ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం అని కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమన్న కేసీఆర్, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తాం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో తెలంగాణ ప్రభుత్వం తరపున ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తప్పిదం అని అన్నారు. తెలంగాణను సంప్రదించకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తీవ్ర అభ్యంతరం చేసారు. "గత వివాదాలను పక్కన పెట్టి ఏపీకి స్నేహ హస్తం అందించాం, భేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించా, అయినా ఏపీ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించలేదు, తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదని" కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇద్దరం పరస్పరం సహకరించుకుని, నీళ్ళు వాడుకుందాం అని అనుకున్నాం, కాని ఏపి చర్య దీనికి విరుద్ధంగా ఉందని అన్నారు. దీని పై ఏపి క్లారిటీ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూ సెక్కుల నుండి 80 వేలకు పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు ముఖ్యమంత్రి తొలిదశలోనే రూ. 7 వేల కోట్ల రూపాయలకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.

కృష్ణానదీ నీటి ప్రవాహానికి సంబంధించి పవర్ మేనేజ్మెంట్ బోర్డు లెక్కల ప్రకారమే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటాయని పేర్కొన్నరు మంత్రి. ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ లెక్కలకు మించి ఒక్క చుక్క అధికంగా వాడుకొనేందుకు ఎవరికీ అవకాశం లేదన్నారు. గత ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వంలో నిత్యం ఘర్షణ వాతావరణం వుండేదని పేర్కొన్న అయన తమ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకొనే విషయంలో వెనుకంజ వేసేది లేదని పేర్కొన్న జలవనరులశాఖామంత్రి. అయితే గతంలో చంద్రబాబు ఇదే విషయం పై, అసెంబ్లీలో మాట్లాడుతూ, పక్క రాష్ట్రంకు మన హక్కులు తాకట్టు పెట్టవద్దు అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడే అదే నిజం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటే, అమరావతి కాదు, రాష్ట్రానికి మూడు ముక్కల రాజధానులు చేస్తాం, ఒక ముక్క విశాఖపట్నంలో, ఒక ముక్క కర్నూల్ లో, ఒక ముక్క అమరావతిలో పెడతాం అంటూ, రాష్ట్ర ప్రభుత్వం, గత ఏడాది సెప్టెంబర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతి రాజధాని అని, 5 కోట్ల ఆంధ్రులకు మంచి రాజధాని కోసం, 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోయారు. జగన్ మోహన్ రెడ్డికి ఎంత మోర పెట్టుకున్నా, పట్టించుకోలేదు. దాదాపుగా 150 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు వెళ్ళే సమయంలో, అమరావతి రాజధాని గ్రామాల మీదుగా వెళ్తున్నా, వాళ్ళు చేస్తున్న ఆందోళనను మాత్రం జగన్ మోహన్ రెడ్డి కాని, ఒక్క మంత్రి కాని, కనీసం ఒక అధికారి కూడా వచ్చి పట్టించుకోలేదు. దాంతో, కొంత మంది రైతులు హైకోర్ట్ మెట్లు ఎక్కారు. ఇదే సందర్భంలో, ప్రభుత్వం, అమరావతి పై కక్ష తీర్చుకునే పనిలో, అనేక పనులు చేసింది అనే ఆరోపణలు ఉన్నాయి.

ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో, వేరే ప్రాంతం వారికి నవరత్నాల పధకంలో భాగంగా, ఇళ్ళ పట్టాలు ఇవ్వటం లాంటివి ఉన్నాయి. అయితే దీని పై కూడా రైతులు ఎదురు తిరిగారు. ప్రభుత్వం ఇక్కడ కూడా దిగి రాక పోవటంతో, హైకోర్ట్ కు ఎక్కారు. విశాఖకు రాజధానిని తరలించే విషయం పై, హైకోర్ట్ లో వాదనలు జరగగా, రెండు బిల్లులు, చట్ట సభల్లో ఉన్నాయని, మండలిలో సెలెక్ట్ కమిటి ముందుకు రెండు బిల్లులు వెళ్లాయని, ప్రభుత్వం కోర్ట్ కు తెలిపింది. దీంతో కోర్ట్ కూడా, ఈ విషయం పై తొందర పడ కుండా, ఈ రెండు బిల్లులు విషయం శాసనమండలిలో తేలే వరకు, ఈ ప్రక్రియ ముందుకు వెళ్ళదు కాబట్టి, వాయిదా వేసుకుంటూ వస్తుంది. ఇదే సందర్భంలో, మరో వార్త అమరావతి రైతులను కంగారు పెట్టింది.

సచివాలయ ఉద్యోగులు సమావేశం అయ్యి, మే నెల నాటికి విశాఖ వెళ్ళాలి అంటూ, కొంత మంది తీర్మానించటంతో, మళ్ళీ రైతులు కోర్ట్ మెట్లు ఎక్కారు. దీని పై సమాధానం చెప్పాల్సిందిగా, హైకోర్ట్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం, కీలక విషయాలు చెప్తూ, అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని తరలింపు, పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. చట్ట సభల్లో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయిని, దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తైన తరువాతే రాజధాని తరలింపు పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం కోర్ట్ కు తెలిపింది. సెక్రటేరియట్ ఉద్యోగుల సమావేశం గురించి తమకు సమాచారం లేదన్న ఏపీ ప్రభుత్వం, ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉందని కోర్ట్ కు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణను నిలిపివేయాలని కౌంటర్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ఎల్జీ పాలిమర్స్ కు టిడిపి హయంలోనే భూమి ఇచ్చింది అంటూ, వైసీపీ చేస్తున్న ప్రచారం పై చంద్రబాబు స్పందించారు. "ఈ కంపెనీకి భూములు టిడిపి ప్రభుత్వమే ఇచ్చిందనడం పచ్చి అబద్దం. హిందుస్తాన్ పాలిమర్స్ కు 1964 నవంబర్ 23న అప్పటి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం జీవో 2177ద్వారా 213ఎకరాల భూమిని ఎకరం రూ2,500 రేటు మీద అందజేసింది. ఈ భూమికి 1992 అక్టోబర్ 8న అప్పటి ప్రభుత్వం జీవో 1033 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. హైకోర్టు సూచనల మేరకే టిడిపి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది, దానిపై దుష్ప్రచారం చేయడం వైసిపి దివాలాకోరుతనం. ఎల్జీ పాలిమర్స్ లో పాలిస్టైరీన్, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్, ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తి జరుగుతుంది. 2018డిసెంబర్ లో స్టైరీన్ ఉత్పత్తికి టిడిపి ప్రభుత్వం అనుమతించిందనే ప్రచారంలో వాస్తవం లేదు. ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తిని, స్టైరీన్ ఉత్పత్తితో ముడిపెట్టడం దివాలాకోరుతనం. వైసిపి అధికారంలోకి వచ్చాకే మొదటి రెండు ఉత్పత్తుల(పాలిస్టైరీన్, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్)కు అనుమతించారు, కేంద్రానికి సిఫారసు చేశారు. వాస్తవాలను వక్రీకరించి వైసిపి దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం." అని చంద్రబాబు అన్నారు.

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధితులకు అండగా ఉన్న టిడిపి, తదితర ప్రతిపక్షాల నాయకులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. రూ కోటి వద్దు-కూతురే కావాలనే తల్లిపై కేసులు పెట్టడం కన్నా అమానుషం మరొకటి లేదని ధ్వజమెత్తారు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి, చితికి పోయిన పేదలపై భారాలు మోపడాన్ని గర్హించారు. కరోనా నుంచి ప్రజలను ఆదుకునే చర్యలు వదిలేసి, కరెంటు ఛార్జీలు రెట్టింపు వసూళ్లు చేయడాన్ని ఖండించారు.

అటు ఆర్ధికంగా, ఇటు ఆరోగ్యపరంగా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. సమస్యలను పరిష్కారం చేయడం చేతగాక కొత్త సమస్యలు సృష్టించడమే పనిగా వైసిపి నాయకులు పెట్టుకున్నారు. ఏదో ఒకటి మాట్లాడటం, ఎదురుదాడి చేయడం, తప్పించుకుపోవడం వైసిపి నాయకులకు పరిపాటి అయ్యిందని దుయ్యబట్టారు. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కోవాలని, బాధిత ప్రజలకు అండగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. టిడిపి నాయకులపై, ప్రతిపక్షాలపై, బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వాకంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా లాక్ డౌన్ అనంతరం విద్యుత్ బిల్లులు రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఫిబ్రవరి నెల్లో రూ.640లు వచ్చిన బిల్లు మార్చిలో కూడా అదే క్రమంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలని సిబ్బంది కరోనా కారణంగా బిల్లులు ఇవ్వరని ఆ శాఖ తెలిపింది. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా ఆ సరాసరి ప్రకారం వినియోగదారులు 90శాతం మంది ఆన్లైన్లో చెల్లించారు. తీరా మే నెలలో విద్యుత్ బిల్లులు చూస్తే సామాన్యుడి గుండె పగిలినట్లుగా భావించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీలకు 300 యూనిట్లు లోపు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకున్నప్పటికి దాదాపుగా 50 శాతానికి పైగా ఎస్సీ వినియోగదారులు బిల్లులు మోతపై నోటిమీద వేలువేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే 3నెలలుగా మధ్య తరగతి ప్రైవేటు ఉద్యోగులకు పనుల్లేక, చేతివృత్తి దారులు ఇళ్లకే పరిమితమైన సందర్భంలో విద్యుత్ వినియోగం పై ఛార్జీలు పెంచి వసూళ్లు చేయాలన్న ఆ శాఖ తీరును ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏప్రిల్ నెల బిల్లు సరాసరి కట్టినప్పటికి అధికంగా విద్యుత్ వినియోగం జరిగినట్లు యూనిట్లు పెరగడంతో పాటు టారిప్లు పెంచడం జరిగిందని ఆశాఖాధికారులు వివరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై లాక్ డౌన్ అమలు కారణంగా పనులు, వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మధ్యతరగతి, ప్రైవేటు, చేతివృత్తి దారులు అత్యధికంగా అద్దె ఇళ్ల లోనే జీవనం సాగిస్తున్నారు.

దీనికి సంబంధించి సిటీ పరిధిలో అద్దె రూ. 5 వేలు చెల్లిస్తున్న ఒక వ్యక్తికి విద్యుత్ బిల్లు రూ.6వేలు రావడంపై తీవ్ర మనోవేదనకు గురైనట్లు వివరించారు. లాక్ డౌన్ నేపధ్యంలో కూడా ఏఏఎపిడిసిఎల్ అధికారులు విద్యుత్ వినియోగదారుల పై బిల్లుల రూపంలో మానసిక దాడి చేసినట్లుగా ఉందన్న అభిప్రాయం ప్రజల నుండి వ్యక్తమవుతోంది. కరోనా నేపధ్యంలో అన్ని కుటుంబాలు ఇళ్లకే పరిమిత కావడం వాస్తవమే అయినప్పటికి ఇన్ని రెట్లు విద్యుత్ చార్జీలు పెరగడం పై ఆశాఖ తీరును వినియోగదారులు తప్పుబడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా అన్ని రాష్ట్రాల పరిధిలో ప్రైవేటు వ్యాపారసంస్థలు, కర్మాగారాలు, వైద్యశాలలు, ఫ్యాక్టరీలు మూతవడి ఉండగా, దీంతో ప్రభుతానికి వినియోగం తగ్గి ఉండాల్సి ఉండగా కొనుగోలు కూడా తగ్గిన నేపధ్యంలో రాష్ట్రానికి కొంత నష్టం తగ్గిందని చెప్పవచ్చు.

Advertisements

Latest Articles

Most Read