జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, వైకాపా అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు, మోడీ చేస్తున్న మోసం పై, ధర్మపోరాట దీక్ష చేస్తుంటే, జగన్ మాత్రం వంచన దీక్ష పేరిట నాటకాలు ఆడుతున్నారని, మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. చంద్రబాబు పోరాటానికి రాష్ట్రంలోనే కాకుండా, విదేశాల్లోని తెలుగువారు కూడా మద్దతు తెలియజేస్తే, జగన్ మాత్రం ప్రధాని మోడీకి మద్దతిస్తూ నయవంచన చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుజాతి పై కక్షగట్టి, కేంద్రం చేస్తోన్న అన్యాయాన్ని ఎదుర్కోకుండా, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నాటకాలు ఆడుతున్నారని, చంద్రబాబుని విమర్శిస్తున్న జగన్, ప్రత్యేక హోదా గురించి మోదీని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

ప్రతి రోజు ఢిల్లీలో హడావుడి చేసిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, నేను మోడీ ఇంట్లోనే ఉంటాను అని చెప్పిన ఆయన, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. ఆయనతో పాటు పలువురు వైకాపా నేతలు కర్ణాటకలో, గాలి అనుచరులను గెలిపించే పనిలో ఉన్నారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకు ప్రచారం చేయడమంటే, తెలుగుజాతికి నమ్మకద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడేందుకు, ఈడీ నుంచి ఆస్తులు విడిపించుకోవటానికే జగన్, విజయసాయి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

అమిత్ షా కనుసన్నల్లోనే వైకాపా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో భాజపా అధ్యక్ష పదవి ఖాళీగా ఉందని.. దాన్ని జగన్‌ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఏపీలో ఎవరు ఏ పార్టీలో చేరాలనేది అమిత్ షా, ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారని ఆరోపించారు. 40ఏళ్లు జగన్ కుటుంబానికి పదవులు ఇచ్చిన పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. పులివెందుల చుట్టూ ఉన్న నీళ్లు నెత్తిన జల్లుకుంటే జగన్ పాపాలు సగమైనా పోతాయని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి కాకుండా బయటి జిల్లాల్లో పోటీ చేయాల్సిందేనని అన్నారు.

అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రిగా ఉండగా, గన్నవరం ఎయిర్ పోర్ట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు... ఏడాది లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ హోదాను అందుకుంది... అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను కూడా పూర్తి చేసుకో కలిగింది... మరో పక్క అంతర్జాతీయ విమానాలు తిరగటానికి వీలుగా ఇమిగ్రేషన్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయ్యేలా చూసారు... అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ శాఖలు కొలువు తీరటానికి కార్యాలయాలతో పాటు, కౌంటర్లు కూడా పూర్తయ్యాయి... ఇమిగ్రేషన్‌ అధికారితో పాటు సిబ్బందిని కూడా నియమించటం జరిగింది... అయితే ఇవన్నీ అశోక్ రాజీనామా చెయ్యకముందు జరిగిన పనులు... రాజీనామా చేసిన తరువాత పరిస్థితి మారిపోయింది..

ఇన్ని చేసినా, ఇప్పటికీ కేంద్రం ఇంటర్నేషనల్ ఫ్లైట్ లకి, పర్మిషన్ ఇవ్వటం లేదు.. ఇంకా దారుణం ఏంటి అంటే, మన రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులు హజ్‌ యాత్రకు, గన్నవరం నుంచే వెళ్ళవచ్చు అని, ఇది వరకు అశోక్ మంత్రిగా ఉండగా ఆదేశాలు వచ్చాయి.. ఇప్పుడు మాత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, హజ్ యాత్రకు వెళ్ళే విషయం పై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. ఈ ఏడాది కొత్తగా ఎంబార్కేషన్‌ పాయింట్స్‌ ఇవ్వటం లేదని, సెంట్రల్‌ మైనారిటీ అఫైర్స్‌ తేల్చి చెప్పటంతో, ముస్లిం సోదరులు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి.. రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల మంది హాజీలు హజ్‌ యాత్రకు బయలుదేరబోతున్నప్పటికీ, మన రాష్ట్రంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కాకుండా, పొరుగురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హజ్‌యాత్రకు ప్రత్యేక విమానాలు నడపటానికి విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నా.. విజయవాడ నుంచే తమ యాత్రను ప్రారంభించాలని హాజీలు భావిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవటంతో ఈ ఏడాది కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తీపి కబురు లేదు. సెంట్రల్‌ మైనారిటీ అఫైర్స్‌ కొత్తగా ఎలాంటి ఎంబార్కేషన్‌ పాయింట్స్‌ ఇవ్వటం లేదని చెప్పటంతో భవిష్యత్తు ఆశలపై కూడా నీళ్లు చల్లుతున్నట్టు అవుతోంది. మూడు వేల మంది హాజీలు బయలుదేరే ప్రాంతానికి ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఇవ్వకపోవటం అర్థరహితమని భావించిన రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ మొయిన్‌ అహ్మద్‌ హుస్సేన్‌ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. ఆయన కేంద్ర మంత్రి నక్వీతో మాట్లాడినట్టు సమాచారం. నక్వీ సానుకూలంగా హామీ ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో, ఇప్పటి వరకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హజ్ యాత్రకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వలేదు..

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో అతి పెద్ద బహిరంగ సభ వేదిక పై నుంచి, ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మోసం గురించి, ఎండగట్టనున్నారు.. ఈ నేపధ్యంలో, రేపటి సభ కంటే ముందుగానే, బీజేపీ నేతలకు షాక్ తగిలింది... గత సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కారుమంచి జయరామ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు... రాజీనామా లేఖను నిన్న సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫ్యాక్స్‌లో పంపారు... రేపు తిరుపతిలో జరిగే ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు...

ఆయన గత వారం రోజులుగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అనుచరులు, స్నేహితుల అభిప్రాయాలను సేకరించారు. 2014లో పోలీస్‌ ఆఫీసర్‌ పదవికి రాజీనామా చేసి తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గ సమస్యలను రాష్ట్ర, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన అన్నారు..

బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మూడు గ్రూపులు, ఆరు ముఠాలుగా కొనసాగుతున్నాయన్నారు. ‘నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో ఏడుకొండలుపైన, తిరునామం వైపు వేలెత్తిచూపుతూ ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. నేను దీనికి ప్రత్యక్ష సాక్షిని’’ అన్నారు. రాష్ట్ర ప్రగతి చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. రాష్ట్రాభివృద్ధిపట్ల నిరంతరం తపనపడే వ్యక్తి సారథ్యంలోని టీడీపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు జయరామ్‌ చెప్పారు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శైలి గురించి అందరికీ తెలిసిందే... ఒక 15 రోజుల క్రితం దివాకర్‌రెడ్డి అమరావతి వచ్చి చంద్రబాబుని కలిసారు... దాదాపు ఒక అరగంట సేపు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థుతులు, చంద్రబాబు తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి కుండబద్దలు కొట్టేసారు... మీరు ఏమైనా అనుకోండి, ఈ పనులు గురించి మీరు ఆలోచించాలి, నా సలహా పాటించాలి అంటూ, మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రతిరోజూ ఏదో ఒక పని చేయమని అనడం.. బయోమెట్రిక్‌ అడెండెన్స్‌.. ఇలాంటివి వారికి కంటగింపుగా మారాయని సీఎంకు దివాకర్‌రెడ్డి చెప్పారు..

43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందకపోవడం ఆశ్చర్యంగా ఉందని దివాకర్ రెడ్డి అన్నారు.. ఇది మీరు వెంటనే కరెక్ట్ చేసుకోపోతే, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని, దీని పై అలోచించి, అందరితో మాట్లాడి, ఒక నిర్ణయం తీసుకోండి అంటూ, జేసే దివాకర్ రెడ్డి చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు.. ఈ విషయం పై, చంద్రబాబు ఆరా తీసారు.. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బయోమెట్రిక్ ఎందుకు వద్దు అనేవి అరా తీసి, దీనిపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయమిచ్చారు. బయోమెట్రిక్‌ హాజరుకు, జీతాలకూ మధ్య లింకు పెట్టనే పెట్టవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. సమయపాలనలో కాస్త అటూ ఇటూ అయినా సరే... చిత్తశుద్ధితో పని చేయడమే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఉద్యోగస్తుల హాజరుకు బయోమెట్రిక్‌తో అనుసంధానం లేకపోయినా ఇబ్బంది లేదని సీఎం స్పష్టం చేశారు. దీని ఆధారంగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు కింది స్థాయి వరకు స్పష్టం చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను, సాధారణ పరిపాలన శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. సమయం అటూ ఇటూ అయినా... ప్రజల పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో పని చేయాలన్నది నా ఉద్దేశం. కానీ, దీనిని తప్పుగా అర్థం చేసుకుని బయోమెట్రిక్‌కు - జీతాలకు లింకు పెట్టారనే భావన కల్పించారు. ఇది పూర్తిగా తప్పు. ఈ విషయంపై ఉద్యోగులందరికీ స్పష్టత ఇవ్వండి అని అధికారులని ఆదేశించారు... నేను మీకు ఇన్ని అవకశాలు ఇస్తున్నాను అంటే, మీరు ఇంకా బాగా ప్రజల పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో పని చెయ్యాలని, ఇదొక్కట్టే మిమ్మల్ని కోరుకునేదని, ఉద్యోగులతో చంద్రబాబు అన్నారు...

Advertisements

Latest Articles

Most Read