శుక్రవారం వేకువజాము 3:30కు సింగపూర్ చాంఘి అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగుపెట్టారు. సింగపూర్‌లో ఈరోజు ఒకరోజు పర్యటనలో బిజీ షెడ్యూల్ గడపనున్నారు. పారిశ్రామిక, వాణిజ్య, రాజకీయ ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం 5:30 (IST) నుంచే ముఖ్యమంత్రి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎస్ ఈశ్వరన్‌తో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంలో, హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ఆర్ సుకుమార్, చంద్రబాబుని ప్రశ్నలు అడిగారు...

mint asia 13042018 1+

జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర, ప్రణాళిక ఏమిటి, అని అడగగా, "జాతీయ రాజకీయాల్లో నాకు ఆసక్తిలేదని అంశాన్ని గతంలో నేను ఎన్నో పర్యాయాలు స్పష్టం చేశాను. నాకు అటువంటి ఆకాంక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలకు అభివృద్ధిలో ఒక నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం. నా ఆకాంక్ష అదే." అంటూ చంద్రబాబు సమాధానం చెప్పారు... టెక్నాలజీలో రోల్ మోడల్ అని ఎలా చెబుతారు? అని మరో ప్రశ్న అడగగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ... "నేను టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాను. డిజిటల్ పరిపాలనలలో భాగంగా ప్రభుత్వ విభాగాల ఫైళ్లను ఆన్‌లైన్ లో ఉంచాం. కంప్యూటర్ ద్వారానే ఫైళ్ల క్లియరెన్స్ ను పర్యవేక్షిస్తున్నాను. ముఖ్యమంత్రిగా నాకు ఒక డ్యాష్ బోర్డు ఉంది. సీఎం కోర్ డ్యాష్ బోర్డుకు అన్ని విభాగాలను అనుసంధానం చేశాం....."

mint asia 13042018 1+

"...తద్వారా వాస్తవిక సమాచార పద్ధతిలో పరిపాలనలో ముందుకు సాగుతున్నాం.రియల్ టైమ్ గవర్నెన్స్ మెరుగైన పరిపాలన అందిస్తున్నాం. రైతు వ్యవసాయిక సీజనులో చీడపీడల నివారణకు ఏ సీజనులో ఏ పంటకు ఏఏ క్రిమిసంహార మందులు వినియోగించాలో తెలియజేసే యాప్స్ ను మా రైతులు ఉపయోగిస్తున్నారు. అటువంటి టెక్నాలజీ ఉంది. నా ట్యాబ్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తు వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షిస్తాను. సంఘవ్యతిరేక శక్తులైన రౌడీషీటర్లను అదుపు చేయడానికి యాప్ సేవలు ఉపయోగించుకుంటున్నాం. అదలా ఉంచితే మా రాష్ట్ర వృద్ధి రేటు 10.5% గా ఉంది. వచ్చే 15 నుంచి 20 ఏళ్లలో వృద్ధి రేటును 15% కు తీసుకెళ్లడానికి సంకల్పం తీసుకుని కష్టపడి పని చేస్తున్నాం. మా రాష్ట్రంలో పెట్టుబడులకు నాదీ భరోసా. ఆంధ్రప్రదేశ్ కి రండి. పెట్టుబడులు పెట్టండి. మా రాష్ట్రం వృద్దిరేటులో, అభవృద్ధిలో మరింత ఎదగడానికి మీ సహాయ సహకారాలను కోరుతున్నాను." అని అన్నారు...

ప్రస్తుతం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వైరం నేపధ్యంలో, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కు మరో గండం లాంటిది వచ్చి పడింది... పోలవరానికి పర్యావరణ అనుమతులు, ఈ జూలై 2తో ముగుస్తాయి... ప్రతి సంవత్సరం కేంద్రం, దీన్ని పొడిగిస్తూ వస్తుంది... మరి ఈ సారి ఏమి చేస్తుందో అని రాష్ట్ర అధికారులు టెన్షన్ పడుతున్నారు... ఇదే విషయం పై ఢిల్లీ వెళ్లారు.. పోలవరం పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా సడలించడం కాకుండా, శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలసంఘాన్ని కోరింది. పోలవరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 31 బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పై సీడబ్ల్యూసీ సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలవరం డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ నాగిరెడ్డి, మరికొందరు ఇందులో పాల్గొన్నారు. పూర్తిస్థాయిలో చర్చించడానికి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

polavaram 13042018

ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి గురించి రాష్ట్ర అధికారులు సీడబ్ల్యూసీకి పవరపాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పోలవరం నిర్మాణం పై ఉన్న షరతులను తొలగించాలని కోరింది. ఒడిశాలో తలెత్తే ముంపును దృష్టిలో ఉంచుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేంతవరకూ నిర్మాణ పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న అప్పటి యూపీయే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాతి కాలంలో ఈ షరతులను సమయానుకూలంగా ఆరునెలలు, సంవత్సరంపాటు సడలిస్తూ వస్తున్నారు. తాజాగా 2017 జులై 5న ఇచ్చిన సడలింపు ఈ ఏడాది జులై 2తో ముగియనుంది. ఇలా ప్రతిసారీ నిర్మాణ పనుల పై ఆంక్షలు విధించడం వల్ల తమకు పూర్తి అసౌకర్యం కలుగుతోందని, ఈ నిబంధనలను శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తాజా సమావేశంలో కోరారు.

polavaram 13042018

ఇదే అంశం పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రికి లేఖ కూడా రాసినట్లు వారి దృష్టికి తీసుకొచ్చారు. 2010-11 ధరల స్థాయితో పోలిస్తే 2013-14 నాటికి ప్రాజెక్టు వ్యయం పెరగడానికి గల కారణాలను విపులీకరించారు. ఇదివరకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ. 2,934 కోట్లు అవుతుందని అంచనా వేయగా 2013 భూసేకరణ చట్టం నేపథ్యంలో ఆ వ్యయం రూ. 33,225 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఈ ఒక్క వ్యయమే 1,132. 27% పెరి గినట్లు తెలిపారు. కాలువలు, హెడ్ వర్క్ నిర్మాణ పనుల్లో ఇంత అసాధారణ స్థాయిలో పెరుగుదల లేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చులనూ సకాలంలో ఇప్పించాలని కోరారు. 2018 ఫిబ్రవరి వరకు రూ. 8,065 కోట్లు ఖర్చుచేస్తే రూ. 5,342 కోట్లు చెల్లించారని, ఇంకా రూ. 2,723 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. ఈ డబ్బు త్వరగా ఇప్పిస్తే ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి కావడానికి వీలవుతుందన్నారు.

మోడీ ప్రచార పిచ్చ, కొత్త పోకడలకు తెర లేపింది... రాష్ట్రాలని నిర్వీర్యం చేసే అతి భయంకర నిర్ణయం తీసుకున్నారు మోడీ... ఇప్పటికే సామాఖ్య స్పూర్తికి విరుద్ధంగా, కేంద్రం ప్రవర్తిస్తుంది అని, అనేక రాష్ట్రాలు గోల చేస్తుంటే, మరో నిర్ణయంతో ముందుకొచ్చారు... రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, నేరుగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం మొదలుపెట్టింది... ‘గ్రామీణ స్వరాజ్‌ అభియాన్‌ యోజన’! కేంద్ర ప్రభుత్వ పథకాలను ఊరూరా ‘చాటింపు’ వెయ్యటం కోసం, ‘మీ పథకాలు మీవే... మా పథకాలు మావే!’ అంటూ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని వింత నిర్ణయం తీసుకుంది కేంద్రం...

modi sattes 12042018

‘‘మేం నిధులు ఇచ్చే పథకాలకు మా పేరు ఉండాలి. మా పేరుతోనే ప్రచారం జరగాలి. వాటిని మా అధికారులే పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు లెక్కాపక్కా మాకే చెప్పండి’’ అని కేంద్రం కలెక్టర్ లని ఆదేశించింది. అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్‌ 14) నుంచి వచ్చేనెల 5 వరకు గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ పేరిట ప్రచారం చేయాలని కలెక్టర్లను కేంద్రం ఆదేశించింది. ఈ కార్యక్రమం ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ అంతా అంతా ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర సర్వీసు అధికారులే పర్యవేక్షిస్తారు. గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ను దేశవ్యాప్తంగా 21,058 గ్రామాల్లో నిర్వహించబోతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఏపీలో 305 గ్రామాల్లో ఈ సభలను నిర్వహిస్తారు. అందులోనూ... ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో అత్యధికంగా 70 గ్రామాలను ఎంపిక చేయడం గమనార్హం.

modi sattes 12042018

కేంద్ర-రాష్ట్ర సంబంధాలు చెడిపోయి రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తిన కాలంలో కూడా కేంద్రం రాష్ట్రాల్లో సొంతంగా గ్రామసభలు పెట్టి ప్రచారం చేసుకోలేదు. మోదీ సర్కారు మొట్టమొదటిసారి ఆ పని చేస్తోంది. జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులే సారథులు. సూచనలు, ఆదేశాలు ఏవైనా వారి నుంచే వస్తాయి, రావాలి! కానీ... కేంద్రం మొట్టమొదటిసారిగా సీఎ్‌సతో సంబంధం లేకుండా సొంతంగా జిల్లా కలెక్టర్లను లైన్‌లోకి తీసుకుంది. ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్లు విస్తుపోతున్నారు. స్వంతంత్ర భారత చరిత్రలోనే ఇలా ఎప్పుడూ లేదని వ్యాఖ్యానిస్తున్నారు... అయితే, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం, ఈ నిర్ణయం పై భగ్గు మంటున్నాయి... ఇప్పటికే కలెక్టర్లు, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అములులో, పని ఒత్తిడి ఉందని, అవసరం అయినవి కాకుండా, ఇలా ప్రచారం కోసం, మా అధికారలుని తీసుకోవటం ఏంటని, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి...

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు.. అంతా అయిపోయాక ఇప్పుడు తల్చుకుని బాధపడుతున్నారు.. దౌత్యం చేయమని అడుగుతున్నారు.. చేయి దాటిపోయాక బాధపడి ప్రయోజనం ఏముంటుంది? కొంతమంది కేంద్రమంత్రులకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో సంబంధాలు తెంచుకోవడం ఎంతమాత్రం ఇష్టంలేదు. చంద్రబాబుతో మాట్లాడాలనీ, మధ్యవర్తిత్వం వహించాలనీ కొంతమంది కేంద్ర మంత్రులు తెలుగుదేశం ఎంపీలను అడుగుతున్నారు. రాయబారం దశ దాటిపోయిందని చెబుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గట్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో ఆయన విజయవాడకు వచ్చి కృష్ణానదిలో ఏర్పాటుచేసిన భారీ ఫంట్‌ను ప్రారంభించి, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తారంటూ సమాచారం అందింది.

gadkari 12042018

ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం పక్షాన కేంద్రమంత్రిని ఎవరు ఫాలో అవుతారని జలవనరుల శాఖ అధికారులు ఆరాతీశారు. రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమా వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇంకెవరు వస్తారంటూ మళ్లీ ప్రశ్నించారు. ఇంకెవరూ రారు అని సిఎంవో తేల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వస్తారని గట్కరీ ఆశించారని చెబుతున్నారు. అయితే సీఎంకి ముందుగా పర్యటనలు ఖరారు కావడంతో ఆయన హాజరుకాబోరని సిఎంవో వర్గాలు తేల్చిచెప్పాయి. కనీసం పోలవరం సమీక్షకు అయినా సీఎం హాజరైతే బాగుంటుందని భావించారు. కానీ ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి కూడా హజరయ్యే అవకాశం లేదని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం అందింది. దీంతో చివరి నిముషంలో నితిన్ గట్కరీ పర్యటన వాయిదా పడిందంటూ సమాచారం అందించారు.

gadkari 12042018

రాష్ట్రంలో హోదా కోసం ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో గట్కరీ పర్యటనకు వెళితే బాగోదని కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న గట్కరీ తన పర్యటనను స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉన్నాయన్న సాకుతో వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సహజంగా ఆదివారం ఢిల్లీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగే అవకాశమే లేదు. ఇలా కేంద్రమంత్రులు నలుగురైదుగురు తెలుగుదేశంతో సంబంధాలు తెంచుకోవడం పట్ల తెగ బాధపడిపోతున్నారు. కొంతమంది చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కూడా కేంద్రమంత్రులతో పాలనాపరమైన వ్యవహారాలు మినహా మిగతా రాయబారాలను అంగీకరించడం లేదు.

Advertisements

Latest Articles

Most Read