చంద్రబాబు పై ఎప్పుడూ విష ప్రచారమే. ఆయన అధికారంలో ఉన్నా, ఆయన అధికారంలో లేకున్నా విష ప్రచారమే. తమ వాదన కరెక్ట్ అని చెప్పుకోవటానికి, వైసిపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తమ అనుకూల మీడియాలో, అలాగే పైడ్ సోషల్ మీడియా క్యాంపైన్ ద్వారా, ఎదో జరిగిపోతుంది అంటూ, విషం చిమ్ముతూనే ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఇది చంద్రబాబు, తెలుగుదేశం వైఫల్యం. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవటానికి, ఈ విష ప్రచారం కూడా ఒక కారణం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, అదే విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి అంటే, వైసిపీకి ఎంత మంటో అందరికీ తెలిసిందే. మొన్నటి దాక అమరావతి మునిగిపోతుంది అని ప్రచారం చేసే వారు గుర్తుందా ? అయితే ఇప్పుడు వరదలు వస్తున్న సంగతి తెలిసిందే.

house 14082019 2

కృష్ణా కరకట్ట పై ఉన్న చంద్రబాబు నివాసం పై , ఇప్పుడు విష ప్రచారం మొదలు పెట్టారు. చంద్రబాబు నివాసంలోకి నీళ్ళు వచ్చేసాయని, సిమెంట్ బస్తాలు వేసి, వరదను ఆపుతున్నారని, చంద్రబాబుని సురక్షిత ప్రాంతానికి తరలించారు అంటూ, విష ప్రచారం చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు నిన్న హైదరాబాద్ వెళ్లారు. ఆయన చెయ్య నొప్పి కారణంగా, చికిత్స చేయించుకుంటానికి హైదరాబాద్ వెళ్లారు. అయితే, వీళ్ళు మాత్రం, చంద్రబాబుని భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజగా చంద్రబాబు ఉంటున్న నివాసం దగ్గర పరిస్థితి పై ఫోటోలు విడుదల అయ్యాయి, ఆ ఫోటోల్లో ఎక్కడా, చంద్రబాబు నివాసం దగ్గరకు నీళ్ళు రాలేదు.

house 14082019 3

ఎప్పుడూ ఎలా ఉంటుందో, నీళ్ళు అలాగే ఉన్నాయి. ఎప్పటి లాగే చంద్రబాబు నివాసంతో పాటు, మిగతా కరకట్ట భవనాలు ఉన్నాయని, ఫోటోలు చూస్తే తెలుస్తుంది. మరి, ఈ విష ప్రచారం ఎందుకు ? తమ వాదన కరెక్ట్ అని చెప్పుకునే ప్రయత్నమా ? వరద ఇలాగే వచ్చినా ఇబ్బంది ఉండదు, ఎందు కంటే, గేటులు అన్నీ ఎత్తేసి, నీళ్ళు కిందకు వదులుతున్నారు. వీళ్ళు ఏదైనా కుట్ర పన్ని, గేటులు మూసేసి, కావలని చేస్తే తప్ప, ఇప్పుడు వస్తున్న వరదకు, చంద్రబాబు ఇంటికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఒక వేళ వచ్చినియ్యే అనుకుందాం, ఏమి అవుతుంది ? రెండు రోజులు బయట ఉంటారు. కొన్ని వేల కుటుంబాలు, కరకట్ట పై ఉంటాయి, వారు చేసేది అదేగా ? ఈ మాత్రం దానికి ఈ పైశాచిక ఆనందం దేనికి ? వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వారి సంగతి చూడాలి కాని, ఎంత సేపు రాజకీయమేనా ? అందుకే చంద్రబాబు వీళ్ళను సైకోలు అనేది.

జగన్ ప్రభుత్వానికి, జపాన్ దేశం షాక్ ఇచ్చింది. షాక్ మాత్రమే కాదు, ఘాటు లేఖ కూడా రాసింది. జగన్ ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ, కొంచెం స్పీడ్ తగ్గించుకోండి అంటూ, ఘాటుగా చెప్పింది. పునరుత్పాదక ఇంధన రేట్ల విషయంలో, జగన్ ప్రభుత్వం మొండిగా వెళ్తున్న సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబు టార్గెట్ గా, గత ప్రభుత్వంలో కుదురుచుకున్న విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష జరిపి, కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళ్తుంది. అయితే ఇదే విషయం పై, ఇప్పటికే కేంద్రం మూడు సార్లు అలా చెయ్యద్దు అంటూ ఉత్తరం రాసింది. అలాగే ట్రిబ్యునల్ కూడా చీవాట్లు పెట్టింది. చివరకు 42 కంపెనీలు, హైకోర్ట్ కు వెళ్ళటంతో, హై కోర్ట్ కూడా మొట్టికాయలు వేసింది. అయినా జగన్ మాత్రం తగ్గటం లేదు. ఎంత మంది చెప్పినా మొండిగా వెళ్తున్నారు.

japan 14082019 2

ఇప్పటికే అనేక మంది బిజినెస్ అనయలిస్ట్ లు, ఇలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్టుబడులు పెట్టటానికి ఎవరు రారని హెచ్చరిస్తున్నా, జగన్ మాత్రం ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో, ఇప్పుడు ఏకంగా జపాన్ ప్రభుత్వం, కేంద్రానికి కాకుండా, ఏకంగా జగన్ ప్రభుత్వానికే లేఖ రాయటం సంచలనం అనే చెప్పాలి. దేశాలు దాటి, వేరే దేశాలు చేత కూడా, మొట్టికాయలు వేయించుకుంటున్నారు. ఇండియాలో జపానీస్ ఎంబాసిడర్ కెంజి హిరమత్సు జగన్‌కు ఘాటు లేఖ రాసారు. మీ చర్యలు నిశితంగా పరిశీలిస్తున్నాం. గతంలో చేసిన ఒప్పందాలు మళ్ళీ సమీక్షించటం ఏంటి అంటూ, హెచ్చరించారు.. ఇలా అయితే, ఎవరూ పెట్టుబడులు పెట్టరు అంటూ హెచ్చరించారు. భారత దేశ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలోకి ఫ్రాన్స్, సౌతాఫ్రికా, యూరోప్ దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్న టైంలో, ఇవేమీ నిర్ణయాలు అంటూ జపాన్ ఆక్షేపించింది.

japan 14082019 3

జపాన్‌కు చెందిన కంపెనీలు మన దేశంలో పెట్టుబడి పెట్టారు. వారిలో ముఖ్యంగా ఎస్.బి. ఎనర్జీ, రెన్యూ ఎనర్జీ అనే సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఎస్.బి. ఎనర్జీ సంస్థలో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, సాఫ్ట్ బ్యాంక్ భారీ పట్టుబడులు, ఈ రంగంలో పెట్టాయి. పెట్టుబడులు వాతావరణం ఇంత బాగా ఉంటే, ఇప్పుడు కనుక జగన్ ప్రభుత్వం, గత కాంట్రాక్టులను రద్దు చేసుకున్నా, పునఃసమీక్షించినా దాని ప్రభావం దేశ వ్యాప్తంగా, ఈ సంస్థలు పెట్టిన పెట్టుబడులు పై పడతాయి. అంతే కాదు, కొత్తగా వచ్చే కంపెనీలు కూడా, ఈ వైఖరితో పెట్టుబడులు పెట్టటానికి భయపడతాయి. ఇప్పటికైనా జగన్ గారు, చంద్రబాబు మీద కక్ష సాధింపు ఆపితే, రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా మంచి జరుగుతుంది.

చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్ళు, మా జాతి మా జాతి అంటూ, చంద్రబాబు సానుకూలంగా ఉన్నా సరే, ఆయన్ను ఇబ్బంది పెడుతూ, కాపు రిజర్వేషన్ల అంశం పై, ముద్రగడ ఉద్యమాలు చేసేవారు. ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే, పెద్ద ఉద్యమం చేసి, రైలు కూడా తగలబెట్టి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసారు. చంద్రబాబు కాపులకు ప్రత్యెక కార్పొరేషన్ పెట్టారు, కాపుల్లో ఉన్న పేదలను ఆదుకున్నారు. తరువాత కాపు రిజర్వేషన్ పై, బిల్లు పెట్టి, కేంద్రానికి కూడా 2017లో పంపించారు. అయినా ముద్రగడ మాత్రం, చంద్రబాబు పై సణుగుతూనే ఉన్నారు. తరువాత కేంద్రం 10 శాతం అగ్రవర్ణాలకు రిజర్వేషన్ తీసుకు రావటంతో, జనాభా ప్రాతిపదికన, కాపులకు అందులో 5 శాతం రిజర్వేషన్ ఇస్తూ, చంద్రబాబు జీఓ ఇచ్చారు.

mudragada 13082019 2

ఇలా చేస్తే, బీసిలకు కూడా ఇబ్బంది ఉండదు అని భావించారు. ఇంత చేసినా , ముద్రగడ మాత్రం, చంద్రబాబు పై విషం చిమ్ముతూనే వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే, చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కాపు రిజర్వేషన్ ఎత్తేసారు. అయితే ముద్రగడకు ఆ విషయం పై స్పందించటానికి, రెండు రోజులు పట్టింది. ఇది కూడా ఎదో ఒక లేఖ జగన్ కు రాసారు అంతే. ఇదే పని చంద్రబాబు చేసి ఉంటే, ముద్రగడ ఎలా చేసే వారో ఒకసారి ఊహించండి. అయితే, ఇప్పుడు జగన తో వర్క్ అవ్వదు అనుకున్నారో, లేక జగన్ ను కాకుండా, ప్రధాని మోడీనే ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నమో కాని, ఇప్పుడు ప్రధాని మోడీకి లేఖ రాసారు. ఈ లేఖలో మాత్రం, చంద్రబాబు చేసిందే మాకు ముద్దు అంటూ, చంద్రబాబు మాకు ఎంతో చేసారు అనే విధంగా ఉత్తరం రాసారు.

mudragada 13082019 3

02.12.2017న అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన 33/2017 కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన తన లేఖ ద్వారా మోడీకి విజ్ఞప్తి చేశారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ బిల్లు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్ లో ఉందని చెప్పారు. తక్షణమే చంద్రబాబు అప్పట్లో పంపించిన ఆ బిల్లును ఆమోదించాలని, కాపు రిజర్వేషన్లకు మోడీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. అంటే, ఇప్పుడు ముద్రగడకు చంద్రబాబు విలువ ఏంటో తెలిసి వచ్చిందా ? లేక ఇది కూడా రాజకీయమా ? లేకపోతె ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్ ని ఏ ఇబ్బంది పెట్టకుండా, కేంద్రం పైకి నెట్టేసి, మోడీని దోషిగా చూపించే కొత్త ఎత్తుగడా ? ఏది నిజం అనేది కాలమే సమాధానం చెప్తుంది.

జగనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కేసులో, కోర్ట్ కు తీసుకువెళ్లగానే, కొత్త ట్విస్ట్ వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో పోలీస్ స్టేషన్ ను, రాపాక ముట్టడించారని, ఆయన పై నాన్ బైలబుల్ కేసులు పెట్టారు. దీంతో ఆయాన ఈ రోజు రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే ఈ సందర్భంగా, రాపాకను కస్టడీకి విధించాలని, రాజోలు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు రాపకను హాజరుపరిచారు. అయితే ఈ సందర్భంలో, పోలీసులకు అనుకోని ట్విస్ట్ ఇచ్చింది కోర్ట్. రాపాకను కొన్నాళ్ళు జైల్లో ఉంచాలనే ప్రభుత్వ పెద్దల ప్లాన్ బెడిసికొట్టింది. రాపాకను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే విధానం ఇది కాదని పోలీసులను కోర్ట్ మందలించింది. విజయవాడ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పోలీసులకు సూచించారు.

rapaka 13082019 2

కోర్ట్ లో పోలీసులకు క్కెదురు కావడంతో రాపాకను స్టేషన్ కు తీసుకొచ్చి, స్టేషన్ బెయిల్ ఇస్తామని పోలీసులు కోర్ట్ కి చెప్పారు. దీంతో రాపాకను స్టేషన్ బెయిల్ పై విడిచి పెట్టారు. రాపాకను అరెస్ట్ చేసి లోపల వేసి, వేధించవచ్చు అనే ప్లాన్ మాత్రం ప్రభుత్వ పెద్దలకు బెడిసి కొట్టింది. అయితే అంతకు ముందు, మలికిపురం పోలీస్ స్టేషన్ ను తన అనుచరలుతో కలిసి, ముట్టడించిన కేసులో పోలీసులు రాపాక వరప్రసాద్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను జారీ చేసారు. రాపాకతో పాటు ఆయన అనుచరులు అయిన 30 మంది జనసేన కార్యకర్తల పై సెక్షన్‌ 143,147,148,341,427 r/w 149 ఐపీసీ, 7 సీఎల్ఏ - 1932, 3పీడీపీపీఏ సెక్షన్ల కింద రాజోలు పోలీసులు కేసు నమోదు చేసారు. దీంతో రాపాక అరెస్ట్ ఖాయం కావటంతో, ఆయనే వచ్చి లొంగిపోయారు.

rapaka 13082019 3

దీని పై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఇంత చిన్న కేసు విషయంలో, ఇలా ఎందుకు చేస్తున్నారో, అని పవన్ కళ్యాణ్ అన్నారు. గోరుతో పోయే దాన్ని, గొడ్డలి దాక తెస్తున్నారని అన్నారు. పరిస్థితి చేయి దాటితే, నేను కూడా అక్కడకు వచ్చి కూర్చుంటాను అని అన్నారు. అయితే ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యేల పై కక్ష తీర్చుకుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక పక్క నిన్న, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఒక పత్రికాధినేత పై దాడి చేసి, చంపేస్తాను అని బెదిరిస్తే, ఆయన కేసు పెడితే, ఇప్పటి వరకు పోలీసులు ఆ ఎమ్మెల్యేను విచారణకు పిలవలేదు. అలాంటిది, ఇంత చిన్న విషయంలో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read