ముఖ్యమంత్రి జగన్ 10 నెలల పాలనలోనే రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేయటమే కాక ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని టీడీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండి పడ్డారు. ఆదివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం నిత్యవసరాల ధరలు పెంచి పేదలపై భారం మోపుతోంది. నిన్న పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ జీవో 68 విడుదల చేశారు. జీవోలు మార్చి నెల రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు రెండు సార్లు పెంచారు. జగన తీసుకునే నిర్ణయాలు తుగ్లక్ ని మరిపిస్తున్నాయి. ఏ1, ఏ2 లకు పాలన చేతకాక ధరలు పెంచి తడిగుడ్డతో పేద ప్రజల గొంతు కోస్తున్నారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గుతున్నాయని సీఎన్ ఢీసీ చెప్తుంటే రాష్ర్టంలో వాటి ధరలు పెంచటం తుగ్లక్ పాలనకు నిదర్శనం. పోరుగు రాష్ట్రాల కంటే మన రాష్ర్టంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. 2019-20 బడ్జెట్ లో లక్షా 78 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఈ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వచ్చిన ఆదాయం కేవలం రూ. 85 వేల కోట్లు మాత్రమే. జీఎస్టీ ద్వారా రూ. 37 వేల కోట్లు ఆదాయం వస్తుందని బుగ్గన అంచనా వేస్తే .. వచ్చింది కేవలం రూ. 22 వేల 900 కోట్లు మాత్రమే.

చంద్రబాబు పాలనలో టార్గెట్ ని మించి 119 శాతం జీఎస్టీ వసూళ్లు వచ్చాయి, రెండెంకెల వృద్ది రేటు సాధించాం. ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ఆధాయం 50 శాతం పడిపోయింది, రూ. 46 వేల కోట్ల అప్పు భారం పెరిగింది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావటంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కేంద్రం నుంచి రూ. 66 వేల కోట్లు తీసుకురావాల్సి ఉండగా... కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే తీసుకు వచ్చారు. పీపీఏల విషయంలో కేంద్రంతో ఘర్షణ వాతావరణం ఏర్పరచుకుంది. వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే కేంద్రం రాష్ర్టానికి నిధులివ్వటం లేదు, కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు. జగన్ తన తప్పుడు నిర్ణయాలతో అంతర్జాతీయంగా రాష్ర్ట ప్రతిష్ట దెబ్బతీసి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ర్టం నుంచి అనేక పరిశ్రమలు తరిమేసి యువతను రోడ్డున పడేశారు. ఇచ్చిన హామీల్లో కోతలు విధించి జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. విధ్యార్డులకు మెస్ చార్జీలు, స్కాలర్ షిప్పులు ఇవ్వలేదు, రైతు భరోసా పూర్తిగా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేశారు. చంద్రబాబు సంపద సృష్టించి పేదలకు పంచితే, జగన్ పేదల సంపద దోచుకుని వారిని రోడ్డున పడేస్తున్నారు.

ఇల్ల పట్టాల పేరుతో పేద ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిత్యసరాల ధరలు పెంచి ఓ వైపు, మరో వైపు అసైండ్ భూములు లాక్కుంటూ పేదల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ డబ్బుతో భూమి కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు 5 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ జగన్ బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారు . విశాఖలో చంద్రబాబు పై రౌడీ మూకలతో జగన్ దాడి చేయించారు. . చంద్రబాబు నాయుడుకి సీఆర్పీ సెక్షన్ 151 కింద ఎలా నోటీసులిస్తారని పోలీసులకు కోర్టు మెట్టికాయలు వేసింది. ఇప్పడు అధికారులు ఏం సమాధానం చెప్తారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు, తప్పు చేసినవారందర్నీ కోర్టుకీడుకిస్తాం. త్వరలో ప్రజా చైతన్య యాత్ర విశాఖ నుంచే ప్రారంభిస్తాం, పేదలకు అండగా నిలబడి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న సీనియర్ ఏపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ బాలసుబ్రహ్మణ్యం లాంగ్ లీవ్‌ లో వెళ్ళటం పై, అధికార వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఆయన అమెరికా వెళ్లేందుకు, ఏడాదిపైనే సుధీర్ఘంగా సెలవు కావాలని, ప్రభుత్వానికి లేఖ రాసారు. 2020 మార్చి 4 నుంచి వచ్చే 2021 జూలై 31 వరకు అంటే 515 రోజులు లాంగ్ లీవ్ అడిగారు. తాను వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లాలని, లీవ్ కావాలని అంటూ ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీని ప్రభుత్వం కూడా వెంటనే లాంగ్ లీవ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ పరిణామం సచివాలయం అధికార వర్గాల్లో, చర్చకు దారి తీసింది. ఏకంగా ఏడాదన్నర పాటు ఆయన లాంగ్ లీవ్ కావాలని అడగటం, ప్రభుత్వం కూడా వెంటనే ఆ లాంగ్ లీవ్ కు అనుమతి ఇవ్వటం పై, అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. సహజంగా ఎవరైనా, నెలా రెండు నెలలు లీవె తీసుకుంటేనే, దాన్ని లాంగ్ లీవ్ అంటూ ఉంటారు. దానికి కూడా ప్రభుత్వాలు అన్నీ చూసి అనుమతులు ఇస్తాయి. మరి ఇక్కడ మాత్రం, ఏకంగా 515 రోజులు లీవ్ ఇచ్చారు.

bala 01032020 2

ఇక్కడ రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి. ఆయనకు ఇక్కడ పని చెయ్యటం ఇష్టం లేదు, అలాగే ప్రభుత్వానికి పెద్దగా ఆయన పై ఆసక్తి లేదు అనే విషయం, ఈ ఎపిసోడ్ చూస్తే అర్ధం అవుతుంది. చంద్రబాబు హయంలో, అడిషనల్ డీజీ బాలసుబ్రహ్మణ్యం రవాణా శాఖ కమిషనర్‌గా పని చేసారు. అప్పట్లో, తెలుగుదేశం నేతలు ఆయన పై దురుసుగా ప్రవర్తించారని, వార్తలు రావటంతో, చంద్రబాబు ఆ నేతలను మందలించి, బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పమని కోరారు కూడా. అప్పట్లో ఈ సంఘటన ఒక సెన్సేషన్ అయ్యింది. అయితే, చంద్రబాబు సూచన మేరకు, క్షమాపణ చెప్పటంతో, అప్పట్లో ఆ వివాదం ముగిసింది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ, వనజాక్షి ఇష్యూ లా చెయ్యాలి అని చూసినా, కుదరలేదు.

bala 01032020 3

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యాన్ని, రైల్వే డీజీగా నియమించారు. అయితే, ఎంతో సీనియర్ అయిన నాకు, ఇది ఏ మాత్రం, ప్రాధాన్యం లేని పోస్టు అంటూ, ఆయన అసంతృప్తిలో ఉన్నారని, అందుకే ఆయన లాంగ్ లీవ్‌ పై, వెళ్తున్నారు అనే సమాచారం, సచివాలయంలో వినిపిస్తుంది. ఆయన అడిగిన వెంటనే, ప్రభుత్వం కూడా లీవ్ ఆమోదించటం, ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మొన్నటి దాక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా లాంగ్ లీవ్‌లో ఉన్నారు. ఆయన్ను చీఫ్ సెక్రటరీ నుంచి, బాపట్ల ఎన్‌హెచ్‌ఆర్డీఐకి బదిలీ చెయ్యటంతో, ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఇక సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు, సీనియర్ ఐఆర్ఎస్ జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ వ్యవహారం కూడా తెలిసిందే. మొత్తానికి, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి అననటంలో సందేహం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వీటిపై వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచింది. ఈ ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ కు 76 పైసలు, ఒక లీటర్ డీజిల్ కు రూ. 1.07 పైసలుగా పెంపు ఉంటుంది. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై 31శాతం వ్యాట్ తో పాటు 2.76 సర్ చార్జి, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ తో పాటు అదనంగా రూ. 3.07 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలోనే వ్యాట్ రూపంలో పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచింది. గత నెలలో పెట్రోల్, డీజిల్ పై 4.5 శాతం వ్యాటు , ప్రభుత్వం పెంచింది. దీంతో పెట్రోల్ ధర 31 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. డీజిల్‌పై 22.5 శాతం నుంచి 27శాతానికి పెంచింది. తాజాగా సరిగ్గా నెలరోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వ్యాట్ పేరుతో ధరలు పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 76.09 పైసలు ఉండగా ఆదివారం నుంచి 76 పైసలు వ్యాట్ రూపంలో పెంచడంతో రూ. 77.04 కి పెరగనుంది. అలాగే లీటర్ డీజిల్ ధర ప్రస్తుతం రూ. 70.67 పైసలు ఉండగా రూ. 1.07 పైసలు పెరిగింది.

దీంతో ఆదివారం నుంచి డీజిల్ ధర రూ.71.74 పైసలుకు పెరగనుంది. ఇప్పటికే వివిధ రూపాల్లో ధరలు పెరగడంతో సామాన్యులు మోటారు వాహనాలను నడిపే పరిస్తితి లేదు. పెట్రోడీజిల్ ధరలు ఇదే విధంగా పెరుగుతూ పోతే ఆ ప్రభావం ఇతర నిత్యావసర సరుకులపై పడే ప్రభావం ఉంది. పెట్రోల్ ధరలు పెరగడంతో రాష్ట్ర రాజధాని విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రధాన నగరాల్లో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఏపీఎస్ఆర్టీసీ బస్ చార్జీలను గతేడాదిలోనే భారీగా పెంచింది. పెరిగిన ధరలతో ఇప్పటికే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. దీనివల్ల మరోసారి నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే టోల్ గేట్లు రూపంలో వేల రూపాయిలు చెల్లిస్తున్నామని, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా చార్జీలు మిగలకపోగా వాహనాల తరుగుదల, మరమ్మతులు ఆర్ధికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాపోతున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల వాహనాలను తిప్పే పరిస్తితి లేదని తమ కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశాలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉండటం వల్ల ఆయా ప్రాంతాలకు కిరాయిల నిమిత్తం వెళ్లే వాహనాలు అక్కడే తమ వాహనాలకు డీజిల్, పెట్రోలు పోయించుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ప్రధానంగా రాష్ట్రానికి వాణిజ్య పన్నులు శాఖ నుంచి అధికంగా ఆదాయం వస్తుంది. పెట్రో, డీజిలు ఆ రంగానికి చెందినవి కావడంతో రాష్ట్ర ఖజానాకు చిల్లులు పడుతున్నాయి. పెట్రో, డీజిల్ ధరల్లో కనీసం రూ. 1.50 నుంచి రూ.2 వరకూ వ్యత్యాసం ఉండటంతో ఇతర రాష్ట్రాల్లో ఆయిల్ పోయించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దుగా ఉన్న మధిరలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.42 పైసలు ఉంటే ఏపీలో రూ.77.04 గా ఉంది. డీజిల్ ధర లీటర్ కు రూ. 70.25 పైసలు ఉంటే రూ. 71.74కి పెరిగింది. తెలంగాణలోని కోదాడలో రూ. 76.43 పైసలు, డీజిల్ రూ.70.26 పైసలుగా ఉన్నాయి. తమిళనాడు సరిహద్దులో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.73 పైసలు ఉండగా, డీజిల్ ధర రూ. 68.27 పైసలు ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే నెల రోజల్లో ఆయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, తాము చేసిన ఘనతలు గొప్పగా చెప్పుకుంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలా చెప్పుకోవాలి కూడా. ఏపిలో గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు, ఇలా చేసింది చెప్పుకోలేక పోవటం వల్లే, ప్రత్యర్ధుల పైడ్ ప్రచారం నమ్మి, చంద్రబాబు ఓడిపోయారు అంటూ, ఆయన ఓడిపోవటానికి ఒక కారణంగా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు కాని, ప్రభుత్వాలు కాని, తమకున్న మాధ్యమాలు ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితే, ప్రభుత్వ సొమ్ముతో, పేపర్లలో, టీవీల్లో, సినిమా హాల్స్ లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రకటనలు ఇచ్చి, తమ గొప్పతనం చెప్పుకుంటూ ఉంటారు. దీని కోసం, వందల, వేల కోట్లు కూడా ఖర్చు పెడుతూ, ప్రజా ధనం కర్పూరంలా కరిగిస్తూ ఉంటారు. అయితే, తమ సొంతంగా చేసుకున్న పనులకు, ఇలా చేస్తే పరవాలేదు, గుడ్డిలో, మెల్ల అని ప్రజలు సరి పెట్టుకుంటారు, కాని ఇక్కడ తాము చెయ్యని పనులు, ఎవరో చేసిన పనులు కూడా, ప్రభుత్వం సొమ్ముతో ప్రచారం చేసుకుంటే ?

lokesh 01032020 2

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, వృధాప్య, వితంతు పెన్షన్లు, నెలకు రూ.200 ఇచ్చే వారు. తరువాత వచ్చిన చంద్రబాబు, ఇవి ఏ మాత్రం సరిపోవు అని, ఇప్పుడున్న పరిస్థితిలో, వాళ్ళకు ఇవి ఏ మూలకు సరిపోవని, పెన్షన్ ను వెయ్యి రూపాయలు చేసారు. తరువాత క్రమంలో, నెమ్మది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెడుతూ వచ్చి, రాష్ట్రంలో పెరిగిన సంపద, పేదవాళ్ళ వద్దకే వెళ్ళాలని, వెయ్యి రూపాయల పెన్షన్ ను, రెండు వేలు చేసారు. జనవరి 2019 నుంచి, జూన్ 2019 వరకు ఇలా రెండు వేల పెన్షన్, దాదాపుగా, రాష్ట్రంలో ఉన్న 55 లక్షల మందికి ఇచ్చారు. అయితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో, గతంలో చంద్రబాబు కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చే వారని, నేను వచ్చిన తరువాత దాన్ని రెండు వేల, రెండు వందల యాభై కి పెంచాను అంటూ యాడ్ ఇచ్చారు.

lokesh 01032020 3

అంతే కాదు, చంద్రబాబు హయంలో, కేవలం 44 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే వారని, మేము 58 లక్షల మందికి ఇస్తున్నాం అంటూ ఆ ప్రకటనలో ఉంది. అయితే ఒక ప్రభుత్వ ప్రకటనలో, తాను చెయ్యని పనులు కూడా చేస్తున్నట్టు, డబ్బా కొట్టటం పై, తెలుగుదేశం ఘాటుగా స్పందించింది. టిడిపి నేత లోకేష్, ఈ విషయం పై ట్వీట్ చేసారు. "సిగ్గు అనేది పూర్తిగా వదిలేశారా YS Jagan Mohan Reddy ? ప్రభుత్వ ప్రకటనల్లో, ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యటానికి, ఇదేమన్నా మీ దొంగ సాక్షి అనుకున్నారా ? జనవరి 2019 నుంచి మీరు ప్రజల నెత్తిన పడిన జూన్ 2019 దాకా, 54.47 లక్షల మందికి పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? మీ నాయన కేవలం రూ.200 ఇస్తే, మా నాయన 2014లో వెయ్యి రూపాయలు, 2019లో రెండు వేలు చేశారు. అంటే, పది రెట్లు ఎక్కువ. ఇప్పుడు తమరు వచ్చి, 3 వేలు అని మోసం చేసి, లింగులిటుకుమంటూ, రూ.250 పెంచి, మోసం చేసింది కాక, ప్రభుత్వ సొమ్ముతో, ఇలా అబద్దపు డబ్బాలు కొట్టుకుంటారా ?" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read