జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలకంటే బాగా కిల్ ఏపీ పథకాన్ని బాగా ముందుకు తీసుకెళుతున్నాడని, ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడంతో పాటు, భారత్ ఇమేజ్ ను కూడా తన నిర్ణయాలతో ఆయన దెబ్బతీస్తున్నాడని టీడీపీనేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వాల్ స్ర్టీట్ జర్నల్, రాయిటర్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు ఇప్పటికే జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ముక్తకంఠంతో ఖండించాయని, మీడియాతో పాటు జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఏపీ సీఎం నిర్ణయాలపై తీవ్రంగా ఆందోళన వ్యక్తంచేశాయన్నారు. తాజాగా ఆసియా దేశాలలోనే పేరుగాంచిన ఏషియన్ కమ్యూనిటీ న్యూస్ నెట్ వర్క్ కు కొట్రా (కొరియా ట్రేడ్ అండ్ ఇన్ వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ) అధ్యక్షులైన యాంగ్ కిన్ మున్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టడం జరిగిందన్నారు. జగన్ చర్యలు, నిర్ణయాల కారణంగా కొరియాకు చెందిన సంస్థలేవీ ఆంధ్రరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంలేదని కొట్రా అధ్యక్షులు స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.

కొరియాదేశంలో పారిశ్రామికవేత్తలకు వేదికైన కొట్రా అధ్యక్షులే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏపీ పరిస్థితి ఎలా తయారైందో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. జగన్ నిర్ణయాలు చూశాక, కొట్రా అధ్యక్షులు కేంద్రానికి కొన్ని సూచనలు చేశారని, ప్రభుత్వాలు మారినప్పడల్లా, విధానాలు, నిర్ణయాలు మారకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని, ఏరాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెట్టేవారికి ఇబ్బందులు లేకుండా 15 నుంచి 20ఏళ్లపాటు మార్పులు లేకుండా చూడాలని, దీనికి సంబంధించి కేంద్రమే ఒక కొత్తచట్టం తేవాలని కూడా చెప్పడం జరిగిందన్నారు. కొరియాకు చెందిన అనేక సంస్థలు, భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్న తరుణంలో, 50 బిలయన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్న సమయంలో, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలవల్ల అవన్నీ వెనక్కు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, యాంగ్ కిన్ మున్ ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. నిజంగా 50 బిలయన్ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చిఉంటే, లక్షలమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించి ఉండేవన్నారు.

కానీ జగన్ తుగ్లక్ నిర్ణయాల కారణంగా, దేశమే నష్టపోయే దుస్థితి దాపురించిందని పట్టాభి మండిపడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన కియా, ఇప్పటికే చెన్నైవైపు చూస్తోందని, జగన్ నిర్ణయాలకారణంగా కియా తమ ప్లాంట్ ను పొరుగు రాష్ర్టానికి తరలించాలని చూస్తోందని కొట్రా అధ్యక్షులే చెప్పడం జరిగిందన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, కేంద్రం తక్షణమే దీనిపై స్పందించి చట్టం చేయకుంటే, కొరియా నుంచే కాకుండా, ప్రపంచంలోని మరే దేశంకూడా భారత్ లో పెట్టుబడులు పెట్టవని యాంగ్ కిన్ మున్ పేర్కొనడం చూస్తుంటే, జగన్ ఎంతటి భయభ్రాంతులతో పాలన సాగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చన్నారు. 9నెలల పాలనలో కొన్నివేల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని, అందుకు జగన్, విజయసాయి, ఇతర నేతల నిర్ణయాలే కారణమని పట్టాభి స్పష్టంచేశారు. జే-ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు కాబట్టే పారిశ్రామికవేత్తలెవరూ రాష్ట్రంవైపుచూడటం లేదన్నారు.

జగన్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దక్షిణ కొరియా నుంచి దేశానికి రావాల్సిన 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆగిపోతే, ఇతరదేశాలనుంచి ఇంకెన్ని పెట్టుబడులు ఆగిపోయాయే చెప్పాల్సిన పనిలేదన్నారు. ఒకవైపు ప్రధాని మోదీ దేశంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వనిస్తుంటే, జగన్ మాత్రం భవిష్యత్ లో ఇంకెవరూ దేశంవైపు, రాష్ట్రంవైపు కన్నెత్తి చూడకుండా చేస్తున్నాడని పట్టాభి ఎద్దేవాచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో చదువుకునే యువతను మోసపూరితహామీలతో మోసగించిన జగన్, తాజాగా పెట్టుబడులు రాకుండా చేసి వారికి ఉపాధి, ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాడన్నారు. ప్రతి విద్యార్థికి రూ.లక్ష వరకు మేలు చేస్తానని తన మేనిఫెస్టోలో చెప్పిన జగన్, ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర బకాయిలు ఇవ్వకుండా వారి జీవితాలను నాశనం చేవాడని, దానితో ఆగకుండా రాష్ర్టానికి పెట్టుబడులు రాకుండా చేయడంద్వారా వారిని మరింత దగా చేస్తున్నాడన్నారు. వివిధ దేశాల్లోని ట్రేడ్ ఆర్గనైజేషన్ లన్నీ జగన్ నిర్ణయాలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయని, పెట్టుబడులకు రక్షణగా భారత ప్రభుత్వం చట్టాలు చేయాలని కోరే స్థితికి వచ్చాయన్నారు.

ప్రజా రాజధానిని నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతోనే వైసీపీ సర్కారు పనిచేస్తోందని, మూడుముక్కల ప్రకటనతో, ప్రజలను అయోమయంలో పడేసిన జగన్, తన స్వార్థంకోసమే విశాఖను రాజధానిగా ఎంచుకున్నాడు తప్ప, అక్కడేదో అభివృద్ధి చేసి, ఆ ప్రాంతవాసుల్ని ఉద్ధరించాలన్న ఆలోచన ఆయనకు లేనేలేదని టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక, శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకొని, ప్రజామోదంతోనే నాటి టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిందని, ఆ క్రమంలోనే దాని నిర్మాణంకోసం రైతులు 34 వేల ఎకరాలవరకు భూములు ఇవ్వడం జరిగిందన్నారు. నాడుప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా, అమరావతి ఎంపికను స్వాగతించాడని, అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 30వేల ఎకరాల వరకు అవసరమవుతుందని కూడా చెప్పాడన్నారు. అమరావతి ప్రకటన తర్వాత సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ నుతయారు చేసి ఇచ్చిందన్నారు. ప్రజలుకూడా భాగస్వాములుగా మారి, నా ఇటుక – నా అమరావతి కోసం రూ55కోట్ల వరకు నిధులు ఇవ్వడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వంకూడా నవనగరాల నిర్మాణమే ప్రాతిపదికగా ముందుకుసాగిందని కొల్లు వివరించారు. రూ.9116కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు, రోడ్లు, ఇతరేతర మౌలిక వసతులు పూర్తి చేయడం జరిగిందన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధానిపై ఒక్కరూపాయికూడా ఖర్చు పెట్టకపోగా, అమరావతిపై విషప్రచారం చేయడమేపనిగా పెట్టుకుందని రవీంద్ర దుయ్యబట్టారు. జగన్ మూడురాజధానులు ప్రకటనచేయడానికి ముందే, అమరావతి ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు పనికిరాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ అని పలురకాలుగా దుష్ప్రచారం చేసిందన్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, చెన్నై ఐఐటీ నివేదికలతో, కేంద్ర ప్రభుత్వ ప్రకటనలతో అమరావతిపై వైసీపీప్రభుత్వం చేసిందంతా తప్పుడు ప్రచారమని తేలిపోయిందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ వల్లే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప, రాజధాని వికేంద్రీకరణ వల్ల కాదని రవీంద్ర తేల్చిచెప్పారు. విశాఖను, ఉత్తరాంధ్రను అంతగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన జగన్ కు ఉంటే, ఆ ప్రాంతంలో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమలను ఎందుకు వెళ్లగొట్టాడో సమాధానం చెప్పాలన్నారు.

విశాఖలో ఏర్పాటు కావాల్సిన లులూ, ఆదానీ గ్రూప్ పరిశ్రమలను ఎందుకు తన్ని తరిమేశాడో స్పష్టంచేయాలన్నారు. విశాఖనగరం సహా, చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల స్వాహాకు, కబ్జాకే జగన్, అక్కడ రాజధాని అంటూ కొత్త పల్లవి మొదలెట్టాడన్నారు. ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్న జగన్మోహన్ రెడ్డి, కావాలనే తన స్వార్థంకోసం అమరావతిని బలిపెట్టడానికి సిద్ధమయ్యాడని రవీంద్ర తేల్చిచెప్పారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై జాతీయ, అంతర్జాతీయ మీడియాకూడా దుమ్మెత్తిపోసింద ని, తుగ్లక్ నిర్ణయమంటూ తూర్పారబట్టినా కూడా, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకెళుతున్నాడన్నారు. జగన్ దుష్ట ఆలోచనలపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, జాతీయ, అంతర్జాతీయ మీడియాకూడా తప్పుపడుతున్నా ప్రభుత్వ ఆలోచనలు మారకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ తీసుకున్న మూడురాజధానుల నిర్ణయంపై ప్రజాచైతన్య యాత్రలో ప్రజాభిప్రాయం కోరాలని టీడీపీ నిర్ణయించిందని, అందులోభాగంగానే రేపటినుంచి జరగబోయే యాత్రలో ప్రజాభీష్టమేమిటో తెలుసుకుంటామని రవీంద్ర వివరించారు. రేపటినుంచి మూడు రోజులపాటు ప్రజాబ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తామని, జగన్ అమరావతి కేంద్రంగా చేస్తున్న అల్లరిని రాష్ట్రప్రజలకు తెలియచేస్తామని ఆయన స్పష్టంచేశారు.

3 రాజధానుల పేరుతో అమరావతిపై కులముద్రవేసిన జగన్, తన భూదోపిడీకోసమే విశాఖను రాజధానిగా ఎంచుకున్నాడని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. గతంలో అమరావతికి మద్ధతిచ్చిన జగన్, ఇప్పుడెందుకు అదేప్రాంతంపై విషప్రచారం చేస్తున్నడన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతించినజగన్, అధికారంలోకి వచ్చాక తన నిర్ణయాన్ని ఎలా మార్చుకుంటాడన్నారు. చంద్రబాబు రాజధానిని ప్రకటిస్తే, నాటి ప్రతిపక్షనేత జగన్ దాన్ని స్వాగతించాడని, అనంతరం ప్రధాని మోదీ అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేశాడన్నారు. ఈవిధంగా కేంద్రప్రభుత్వం, నాటి అధికార, ప్రతిపక్షాలు అమరావతి ఎంపిక, నిర్మాణంలో కీలకపాత్ర పోషించాయని శ్రావణ్ కుమార్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన జగన్, అమరావతిపై తన అక్కసు వెళ్లగక్కుతుంటే, కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. కేంద్రం ఇప్పటికైనా జగన్ నిర్ణయంపై తన అభిప్రాయమేమిటో స్పష్టంగా చెప్పాలన్నారు. అమరావతిలో ఉన్న 132 సంస్థలను తరిమేయడానికి సిద్ధమైన జగన్, విశాఖను అభివృద్ధి చేస్తానంటే ప్రజలెవరూ నమ్మే స్థితిలోలేరన్నారు. అనేక రకాల పథకాలపేరుతో ప్రజలను ఇప్పటికే మోసగించిన జగన్, ఇళ్లస్థలాల పేరుతో మరోవిధంగా మోసంచేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ నేపధ్యంలో, రాష్ట్రపతి భవన్ లో నిన్న సాయంత్రం రాష్ట్రపతి విందు ఇచ్చారు. ఈ విందుకు తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అనింది. అయితే దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాత్రం ఆహ్వానం అందలేదు. అయితే జగన్ కు ఆహ్వానం అందకపోవడం పై పలు విమర్శలు వచ్చాయి. జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టే, ఆయనకు ఆహ్వానం లేదు అంటూ, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ రాక నేపథ్యంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి జగన్​కు ఆహ్వానం అందకపోవటంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సీఎం జగన్ దేశంలో బలమైన నాయకుడు కాబట్టే విందుకు ఆహ్వానించలేదని అన్నారు. జగన్ ఎంతో బలమైన నాయకుడు కాబట్టే ఆహ్వానం పంపించి ఉండక పోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు బొత్సా.

botsa 26022020 2

నిన్న చంద్రబాబు ఈ మధ్య ఈ విషయం పై మాట్లాడుతూ, ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆహ్వానం అంది.. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అందకపోవడం అవమానకరమని టిడిపి మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆర్థిక నేరగాడైన జగన్​ను ఆహ్వానిస్తే.. తనకు చెడ్డ పేరు వస్తుందనే ప్రధాని మోదీ.. డొనాల్డ్​ ట్రంప్​ పర్యటనకు ఆహ్వానం పంపలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్​ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు తెనాలి పక్కనున్న పెదరావూరు మహిళలకూ ఆయన పక్కన కూర్చునే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడం అవమానకరమని వ్యాఖ్యానించారు.

botsa 26022020 3

చట్టాలు చేసే స్థానాల్లో ఉన్న వారే, ఆయా చట్టాలపై నమ్మకం లేదన్నట్లుగా మాట్లాడే నేతల తీరుచూస్తుంటే, ఇలాంటివాళ్లకా మనం ఓట్లేసిందని ప్రజలంతా సిగ్గుపడుతున్నారన్నారు. 11 సీబీఐ ఛార్జ్ షీట్లలో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్, రూ.43వేలకోట్ల అక్రమఆస్తులను జప్తు చేయించుకొని, దేశవ్యాప్తంగా అవినీతి చక్రవర్తిగా పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ వేయడం చూస్తుంటే హస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయస్థానాలకు హాజరుకాకుండా, వారంవారం తప్పించుకు తిరుగుతున్న జగన్, ప్రజలను మభ్యపెట్టడానికే ఇటువంటి చిల్లర పనులు చేస్తున్నాడని ఆలపాటి దుయ్యబట్టారు. గత ప్రభుత్వ పాలనపై విచారణ జరుపుతానంటున్న జగన్, ప్రభుత్వంలోని శాఖలన్నింటినీ విచారణ పరిధిలోకి తీసుకురావడం ద్వారా, ఎందరు అధికారులను, ఎన్నేళ్లపాటు విచారిస్తాడో సమాధానం చెప్పాలన్నారు. సెర్బియా అరెస్ట్ కాబడిన నిమ్మగడ్డ ప్రసాద్, జగతి పబ్లికేషన్స్, భారతిసిమెంట్స్ లోకి, ఇతరేతర కంపెనీలద్వారా, తప్పుడు మార్గాల్లో ఎలా సంపాదించారో దానిపై జగన్ నోరు విప్పితే బాగుంటుందని ఆలపాటి ఎద్దేవాచేశారు. తనపై ఉన్న కేసులగురించి, తన అవినీతి చరిత్ర గురించి ప్రజలకు చెప్పి, కోర్టులకుహాజరై తాను దొంగో, దొరో జగన్ నిరూపించుకుంటే మంచిదన్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అమరావతి ప్రజలకు, ఏపి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిందనే అనుకోవాలి. ఈ రోజు హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు, జగన ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్టే అని చెప్పాలి. ఈ రోజు అమరావతి రాజధానిలో ఇప్పటికే ఉన్న కార్యాలయాలు, వేరే ప్రాంతానికి తరలింపు విషయం పై, ఈ రోజు హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంలో, హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. సరైన పద్దతి లేకుండా, శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందకుండా, జగన్ కార్యాలయాలు తరలిస్తున్నారు అంటూ, రైతులు హైకోర్ట్ ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలగే రాజధాని విషయంలో వేసిన బోస్టన్, జీఎన్ రావు, హైపవర్ కమిటీలకు చిట్టా బద్ధత లేదు అంటూ రైతులు కోర్ట్ ను ఆశ్రయించారు. ఇలా అన్ని పిటీషన్ల పై హైకోర్ట్ విచారణ జరిపింది. ముఖ్యంగా, హైకోర్ట్ తరలింపు విషయంలో, పిటీషన్ ను విచారించిన హైకోర్ట్, జగన సర్కార్ తీరు పై, ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయం పై, కర్నూల్ కు హైకోర్ట్ తరలింపు పై, ఈ రోజు హైకోర్ట్ కు వివరణ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. 

highcourt 26022020 2

ప్రభుత్వం తరపు వాదనలు విన్న హైకోర్ట్, ఏపి హైకోర్ట్ ను కర్నూల్ కు తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనకు, మోకాలడ్డింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న శాశ్వత హైకోర్ట్ పనులు ఆపవద్దంటూ, జగన్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం షాక్ తింది. ఇప్పటికే హైకోర్ట్ ను, కర్నూల్ కు మార్చాలనే ఉద్దేశంలో ఉన్న జగన్ కు ఇది షాక్ అనే చెప్పాలి. మే 23 నుంచి అమరావతిలో అన్ని పనులు ఆగిపోయాయి. హైకోర్ట్ నిర్మాణం పనులు కుడా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఇక్కడ నుంచి హైకోర్ట్ ని కర్నూల్ కు తరలించాలని జగన్ అనుకోవటం, కాని హైకోర్ట్ మాత్రం, అమరావతిలో నిర్మాణంలో ఉన్న హైకోర్ట్ పనులు ఆపవద్దు అంటూ, ఆదేశాలు ఇవ్వటంతో, జగన్ నిర్ణయానికి బ్రేక్ పడినట్టే అన్న భావన వ్యక్తం అవుతుంది.

highcourt 26022020 3

ఇక వాదనల విషయాలకు వస్తే, హైకోర్ట్ ఎందుకు తరలించాలి అంటూ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది. ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ, స్థలం లేకనే, కార్యాలయాల తరలింపు చేస్తున్నామని చెప్పారు. పిటీషనర్ తరపు లాయర్ స్పందిస్తూ, ఉమ్మడి హైకోర్టుని అప్పట్లో ఉన్న హైదరాబాద్ అఫ్జల్ గంజ్ ప్రధాన భవనం నుంచి గచ్చిబౌలి కి మార్చాలని, తెలంగాణా ప్రభుత్వం అనుకుంటే, హైకోర్ట్ ఒప్పుకోలేదని, తీర్పు చెబుతూ తెలంగాణ ప్రభుత్వానికి గానీ, శాసన సభకు గానీ అలా అడిగే హక్కు లేదని ఇచ్చిన తీర్పును హైకోర్ట్ కు తెలిపారు. విచారణ కొనసాగించాలని, కాని అమరావతిలో నిర్మాణంలో వున్న హైకోర్టు పనులను ఆపవద్దంటూ జగన్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్ట్. దీంతో, ఇది జగన్ కు భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి. Source of News: https://tv9telugu.com/high-court-directions-to-government-205766.html

Advertisements

Latest Articles

Most Read