అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చాలా ఇరుకుగా ఉందని, హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న వేళ, ఇరుకుగా ఉండే ఈ ఎయిర్ పోర్ట్ కాకుండా, పెద్ద ఎయిర్ పోర్ట్ కావాలని, శంషాబాద్ లో, మొట్ట మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టారు చంద్రబాబు... అయితే, ఆయన అధికారం కోల్పోయి, రాజశేఖర్ రెడ్డి వచ్చాడు.. అది 2008 మార్చ్ 23వ తేది... బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి షిఫ్ట్ అవుతున్న వేళ, రాజశేఖర్ రెడ్డి, దివంగత ఎన్టీఆర్ ను ఎలా అవమానపరిచారో అందరికీ గుర్తుండే ఉంటుంది... బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఇంటర్నేషనల్ టెర్మినల్ కు రాజీవ్ గాంధి పేరు, డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఉండేది...

అయితే, బేగం పెట్ ఎయిర్ పోర్ట్ మూసివేసి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చే సమయంలో, ఇక్కడ ఇంటర్నేషనల్ టెర్మినల్ కు రాజీవ్ గాంధి పేరు పెట్టారు కాని, డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు మాత్రం రాజశేఖర్ రెడ్డి పెట్టకుండా అవమానించారు... అది కరెక్ట్ కాదని, ఇవాళ మీరు ఉంటారు, రేపు మేము వస్తాం, ఇలా చెయ్యటం సంప్రదాయం కాదని, చంద్రబాబు, తెలుగుదేశం శ్రేణులు, ఎంత మొత్తుకున్నా, రాజశేఖర్ రెడ్డి వినలేదు... ఆయనేమన్నా గొప్ప నాయకుడా ఏంటి అంటూ, తన స్టైల్ లో వెటకారంగా నవ్వి, టిడిపి వాళ్లకి పనేం లేదు అంటూ, అవమానించారు.. అయితే, అప్పుడు చంద్రబాబు చెప్పినట్టే, వీరు అధికారంలోకి రాగానే, డొమెస్టిక్ టెర్మినల్ కు, ఎన్టీఆర్ పేరు పెట్టారు... మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు, పాదయాత్రలో డ్రామాలు ఆడుతూ, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాను అంటూ చెప్తున్నాడు...

అయినా, నువ్వు అధికారంలోకి రావాలి కదా, అంటూ తెలుగుదేశం విమర్సిస్తుంది... మీ నాన్న లాగా, కడప జిల్లాకు పేరు పెట్టుకున్నట్టు, ఎన్టీఆర్ ఒక జిల్లాకు పరిమితమైన నేత కాదని, డ్రామాలు ఆపాలి అంటూ చెప్పారు.. అంతే కాదు, జగన్ కు, ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంటే, ఎన్టీఆర్ కు భారత రత్న సిఫార్సు చెయ్యాలని అంటున్నారు... ఎలాగూ, మీకు మోడీ మంచి స్నేహితుడు, విజయసాయి రెడ్డి లాబయింగ్ బాగా చేస్తారు కాబట్టి, ఎన్టీఆర్ కు భారత రత్న వచ్చేలా ప్రయత్నం చెయ్యాలని... అది మీరు చెప్పిన ఫార్ములానే, ఎలాగూ చంద్రబాబు తి ఏడు సిఫార్సు చేస్తున్నారు, మీరు కూడా చేస్తే, అన్ని పక్షాలు అడుగుతున్నాయని కాబట్టి, మోడీ పై ఒత్తిడి ఉంటుంది, అంటూ జగన్ కు, తెలుగుదేశం శ్రేణులు పంచ్ లు వేస్తున్నారు... అప్పుడు నీకు, ఎన్టీఆర్ అంటే ఎంత ప్రేమో ఉందో తెలుస్తుందని, మీ నాన్న చేసిన పాపం పోతుందని అంటున్నారు...

తిరుపతిలో వెంకన్న పాదాల చెంత, నాలుగేళ్ళ క్రిందట, సరిగ్గా ఇదే తేదిన నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్ధిగా వచ్చి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు... వాటిని నెరవేర్చకుండా మోసగించారని మండిపడుతున్న చంద్రబాబు నాయుడు, అదే ఏప్రిల్‌ 30న అదే ప్రాంగణం నుంచి మోదీ మోసాన్ని జనానికి తెలియజెప్పే విధంగా సభ నిర్వహిస్తున్నారు... ఎన్నికలకు ఏడాది సమయమేఉండటం, తిరుపతి నుంచే తెదేపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సంప్రదాయం కలిగి ఉండటాన్ని బట్టి ఇది ఎన్నికల ప్రచారానికి నాందిగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు...

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. తెదేపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో కేంద్రంపై పోరాటానికి తిరుపతినే వేదికగా ఎంచుకున్నారని అవగతమవుతోంది. ఈ సభ తర్వాత రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ సభలు నిర్వహించే యోచనలో పార్టీ ఉందని సమాచారం. ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా మోదీ ప్రసంగ పాఠాన్ని ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించనున్నారు. అందులో మోదీ పేర్కొన్న ప్రతి అంశాన్నీ ప్రస్తావిస్తూ నాడు ఏమి హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎలా వాగ్దాన భంగానికి పాల్పడ్డారో.. వివరించనున్నారు. తెలుగు ప్రజల ఇలవేల్పు సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఇచ్చిన హామీని ఏ విధంగా విస్మరించారనేది వివరించనున్నారు...

అయితే, ఈ సభ జరగకుండా ఉండటానికి, కేంద్రం ఇప్పటికే గవర్నర్ ను, ఐబి చీఫ్ ను చంద్రబాబు వద్దకు పంపించింది... చంద్రబాబు ఇక్కడ మీటింగ్ పెట్టి విమర్శలు చేస్తే, కర్నాటక ఎన్నికల పై ప్రభావం పడుతుందని, ఇప్పుడిప్పుడే అక్కడ బీజేపీ పరిస్థితి మెరుగు పడుతుంది అని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.. అయితే, ఇవన్నీ చంద్రబాబు పట్టించుకోలేదు.. మరింత విమర్శల దాడి పెంచారు.. అయితే, ఈ సభ అనివార్యం అని తెలుసుకున్న బీజేపీ పెద్దలు, మమ్మల్ని ఎన్ని విమర్శలు అయినా చేసుకోండి, కాని కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా వోట్ వెయ్యమని పిలుపు ఇవ్వద్దు అని, అది ఎన్నికల పై, అక్కడ తెలుగు వారి ప్రభావం చూపిస్తుందని, చంద్రబాబుకి వర్తమానం పంపించారు... అయితే, చంద్రబాబు మాత్రం, ప్రజలకు ఏది కావాలో, నేను అదే మాట్లడతా అని, తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది..

ఒక పక్క ఎన్ని రాజకీయ విమర్శలు ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మాత్రం గుర్తించకుండా ఉండలేని పరిస్థితి కేంద్రానిది... స్వయంగా ప్రధాని మోడీనే, మన రాష్ట్రానికి అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితి.. ఇది చంద్రబాబు ముందు చూపుకు, కష్టానికి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు... గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు నైపుణ్యాభివృద్ధిలో (స్కిల్ డెవలప్మెంట్) శిక్షణను ఇస్తూ, ఉపాధి కల్పనకు తోడ్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు, జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు వచ్చింది... మొదటిస్థానంలో ఒడిసా ఉండగా, రెండో స్థానంలో కేరళ నిలచింది... మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల లాబీయింగ్‌ను అధిగమించి మరీ, ఆంధ్రప్రదేశ్ ఈ ర్యాంకు సాధించడం విశేషం.

నిజానికి ఈ అంశంలో కేరళ రాష్ట్రం కంటే, ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది.. కాని కేరళలో మెట్రోరైలులో గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు, ఎక్కువగా చూపడంతో ఆ రాష్ట్రం రెండో స్థానం సాధించింది... ఈ ఏడాది వచ్చిన ర్యాంకు స్ఫూర్తితో, వచ్చే సంవత్సరం నెంబర్ వన్ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో కోగంటి సాంబశివరావు చెప్పారు... ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఈ అవార్డు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి దినోత్సవం సందర్భంగా మే 5న రాంచీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డులను అందజేస్తారని తెలిపారు. యువతలో దాగిఉన్న విజ్ఞానాన్ని, నైపుణ్యాలను వెలికి తీసి ఉపాధి అవకాశాలను కల్పించేలా దిశగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో కె. సాంబశివరావును సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలోని గ్రామీణ యువతకు సోసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ఏపీ(సీడ్‌ఏపీ) నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది 5980 మందికి శిక్షణ ఇచ్చి, 10,923 మందికి ఉపాధి కల్పించింది. ఈ ఏడాది 17,977 మందికి శిక్షణ కల్పించింది. ఒక్కో విద్యార్థిపె రూ.60 వేల వరకు ఖర్చు చేస్తోంది. కాగా, నైపుణ్యాభివృద్ధిపై ఆసక్తిగల యువత జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయాలను సంప్రదించాలని సీఈవో కోగంటి సాంబశివరావు సూచిస్తున్నారు.

పసిబిడ్డ ఆంధ్ర రాష్ట్రం, పాకుతూ, లేచి నిలుచోవటానికి అపసోపాలు పడుతుంటే... అడుగడుగునా ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, అధిపత్యం కోసం, అధికారం కోసం, చంద్రబాబుని నిలువరించేందుకు కేంద్రంలో పెద్దలు వంచన చేస్తుంటే... మీకు అడ్డం రాను, రాస్త్రనికి చేయూత నివ్వండి మహాప్రభూ అంటూ ఒకరకంగా తలవొగ్గారు చంద్రబాబు... అయినా ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి...మిత్రధర్మాన్ని విస్మరించి..ద్రోహం చేసిందెవరో తెలియదా...?వంచన చేసిందెవరో తెలియదా ...? మోడీ మోసం పై ధర్మ పోరాటం చేస్తుంటే, ఇదే రోజు జగన్, వైజాగ్ లో వంచన దీక్ష అంటూ, చంద్రబాబుకు వ్యతిరేకంగా దీక్ష చెయ్యటం ఏంటి ?

చంద్రబాబు కి వ్యతిరేకంగా, రాష్ట్ర సమస్యలపై దీక్షలు చేయండి... పెన్షన్ లు ఇవ్వకపోతే , నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, రైతు ఋణమాఫీ చేయకపోతే, డ్వాక్రా ఋణమాఫీ చేయకపోతే, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టకపోతే, అన్న కాంటీన్ లు పెట్టకపోతే, ఉద్యోగులకు నలభైమూడు శాతం ఫిట్ మెంట్ ఇవ్వకపోతే, రిటైర్ మెంట్ ఏభైఎనిమిది నుండి అరవై చేయకపోతే, పట్టిసీమ నీరు కృష్ణ లో అనుసంధానం చేయకపోయి ఉంటే, కృష్ణా డెల్టా ఎండిపోయుంటే, పులివెందులకు నీరు ఇవ్వకపోయుంటే, అనేక ఆటంకాలమధ్య పోలవరం ఏభైశాతం పనిపూర్తవక పోయి ఉంటే, పక్క రాష్ట్రం ధనిక రాష్ట్రం ఒక్క ఉద్యోగం అయినా ఇవ్వకపోయినా, రెండుసార్లు డియస్ సీ ప్రకటించకపోతే, ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకు రాకపోతే, రాష్ట్రంలో అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేయకపోతే, సంవత్సరం లోపల మన రాష్ట్రం, మన రాజధాని మనదగ్గర నుండే పాలన చేయకపోతే, హుద్ హుద్ లాంటి జలప్రళయం ని సమర్థవంతంగా ఎదుర్కోక పోతే, కియామోటార్స్, హీరో మోటార్స్, ఆపిల్ లాంటి కంపెనీలు రాకపోతే, అన్నిటికన్నా ముప్పై మూడువేల ఎకరాలు ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క రక్తం చుక్క కారకుండా కేవలం తన మీద నమ్మకంతో రైతులు ఇవ్వకపోతే, అప్పడు కదా చంద్రబాబు కి వ్యతిరేకంగా దీక్షలు చేయాల్సింది.

మరేంటయ్యా ...కేంద్రం మోసం చేసింది...మోదీ కక్ష గట్టాడు, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది...ప్రజలంతా ఆగ్రహంతో కేంద్రం మీద యుద్దం చేస్తుంటే... మీరేంటయ్యా ప్రజల మీద యుద్దం ప్రకటించారు... మీ కేసుల గురించా ? ప్రజలందరికీ తెలుసు ...ఇక డ్రామాలు చాలించి ...ముసుగులు తీసి ప్రత్యక్ష యుద్దం చేయండి...బాబు కావాలో, మీరు కావాలో ప్రజలు తేల్చుకుంటారు.. రోజులుమారాయి...మీ డ్రామాలు...అసలు నయవంచన మీదే, అని ప్రజలుకు బాగా అర్దమయింది...సమయం కోసం చూస్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read