బంద్‌లు, రాస్తారోకోలు చేస్తే రాష్ట్రానికే నష్టం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని, ప్రధాని మోదీ చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు నష్టపోతారన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఈ నెల 16 న ఏపీ బంద్‌కు వామపక్ష పార్టీలు, వైసిపీ పిలుపునిచ్చిన నేపధ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు... దేశం మొత్తం తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. మనమంతా కలిసి ప్రధాని మోదీపై పోరాటం చేయాలని, ఢిల్లీ వెళ్లి మోదీపై పోరాటం చేయాలి కానీ... రాష్ట్రంలో రాస్తారోకోలు చేస్తే ఏం వస్తుందంటూ చంద్రబాబు అన్నారు. బంద్‌లు రాస్తారోకోల వల్ల రాష్ట్రానికే నష్టం అని, మన పోరాటాలు ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉండాలని సీఎం అన్నారు.

cbn 12042018 1 1

అప్పట్లో స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామ రాజు వంటి వారు తమ తమ శైలిలో పోరాడారని, కొంత మంది మనవాళ్లు మాత్రం బ్రిటీష్ వారితో లాలూచీ పడ్డారని, వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు తాను చేసే పోరాటం రాష్ట్రం కోసమేనని, తాను కేంద్ర ప్రభుత్వం, మోదీపై పోరాటం చేస్తున్నానని అన్నారు. వైసీపీ, జనసేన ఈ పోరాటానికి కలిసి రాకుండా కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. పోరాటంలో చిత్తశుద్ధి ఉండాలని, కేంద్ర ప్రభుత్వం మున్ముందు ఏ రూట్లో వస్తుందో మనం ఏ రూట్లో పోవాలో చూడాలని వ్యాఖ్యానించారు. అసలు బ్రిటీష్ వారికి, కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు.

cbn 12042018 1 1

‘ప్రధానిగా ఉన్న వ్యక్తి దీక్ష చేయడం దేశ చరిత్రలో లేదు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయ కారణాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరికొన్ని రాష్ట్రాలను ఇప్పుడు రెచ్చగొడుతున్నారు.. దీని వల్ల వారే నష్టపోతారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతే కేంద్రంలో మోదీ ఆనందపడతారు. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు మోదీ ఆనందపడేలా ప్రవర్తిస్తున్నాయి.’ అని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అన్నీ సాధించే వరకు రాజీపడేది లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు.

అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు చచ్చినట్టు, ఇంట చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ లు, చివరకు జనసేన లాంటి పార్టీల చేతిలో కూడా అవమానాలు పొందుతున్నారు... సిద్ధాంతాలు వదిలేసి, కమ్యునిజం సిగ్గు పడేలా, గత కొన్నేళ్ళ నుంచి కమ్యూనిస్ట్ లు దిగజారి పోతూ వచ్చారు... దానికి పరాకాష్ట, జనసేన లాంటి పార్టీలతో కలిసి ప్రయాణం... ప్రజా రాజ్యం పార్టీలో, నెంబర్ 2 అయిన పవన్ కళ్యాణ్ తో, ఎందుకు పొత్తు పెట్టుకున్నారో, అది ఏ సిద్ధాంతమో వారే చెప్పాలి... అయితే, వెళ్ళు చేసిన పనులకు మూల్యం చెల్లించుకుంటున్నారు... కెమెరాలు ముందు చొక్కాలు మోస్తే, ఆహా ఒహా అన్న వారు, ఇలాంటి వాటికి సమాధానం ఏమి చెప్తారో మరో.. అసలు ఈ రోజు ఏమి జరిగింది అంటే...

janasena 12042018

పవన్ కల్యాణ్ గురువారం వామపక్ష నేతలతో సమావేశం నిర్వహించేందుకు మీటింగ్ ఏర్పాటు చేసారు... అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు మరో ఇద్దరు నాయకులు మధ్యాహ్నం జనసేన కార్యాలయానికి వచ్చారు. కాగా... వీరిని కార్యాలయంలోకి వెళ్ళకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు... తమకు సమాచారం లేదని, లోనికి అనుమతించమంటూ నేతలను అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీలేక దాదాపు ఓ పావుగంట సేపు అలాగే గేటు బయట వామపక్ష నేతలు నిల్చుండిపోయారు.

janasena 12042018

ఇదిలా ఉండగా ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంత సేపటికి వారిని లోపాలకి పంపాల్సిందిగా సెక్యూరిటీకి ఆదేశాలు రావటంతో చివరకు గేట్లు తీశారు. ఆ తర్వాత వామపక్ష నేతలు లోనికి వెళ్లారు... ఇంత సేపు గేటు బయట పడిగపులు కాస్తూ కూర్చున్నారు... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వస్తే, ఆయన్ను లోపలకి పంపించాలన్న సంస్కారం అక్కడ ఒక్కడికి లేదు... అయినా సెక్యూరిటీ కి ఎవరు ఏంటో తెలియదా ? సెక్యూరిటీ ఆపితే, పార్టీ వర్గాలు ఏమి చేస్తున్నాయి ? పావు గంట సేపటి దాకా, గేటు ముందు నుంచున్నారు అంటే, కమ్యూనిస్ట్ లు ఎంత దిగాజారి పోయారో అర్ధమవుతుంది... ఎవడి కర్మకు ఎవరు బాధ్యులు చెప్పండి...

ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, పాదయత్ర స్టైల్ గురించి అందరికీ తెలిసిందే... పాదయాత్ర అంటే ఈయనగారికి ఎంత జోక్ గా ఉందో ఇక్కడే అర్ధమవుతుంది... ఒక రాజకీయ నాయకుడు పాదయత్ర చేస్తే, అది ఎంత పవిత్రంగా చేస్తారో, మనం మన రాజకీయాల్లో చూసాం... రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎలా పాదయాత్ర చేసారు అన్నది, మనకు ఇంకా గుర్తు ఉంది... ఈ జగన్ మాత్రం, ఏంటో తెలియదు... వారినికి రెండు రోజులు కోర్ట్ కు వెళ్ళాలని సెలవు పెట్టి, ఫ్లైట్ ఎక్కి, హైదరాబాద్ లో దిగుతాడు... పోనీ కోర్ట్ కు వెళ్తాడా అంటే, ఇంటికి వెళ్లి, మసాజ్ లు, ఫేషియల్ లు చేపించుకుని, రెస్ట్ తీసుకుని, హాయగా రెండు రోజులు ఎంజాయ్ చేసి, మళ్ళీ పాదయాత్ర అంటాడు...

jagan 12042018 1

వారానికి ఒక రోజు, శుక్రవారం కోర్ట్ కి పోవాలి.. అందుకోసం గురువారం మధ్యాహ్నం నుంచే మనోడు జంప్ అవుతాడు... గట్టిగా నడిచేది 5 రోజులు... మళ్ళీ మధ్యలో పండుగలు అని, అదని, ఇదని, హాలిడే తీసుకుంటాడు... అయితే, ఇన్నాళ్ళు గురవారం మధ్యాహ్నం పాదయాత్ర ఆపేసి వెళ్ళిపోతున్నాడు అంటే, పాపం హైదరబాద్ చేరుకోవాలి అంటే ఇబ్బంది కదా, మళ్ళీ కోర్ట్ కి లేట్ అయితే జడ్జి గారు ఊరుకోరు కాబట్టి వెళ్తున్నాడు అనుకున్నాం... కాని ఈయనగారు ప్రస్తుతం బెజవాడ బోర్డర్ లో ఉన్నాడు... ఉండవల్లి దగ్గర ఉన్నాడు... ఇక్కడ నుంచి ఎవరికైనా హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది ? బస్సులో వెళ్ళే మనమే, నాలుగు గంటల్లో హైదరాబాద్ వెళ్తున్నాం...

jagan 12042018 1

ఈయనగారు, కార్లు వేసుకుని వెళ్తాడు... మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ట్యాగ్ ఒకటి ఉంటుంది కాబట్టి, ట్రాఫిక్ కు కూడా ఫ్రీ చేస్తారు... గట్టిగా కొడితే, మూడు గంటల్లో హైదరాబాద్ లో ఉంటాడు... అలాంటిది, ఒక్క రోజు ముందే ఇంటికి వెళ్ళటం ఏంటి ? అసలు ఇలాంటి పాదయత్ర ఎక్కడన్నా ఉంటుందా ? ఎంత దీక్షగా చేస్తారు, పాదయాత్ర అంటే ? చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంటికి కూడా వెళ్ళలేదు... ఎప్పుడన్నా ఎవరన్న చనిపోయినప్పుడు వెళ్ళినా, అక్కడకు వెళ్లి, వెనక్కు వచ్చేసేవారు.. ఈయన మాత్రం, రెండు రోజులు వెళ్లి లోటస్ పాండ్ లో డొల్లుతాడు... మసాజ్ లు, ఫేషియల్ లు చేపించుకుని, రెస్ట్ తీసుకుని, హాయగా రెండు రోజులు ఎంజాయ్ చేసి, మళ్ళీ పాదయాత్ర అంటాడు... వీళ్ళు ప్రజా నాయకులు...

పట్టుమని నియోజకవర్గానికి 100 ఓట్లు కూడా రాని బీజేపీ, ఆంధ్రప్రదేశ్ కు వార్నింగ్ లు ఇస్తుంది... కర్ణాటక ఎన్నికలు పూర్తయిన వెంటనే, మీ అంతు చూస్తానికి వస్తున్నాం, కాచుకోండి అంటూ, సవాల్ చేస్తుంది... మమ్మల్ని ఇంత అవమానాల పాలు చేసి, దేశంలో మా పరువు తీసిన, చంద్రబాబుని వదిలిపెట్టే సమస్యే లేదు అంటూ, ఎగురుతున్నారు బీజేపీ పెద్దలు... కర్ణాటక మేము గెలుస్తున్నాం, తరువాత మా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే, ఇక్కడ పాగా వేసి, మా సత్తా ఏంటో చూపిస్తాం అంటూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారు... కనీసం కాండిడేట్ లు కూడా దొరకని బీజేపీకి ఇంత ధైర్యం రావటానికి కారణం, పవన్, జగన్... వెళ్ళఇద్దరితో ఏపిలో గేమ్ ఆడబోతున్నారు...

bjp 12042018

నిన్న బీజేపీ నేత మురళీధర్‌రావు, ఒక మీడియా ఛానల్ తో మాట్లాడిన మాటలు కూడా ఇలాగే ఉన్నాయి... 2 నెలల్లో ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు... అంటే, ఎదో భారీ ప్రణాళికతోనే రాబోతున్నారు... చంద్రబాబు చూపిస్తున్న దూకుడు ఊహించిన బీజేపీ పెద్దలు ప్రస్తుతానికి వెనక్కు తగ్గారు కాని, లేకపోతే ఈ పాటికే ఆపరేషన్ గరుడ పూర్తయ్యేది... చంద్రబాబు ఎదురు తిరగటం, వీళ్ళ నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా ఎండగట్టటంతో, మోడీ, అమిత్ షా పరువు గంగలో కలిసింది.. కనీసం, పార్లమెంట్ కూడా నిర్వచించలేక, దద్దమ్మల్లా పారిపోయారు అంటూ, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే, అవి కవర్ చెయ్యటానికి, ఈ రోజు దీక్ష అంటూ కొత్త ఎత్తుగడ వేసారు...

bjp 12042018

మరి, ఇంత ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుని ఎదుర్కోవటానికి, వాళ్ళకి రెండే దారులు... ఒకటి, చంద్రబాబు పై కేసులు మోపి, లోపల వేయించటం... కాని, ఇది కుదరటం లేదు... కేంద్రంలోని అధికారులు, స్వయంగా పియంఓ అధికారులు రంగంలోకి దిగినా, ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చంద్రబాబు పై దొరకటం లేదు... చివరకి లోకేష్ పై కూడా కేసులు కోసం ప్రయత్నిస్తున్నా, ఎక్కడా అవకాసం చిక్కటం లేదు.. అందుకే రెండో ప్లాన్ రెడీ చేస్తున్నారు... అదే కుల గొడవలు... ఆంధ్రప్రదేశ్ లో కుల గొడవలు రేపటం ఒక్కటే మార్గం అని డిసైడ్ అయ్యారు... ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కడా చంద్రబాబు పై వ్యతిరేకత లేదు.. అందుకే కుల గొడవలు రేపటానికి రెడీ అయ్యారు... ఇందు కోసం పవన్, జగన్ ని వాడుకునే ప్లాన్ వేస్తున్నారు... రాష్ట్రంలో ఇక మనం చుదబోయిది ఇదే.. కాని, ప్రజలు అంత పిచ్చోళ్ళా ? 2014లోనే అభివృద్ధి వైపు వోట్ వేసారు ప్రజలు... ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, కులం గురించి పట్టించుకునే వారు ఉన్నారు అనుకోవటం, బీజేపీ అవివేవకం తప్ప, ఏమి లేదు...

Advertisements

Latest Articles

Most Read