విజయనగరం పార్లమెంటుపై చంద్రబాబు సమీక్ష చేసారు. ఈ సమావేశంలో టిడిపి ప్రజా ప్రతినిధులు, మండల కమిటీల బాధ్యులు పాల్గున్నారు. ఈ సందర్భంగా, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, జిల్లాలో జరుగుతున్న వాటి పై చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఆయన మాటల్లో "ఉత్తరాంధ్ర జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నారు. 2,500ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం అభివృద్దికి టిడిపి శ్రీకారం చుట్టింది. మెయింటెనెన్స్ రిపేర్లు(ఎంఆర్), కార్గోలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉండేవి. వైసిపి వచ్చాక అందులో 500ఎకరాలు తగ్గించారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కు తెరదీశారు. కోజికోడ్ లో జరిగిన విమాన ప్రమా-దంలో అనేకమంది ప్రా-ణా-లు కోల్పోవడం తెలిసిందే. రన్ వే, ఎమ్మార్, కార్గో కుదించి భోగాపురాన్ని ఏం చేద్దామని వైసిపి నాయకులు అనుకుంటున్నారు..? క్లిష్ట పరిస్థితుల్లో విజయనగరం జిల్లా రైతాంగం ఉంది, అన్నివర్గాల ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారు. ఎటువంటి అభివృద్ది ఆలోచనలు వైసిపికి లేవు. విజయవాడ విమానాశ్రయం విస్తరణకు రైతులు 900 ఎకరాలు ఇస్తే వాళ్లకు కూడా అన్యాయం చేశారు. టిడిపి హయాంలో వాళ్లకు అమరావతిలో భూములిచ్చాం, అలాంటిది అమరావతినే నాశనం చేయడంతో భూములిచ్చిన రైతుల భవిష్యత్ అంధకారం అయ్యింది. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయానికి టిడిపి ప్రభుత్వం భూములు ఇచ్చి, ప్రహరీగోడ నిర్మాణం కూడా పూర్తిచేస్తే, దానిని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనే దురుద్దేశంతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని అక్కడ నుంచి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. "

"చక్కగా నడిచిపోతున్న మాన్సాస్ ట్రస్ట్ ను అస్తవ్యస్తం చేశారు. మా తండ్రి పివిజి రాజు 1954లో శ్రీకాకుళంలో ఇచ్చిన 345ఎకరాల భూ విరాళంతో విజయనగరం సత్రంలో 450మంది విద్యార్ధులు నాలుగున్నర దశాబ్దాలుగా ఉచిత భోజన వసతి లభిస్తోంది. సత్రం భూములు ఒక జిల్లాలో, లబ్దిదారులు మరో జిల్లాలో, దేవాలయం ఇంకో జిల్లాలో ఉన్నాయి. అలాంటిది వీటిపై నిర్వహణ కలెక్టర్లకు అప్పగిస్తే, భూములకు భద్రత లేక, సత్రం నిర్వహణ అస్తవ్యస్థమై, బడుగు బలహీన వర్గాల విద్యార్ధులకు తీరని నష్టం జరుగుతుంది. ట్రస్ట్ లో డబ్బులు పుష్కలంగా ఉన్నప్పటికీ, గోశాలలో గోవులు చ-ని-పో-వ-డం బాధాకరం. 37 దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందులు పడుతుంటే, వాటికి ఆ కొరత లేకుండా ట్రస్ట్ నుంచి తీర్చాం. సామాజిక ధర్మం కోసం పెట్టిన మాన్సాస్ ట్రస్ట్ ను ఇప్పుడు నిర్వీర్యం చేయడం చూస్తుంటే బాధేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ట్రస్ట్ భూముల్లో అవకతవకలు చేస్తున్నారు. ఎండో మెంట్, మైనింగ్, రెవిన్యూ శాఖల మధ్య చెలగాటం ఆడుతున్నారు ...దాతల ఆశయాలను, ట్రస్ట్ లక్ష్యాలకు తూట్లు పొడిచేలా సీఎం జగన్ చర్యలు ఉన్నాయి. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు అటకెక్కాయి. సేద్యం, ఎండోమెంట్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేశారు. చంపావతి, గోసాని,తోటపల్లి తాగునీటి పథకాలన్నీ నిర్లక్ష్యం చేశారు. " అని అశోక్ గజపతి రాజు, చంద్రబాబుకు చెప్పారు. అన్ని విషయాల పై గట్టిగా పోరాడాలని, పార్టీ కూడా అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపటం లేదు అంటూ, గత ఏడాది దాఖలు అయిన పిటీషన్ పై, గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చి ఎన్నికలు జరపమని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల వరకు వెళ్ళింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచం మొత్తానికి క-రో-నా వచ్చి ఇబ్బంది పెట్టటంతో, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ప్రారంభించింది. దీంతో రోజు రోజుకీ ముప్పు ఎక్కువ అవ్వటంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేసింది. అయితే ఈ కేసు మరో సారి మొన్న హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్బంగా విచారణ చేసిన హైకోర్టు ఎందుకు ఎన్నికలు జరపటం లేదు అని అడగగా, ప్రభుత్వం తరుపు న్యాయవాది క-రో-నా ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితిలో ఎన్నికలు జరపలేమని తేల్చి చెప్పారు. అయితే దీని పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధం అవుతున్నారు కదా, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలే కదా అంటూ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చి, వారి అభిప్రాయం కోరింది. ఎన్నికల నిర్వహణ పై తమ అభిప్రాయం చెప్పాలి అంటూ, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

దీంతో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ ఏమి చెప్తారు అనే దాని పై ఆసక్తి నెలకొంది. ఆయన మేము ఎన్నికలు ఈ సమయంలో జరపలేం అంటే ఇబ్బందే ఉండదు. అదే ఎన్నికలు జరపే అవకాసం ఉందని చెప్తే మాత్రం, మళ్ళీ ప్రభుత్వం వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ఆసక్తిగా మారింది. మరో పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తమ అభిప్రాయం చెప్పే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గతంలో అంటే వాయిదా కాబట్టి ప్రభుత్వ సహకారం అవసరం లేదు, ఇప్పుడు ఒక వేళ ఎన్నికలు జరపాలి అంటే మాత్రం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ సహకారం అవసరం అవుతుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందా, లేకపోతే పరిస్థితి అంచనా వేసి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధత ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. చూద్దాం ఇది ఏమి అవుతుందో.

తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడుగారు ఇదివరకు గుమ్మనూరువారి ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి బెంజ్ కారు ఆధారాలు చూపించారు. ఇప్పుడు గుమ్మనూరు భూస్కామ్ గురించి ఆధారాలు చూపించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో, ఇట్టిన ప్లాంటేషన్ అనే సంస్థకు చెందిన 203 ఎకరాలను, దొంగ సంతకాలతో మంత్రి జయరాం కైవసం చేసుకున్నారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. 2005లో కర్నూలు జిల్లాలో, ఇట్టిన కంపెనీ కోసం మహాబలేశ్వరప్ప, మంజునాథ్ అనే వ్యక్తులు, 450 ఎకరాలు కొన్నారని, మహాబలేశ్వరప్ప 2008లో మరణించటంతో ఆయన కొడుకులు కంపెనీ డైరెక్టర్లుగా చేరారరాణి, 2009 మార్చి 31న ఇట్టినా డైరెక్టర్ పదవి నుంచి మంజునాథ్ తప్పుకున్నారని, అయితే, 10 ఏళ్ళ తరువాత మంజునాథ్ ని ముందుకు తీసుకోవచ్చి, కంపెనీ భూములు అమ్మెందుకు పవర్ ఆఫ్ అటార్నీ ఉందని, ఫోర్జరీ పత్రాలతో, 203 ఎకరాలు మంత్రి జయరాం కొనుగోలు చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపణ. తన భార్య పేరిట 30.83 ఎకరాలు, తమ్ముడు భార్య పేరిట 30.53 ఎకరాలు, మరో తమ్ముడు పేరిట 31.58 ఎకరాలు, మరో నలుగురు బినామీ పేరున రాయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

ఇట్టినా సంస్థ ఆ భూములను రైతుల నుంచి కొనేటప్పుడు స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ భూములన్నీ మంత్రి గుమ్మనూరు వారి సొంతమైపోయాయని, దీని పై కేసులు ఉన్నా పట్టించుకోలేదని, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది క్షేత్రస్థాయిలో పర్యటన కూడా చేసి, ఇవి వాస్తవాలు అంటూ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. దీని పై పూర్తి ఆధారాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ లు, అన్నీ తీసుకుని, హైకోర్ట్ లో కేసు వెయ్యటానికి కూడా తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. అయితే సరిగ్గా ఇక్కడే ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. ఈ భూములు వ్యవహారం పై మంత్రి భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కంపెనీ ఎండీ మను, మాజీ డైరెక్టర్ మంజునాథ్ సహా, మరికొంత మంది పై కేసు పెట్టారు. మంజునాథ్‍ అనే వ్యక్తికి భూములు అమ్మే హక్కు ఇస్తూ కంపెనీ బోర్డ్ తీర్మానం చేసి, ఇప్పుడు కంపెనీ మాట మార్చింది అంటూ, మంత్రి గారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

అమరావతి విషయంలో కేసులు రోజు వారీ విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే, అమరావతిలోని సెక్రటేరియట్, రాజ్ భవన్, అసెంబ్లీ, సియం కార్యాలయం, ఇతర డిపార్టుమెంటులు, కార్పొరేషన్ భవనాలు, విశాఖకు తరలించకుండా, ఇక్కడే ఉంచాలి అంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే మిగతా భవనాలు ఇప్పుడు తరలించే ఉద్దేశం మాకు లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే సియం క్యాంప్ కార్యాలయం ఎక్కడైనా పెట్టుకునే హక్కు మాకు ఉందని, అలాగే వివిధ కార్పొరేషన్ ఆఫీస్ లు ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని కోర్టుకు తెలిపింది. పలానా చోటు మాత్రమే క్యాంపు కార్యాలయం ఉండాలని ఎక్కడా లేదని, కోర్టుకు తెలపటంతో, దీనికి సంబంధించిన మొత్తం వివరాలు తమకు సమర్పించాలని, కోర్టు ఆదేశించటంతో, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు నిన్న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సియం క్యాంప్ ఆఫీస్ లు అయినా పెట్టుకునే హక్కు ఉందని అన్నారు. జిల్లాకి ఒకటి అయినా పెట్టుకోవచ్చని ఆయన తన కౌంటర్ లో తెలిపారు. క్యాంప్ కార్యాలయం అమరావతిలోనే ఉండాలి, మరెక్కడా ఉండకూడదు అనే హక్కు పిటీషనర్ కు లేదని ఆయన కౌంటర్ లో తెలిపారు.

క్యాంప్ ఆఫీస్ ఒక్క చోటే ఉండాలనే చట్టం ఎక్కడా లేదని, సిఆర్డీఏ చట్టంలో కూడా, ఈ నిర్వచనం ఎక్కడా లేదని తెలిపారు. ఇప్పుడు ఉన్న చోటు నుంచే ముఖ్యమంత్రి ఉండాలని, అక్కడ నుంచి వేరే చోట పెట్టకూడదు అనే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. అందుకే ఈ పిటీషన్ ను కొట్టేయాలని తమ కౌంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని కోరింది. ఈ పిటీషన్ పై రేపు విచారణ జరగనుంది. ఇక మరో పక్క కార్పొరేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది కాబట్టి, మిగతా కార్యాలయాలు తరలించటం లేదని, కార్పొరేషన్ల విషయంలో, ఇప్పటికే అనేక చోట్ల ఇవి ఉన్నాయి కాబట్టి, వాటికి ఇవి వర్తించదని, గుంటూరు, కృష్ణాలో ఉన్న కార్పొరేషన్ ఆఫీస్ లకే, ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి అంటూ, ఆ కార్పొరేషన్ ల లిస్టు ని, హైకోర్టుకు సమర్పించారు. అమరావతి రాజధాని తరలింపు పిటీషన్ల పై రేపు, మరోసారి విచారణ జరగనుంది.

Advertisements

Latest Articles

Most Read