నిన్న హైకోర్టులో హెబియస్‌ కార్పస్ పిటీషన్ల పై విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా, రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందో లేదో తేలుస్తాం అంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపధ్యంలో, నిన్న జరిగిన విచారణ ఆసక్తి కలిగించింది. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన హైకోర్టు ధర్మాసనం, ఈ వ్యాఖ్యలు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక న్యాయవాదిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు అంటూ దాఖలు అయిన పిటీషన్ ను మంగళవారం విచారణలో చేర్చాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు మాట్లాడుతూ, ఈ మొత్తం హెబియస్‌ కార్పస్ పిటీషన్లను పరిగణలోకి తీసుకుని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందో లేదో తమ వాదనల్లో చెప్పాలని, న్యాయవాదులని కోర్టు ఆదేశించింది. దంపతులను అక్రమంగా నిర్బంధించారు అంటూ దాఖలు అయన పిటీషన్ సందర్భంగా, ఆ పిటీషన్ ఉపసంహరించుకోవాలి అంటూ, పిటీషన్ వేసిన న్యాయవాదిని పోలీసులు బెదిరించారు అంటూ పిటీషన్ లో తెలిపిన వాటి పై, ప్రభుత్వం తరుపున ప్రత్యేక కౌన్సిల్ ఈ కేసుని వాదించారు.

తాము ఎవరినా నిర్బంధించలేదని అన్నారు. ఆ న్యాయవాది ఇంట్లో పోలీసులు తనిఖీ చేసిన మాట వాస్తవమే అని, కానీ కేసు కేసుకు దానికి సంబంధం లేదని, అది వేరే కేసుకు సంబంధించి, పోలీసులు ఆ న్యాయవాది ఇంట్లో సోదాలు చేసారని కోర్టుకు తెలిపారు. న్యాయవాది పై కేసు ఉపసంహరించుకోమని ఎలాంటి ఒత్తిడులు తేలేదని తెలిపారు. జరిగిన ప్రాసెస్ లో కొన్ని లోపాలు ఉన్నాయని, అయితే అది కావాలని చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా చేసిన జ్యుడీషియరీ విచారణ కూడా సరిగా లేదని వాదనలు వినిపించారు. అయితే దీని పై స్పందించిన కోర్టు, జ్యుడీషియరీ రీవిచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయని పిటీషనర్ తరుపు వారు చెప్తుంటే, మీరు మాత్రం దానితో ఒప్పుకోవటం లేదు కాబట్టి, దీని పై స్వతంత్ర సంస్థతో ఎంక్వయిరీ చేయమని కోరతామని , స్వతంత్ర సంస్థతో ఎందుకు ఎంక్వయిరీ చేయకూడదో చెప్పాలని కోరారు. అయితే పోలీస్ ఉన్నతాధికారులు ఎవరూ ఇందులో లేరు కాబట్టి, అవసరం లేదని ప్రభుత్వ తరుపు న్యాయవాది చెప్పగా, విచారణ ఈ రోజుకి వాయిదా పడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రెస్ మీట్ పెట్టి, సుప్రీం కోర్టు జస్టిస్, హైకోర్టు జస్టిస్ ల పై, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను మేఇద్య సమావేశంలో బహిర్గతం చేయటం పై, సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు అయ్యింది. ముక్తి సింగ్ అనే న్యాయవాది, తన క్లైంట్ సునీల్ కుమార్ సింగ్ తరుపున ఈ పిటీషన్ దాఖలు చేసారు. భవిష్యత్తులో జడ్జిలను కించపరుస్తూ ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే జగన్ మోహన్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఎందుకు చర్యలు తీసుకోకూడదో అడగాలని తన పిటీషన్ లో కోరారు. ఆ ప్రెస్ మీట్ తో పాటు, మీడియాకు విడుదల చేసిన అంశాలు అన్నీ, గౌరవ సుప్రీం కోర్టు జస్టిస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా, కావాలని చేసినట్టు ఉందని తన పిటీషన్ లో తెల్పారు. సుప్రీం కోర్టు జస్టిస్ పై, అలాగే హైకోర్టు జస్టిస్ ల పై, చేసినవి అన్నీ నిరాధార ఆరోపణలు అని కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలో ఉన్న పరిధి దాటి, జగన్ మోహన్ రెడ్డి స్పందించారని కోర్టుకు తెలిపారు. పార్లమెంట్ లో కానీ, రాష్ట్రాల అసెంబ్లీలలో కానీ, ఏ సుప్రీం కోర్టు జడ్జి గురించి కానీ, ఏ హైకోర్టు జడ్జి చేసే డ్యూటీ గురించి మాట్లాడకూడదని రాజ్యాంగంలో ఉందనే విషయం గుర్తించుకోవాలని పిటీషన్ లో తెలిపారు.

ఈ ఇంటర్నెట్ యోగంలో, సోషల్ మీడియా బాగా ఆక్టివ్ గా ఉన్న సమయంలో, ఇలాంటి నిరాధార ఆరోపణలు, నిమిషాల్లో వైరల్ అవుతాయి అని, ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మోకం కోల్పోయే అవకాసం ఉందని పిటీషన్ లో తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ప్రమాణం చేస్తారని, ఆ ప్రమాణం ప్రకారం, రాజ్యాంగానికి లోబడి ఉండాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో దేశ న్యాయవ్యవస్థ పై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే, పౌర సమాజనికి, న్యాయ వ్యవస్థ పై నమ్మకం పోయే అవకాసం ఉంటుందని తన పిటీషన్ లో తెలిపారు. ఈ కేసు సుప్రీం కోర్టు విచారణకు తీసుకుంటుందా ? తీసుకుంటే ఎప్పుడు విచారణకు వస్తుంది ? సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకు ఈ కేసు వస్తుందా అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ చర్యను రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుంది ? ఎలాంటి వాదనలు వినిపిస్తారు అనే దాని పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. చూద్దాం ఏమి అవుతుందో.

అమరావతి 300 రోజుల ఉద్యమం సందర్భంగా నారా లోకేష్, ఈ రోజు అమరావతిలో పర్యటించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన వివిధ శిబిరాల్లో పాల్గున్నారు. వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గుని, ప్రసంగించారు. తన కార్యక్రమం ముగుసిన తరువాత, అయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఇటీవల న్యాయ వ్యవస్థ పై జగన్ రాసిన లేఖ గురించి లోకేష్ వద్ద ప్రస్తావించగా, లోకేష్ ఇలా స్పందించారు. "నేను దీని మీద స్పందించదలుచుకోలేదు. వాళ్ళు ఏమి చేయాలి అనుకుంటున్నారో, మనకు అర్ధం అవుతుంది. మన దౌర్భాగ్యం కాకపొతే, 16 నెలలు జైలుకి వెళ్ళినవాడు, 11 సిబిఐ కేసులు తన పై పెండింగ్ ఉన్న వాడు, అలాగే 28 వరకు 420 కేసులు ఉన్న వ్యక్తి, సిబిఐ, ఈడీ, ఫేమా, ఇలా అన్ని రకాల వైట్ కాలర్ నేరాలు చేసిన వ్యక్తిగా అతని ట్రాక్ రికార్డు ఉంది. ఇలాంటి వ్యక్తులు, ఇన్ని కేసులు వారి వెనుక పెట్టుకుని, ఇలాంటి వారు న్యాయవ్యవస్థ పై దాడి చేస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం మాత్రమే కాదు, దేశ సమగ్రతకే ఇలాంటి వారు ముప్పు. " అని లోకేష్ అన్నారు.

ఇక అలాగే అమరావతి ఉద్యమం పై, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై కూడా లోకేష్ స్పందించారు. గత 300 రోజులుగా అమరావతి ప్రజలు పిల్లా పాపలతో, ఉద్యమం చేస్తుంటే, ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదని, వీరి వద్దకు వచ్చి, మీ బాధలు ఏంటి అని అడగలేదని, ఒక్క మంత్రి కానీ, చివరకు స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాలేదని లోకేష్ అన్నారు. రాకపోగా, రైతులను అవమానపరుస్తున్నారని, బూతులు తిడుతున్నారని, వారిని పర్సనల్ గా తిడుతున్నారని, ఇది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని, వారి పోరాటానికి ఎప్పుడూ మద్దతు ఉంటుందని లోకేష్ అన్నారు. అమరావతి పై అనేక ఆరోపణలు చేసారని, ఈ 16 నెలల్లో ఒక్కటంటే ఒక్క ఆరోపణ అయినా రుజువు చేయలేక పోయారని లోకేష్ అన్నారు. అమరావతి అనేది ఒక మంచి మోడల్ సిటీ అని, మన దేశానికీ ఈ శతాబ్దిలో నిర్మాణం అవుతున్న, మంచి మోడల్ సిటీ అని, ఇలాంటి అమరావతిని నిర్వీర్యం చేయకుండా, నిర్మాణం చేయాలని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే గత పది రోజుల్లో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. మొదటి సారి ఢిల్లీ పర్యటనలో కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ని కలిసారు. అయితే సాయంత్రం భేటీ అయిన తరువాత, అమిత్ షా ఆదేశాల ప్రకారం, మరుసటి రోజు కూడా జగన్ , అమిత్ షా ని కలిసారు. ఈ సమావేశంలోనే ప్రధాని కార్యాలయం ప్రధాన కార్యదర్శి కూడా పాల్గున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇదే పర్యటనలో జగన్ వెంట, రిటైర్డ్ సుప్రీం కోర్టు జుస్తిస్ జాస్తి చలమేస్వర్ కుమారుడు కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇక రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అదే సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రతినిధులను కలవటం, తన పై సిబిఐ కేసుకి ఇదే మూలం అంటూ వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీని కలిసిన తరువాత, ఆ భేటీ దేని కోసం జరిగింది అనేది, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి ప్రెస్ నోట్ రాలేదు. బయటకు మాత్రం, ప్రత్యెక హోదా, పోలవరం నిధులు, విభజన హామీలు, తదితర అంశాల పై జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీని కలిసారని చెప్పారు. అయితే శనివారం ప్రభుత్వం విడుదల చేసిన లేఖలు లాంటివి చూసిన తరువాత, న్యాయస్థానంలో ఉన్న జడ్జిల పై కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళారని, ఇది కూడా ఒక అంశం అని అర్ధం అయింది.

అయితే ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న వేళ, జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తారని వార్తలు వస్తున్నాయి. రేపు కాని, ఎల్లుండి కానీ ఆయన ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో రాష్ట్రపతి కోవిండ్, ప్రధాని మోడీ, అపాయింట్మెంట్ కోరారని, అవి రాగానే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయలు దేరి వెళ్తారని అంటున్నారు. అయితే దీని పై మీడియాకు లీకులే కానీ, ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. జగన్ మోహన్ రెడ్డి, కొంత మంది జడ్జిల పై ఫిర్యాదు చేస్తూ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రజాప్రతినిధుల పై ఏడాదిలో కేసులు తెల్చేయలని సుప్రీం కోర్టులో ఒక న్యాయవాది చేసిన తరువాతే, ఇలా చేస్తున్నారని, జాతీయ స్థాయిలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే, జడ్జీల పై ఫిర్యాదు చేయటానికి ఆయన రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ కోరారా ? లేకపోతే కేంద్ర పెద్దలు, జరుగుతున్న పరిణామాల పై చర్చించటానికి పిలిస్తే, ఇలా బయటకు లీకులు ఇస్తున్నారా ? లేక నిజంగానే రాష్ట్ర సమస్యల పై చర్చింటానికి వెళ్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read