స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో, ప్రతిపక్ష నేత పేరు ఉండాలి అంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయటం లేదు అంటూ, 2019లో హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ పిటీషన్ పై గతంలో ఒకసారి విచారణ జరిగి, వాయిదా పడింది. మళ్ళీ ఈ రోజు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు, కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో ప్రతిపక్ష నేత పేరు ఉండాలి అని చెప్పి, గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను , రాష్ట్ర హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. సెక్యూరిటీ కమిషన్ లో, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు పేరు లేకపోవటం పై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా, ఆయన పేరు నమోదు చేసి, నెల రోజుల్లో జీవో ఇవ్వాలి అని చెప్పి, రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత పేరుని రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్ లో చేర్చాలి అని కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఇలా చేర్చకపోవటం అనేది సుప్రీం కోర్టు తీర్పుకి ఆదేశాలకు, పూర్తిగా విరుద్ధం అని కూడా రాష్ట్ర ప్రభుత్వాని పై హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ, ఈ లోపు ప్రతిపక్ష నేత పేరును, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో చేరుస్తూ, జీవో జారీ చేయాలని, రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీనికి సంబంధించి, నాలుగు వారాల్లో, ఈ జీవోని రాష్ట్ర హైకోర్టుకు అందించాలని కూడా రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిసెంబర్ 26, 2019న, ప్రభుత్వం స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ని నామినేట్ చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ జీవోలో హోం మంత్రి, చీఫ్ సెక్రటరీ, హోం సెక్రెటరి, హెడ్ అఫ్ పోలీస్ ఫోర్సు (ఎక్ష్ ఆఫిషియో సెక్యూరిటీ), మరో ముగ్గురుని నియమిసు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆనవాయతీ ప్రకారం, అలాగే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కూడా, రాష్ట్ర ప్రతిపక్ష నేత, ఈ రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్ లో ఒక మెంబర్ గా ఉండాలి. అయితే ఈ జీవో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం లేకుండా, రాష్ట్ర ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు పేరు అందులో లేకపోవటంతో, హైకోర్టులో ఈ విషయం పై పిటీషన్ దాఖలు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించలేదని, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరటంతో, దీనికి సంబంధించి ఈ రోజు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ప్రతిపక్ష నేతను స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో చేర్చి, జీవో జారీ చేయాలనీ ఆదేశాలు జరీ చేసింది.

జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు న్యాయముర్టులలో ఒకరైన జస్టిస్ ఎన్వీ రమణ పై ఆరోపణలు చేస్తూ, ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బాబ్డే కు రాసిన లేఖ పై ఢిల్లీ బార్ అసోసియేషన్, అత్యంత ఖటినమైన, తీవ్రమైన పదజాలంతో ఖండించింది. జగన్ ఇటువంటి దుశ్చర్యలు మానుకోవాలని చెప్పింది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ పై ఆయన బురద చల్లే ప్రయత్నం చేసారని, ఇటువంటి చర్యలు వల్ల న్యాయ వ్యవస్థకు ఎటువంటి మచ్చ రాదు కనీ, ఈ చర్యల వల్ల న్యాయ వ్యవస్థ పై జగన్ చేస్తున్న చర్యల పై మాత్రం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ రోజు ఢిల్లీ బార్ అసోసియేషన్ జరిపిన సమావేశంలో, ఒక తీర్మానాన్ని కూడా ఆరోపించారు. ఆ తీర్మానంలో అత్యంతకఠినమైన వ్యాఖ్యలు జగన్ పై వాడారు. ఏదైతే న్యాయ వ్యవస్థ పై నికృస్టంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించారని, ఇలాంటి పనులు ఆయన మానుకోవాల్సి ఉందని, అతని చర్యల పై అందరు ఖండించాలని చెప్పారు. అలాగే జస్టిస్ ఎన్వీ రమణ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలుసు అని, ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కూడా చేసారని, ఆయన నిబద్ధత ఏమిటో మాకు తెలుసని అన్నారు. అత్యుత్తమ న్యాయమూర్తులు కలిగిన వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణకు పేరు ఉందని అన్నారు.

ఆయన పై ఆరోపణను ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నామని ఈ లేఖలో రాసారు. అంతే కాకుండా, జగన చర్యలు, స్వచ్చంద న్యాయ వ్యవస్థ పై దాడి జరపటమే అని మేము భావిస్తున్నామని తెలిపారు. ఇలాంటి న్యాయ వ్యవస్థను బెదిరించటానికి, జగన్ చేస్తున్న పనులను మేము ఖండిస్తున్నామని, న్యాయమూర్తుల పై జగన్ చేసిన ఆరోపణలలో ఎలాంటి హేతు బద్ధత లేదని, ఈ లేఖలో తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 6 న లేఖ రాసిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెందిన ప్రతినిధి అజయ్ కల్లం రెడ్డి, మీడియా సమావేశం పెట్టి చెప్పటం, ఆ లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేయటం, వీటి అన్నిటి పై , ఢిల్లీ బార్ అసోసియేషన్ ఖండించింది. ఈ లేఖ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, కాబట్టి జగన్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్ అసోసియేషన్ భావించింది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నామని, మొత్తం వ్యవహారం పై చర్యలు తీసుకోవాలని తమ తీర్మానంలో తెలిపారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో మంగళవారం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వివిధ అంశాల పై సీనియర్ నేతలతో చర్చించారు. క-రో-నా కేసులు, అమరావతి ఉద్యమం, భారీ వర్షాలతో రైతుల ఇబ్బందులు, రైతులకు మోటార్లు తదితర అంశాల పై చంద్రబాబు మాట్లాడారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న హాట్ టాపిక్ అయిన, న్యాయవ్యవస్థ పై ఆరోపణల విషయం పై కూడా చంద్రబాబు స్పందించారు. దేశంలో ఎప్పుడూ చూడని పరిణామాలు చూస్తున్నామని అన్నారు. ముందుగా సోషల్ మీడియాలో జడ్జిలను టార్గెట్ చేసారని, ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తుల పైనే ఫిర్యాదులు చేస్తూ, 16 కేసుల్లో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఇలా చేయటం మరో వింత అని చంద్రబాబు అన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన లాలూ ప్రసాద్ యాదవ్, మధుకోడా, జయలలిత, ఓం ప్రకాష్ చౌతాలా, శిబుసోరెన్ వంటి వారి పై కూడా ఇలాంటి అభియోగాలే ఉన్నా, వారు ఎప్పుడు ఇలా న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై ఇలాంటి క్యారక్టర్ అసాసినేషన్ చేయలేదని అన్నారు. వారికి అధికారం చేతిలో ఉన్నా, వ్యవస్థలపై దా-డి చేసే దుస్సాహసానికి ఎప్పుడు తెగబడలేదని గుర్తు చేసారు.

ఎప్పుడూ లేని దుర్మార్గపు పాలన మన రాష్ట్రంలో నడుస్తుంది, నేర ప్రవర్తి ఉన్న వాళ్ళకు అధికారం వస్తే ఎలా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. ఒక తప్పు చేస్తారని, ఆ తప్పు కప్పిపుచ్చుకోవటానికి, మరో పెద్ద తెప్పు చేస్తున్నారని, ఈ క్రమంలో మంచి చెడు లేకుండా, విచక్షణ లేకుండా ప్రవర్తించంటం, జగన్ మోహన్ రెడ్డికి నిత్యకృత్యం అయిపోయిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్ప కూల్చేసారని, ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థ పైనే దా-డి చేసారని అన్నారు. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారంతో అపోహలు కలిగించటం, తన పై అంటిన బురదను ఇతరులకు అంటించటం, జగన్ మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయిందని, చంద్రబాబు అన్నారు. ప్రజాప్రతినిధుల కేసులు ఏడాదిలో తెల్చేయాలని కోర్టు ఇప్పుడు చెప్పలేదని, ఆ ఆదేశాలు ఇప్పుడు అమలు చేస్తుంటే, అదేదో తన కోసమే చేస్తున్నట్టు, జగన్ మోహన్ రెడ్డి కంగారు పడి, ఏకంగా కోర్టుల పైనే టార్గెట్ పెట్టటం బరితెగింపునకు పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు.

అమరావతి పై ఇప్పటికే 230 పిటీషన్ల దాకా హైకోర్టులో దాఖలు అయ్యాయి. ఈ కేసులను 18 విభాగాలుగా విభజించిన హైకోర్టు, వీటి పై ఇప్పటికే విచారణ ప్రారంభించింది. అనుబంధ పిటీషన్ల పై విచారణ కూడా ముగిసి, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. ఇప్పటికే రోజు వారీ విచారణ కూడా ప్రారంభం అయ్యింది. అయితే ఇక మెయిన్ పిటీషన్ పై వాదనలు, నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు వాదనలు జరిగే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో హైకోర్టులో ఈ రోజు మరో ఆసక్తికర పిటీషన్ దాఖలు అయ్యింది. అమరావతి రాజధాని విషయం పై కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలి అంటూ, విఎల్ కృష్ణా అనే ఒక లా స్టూడెంట్, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించి, ఇప్పుడు మాట మార్చిందని పిటీషన్ లో తెలిపారు. అలాగే రైతులతో కుదుర్చుకున్న ల్యాండ్ పూలింగ్ అగ్రిమెంట్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని, అందుకే ఈ కేసు ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాల్సిందిగా కోరారు. గతంలో అన్ని ప్రముఖ కేసులు పై లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వచ్చు అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుని ఉదాహరించారు.

అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా మాట మార్చింది, శాసనసభ, మండలిలో ఏమి జరిగింది, మిగతా అంశాలు అన్నీ ప్రజలకు తెలిసే అవకాశాలు ఉన్నాయని పిటీషన్ లో తెలిపారు. రాష్ట్ర ప్రజానికానికి, ఇప్పటికీ ఈ కేసుల పై పూర్తి అవహగన లేదని, మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఒక సైడ్ తీసుకుని వచ్చే వార్తలతో, ప్రజలకు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదని అన్నారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో చెప్పిన కొన్ని ఆర్టికల్స్ ని పిటీషన్ లో ఉదాహరించారు. అలాగే ఈ కేసులో వచ్చే తీర్పు ఏ రాజకీయ పార్టీకి, గెలుపు, ఓటమి కాదు అంటూ, అలా చర్చించకూడదు అంటూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హైకోర్టుని తప్పుగా చుపెట్టేలా పోస్టింగ్ లు ఉంటున్నాయని, హైకోర్టుని పార్టీలకు అంటగట్టి మాట్లాడుతున్నారని, అలాంటి వారిని శిక్షించాలని కోరారు. ఈ నేపధ్యంలోనే కేసు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తే, అసలు ఏమి జరుగుతుంది, మంచి చెడులు ప్రజలే నిర్ణయం తీసుకుంటారని తన పిటీషన్ లో కోరారు.

Advertisements

Latest Articles

Most Read