయిస్టులు లెక్కలేనంత మంది ఉన్నారు. అటువంటి `పవర్` ఫుల్ వ్యక్తిని ఢీకొడుతోంది డాక్టర్ సునీతారెడ్డి. తన తండ్రిని చంపిన హంతకులని చట్ట ప్రకారం శిక్ష పడాలనే లక్ష్యంతో ఎవరి అండదండా లేకుండా ఒంటరిపోరాటం చేస్తోంది. అధికారం, డబ్బు, వ్యవస్థలని మేనేజ్ చేసే యంత్రాంగం ఉన్న పెద్దలు ..వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆడుతున్న డ్రామాలని పసిగట్టేసిన సునీతారెడ్డి...పట్టువదలకుండా పోరాడుతోంది. పాత్రధారులు పట్టుబడ్డారు. సూత్రధారులు అధికారం వెనుక దాక్కున్నారు. వారినీ చట్టం ముందు నిలబెట్టేందుకు సునీతారెడ్డి ఉద్యమంలా ఫైట్ చేస్తున్నారు. వైసీపీ క్యాంపులో కీలకనేతలకి ఈ హత్యతో సంబంధం ఉండడం, సునీత వైపు న్యాయం ఉండడంతో ఆమె పోరాటాన్ని కుయుక్తులతో ఎదుర్కోవాలని చూస్తున్నారు. చివరికి కుటుంబసభ్యులనీ ఒక్కొక్కరినీ రంగంలోకి దింపుతున్నారు. వివేకానందరెడ్డి గొడ్డలిపోటు అని ఒకసారి, గుండెపోటు అని మరోసారి, ముస్లిం మతంలోకి మారాడని మరోసారి, రెండోపెళ్లి గొడవలంటూ ఇంకోసారి, వివాహేతర సంభంధాలను అంటగట్టి హత్యకేసు నుంచి తప్పించుకోజూశారు. సునీతారెడ్డి ఏ దశలోనూ సహనం కోల్పోవడంలేదు. న్యాయపోరాటాన్ని వీడలేదు. వివేకా రెండో భార్య బేగంని తన ఇంటికి పిలిపించుకున్నాడు సీఎం వైఎస్ జగన్ రెడ్డి. తన సొంత తల్లి, చెల్లిని తరిమేసినోడు...బాబాయ్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడూ అయిన అబ్బాయ్..ఈ సవతి పిన్నిని ఎందుకు చేరదీస్తాడో తెలియనంత అమాయకులు ఏపీలో లేరు. ఆమెని సునీతారెడ్డిపైకి ఉసిగొల్పి తాము బయటపడాలనే వ్యూహం అమలు చేశారు. అది ఫెయిలైంది. ఇప్పుడు మరో పాత్రని దింపారు. సునీతారెడ్డి మేనత్త, వైఎస్ వివేకానందరెడ్డి చెల్లెలు విమలారెడ్డిని దింపారు. ఆమె తన అన్న మంచోడు అనీ, ఆయన చంపిన వాళ్లు మంచోళ్లు అని సర్టిఫికెట్ ఇస్తోంది. తన అన్న కూతురే గబ్బు పట్టిస్తోందని చెబుతోందంటే..దీని వెనక ఎవరున్నారో ఇట్టే అర్థమైపోతుంది.
మహానాడుపైనా జగన్ రెడ్డి మార్కు కుట్రలు
మరో మహానాడుకి సర్వం సిద్ధమైంది. రాజమహేంద్రవరం వేదికగా 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహా పండగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అయితే ఏపీ సర్కారు తీరు, పోలీసుల వ్యవహారమే మహానాడు నిర్వాహకులకి భయం కలిగిస్తోంది. ఒంగోలులో గతేడాది మహానాడు నిర్వహణకి అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. ఆర్టీసీలు బస్సులు ఇవ్వలేదు. ప్రైవేటు బస్సులు ఇవ్వొద్దని బెదిరించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించకుండా పోలీసులే కారు టైర్లలో గాలి తీసేయడం, వాహనాలు అడ్డంగా నిలిపేయడం వంటివి చేపట్టారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఒంగోలు మహానాడుని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం మహానాడుకి వైకాపా సర్కారు కుతంత్రాలు వెంటాడుతాయనే భయాందోళనలు ఉన్నాయి. ట్రాఫిక్ గురించి ఇప్పటికే లేఖ రాసినా డిజిపి స్పందించలేదు. మహానాడుకు భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సిందిగా కోరుతూ డీజీపీకి ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. సంస్థ నిబంధనల మేరకు డబ్బులు కడతామని ఆర్టిసి బస్సులు ఇవ్వాలని మేనేజింగ్ డైరెక్టర్కి లెటర్ పంపారు. అయితే ప్రభుత్వం పోలీసులు, ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి తెస్తోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టిడిపి కేడర్లో ఆందోళన నెలకొంది. లక్షలాది మంది తరలివచ్చే మహానాడుని రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి గ్రామంలో నిర్వహిస్తున్నారు. మామూలుగానే రాజమహేంద్రవరంలో తరచూ ట్రాఫిక్ జాములు జరుగుతుంటాయి. నదిపై వంతెనలు, జాతీయ రహదారుల వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. మహానాడుకి వచ్చే వేలాది వాహనాలు, లక్షలాది జనం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని టిడిపి అధ్యక్షుడు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.