2019 ఫిబ్రవరి 27 న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ పేరుతో, విశాఖపట్నం కేంద్రంగా, ప్రధాన కార్యాలయంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు ప్రకటించారు. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ ప్రకటన కేంద్రం నుంచి వచ్చింది. నాలుగైదు నెలల్లో ఈ జోన్ ఉనికిలోకి వస్తుందని అప్పట్లో కేంద్ర మంత్రి ప్రకటించారు కూడా. కానీ అలాంటిదేమీ ఇప్పటి వరకు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం తాజగా ఇచ్చిన తన బడ్జెట్‌లో కొత్త రైల్వే జోన్ గురించి ప్రస్తావించలేదు. ఇప్పటికే ప్రకటించిన విశాఖ కొత్త జోన్ యొక్క మౌలిక సదుపాయాల కోసం ఎటువంటి కేటాయింపులు ఈ బడ్జెట్ లో కేంద్రం చెయ్యలేదు. అంటే విశాఖ జోన్ ప్రకటన అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు ఎన్నికల జిమ్మిక్ గానే మారిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. రాష్ట్ర రాజధాని ప్రణాళిక ప్రకారం కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంగా మార్చినట్లయితే, విశాఖపట్నం కోసం ఎక్కువ రైళ్లు అవసరం.

ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఆ అంశంలో ఉపయోగపడుతుంది. కొత్త జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంటకల్ వంటి మూడు రైల్వే విభాగాలు ఉన్నాయి. ముఖ్యమైన వాల్టెయిర్ విభాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కు వదిలిపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో, కేంద్రం తన బడ్జెట్ లో విశాఖపట్నం రైల్వే జోన్ అంశం పెట్టక పోవటంతో, మళ్ళీ మొదటికి వచ్చినట్టే అయ్యింది. ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీజేపీ చేసిన హడావిడి అంతా, ఉట్టి మాటలగానే మిగిలి పోయాయి. ఆ రోజు ప్రధాని మోడి కూడా ఎన్నికల ప్రచారంలో ఈ విషయం పై గొప్పగా చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ చూసిన తరువాత, ఇవన్నీ ఒట్టి మాటలే అని, ఎన్నికల ముందు చేసిన షో అని అర్ధమవుతుంది.

మరో పక్క, విభజన హామీల్లో ఒక్కటి కూడా, ఈ సారి కేంద్ర బడ్జెట్ లో పెట్టలేదు. 22 ఎంపీలతో, కేంద్రం మెడలు వంచి, కేంద్ర బడ్జెట్ నుంచి సాధిస్తాం అని చెప్పిన వైసీపీ, రాష్ట్రానికి తెచ్చింది "గుండు సున్నా". 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజి, పారిశ్రామిక రాయతీలు, పోలవరం, రాజధాని, రెవిన్యూ లోటు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు, విశాఖ, విజయవాడ మెట్రో రైలు, విశాఖ రైల్వే జోన్, ప్రత్యెక హోదా, జాతీయ విద్యాసంస్థలకు నిధులు ఇలా ఏ విషయంలోనే కేంద్ర బడ్జెట్ లో ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇలా ఇవ్వకపోగా, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర వాటా తగ్గిపోయింది. గతంలో 4.305 శాతం ఉండగా, ఇప్పుడు 4.111 శాతం అయ్యింది. దీని వల్ల, రాష్ట్రం రూ.1,521.30 కోట్లకు పైగా నష్ట పోతుంది.

క్యాపిటల్ షిఫ్ట్ పై కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అమరావతి రైతులు పెట్టుకున్న ఆశలను కేంద్ర ప్రభుత్వం, ఒక్క దెబ్బతో తుస్సు మనిపించింది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఇచ్చిన బిల్డ్ అప్ చూసి, ఇంకా ఏముంది, బీజేపీ పార్టీ, కేంద్రం నుంచి చక్రం తిప్పుతుందని, జగన్ దూకుడుకు బ్రేక్ వేస్తుందని అందరూ అనుకున్నారు. కాని, అక్కడ అనుకున్నట్టు ఏమి జరగలేదు. కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన మాటలు, సుజనా చౌదరి చెప్పిన మాటలు, అన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. పార్లమెంట్ సమావేశాల్లో, తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎంపి జయదేవ్ గల్లా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో, కేంద్ర ప్రభుత్వం తన రాజధానిని ఎక్కడ గుర్తించాలో అది రాష్ట్ర ప్రభ్తువం ఇష్టంగా పేర్కొంది. రాజధాని విషయంలో జోక్యం చేసుకోవడానికి కేంద్రం కూడా నిరాకరించింది. గల్లా జయదేవ్ మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సలహా ఇస్తుందో లేదో చెప్పాలని ప్రశ్న వేసారు.

ప్రభుత్వం తీసుకున్న రాష్ట్రంలో పెట్టుబడి వాతావరణాన్ని ఇబ్బంది పెట్టటమే కాక, నిర్మాణానికి తమ భూమిని ఇచ్చిన వేలాది మంది రైతులకు నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. అయినా కేంద్రం మాత్రం, ఈ వాదన గురించి పట్టించుకోలేదు. ఇక్కడ ఊరట కలిగించే విషయం మాత్రం, అమరావతిని 2015లోనే నోటిఫై చేసారు అనేది మాత్రమే. అయితే రాజధాని విషయంలో ఎక్కడ ఉండాలి అనేది, రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం చెప్పి తప్పించుకుంది. ఒక పాలసీ డెసిషన్ లేకుండా, కేంద్రమే ఇలా చెప్తే, ఇక ప్రభుత్వాలు మారిన ప్రతిసారి, రాష్ట్రాలు రాజధానులను తమకు ఇష్టం వచ్చిన చోటు పెట్టుకునే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలో జరుగుతున్న నిర్ణయం చూసి, మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ఫాలో అయితే, ఇది మరింత ప్రమాద కరం అవుతుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిర్ణయం, అటు అమరావతి రైతులనే కాక, మిగతా రాజకీయ పార్టీలకు కూడా ఇబ్బంది కలిగించే అంశం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం ఎక్కువ నష్టపోయేలా చేస్తుంది. జనసేన ఇటీవల బిజెపితో పొత్తు పెట్టుకుని, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతుందని, అలా అవుతుందని హామీ ఇచ్చారు కాబట్టే పొత్తు పెట్టుకున్నాం అని పవన్ చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకోవటానికి నిరాకరించడం అంటే, ఈ అంశంపై జనసేన బిజెపిని ప్రభావితం చేయలేకపోయిందని, ఈ పొత్తు విఫలమైనదిగా అమరావతి రైతులకు కనిపిస్తుంది. అమరావతిని కొనసాగించడం కూటమికి ముందస్తు షరతు అని పవన్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో కూడా ఎపికి ప్రత్యేక కేటాయింపులు లేవు, మరో పక్క అమరావతి మా పరిధిలోకి రాదు అని కేంద్రం అంటుంది. మరి జనసేన బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకుందో, ఇప్పుడు పవన్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం, పవన్ ఏమి చేస్తారో ?

కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడుకు తరలిపోతుంది అంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల పై, చంద్రబాబు ఈ రోజు విలేఖరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, "ఈ రోజు రాయి టర్స్ లో కియా మోటార్స్ పై స్టోరీ వచ్చింది. ఆర్ధిక అంశాలపై గ్లోబల్ గా క్రెడిబిలిటి ఉన్న మీడియా. ఈ ఆర్టికల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కియా వాళ్లు తరలింపుపై పక్కరాష్ట్రంతో చర్చిస్తున్నట్లు వచ్చింది. చర్చలు జరుగుతున్నాయని ఆ సంస్థ ప్రతినిధులే చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డిఐ కియా, 5వ అతిపెద్ద కార్ల తయారీ పరిశ్రమ, రూ 13,500కోట్ల పెట్టుబడి, 18వేలమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ. ఏడాదికి 3లక్షల కార్ల తయారీ లక్ష్యంగా ఉన్న పరిశ్రమ. కియా ఏపికి రావడంపై కన్నన్ రామస్వామి వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. "తమిళనాడును మొదటి చాయిస్ గా చూశాం, గుజరాత్ ను రెండో చాయిస్ గా చూశాం, 3వ చాయిస్ గా ఏపిలో శ్రీ సిటీ సెజ్ అనుకున్నాం. తమిళనాడు నాయకులు కంపెనీకి ఇచ్చే భూమి విలువకు 50రెట్లు లంచంగా అడిగారు. దీనితో కియా ఏపికి తరలిపోవాలని నిర్ణయించింది. అనంతను ఎంపిక చేయించడంలో సీఎం చంద్రబాబు కష్టం ఎంతో ఉంది. ఎన్నో రాయితీలు ఇచ్చారు. కియా ఏపికి వెళ్లడం వల్ల తమిళనాడు 110కోట్ల డాలర్ల పెట్టుబడులను కోల్పోయింది. అనుబంధ పరిశ్రమలూ పోయాయి, ఉద్యోగాలు పోయాయి: కన్నన్ రామస్వామి, తమిళనాడు పారిశ్రామిక వేత్త."

‘‘ఏపిలో కియా పరిశ్రమ పెట్టడం ఒక నమ్మలేని అద్భుత ప్రయాణంలా నడిచింది. ఎంవోయూపై సంతకాలు చేసిన దగ్గరనుంచి సీఎం చంద్రబాబు అత్యంత వేగంగా మౌలిక సదుపాయాలు నీరు,విద్యుత్ కల్పించారు. చంద్రబాబు మద్ధతు లేకుంటే ఈ ప్రాజెక్టు సాధ్యం అయ్యేది కాదు. ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ చేసిన చంద్రబాబుకు, ఆయన బృందానికి ధన్యవాదాలు’’: హన్ వూ పార్క్,సిఈవో,కియా మోటార్స్... మా ప్లాంట్ ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం అద్భుతంగా సహకరించింది. సీఎం నుంచి కిందిస్థాయి వరకు అధికార యంత్రాంగం సహకారం వల్లే అనుకున్న సమయం కన్నా ముందే నిర్మాణం పూర్తి అయ్యింది. ఏపిలో విద్యావంతులైన తెలివైన యువత ఉన్నారు. వారికి తోడుగా అద్భుతంగా పనిచేసే ముఖ్యమంత్రి ఏపికి ఉన్నారు. అందుకే మేము ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకున్నాం: మనోహర్ భట్, కియా మార్కెటింగ్ హెడ్"

కియా ఏర్పాటుకు చేసిన శ్రమను సోదాహరణంగా వివరించారు. కొరియాకు వెళ్లడం, వాళ్లు ఇక్కడికి రావడం తేదీల వారీగా పేర్కొన్నారు. "కియా ఆషామాషీగా ఏపికి రాలేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తే కియా వచ్చింది. అనంతపురంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని మనం కోరాం. ఆ ప్రాంతంలో నీటి కొరత గురించి ప్రస్తావించారు. శరవేగంగా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం, దానికి నీళ్లిచ్చి అక్కడనుంచి కియాకు నీళ్లిచ్చాం. 2నెలల్లో భూమి చదును చేయించి పరిశ్రమ ఏర్పాటుకు సిద్దం చేశాం. కియా వల్ల రూ 20వేల కోట్ల భారం అని ఒక మంత్రి చెబుతారు. ప్రోత్సాహకాలు ఇవ్వం, కియా మళ్లీ సమీక్షిస్తాం అని బెదిరిస్తారు. చైనాలో కియా ప్లాంట్ మూతపడితే 6వేల ఉద్యోగాలు పోయాయి. అనంతపురంలో కియా సంగతేంటి..? ఇక్కడ ఉద్యోగాల సంగతేంటి అని సాక్షిలో అనుమానాలు సృష్టిస్తారు. భూములు ఇవ్వవద్దు, సహాయ నిరాకరణ చేయమని జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టారు. కానీ అక్కడి రైతులు విజ్ఞులు కాబట్టి కియా ఏర్పాటుకు సహకరించారు. తుపాకి చూపినట్లు వేలి చూపి వైసిపి ఎంపి మాధవ్ బెదిరిస్తే ఎవరన్నా వస్తారా ఏపికి..? ఈ భూమి మాది, నీళ్లుమావి, ఉద్యోగాలు మావే అని తలకు వేలి చూపి బెదిరిస్తారు. మేము చెప్పినట్లు చేయాల్సిందే, లేకపోతే ఇక్కడ వ్యాపారం చేయలేరని ఇంకో నాయకుడు బెదిరిస్తారు."

"అనంతపురంలో ఉన్న కియా పరిశ్రమ తరలింపును తమిళనాడు అధికారులు ధృవీకరించారు. కియా వాళ్లను బెదిరించారు మేము చెప్పినవాళ్లకే ఉద్యోగాలు కావాలని..మీరు కియాను బెదిరించడం అవాస్తవమా..? మీ మంత్రి, మీ ఎంపి కియా వాళ్లను బెదిరించలేదా..? నంగినంగిగా బుగ్గన మాట్లాడటం కాదు. కథలు చెప్పడం కాదు మంత్రి బుగ్గన. ఆ రోజు కూడా వోక్స్ వ్యాగన్ ను పూణేకు తరిమేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడి వోక్స్ వ్యాగన్ పోగొట్టారు. వీళ్ల చర్యల వల్ల పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదు. కేంద్రమంత్రి లేఖ రాసినా నిర్లక్ష్యం చేశారు. పెట్టుబడి తేవడం చాలా కష్టం, కంపెనీ ఏర్పాటు చేయడం చాలా కష్టం. పారిశ్రామిక రంగంపై మొన్న ఇచ్చిన శ్వేతపత్రంలో చెప్పిందానికి, ఈ రోజు మంత్రి బుగ్గన చెప్పిందానికి పొంతన లేదు. శ్వేతపత్రం పేజి 13లో రూ 2,800కోట్ల ఇన్సెంటివ్ బకాయిలు అన్నారు. ఈ రోజు రూ 3,500కోట్ల బకాయిలని బుగ్గన అంటారు."

"అన్నీ అబద్దాలే మంత్రి బుగ్గన మాట్లాడేది.. 2014జూన్ నుంచి 2019మార్చి వరకు రూ3,675కోట్లు ఇన్సెంటివ్ లు టిడిపి ప్రభుత్వం ఇచ్చిందని మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే చెప్పారు. ఒక్క సెప్టెంబర్ లో 8సార్లు ఓడికి వెళ్లారు. మేము ఒక్కసారి ఓడికి వెళ్లలేదని అబద్దాలు ఆడతారు. ఈ 8నెలల్లోనే రెవిన్యూ వసూళ్లు 13% తగ్గాయి, రెవిన్యూ ఎక్స్ పెండిచర్ సగానికి పడిపోయింది. కేపిటల్ ఎక్స్ పెండిచర్ పూర్తిగా అడుగంటింది(కేవలం 18%మాత్రమే). రాష్ట్రానికి వచ్చేవి రూ లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు పోగొట్టారు. అదాని డేటా సెంటర్ రూ 70వేల కోట్లు, లులూ కన్వెన్షన్ సెంటర్ రూ 3వేల కోట్లు, ఆసియా పేపర్ మిల్స్ రూ 25వేల కోట్లు, సింగపూర్ ఇన్వెస్ట్ మెంట్స్ రూ 50వేల కోట్లు, 130సంస్థలకు ఇచ్చిన భూముల్లో వచ్చే రూ 45వేల కోట్లు పెట్టుబడులు అన్నీ పోగొట్టారు." అంటూ చంద్రబాబు ప్రెస్ మీట్ లో చెప్పారు.

మద్యపాననిషేధం ముసుగులో జగన్మోహన్‌రెడ్డి భారీదోపిడీకి తెరలేపారని, రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న దుకాణాల నిర్వహణను చేప్టిన ప్రభుత్వం ప్రతి 100కేసులమద్యం కొనుగోలుపై ఉచితంగా వచ్చే 30కేసులుఅమ్మగా వచ్చే ఆదాయం మొత్తం ఏపీసీఎం జేబులోకే వెళుతోందని ఎమ్మెల్సీ బుద్దావెంకన్న ఆరోపించారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. మద్యం దుకాణాల్లో వైసీపీనేతలకు చెందిన లిక్కర్‌కంపెనీల్లో తయారే 3, 4రకాల బ్రాండ్లనే అమ్ముతున్నారని, వాిపై కూడా క్వార్టర్‌కు రూ.30 నుంచి రూ.40వరకు అదనంగా వసూలుచేస్తున్నారన్నారు. నిషేధం మాటున పేదలు, మధ్యతరగతిని జగన్‌సర్కారు కల్తీమద్యానికి బానిసల్ని చేస్తోందన్నారు. నాసిరకం మద్యాన్ని ఎక్కువధరకు అమ్ముతూ, పెంచినధరలద్వారా వచ్చే మొత్తాన్ని ఏ1- ఏ2లు తమజేబుల్లో వేసుకుంటు న్నారని వెంకన్న మండిపడ్డారు. పగలంతా రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిం చుకున్న సొమ్ముని, శ్రమజీవుల రక్తాన్ని జగన్‌ప్రభుత్వం జలగలా పీల్చేస్తోందన్నారు. మామూలుగా పెంచినరేట్లద్వారా ప్రభుత్వఖజానాకు రూ.2 వేలకోట్ల వరకు ఆదాయం వస్తోందన్నారు.

ఆ ఆదాయం అలాఉంటే, దుకాణాలకు చెల్లించే అద్దెరూపంలో, ఉచితంగా వచ్చే మద్యంఅమ్మకాల ద్వారావచ్చే ఆదాయాన్ని తోడుదొంగలైన జగన్‌, విజయసాయిలు చెరిసమానంగా పంచుకుంటున్నారని బుద్దా స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే, దుకాణాలు మూసేసినతర్వాత రాత్రి8గంటలనుంచి, ఉదయం 10మధ్యలో క్వార్ట్‌ర్‌కు రూ.30, రూ.40వరకు అదనంగా అమ్ముతూ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు తమజేబులు నింపుకుంటున్నార న్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలుచేస్తే, జగన్మోహన్‌రెడ్డి థలవారీగా చేస్తానం టూ, జే-ా్యక్స్‌ రూపంలో, ఉచితంగా వచ్చే మద్యంఅమ్మకాలద్వారా రూ.10వేల కోట్లవరకు జగన్‌, విజయసాయిల జేబుల్లోకి వెళుతున్నాయన్నారు. పదవుల్లోకి రాకముందే లక్షలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నవారికి ఇలాటంవన్నీ వెన్నతో ప్టిెన విద్యలని బుద్ధాఎద్దేవా చేశారు. పన్నులరూపంలో ప్రజలసొమ్ము ప్రభుత్వానికి వెళుతు ంటే, అవేసొమ్ముని ప్రజలకు ఇచ్చినట్టేఇస్తూ, తిరిగి మద్యంరూపంలో జగన్‌సర్కారు స్వాహాచేస్తోందన్నారు.

మద్యపాననిషేధం జగన్‌కు ఆదాయవనరుగా మారిందనడానికి ఇంతకంటే రుజువులే ముాంయన్నారు. ప్రభుత్వం ఇప్పికైనా మద్యందుకాణాలను ప్రైవేటువ్యక్తులకే అప్పగించాలన్నారు. అన్నాబత్తుని శివకుమార్‌ శిఖండి... అర్థణాకు ఎక్కువ, బేడాకు తక్కువైన అన్నాబత్తుని శివకుమార్‌ శిఖండిలా ప్రవర్తిస్తూ, రాజకీయ పితామహుడైన చంద్రబాబు నాయుడిపై నోరుపారేసుకుంటున్నాడని, అతను తననోిని అదుపులో పెట్టుకోకపోతే తగినవిధంగా బుద్ధిచెబుతామని వెంకన్న హెచ్చరిం చారు. సౌమ్యుడిగా పేరున్న అన్నాబత్తుని సత్యనారాయణ కడుపున చెడబ్టుిన శివకు మార్‌, తనతండ్రికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడన్నారు. శివకుమార్‌ తాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, అతనంత మగాడయితే, తెనాలో ఎక్కడకు రమ్మాండో చెప్పాలని వెంకన్న సవాల్‌ విసిరారు. నోరుందికదా అని రెచ్చిపోతున్న వైసీపీనేతలు తమ పదవులు శాశ్వతం కావనే విషయాన్ని తెలుసుకోవాలని, రెచ్చిపోయేవారందరి జాబితాను చంద్రబాబునాయుడు సిద్ధంచేస్తున్నాడని, వారందరి అంతుచూసి తీరుతామని వెంకన్న తేల్చిచెప్పారు.

Advertisements

Latest Articles

Most Read