ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి స్పెషల్ స్టేటస్. టాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ హామీ ఏడు ఏళ్ళు అయినా అమలు కాలేదు. అనేక విభజన చట్టంలో ఉన్న అంశాలు లాగానే, ఇది పెండింగ్ లోనే ఉంది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఇది రాజకీయ అంశంగా కూడా మారింది. అప్పట్లో ప్రతిపక్షాలు ఈ విషయం పై, తెలుగుదేశం, బీజేపీ పార్టీలను రాజకీయంగా కార్నర్ చేస్తూ వచ్చేవి. మిత్రపక్షంగా ఉంటూ, కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తెలుగుదేశం పార్టీకి, స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయిన అధ్యయనం అని, కేంద్రం నుంచి సమాధానం రావటంతో, షాక్ తిన్నారు. అయితే అప్పటికీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని, స్పెషల్ స్టేటస్ ఇస్తామని, హోదాలో ఉన్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయని, కేంద్రం ప్రకటన చేసింది. హోదా ఎలాగూ ఇవ్వటం లేదు కాబట్టి, ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఒప్పుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా, ఇది కూడా అమలు కాకపోవటంతో, మాకు ఇవన్నీ వద్దు, హోదానే ఇవ్వండి అంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఈ క్రమంలో చంద్రబాబు రాజకీయంగా దెబ్బతిన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, బీజేపీని నమ్మినందుకు, చంద్రబాబు రాజకీయంగా దెబ్బ తిన్నారు. అటు రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు. అయితే ఈ అంశాన్ని మాత్రం, వైసీపీ రాజకీయంగా వాడుకుంది. హోదానే ఎన్నికల అజెండా చేసారు జగన్ మోహన్ రెడ్డి. దానికి తగ్గాటే, హోదా సాధిస్తారని, 22 ఎంపీ సీట్లు ఇచ్చారు ప్రజలు.

అయితే ఎన్నికలు గెలవటం మొదలు, హోదా విషయం అటకెక్కింది. కేంద్రం మెడలు వంచలేం అని, ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప ఏమి చేయలేమని జగన్ చెప్పేశారు. ఇలా 16 నెలలు గడిచిపోయాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో రాజకీయం మారింది. బీజేపీకి మిత్రపక్షాలు దూరం అవుతున్నాయి. అధికారంలో ఉండి కూడా ఇలా జరుగుతూ ఉండటంతో, ఇప్పుడు కేంద్రం కొత్త మిత్రుల కోసం వెతుకుతుందని, అందుకే జగన్ మోహన్ రెడ్డిని రెండు సార్లు ఢిల్లీ పిలిచారని, వైసీపీని కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని, మంత్రి పదవులు ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో హోదా విషయంలో క్లారిటీ లేకుండా, మంత్రివర్గంలో చేరితే రాజకీయంగా నష్టపోతాం అని జగన్ చెప్పటంతో, కేంద్ర పెద్దలు మళ్ళీ స్పెషల్ ప్యాకేజి విషయం తెర పైకి తెచ్చారని, ఇది వరకు ఇచ్చిన ప్యాకేజి కంటే మెరుగైన ప్యాకేజి ఇస్తామని, హోదా కంటే లాభం అని చెప్పినట్టు తెలుస్తుంది. ఒకసారి బీజేపీ ఫిక్స్ అయితే, జగన్ కు ఆప్షన్ ఉండదు కాబట్టి, ఆయన ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే హోదా పోయి, మళ్ళీ ప్యాకేజి వచ్చినా, అది ఎంత వరకు కేంద్రం ఇస్తుంది, ఎంత వరకు రాష్ట్రానికి లాభం, ఇవన్నీ చర్చకు వస్తాయి. మరి జరుగుతున్న ప్రచారం నిజమేనా ? స్పెషల్ ప్యాకేజి ఇస్తున్నారా ? జగన్ పార్టీ కేంద్ర క్యాబినెట్ లో చేరుతుందా ? చూడాలి ఏమి జరుగుతుందో.

యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ, రఘురామకృష్ణం రాజు, ఈ రోజు కూడా రాజధాని రచ్చబండ కార్యక్రమంలో మీడియా ముందుకు వచ్చారు. అయితే ప్రతిసారి కంటే, ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పై అందరూ ఆసక్తికరంగా ఎదురు చేసారు. నిన్న రఘురామకృష్ణం రాజు కంపెనీ పై సిబిఐ దాడులు జరిగాయి. అయితే ఇదే సమయంలో, ఆయన ఇళ్ళ పై కూడా సిబిఐ దాడులు జరిగాయి అంటూ, కొన్ని మీడియా ఛానెల్స్ ప్రసారం చేసాయి. అయితే వీటి పై నిన్న సాయంత్రమే స్పందించిన రఘురామకృష్ణం రాజు, అది బ్లూ మీడియా సృష్టి అని, తన ఇళ్ళ పై ఎలాంటి సిబిఐ దాడులు జరగలేదని, తాను ఇప్పుడు ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా అని, ఈ విషయం పై అసలు ఏమి జరిగింది, దీని వెనుక ఎవరు ఉన్నారు, లాంటి మొత్తం వ్యవహారం పై రేపు మీడియాతో మాట్లాడతానని, అందరూ అది తప్పకుండా చూడండి అంటూ, చెప్పటంతో, ఈ రోజు ఆయన ఏమి చెప్తారా అనే ఆసక్తి నెలకొంది. అనుకున్నట్టె ఆయన కొన్ని సంచలన విషయాలు చెప్పారు. తన కంపెనీ తమిళనాడులో ఉందని, ఆ కంపెనీ కోసం 1500 కోట్ల అప్పు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తెసుకున్నానని, అక్కడ ప్రభుత్వం విండ్ ఎనర్జీ తీసుకోకపోవటం, డబ్బులు ఇవ్వకపోవటంతో నష్టపోయానని, అప్పటి వరకు 700 కోట్లు కట్తానని, ఇంకా 800 కోట్ల దగ్గర ఇబ్బంది రావటంతో, వన్ టైం సెటిల్మెంట్ కు మాటలు నడుస్తున్నాయని అన్నారు.

అయితే ఈ లోపే మా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ, త్వరలో మంత్రి అవుదామని అనుకుంటున్న వ్యక్తీ, ఆ బ్యాంక్ వారితో మాట్లాడి ఈ కేసు మూవ్ చేసారని, అందుకే మొన్న మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చి, వారితో కూడా ప్రత్యేకంగా కలిసారని రఘురాం రాజు తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నన్ను ఏదో చేసానని అనుకుంటున్నారని, నాకు ఏమి అవ్వదని, విచారణలో అన్ని వివరాలు సిబిఐకి చెప్తానని, దానికి నన్నేదో వీళ్ళు చేసేసినట్టు, మోడీ గారు ఏదో వీళ్ళకు సహకరించినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారని, కానీ వీరికి అంత సీన్ లేదని అన్నారు. తాను ఎంక్వయిరీ చేస్తే, ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి, ఎవరు అయితే రాష్ట్ర యంత్రాంగం మొత్తం తన చేతిలో పెట్టుకుని ఉన్నాడో, ఆయన కేంద్రంలో ఫైనాన్స్ డిపార్టుమెంటు లో ఉన్న తన సహచర బ్యాచ్ మేట్ ద్వారా, ఈ కధ మొత్తం నడిపినట్టు తనకు తెలిసింది అంటూ, ఐఏఎస్ అధికారి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే తన పై తప్పుడు వార్తలు రాసిన సాక్షి పై పరువు నష్టం దావా వేద్దాం అనుకుంటే, రేపో మాపో జైలుకు పోయే వాళ్ళకు, ఈ శిక్ష ఎందుకులే అంటి మా లాయర్లు చెప్తే వదిలేసానని, మరో మూడు నాలుగు నెలల్లో, ముగ్గురు కీలక నాయకులు జైలుకు పోతారని రఘురాంరాజు అన్నారు.

జేసి దివాకర్ రెడ్డి, చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు. ఈ మది జేసి ప్రభాకర్ రెడ్డి పై వరుస కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తరువాత, జేసీ చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసారు. జేసి దివాకర్ రెడ్డికి తాడిపత్రి సమీపంలో గనులు ఉన్నాయి. అయితే మైనింగ్ అధికారులు ఆ గనుల వద్దకు వెళ్లి, జేసీ దివాకర్ రెడ్డి గనులు సోదాలు చేసారు. అయితే పక్కన ఉన్న అధికార పార్టీ గనులు సోదాలు చేయలేదని జేసీచెప్తున్నారు. గనులు క్లోజ్ చేసేందుకు, అధికార పార్టీ నేతలు స్కెచ్ వేస్తున్నారని, ఇందులో వచ్చే ఆదాయంతోనే తాము బతుకున్నామని, ఇది లేకుండా చేసి ఆర్ధికంగా దెబ్బ తీయాలని ప్లాన్ చేసారని జేసీ అన్నారు. ఇప్పటికే అనేక ఇబ్బందులు పెట్టారని జేసి అన్నారు. అధికారం శాశ్వతం కాదని, అందరికీ తిరిగి చెల్లిస్తామని, తగిన సత్కారం చేస్తామని అన్నారు. మైన్స్ పై జరుగుతున్న దాన్ని ప్రశ్నించటానికి వస్తే, నేను వస్తున్నా అని తెలిసి ఏడీ వెళ్లిపోయాడని, నా భార్యతో వచ్చి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉందని జేసి అన్నారు.. ఆయన మాటల్లో, " నా మైన్స్ లో సోదాలు చేసారు. ఇది నక్స-లైట్ ల కోసం వచ్చి సాధించేది కాదు. పర్సనల్ గా నా కుటుంబం పై కక్ష సాధించేందుకు చేసింది. ఇప్పటికే ఎన్ని రకాల బాధలు పెట్టాలో, అన్ని రకాల బాధలు పెట్టారు. పక్కగా ఉన్న సరే, ఏది లేకపోతే, ఎస్సీ ఆక్ట్ పైన పెట్టి, లోపల వేయటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తిట్టాడు, తిట్టలేదో వాళ్ళకి అవసరం లేదు. దొరికితే ఎస్సీ ఆక్ట్ పెట్టి లోపల వేస్తున్నారు. ఇంకోటి ఎదో లారీలు, బస్సుల దాంట్లో సంబంధం ఉందని, దాంట్లో ఇరికించారు. కక్ష సాధింపులో భాగంగా. అయితే ఇప్పటి వరకు దివాకర్ రెడ్డిని టచ్ చేయలేక పోయారు. "

"మావాడు మావాడు అంటూ ఉంటాను కదా, అందకే నా పైన లవ్ అనుకుంటా, ఆ సంబంధం ఏమైనా గుర్తుకు వచ్చిందో ఏమో కానీ, ఇంత కాలం నా మీదకు రాలేదు. నా తమ్ముడు మీదకు వెళ్ళారు. ఇప్పుడు నా మీదకు వస్తున్నారు. వాళ్ళు నాకు చెప్పకపోయినా, వాళ్ళ వ్యవహారం నాకు తెలుసు కాబట్టి, నా గనులు క్లోస్ చేసే దానికి, స్కెచ్ వేసి తయారు చేసి రెడీ అయ్యారు. ఒకటి నా భార్య పేరిట ఉంది. నాకు , నా భార్యకు అది తప్ప ఏమి లేదు. దాంట్లో ఏమైనా వస్తే నాకు బ్రతుకు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది కొత్త స్టైల్ లో, నా పొట్ట కొట్టి, బ్రతుకు మీద కొట్టి, చంపేయటానికి చేస్తున్న ప్రయత్నాలు. ఏదో ఒకటి చేసి, ఆ మైన్ నడవకుండా చెయ్యాలని, ఒక సంకల్పంతో వచ్చారు. అది అడగటానికి ఇక్కడ వస్తే అధికారి లేడు. ఇలాగే చేస్తే ఇక నేను, నా భార్య ఇక్కడకు వచ్చి ధర్నా చెయ్యాలి. ఆఫ్ట్రాల్ ఒక ట్రాన్స్ఫర్ కి భయపడి, ఈ అధికారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు రూల్స్ ఏమి లేవు, ఈ ప్రభుత్వంలోనే లేవు. ఒక నియంత చెప్పింది, చేయటమే వాళ్ళకి తెలుసు. ఆ నియంత ఎంత కాలం ఉంటాడో లేదో వీళ్ళకు తెలుసా. " అని జేసి అన్నారు.

సామాన్యంగా సాక్షి మీడియా అంటే, తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. సాక్షి అవినీతితో పెట్టింది అని, దానికి జర్నలిజం విలువలు లేవని, కోర్టు కేసుల్లో ఉన్న సాక్షి, ఎదుటి వారి పై బురద చల్లటానికి మాత్రమే ఉపయోగిస్తారని, తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. అయితే నెల్లూరు తెలుగుదేశం నేత, సాక్షి అధినేత జగన్ మోహన్ రెడ్డి భార్య, వైఎస్ భారతికి ధన్యవాదాలు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగు, తెలుగుదేశం, వైసీపీ మధ్య ధాన్యం కొనుగోళ్ళ విషయంలో మాటల యుద్ధం నడుస్తుంది. దీంతో రెండు పార్టీల నేతల మధ్య ప్రతి రోజు, విమర్శలు నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారు కోట్లు వెనకేసుకుంటున్నారని, రైతులు నష్టపోతున్నారని వాపోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలకు, వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ళలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తెలుగుదేశం హయంలోనే జరిగాయని, తమ పాలన అంతా ట్రాన్స్ పేరెంట్ గా ఉందని, తెలుగుదేశం నేతలు కావాలనే తమ పై బురద చల్లుతూ, రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని వాపోయారు.

అయితే తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలకు బలం చేకూరుస్తూ, వైసిపీ సొంత పత్రిక సాక్షి నెల్లూరు ఎడిషన్ లోనే, ధాన్యం కొనుగోళ్ళలో భారీ అక్రమాలు జరిగాయి అంటూ వార్త వచ్చింది అంటూ, వా వార్త చూపిస్తూ తెలుగుదేశం నేతలు మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం నేత ఆనం వెంకట రమణారెడ్డి మీడియా ముందుకు వచ్చి, ఆ కధనం చూపిస్తూ, జరిగిన అక్రమాల పై మేము చెప్పింది నిజం అయ్యింది అంటూ, మీ పత్రికే రాసింది అంటూ, ఇన్నాళ్ళు దీని పై మా మీద విమర్శలు చేసిన వారు ఏమి సమాధానం చెప్తారు అంటూ, ఎదురు దాడి చేసారు. ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ స్కాంలో ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలోనే ఈ అక్రమాలు జరిగాయని, దానికి సాక్షి పత్రిక కధనమే నిదర్శనం అని, ఏ స్థాయిలో అక్రమాలు జరగకపోతే, సొంత పత్రికే రాస్తుంది అంటూ, ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సాక్షి పత్రికలో మొదటి సారి ఒక నిజం చూస్తున్నానని, ఈ వార్త సాక్షిలో వేసినందుకు వైఎస్ భారతి గారికి ధన్యవాదాలు అంటూ, ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read