మంగళగిరి సీవీ కన్వెనన్లో సీఆర్డీయే, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించే సంతోష నగరాల సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది... ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన సంతోష నగరాల సదస్సులో భూటాన్లోని, జెలెఫర్ నగర మాజీ మేయర్ ఆకారాం కెప్లీ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రధానమంత్రిగా సంభోదించారు...... స్మార్ట్ నగరాల నిర్మాణం పై తన అనుభవాలను వివరించిన కెప్లీ 'ప్రైమ్ మినిస్టర్' చంద్రబాబు నాయుడు ఓ విజన్ ఉన్న నాయకుడని అభివర్ణించారు. తనకు ఉన్న అపారమైన అనుభవంతోనే అమరావతి నిర్మాణానికి సదస్సు ఏర్పాటు చేశారన్నారు. ప్రధానమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దగలరనే నమ్మకం తమకు ఉందన్నారు.

cbn hcs 12042018

ఒకపక్క భారత ప్రధాని నరేంద్రమోదీ పై ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధన కోసం విభేదించి కారాలు, మిరియాలు నూరుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఏకంగా ప్రధానమంత్రిగా కెస్లీ పేర్కొనటం విశేషం.... దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు అయితే, ఇది కావాలనే చంద్రబాబు చేసిన కుట్ర అంటూ, యధావిధంగా విమర్శలు చేస్తున్నారు... చంద్రబాబు ఇలా కావాలనే వాళ్ళ చేత చెప్పించుకుంటున్నారు అని అంటున్నారు... మరో పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తమవంతు సహకారాన్ని అందిస్తామని అభివృద్ధి నమూనాలో అనుభవాలను పంచుకుంటామని దేశ, విదేశీ ప్రతినిధులు వెల్లడించారు....

cbn hcs 12042018

అమరావతి నిర్మాణంలో పరస్పర సహకారాన్ని అందించుకునేందుకు సంసిద్ధతను వ్యక్తంచేశారు, సింగపూర్ ప్రతినిధి... కంబోడియా మెడల్లిన్ నగర మాజీ మేయర్ అనిబల్ గవిరియా మాట్లాడుతూ వ్యవస్థాపరంగా నిర్మాణాత్మకమైన పాలనా విధానాలను అవలంబించడం ద్వారా స్మార్ట్ సిటీలు రూపాంతరం చెందుతాయన్నారు. సామాజిక అసమానతలను తొలగించడంతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించి పర్యాటక కేంద్రాల అభివృద్ధితో సంతోష నగరాల మనుగడ సాధ్యమవుతుందని ఫిన్లాండ్ ఎంబసీ కమర్షియల్ కౌన్సెలర్ జుక్కా హోలప్ప అభిప్రాయపడ్డారు. భూటాన్లోని జెలెఫా టౌన్ మేయర్ తీకారాం కార్డే మాట్లా డుతూ తమ నగరంలో 15 మొక్కలు నాటితేనే భవన నిర్మాణానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరవుతుందన్నారు. సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది నాటికి రాజధాని మొదటి దశ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు.. అందులో భాగంగా మొబైల్ రంగంలో గుర్తింపు పొందిన షియామీ సంస్థ, ఎలక్ట్రానిక్ వస్తువల విడిభాగాలు తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది... పరిశ్రమ తిరుపతి పరిసర ప్రాంతాల్లో నెలకోల్పెందుకు అనువుగా సియం చొరవ తీసుకున్నారు... నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించి, షియోమీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు... ఈ సందర్భంగా రాష్ట్రంలో విడిభాగాల పరిశ్రమ స్థాపనకు ముందుకు రావాల్సిందిగా వారిని కోరారు. తిరుపతి ప్రాంతంలో అనుకూలతలు ఉన్నాయని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని వివరించారు.

cbn 12042018

జిల్లాలో ఫాక్స్‌కాన్‌ కంపెనీ భాగస్వామ్యంతో మొబైల్ తయారీ చేస్తున్న నేపథ్యంలో విడిభాగాలు ఇక్కడే ఉత్పత్తి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు భూమితో పాటు అవసరమైతే నిర్మాణాలు చేసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇలా ఆయా సంస్థల ప్రతినిధులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. తిరుపతిలో కొద్ది గంటలే గడిపినా.. ఏకంగా 38 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ఒకేసారి సమావేశమై రాష్ట్ర ప్రాధాన్యతలను వివరించారు. తిరుపతి పరిసర ప్రాంతాలను హార్డ్‌వేర్‌తోపాటు ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పారు. తాజాగా షియామీ చరవాణులకు విడిభాగాలను అందించే సరఫరాదారులు తమ సంస్థలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా భారతదేశం వచ్చారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం నిర్ణయించి... అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.

cbn 12042018

తిరుపతికి వచ్చిన 38 సంస్థలకు చెందిన మొబైల్ విడిభాగాల సరఫరాదారులతో నేరుగా సమావేశం కావాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా బుధవారం ఉదయం తిరుపతికి వెళ్లారు. సుమారు గంటన్నరకుపైగా వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ తాను చెప్పిన అంశాలతో సంతృప్తి చెందారని, పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయని, ఇది మంచి పరిణామమని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మౌలిక వసతులు ఎక్కడ బాగుంటే అక్కడ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారని అన్నారు. మొత్తంగా రాయలసీమ ప్రాంతంలో భారీగా పరిశ్రమలు వస్తున్నట్లు వెల్లడించారు.

ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మరో మోసం ఇది... దాదాపు 44 బిలియన్ ల పెట్టుబడి, అంటే 3 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీని, ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర తీసుకోపోయారు... ప్రపంచంలోకెల్లా అగ్రగామి అయిన చమురు ఎగుమతుల సంస్థ సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరంకోని, మన రాష్ట్రానికి తీసుకురావటానికి గత సంవత్సర కాలం నుంచి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేసారు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సౌదీ అరంకో అధిపతి నాసర్‌తో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా సమావేశమై అంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన బంగాళాఖాతం తీరాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ విశాఖపట్టణాన్ని ప్రతిపాదించారు...

cbn aramco 11042018 1

దేశంలో కీలకమైన రిఫైనరీలు ప్రస్తుతం బంగాళఖాతం తీరంలో ఉండగా అదే మార్గంలో తాము నూతన రిఫైనరీలు ఏర్పాటు చేయడంతో భారతదేశంతో తమ సుదీర్ధకాల వ్యాపార ప్రయోజనాలను సాధించడంతో పాటు అగ్నేయాసియా దేశాలలో కూడా సౌదీ అరేబియా చమురును సరఫరా చేయడానికి ఉపకరిస్తుందని అరంకో కూడా భావించింది... విశాఖపట్టణంలో రిఫైనరీతోపాటు కృష్ణా నదీ తీర ప్రాంతంలో పెట్రో రసాయానాల రంగంలో పెట్టుబడులు, పెట్రో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిని, 'సౌదీ అరంకో సంస్థ' దాదాపు అంగీకరించింది... ఈ సంవత్సరం జనవరి 23న చంద్రబాబు, సౌదీ అరంకో, వైస్ ప్రెసిడెంట్ సైయద్ అల్ హద్రామిని కలిసి, ఫిబ్రవరి 24న జరిగే సిఐఐ సమ్మిట్ కు కూడా ఆహ్వానించారు.... దాదాపు, అదే టైంలో, ఎంఓయి కూడా అయిపోయేది...

cbn aramco 11042018 1

అయితే, ఎవరి ఒత్తిడి ఏమో కాని, ఈ రోజు 'సౌదీ అరంకో సంస్థ', మహారాష్ట్రలోని రత్నగిరిలో రిఫైనరి పెడుతున్నట్టు ఎంఓయి కుదుర్చుకుంది... దాదాపు 44 బిలియన్ ల పెట్టుబడి, అంటే 3 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు, ఇక్కడ పెట్టనుంది 'సౌదీ అరంకో సంస్థ'... ఎవరు ఒత్తిడి తెచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయమే అని, ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి... ప్రధాని స్థాయిలో ఒత్తిడి వల్లే ఇలా జరిగిందేమో అంటున్నారు... ఇలాగే యాపిల్ సంస్థ కూడా, దాదాపు మన రాష్ట్రంలో తిరుపతికి వస్తుంది అని వార్తలు వచ్చాయి, ఎంఓయి కుదుర్చుకుంటుంది అనే టైంలో, యాపిల్ సంస్థ మహారాష్ట్ర వెళ్ళిపోయింది...ఇదే ప్రధాని మోడీ, మన రాష్ట్రం పై చూపించే ప్రత్యెక శ్రద్ధ.... ఇలాంటి వాటి పై మోడీని అడిగే దమ్ము, మన జగన్ కు, పవన్ కు ఉండదు... ఎదురు ముఖ్యమంత్రి పడి ఏడుస్తారు...

బేటి బచావ్ బేటీ బచావో నినాదం కాదు... బేటీ బచావో, ఆర్తనాదం... బేటీ బచావ్ అంటే, బీజేపీ ఎమ్మల్యేల నుంచి మీ ఆడబిడ్డలను కాపాడుకోండి అని... కూతుళ్ళ వయసు పిల్లల మీద బీజేపీ ఎమ్మల్యేలు చేసే బలాత్కారాల నుంచి పాపడుకోంది.... వాళ్ళ తండ్రులని పోలీసు ఠాణా లలో పెట్టి కుళ్ళబొడిచి -- పోలీసుల చేత చంపించి -- ఆ అమ్మాయి కుటుంబాన్నే దగా చేసే -- బీజేపీ ముఖ్యమంత్రుల నించా, బీజేపీ ప్రధాన మంత్రుల నుంచి కాపాడుకోండి... "బేటీ ! " అంటే ఉండే ఒక స్పందనే వీళ్ళకి తెలియదు . " బేటీ బచావ్ ! " -- అంటే ఆ బేటీ ని ఎవరినించి బచావ్ అని... బిడ్డలు లేని మోదీకి ఆడవారి బాధలు ఏం తెలుస్తాయంటూ సర్కార్ పాలనపై మాటల పోట్లు పెరిగాయి... దీక్షలు చేస్తున్న మోడీ గారు, ఈ ఆడకూతురుకి సమాధానం చెప్పి, దీక్షలు చెయ్యండి...

up modi 12042018

సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కుటుంబం, బంధాలు ఏవీ లేవని.. అందుకే తమ బాధలు పట్టడం లేదంటూ ఓ మహిళా నేత దూషించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ‘‘యూపీ సీఎం యోగికి భార్య, పిల్లలు, కుటుంబం లేదు. కన్నబిడ్డ, ఆడవారి ఆవేదన వారికి ఎలా తెలుస్తుంది..? మోడీకి పెళ్లి అయ్యిందే కానీ పిల్లల భాగ్యం లేదు. ఒక కూతురు అత్యాచారానికి గురయితే తండ్రి పడే బాధ మోడీకి తెలుసా..?’’ అంటూ మహిళ తీవ్ర విమర్శలు చేశారు. బేటీ బచావో అనే బీజేపీ పాలనలో.. ఆ నేతల నుంచే బాలికలకు రక్షణ లేకపోవడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తాయి...

up modi 12042018

‘‘అధికార పార్టీ ఎమ్మెల్యే, అతడి సోదరులు అత్యాచారం చేశారు. వారిపై చర్యలు తీసుకోండి’’ అంటూ కోర్టును ఆశ్రయించిన అబలకు న్యాయం జరగలేదు సరికదా.. ఎదురు ఆమె తండ్రిపైనే తప్పుడు కేసు బనాయించి అతణ్ని అరెస్టు చేశారు ఖాకీలు! పోలీసుల కస్టడీలోనే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ తండ్రి చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు! ఇది దేశంలో పరిస్థితి... మన ప్రధాన మంత్రి మాత్రం, అదరగొట్టే స్పీచ్ లు ఇచ్చి, దేశ ప్రజలను కడుపు నింపుకోమంటారు... ఆయన్ను ఎవరాన్నా ఏమన్నా అంటే, నేను పేద తల్లి కొడుకుని, నేను తక్కువ కులం వాడిని అంటూ, సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నారు... రేప్ చేసారు అంటే చేపించుకోండి, ఎదురు తిరిగితే, మీ తండ్రిని చంపేస్తాం అనే మెసేజ్ ఈ దేశానికి ఇస్తున్న, బీజేపీని ప్రజలే సరైన శిక్ష వేస్తారు....

Advertisements

Latest Articles

Most Read