మూడు రాజధానుల ఏర్పాటుకు ఒకవైపు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం సరికొత్త అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో మరో పాచికను ప్రయోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులపై అధికారపక్షాన్ని ఇరుకుపెట్టిన తెదేపా, ఇప్పుడు తాజాగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. గత సమావేశాల్లో మాదిరిగానే ఈసారి కూడా జగన్ సర్కారుకు ఝలక్ ఇవ్వాలని భావిస్తోంది. తాజాగా సోమవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో కొద్దిసేపు మాట్లాడిన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఈ మేరకు ఒక ప్రకటన చేసి, భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. గత సమావేశాల్లోలాగా గందరగోళం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని, ప్రతిపక్షాన్ని గౌరవించాలని లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుందని, ఈ ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు.

ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే గవర్నర్ ప్రసంగిస్తారని, అయితే ఈ ప్రసంగంలో మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు అంశాలను ప్రస్తావించవద్దని ఇప్పటికే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించామన్నారు. ప్రభుత్వం తమ మాటను గౌరవించకపోతే గవర్నర్ ప్రసంగాన్ని కూడా తిరస్కరించాల్సి ఉంటుందని, అప్పుడు సంక్షోభం తలెత్తుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఈ అంశంలో చిత్తశుద్ధి లేదని, కనీసం గవర్నర్ అయినా ఈ ప్రసంగాన్ని చదివే ముందు తిరస్కరణకు గురైన బిల్లుల అంశం ఉందో.. లేదో సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. అని సూచించారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగాన్ని ఎక్కడా తిరస్కరించడం జరగదని, అయితే తమ ముందు ఉన్న ప్రత్యామ్నాయ అవకాశం అంతకు మించి లేదని యనమల స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం తిరస్కరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టమంట కలుస్తుందని, అందుకే ఈ అంశంలో ప్రభుత్వం దిగి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే అభివృద్ధి వికేంద్రీకరణ సీఆర్డీయే బిల్లులనురూల్-71 కింద శాసనమండలిలో తిరస్కరించామని, అయితే ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు వాటిపై చర్చ సాగించి ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీ కార్యదర్శిని ప్రభుత్వం బెదిరించి సెలక్ట్ కమిటీ ఏర్పడకుండా ఆ ప్రక్రియకు అడ్డు పడుతోందని, ఈ నేపథ్యంలోనే తమతో పాటు మండలి చైర్మన్ షరీఫ్ క వాడా గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారన్నారు.

మండలిలో ప్రతిపక్ష పార్టీగా తమ హక్కులను ఎవరూ అడ్డుకోలేరని, ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే గతంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని యనమల హెచ్చరించారు. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దుపై ప్రభుత్వం క్షణాల్లో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి, ఆమోద ముద్ర వేసి అరగంటలోనే శాసనసభలో ఆమోదించుకుందని చెప్పారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం అప్రజాస్వామికంగా జరగడంతో మండలిలో తాము అడ్డుకున్నామన్నారు. తమకు ఉన్న సంఖ్య బలంతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించామని, సెలక్ట్ కమిటీ ప్రక్రియను పూర్తి చేసి ఉంటే ఇప్పటికే సగం పని పూర్తి అయ్యేదని, ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి వల్లే దీనికి విఘాతం కలిగిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయని, దీనికి ప్రధాన కారణం జగన్ అని యనమల వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ చరిత్రలో జగన్‌ను సరిపోల్చడానికి ఎవరూ లేరని, ఇండియాలో తుగ్లక్ మహాయుడు, జర్మనీలో హిట్లర్, ఇటరీలో ముసోలిన్, రోమ్ లో నీరో చక్రవర్తిని కలిపిన ఆయనకు సాటి రారని ఎద్దేవా చేశారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వ్యక్తిగత స్వార్థం ఉందని, స్వార్థం మినహా ప్రజల సంక్షేమం ఏ మాత్రం లేదని విమర్శించారు.

పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఈ రోజు పోలీసులు హౌస్ అరెస్ట్ లో ఉంచారు. చింతమనేని ఈ రోజు చలో అమరావతికి పిలుపు ఇచ్చిన నేపధ్యంలోనే, ముందస్తు చర్యగా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చలో అమరావతి కోసం, దెందులూరు నుంచి దాదాపు 200 కార్లలో అమరావతి బయల్దేరేందుకు సిద్ధమైన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, చింతమనేని ఇంటికి చేరుకున్నారు. అక్కడ నుంచి అమరావతి వచ్చి, అమరావతిలో నిరసనలు చేస్తున్న రైతులకు, మద్దతు ఇవ్వాలని, చింతమనేని భావించారు. అయితే అనుకున్న దాని కంటే, ఎక్కవు మంది ఈ కార్యక్రమంలో పాల్గునటానికి వచ్చారు. అయితే, వారిని అడ్డుకున్న పొలీసులు, చింతమనేనిని హౌస్ అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఇది కొనసాగుతూ ఉండగానే, పోలీసుల కళ్లు గప్పి చింతమనేని అమరావతికి పయనమయ్యారు. చలో అమరావతి నిర్వహించి తీరుతాం అని అన్నారు.

chintamaneni 030320201 2

ఇక మరో పక్క, మూడు రాజధానుల ప్రకట నను ఉపసంహరించుకుని, అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు సోమవారం నాటికి 78వ రోజుకు చేరగా ఇప్పటికే పలు రూపాల్లో, వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ వచ్చిన రైతులు ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతం 29 గ్రామాల్లో నిరసనలు కొనసా గాయి. సోమవారం తుళ్లూరు, మందడం, వెలగ పూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బేతపూడి, కుర గల్లు, పెదపరిమి, ఉండవల్లి, తాడికొండ అడ్డరోడ్డు, తదితర ప్రాంతాల్లో రైతులు, మహిళలు రిలే దీక్షలు, మహాధర్నాలను కొనసాగించారు. రాయపూడి గ్రామంలో మహిళలు ఒంటికాలిపై నిలబడి, మోకా క్లపై కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడి రాజధానిగా అమరావతినే కొనసా గించాలని డిమాండ్ చేశారు. మందడం గ్రామంలోని చర్చిలో మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్ధనలు, ఉపవాస దినాలు ఆచరించారు.

chintamaneni 030320201 3

జగన్మోహనరెడ్డి మనసును మార్చి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రార్ధనలు నిర్వహిం చారు. ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుండి వచ్చిన రైతులు రాజధాని గ్రామాల్లో నిర్వహి స్తున్న దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు, మహి శలు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చిన తమపై ఈ విధంగా కక్షపూరి తంగా వ్యవహరించడం తగదన్నారు. రాజధాని గ్రామాల్లో అన్ని వర్గాల వారు ఉన్నారని, ఓ సామాజిక వర్గం ముద్ర వేసి విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని హితవుపలికారు. ఎస్సీ నియోజకవర్గమైన తాడికొండ పరిధిలోని మండల, గ్రామాల ప్రజలం దరూ ఓట్లు వేస్తేనే వైసీపీ విజయం సాధించిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. నాడు అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగిన సమయంలో 30 వేల ఎకరాలు కావాలని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చెప్పలేదా అని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయంతో మా జీవితాలు వీధిన పడ్డా యని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయం చేయాలని కోరితే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. కాగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, పలువురు వామపక్ష నేతలు పాల్గొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రప్రభుత్వం బీసీలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియలో ఆయా వర్గాలకు అన్యాయం చేయడానికి జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థానికసంస్థల్లో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, నేడున్న వైసీపీప్రభుత్వం కావాలనే ఆ మొత్తాన్ని తగ్గించడా నికి ‍యత్నిస్తోందన్నారు. 59శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన జగన్, నేడు కావాలనే తనపార్టీ వారిని కోర్టులకు పంపి, వాటిని 50శాతానికి కుదించేయత్నాలు చేస్తున్నాడన్నారు. వైసీపీకి చెందిన బోయ రామాంజనేయులుని (రాఫ్తాడు మండల వైసీపీ కన్వీనర్) కోర్టుకి పంపిన జగన్ సర్కారు, హైకోర్టులో కూడా బీసీలకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించడంలో విఫలమైందన్నారు. స్థానికసంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగేలా కోర్టు తీర్పురావడానికి జగన్ ప్రభుత్వమే కారణమని రవీంద్ర దుయ్యబట్టారు.

రాజధాని విషయంలో తన పంతం నెగ్గించుకోవడానికి రూ.5కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి న్యాయవాదిని నియమించిన జగన్మోహన్ రెడ్డి, బీసీల రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనకోసం, అనుభవజ్ఙుడైన న్యాయవాదిని ఎందుకు నియమించలేదన్నారు. బీసీలకోసం కనీసం రూ.కోటికూడా ఖర్చుచేయకపోవడంవల్లే, బలహీనవర్గాలవారు తమహక్కులు కోల్పోయే దుస్థితి దాపురించిందన్నారు. జగన్ ప్రభుత్వం హైకోర్టులో సరిగా వాదనలు వినిపించలేకపోయినందునే, రిజర్వేషన్లు 55శాతానికి పరిమితం చేయబడ్డాయని, దానివల్ల బీసీలు దాదాపు 10శాతం స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 59శాతం రిజర్వేషన్లు అమలై ఉంటే, బీసీలకు 39శాతం వరకు రిజర్వేషన్లు దక్కేవన్నారు. వైసీపీప్రభుత్వం వచ్చాక బీసీలకు చిల్లిగవ్వ కూడా ఖర్చుపెట్టకపోగా, స్థానికసంస్థల ఎన్నికల్లో వారికి దక్కాల్సిన రిజర్వేషన్లకు కూడా కోతపెట్టిందన్నారు. గతప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకోసం అమలుచేసిన అనేక సంక్షేమపథకాలను జగన్ రద్దుచేశాడన్నారు.

కోర్టు తీర్పు ప్రకారం బీసీలకు 25శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతాయని, తద్వారా 1200 గ్రామపంచాయతీలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. బలహీనవర్గాలకు అన్యాయం జరగుతున్న నేపథ్యంలో మంచిలాయర్ ద్వారా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు అన్యాయంచేసిన జగన్ ప్రభుత్వం, తాజాగా రిజర్వేషన్ల అంశంలోకూడా వారికి తీరని అన్యాయం చేయడానికి సిద్ధమైందని రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
బడుగు, బలహీన వర్గాలకు మేలుకలిగేలా 59శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం, తన పార్టీకే చెందిన వ్యక్తితో రిజర్వేషన్ల అంశాన్ని కోర్టులో వేయించి, బీసీలకు 10శాతం వరకు రిజర్వేషన్లు తగ్గేలా చేసిందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పష్టంచేశారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గినా జగన్ సర్కారులో చలనంలేదని, బీసీలు తమప్రభుత్వానికి బ్యాక్ బోన్ అని చెబుతూనే, వారి వెన్నువిరిచే కార్యక్రమాన్ని యథేచ్ఛగా సాగిస్తోందన్నారు. జగన్ కు నిజంగా బీసీలపై ప్రేమాభిమానాలుంటే, ఇప్పటికైనా సుప్రీంకోర్టు తలుపుతట్టి, వారికి న్యాయంజరిగేలా చూడాలని అర్జునుడు డిమాండ్ చేశారు.

అవసరమైతే రూ.2కోట్లు ఖర్చుపెట్టైనా సరే, సుప్రీంలో న్యాయవాదిని నియమించి బీసీలకు న్యాయం జరిగేలాచూడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. ఎన్టీ ఆర్ బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తే, చంద్రబాబునాయుడు వారిని ఆర్థికంగా పరిపుష్టులను చేశాడన్నారు. రాజ్యాధికారంలో బడుగు, బలహీనవర్గాలకు సరిపడా రిజర్వేషన్లు కల్పించలేనప్పుడు, వారికి జగన్ హామీలెందుకిచ్చాడో చెప్పాలన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 70శాతం వరకు బడుగు, బలహీనవర్గాలకు జగన్ ప్రభుత్వం 9నెలల్లో పైసా కూడా ఖర్చుచేయలేదని, ఏపీలో 139 వరకు బీసీకులాలుంటే కేవలం రెండు కులాలకే ఆర్థిక సహాయం చేస్తామంటూ ప్రభుత్వమిస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని, రిజర్వేషన్ల అంశంలో కూడా వారికి నష్టం చేయాలని చూస్తే సహించేది లేదని అచ్చెన్న హెచ్చరించారు. జగన్ ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించగానే, దానిపై సుప్రీంకోర్టుని ఆశ్రయించిన వ్యక్తి పూర్వాపరాలేమిటో మంత్రి బొత్స, ఇతర మంత్రులు తెలుసుకోవాలన్నారు. సదరు వ్యక్తి వైసీపీలో అతిముఖ్యమైన వాడని, ఆయనకు జగన్ తో సన్నిహిత సంబంధాలున్నాయని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.

నిన్న రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు లేవనెత్తిన అంశంతో, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు పరువు పోయింది. నిన్న రాజ్యసభలో, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాల వివరాలు, వాటి పని తీరు గురించి వెంకయ్య నాయుడు చెప్తూ, ఎవరు ఎలా పని చేసింది వివరాలు ఇచ్చారు. దీంట్లో, వైసీపీ నేత, ఎంపి విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కామర్స్ కమిటీ పని తీరు అధ్వానంగా ఉందని, తాను ఈ విషయంలో బాధ పడుతున్నట్టు వెంకయ్య చెప్పారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కామర్స్ కమిటీ, అన్ని కమిటీల కంటే తక్కువగా కేవలం, 32 శాతం హాజరు మాత్రమే ఉందని, వెంకయ్య నాయుడు సభ దృష్టికి తెచ్చారు. ఇది చాలా విచారకరమని, తాను ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఈ అపవాదుకు, ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్న, విజయసాయిరెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్టాండింగ్ కమిటీలు అనేవి, తమకు కేటాయించిన శాఖలు, బాధ్యతల పై సమీక్షలు జరిపి, చర్చలు జరిపి, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తాయి.

vsreddy 03022020 2

మరింత మెరుగ్గా ఎలా పని చెయ్యాలి, ఏమి చేస్తే మంచిది, ఇలా వివరంగా ప్రభుత్వానికి తగు సూచనలు ఇస్తారు. అయితే, విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కీలకమైన కామర్స్ కమిటీ మాత్రం, ఈ విషయాలను పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. సహజంగా నేతృత్వం వచించే వాళ్ళు బాధ్యత తీసుకుంటే, మిగతా సభ్యులు కూడా, నేతృత్వం వచించే వారిని చూసి నేర్చుకుంటారు. వారు కూడా, సమావేశాల్లో పాల్గునాలి అనే ఆసక్తి వస్తుంది. కాని, ఇక్కడ విజయసాయి రెడ్డి ఆ కమిటీ చైర్మెన్ గా తన బాధ్యతలు సరిగ్గా నిర్వహించటం లేదని, కేవలం 32 శాతం మాత్రమే హాజరు ఉండటం పై, అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఇది రాష్ట్ర సమస్యో, రాజకీయ సమస్యో కాదు, దేశానికి సంబంధించిన విషయం.

vsreddy 03022020 3

మొన్న బడ్జెట్ సమావేశాలు సమయంలో కూడా, బడ్జెట్ పై మాట్లాడండి అని, చైర్మెన్ పిలిస్తే, విజయసాయి రెడ్డి అందుబాటులో లేరు. అపట్లోనే విజయసాయి రెడ్డి పై విమర్శలు వచ్చాయి. కీలకమైన బడ్జెట్ పై, రాష్ట్ర సమస్యలు ప్రస్తావించకుండా జారుకున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి. విజయసాయి రెడ్డికి, ఎంత సేపు ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబుని ఎలా దెబ్బ కొడదాం, ఈ రోజు ఎవరిని ఇరికిద్దాం అనే ధ్యాసే కాని, తనకు ఇచ్చిన బాధ్యతలు చెయ్యటం చేతకాదని, తెలుగుదేశం పార్టీ విమర్సిస్తుంది. ఆయనకు ఢిల్లీలో ఎంపీగా చెయ్యాల్సిన పని కంటే, ఎపిలో రాజకీయాలు చెయ్యటమే ముఖ్యం అని, లేకపోతె ట్విట్టర్ లో పిచ్చి రాతలు రాయటమే ఇష్టం అని, టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read