ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసినా తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. బుధవారం పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సమాధానాన్ని తెలుగుదేశం పార్టీ వక్రీకరిస్తూ భ్రమల్లో విహరిస్తుందని వ్యాఖ్యానించారు. అమరావతినే రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటూ తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా నోటిఫై చేశారని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, ఇకపై మరో కొత్త జీవో ఏదైనా వస్తే కేంద్రం ఆ జీవోను కూడా ప్రస్తావిస్తుందని వివరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జారీ చేసిన జీవో మార్చడానికి శిలా శాసనం కాదని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

కేంద్ర అంత స్ప ష్టతనిచ్చినా భ్రమలు కల్పించే రాజకీయాలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీని విమర్శించారు. కొత్త ప్రభుత్వం కొత్త రాజధానిపై జీవో జారీ చేస్తే దాన్ని కూడా కేంద్ర గుర్తిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ విషయాన్నీ రాజకీయ కోణంలో చూడదని, రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్రానికే పరిమితమైన అంశమని చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమేర వ్యతిరేకిస్తోందనిజీ వీఎల్ నరసింహా రావు అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదట డిమాండ్ చేసింది. బీజేపీయేనని, ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు నిర్ణయం వరకు స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇక మిగతా పాలనా విభాగాలను విశాఖపట్నం తరలించి, అమరావతిని కేవలం అసెంబ్లీకి పరిమితం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇలా చేస్తే అమరావతిని రాజధానిగా కొనసాగించినట్టు కాదని అన్నారు.

ఇది ఇలా ఉంటే జీవీఎల్ తీరు పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఏపి బీజేపీ మొత్తం ఒక వైపు ఉంటే, జీవీఎల్ మాత్రం ఒక వైపు ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజధాని రైతులు, బీజేపీ వైపు ఆశగా చుస్తున్న ప్రతి సారి, జీవీఎల్ వచ్చి, వైసీపీ అధికార ప్రతినిధిలాగా, వైసీపీ ఎజెండా తీసుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అమరావతి పై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత కూడా, జీవీఎల్ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. ఆయనకు అమరావతి మీద ద్వేషమో, లేక చంద్రబాబు మీద ద్వేషమో కాని, ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలి అనుకుంటున్న బీజేపీ ప్రయత్నాలకు మొదటి శత్రువు మాత్రం, జీవీఎల్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ, జీవీఎల్ ని కట్టడి చెయ్యాలని, ఏపి బీజేపీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలను కలవాలని నిర్ణయించారు. తొలుత రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావించినప్పటికీ.. కేంద్రం విస్పష్టమైన ప్రకటనతో తాజాగా వ్యూహాన్ని మార్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఈ నెల 10న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు పార్టీ ప్రముఖులు ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలుసహా రాజధాని గ్రామాల్లో నెలకొన్న పరిణామాలపై ఢిల్లీ పెద్దలతో వీరు చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అమరావతి రాజధాని తరలింపు పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ గతంలోనే రాజకీయ తీర్మానం చేసింది. అంతకు ముందు పలుమార్లుకన్నా లక్ష్మీనారా యణ, సుజనా చౌదరి, పురంధేశ్వరి సహా పలువురు బీజేపీ నేతలు రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. నేతల పర్యటనల్లో రైతుల నుంచివ్యక్తమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తరలింపుపై రాజకీయంగా తీర్మానం చేశారు.

కేంద్ర బీజేపీ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి రాజధాని మార్పుపై రాష్ట్రప్ర భుత్వం వెనక్కి వెళ్లే విధంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు పలుప్రయత్నాలు చేశారు. ఇలాంటి తరుణంలో పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయం రాష్ట్రప భుత్వ పరిధిలోని దంటూ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ప్రకటన బీజేపీ నేతలను సైతం గందరగోళానికి గురి చేసింది. ఈ క్రమంలోనే తొలుత 10న రాజధాని గ్రామాల్లో పర్యటిం చేందుకు ఆలోచన చేశారు. అయితే ముందు పార్టీ అధిష్టానం వద్ద చర్చించిన తర్వాత అక్కడి నుంచి వచ్చే హామీ మేరకు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తొలుత కన్నా సహా కీలక నేతలు ముందు ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసేందుకు వెళుతున్నారు.

రాష్ట్ర బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ఎదుకు చూస్తున్న అధ్యక్ష నియామకంపై ఇదే పర్యాటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గత నెల 18న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక జరగాల్సి ఉంది. అయితే జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా గత నెల 20న బాధ్యతలు చేపట్టడంతో జాప్యం జరిగింది. నెలాఖరుకు రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఖరారు చేస్తారని భావించినప్పటికీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఈ నెల 11 లేదా 12న రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఖరారు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. కొత్త అధ్యక్షుని ఎంపిక వ్యవహారం ముగిసిన తర్వాత అమరావతి రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లే యోచనలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు.

ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. గోదావరి జిల్లాలో మంచి పేరు ఉన్న నేత.. ఆయనే ఎమ్మెల్యే గోరంట్లా బుచయ్య చౌదరి.. మొదటి నుంచి పార్టీకి, అధినాయకుడు చంద్రబాబుకి అండగా వస్తూ వస్తున్నారు. మొన్న ఎన్నికల్లో, అంత బలమైన వైసీపీ గాలి వీచినా, తట్టుకుని గెలిచారు. ఆయన ఎంత బాగా లాజిక్ మాట్లాడతారో అందరికీ తెలిసిందే. గోదావరి వెటకారంతో పంచ్ వేస్తె, అవతలి వారు సైలెంట్ అయిపోవటమే. అసెంబ్లీలో కూడా గోరంట్ల ఎలా ఫైట్ చేస్తారో చూస్తున్నాం. అయితే, ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి, చంద్రబాబుకి, పార్టీకి అండగా ఉన్నా, ఆయనకు ఇప్పటి వరకు మంత్రి పదవి మాత్రం రాలేదు. ఎందుకో అందరికీ తెలిసిందే. సామాజిక న్యాయం అనే ఉచ్చులో పడిన చంద్రబాబు గారు, ఇలాంటి వారికి అన్యాయం చేసారు అనే విమర్శలు ఉన్నాయి. అయినా బుచ్చయ్య చౌదరి గారు, ఎప్పుడూ బాధ పడలేదు. పార్టీకి పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కూడా, ఇదే నా చివరి ఎన్నిక అని కూడా చెప్పేశారు.

ఇక యువతకు, నా స్థానం ఇవ్వాలని అనుకుంటున్నా అని చెప్పారు. సహజంగా, ఇలా చివరి ఎన్నికలు అంటే, అందరూ రిలాక్స్ అయిపోతారు. అయితే, గోరంట్ల మాత్రం, మరింత దూకుడుగా వెళ్తున్నారు. యువతకు దగ్గర కావటం కోసం, సోషల్ మీడియా వేదికగా పంచులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక కారణం సోషల్ మీడియా. టిడిపి అధికారాన్ని కోల్పోయినప్పటి నుండి, పార్టీ తన సోషల్ మీడియా వ్యూహాన్ని మార్చింది. టిడిపి, నారా లోకేష్, మరియు చంద్రబాబు నాయుడు యొక్క ట్విట్టర్ ఖాతాలు ఈ రోజుల్లో మరింత చురుకుగా ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి సూటిగా ఉన్నాయి, అయినప్పటికీ, వైయస్ఆర్ కాంగ్రెస్ డిజిటల్ మీడియాను ఎదుర్కోవటం కష్టం అనే చెప్పాలి.

ప్రశాంత్ కిషోర్ ఇప్పటికీ తన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో పక్క అకస్మాత్తుగా, టిడిపి సీనియర్ నాయకుడు మరియు ఎమ్మెల్యే గోరంట్లా బుచయ్య చౌదరి ట్విట్టర్ ఖాతా గత రెండు నెలల్లో చురుకుగా పని చేస్తుంది. .చమత్కారమైన ట్వీట్లు మరియు వ్యంగ్యంతో అద్భుతమైన ట్రాక్షన్ పొందుతోంది. రాజకీయ నాయకుల తీవ్రమైన ట్వీట్ల మాదిరిగా కాకుండా, ఈ ఖాతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విషయాలతో పోస్ట్ లు చేస్తుంది. చాలామంది టిడిపి కార్యకర్తలు, ఈ టిడిపి ఖాతా అన్నికంటే బాగుందని, ఇలాగే వ్యంగ్యంతో కొట్టాలని అంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ ఖాతాల కంటే, బుచ్చయ్య ట్విట్టర్ ఖాతా ఎక్కువ ఆకట్టుకుంటుందని, టిడిపి కార్యకర్తలు అంటున్నారు. గోరంట్లా బుచయ్య చౌదరి టిడిపి వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆరుసార్లు ఎమ్మెల్యే. ఎన్టీఆర్ పాలనలో పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మూడు ముక్కల రాజధాని విషయంలో, జగన్ ప్రభుత్వం, ఎవరి మాట వినకుండా దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 40 రోజుల్లోనే ప్రక్రియ అంతా ముగించాలని ప్లాన్ చేసారు. అయితే వీరి దూకుడికి శాసనమండలి బ్రేక్ వేసింది. జగన్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రెండు బిల్లులను, శాసనమండలి బ్రేక్ పడేలా చేసింది. సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకోవటంతో, ప్రక్రియ మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాసం ఉంది. అయితే, ఈ విషయాన్నీ జగన్ తట్టుకోలేక పోయారు. తన నిర్ణయానికే వ్యతిరేకంగా చెప్పిన మండలిని ఉంచటానికి వీలు లేదు అంటూ, మండలి రద్దు తీర్మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టి, కేంద్రానికి పమించే ఏర్పాటు చేసారు. దీంతో, కౌన్సిల్ రద్దు గురించి వైయస్ఆర్ కాంగ్రెస్ లో చర్చను ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన మూడు రాజధానుల ప్రణాళికను కౌన్సిల్ ఎలా నిలిపివేసిందనే దాని పై చాలా కోపంగా ఉన్నారని, ఆయన ప్రతీకారం తీర్చుకుంటే, ఇలా ఉంటుందని, దాని వల్ల, సొంత పార్టీ కూడా నష్టపోతుంది అని అంటున్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే ఒకటి లేదా రెండు సంవత్సరాలు సహనంగా ఉండి ఉంటే, అప్పటికి మొత్తం కౌన్సిల్ ఆధిపత్యం చెలాయించే, స్తానంలో వైసీపీ ఉండేదని అంటున్నారు. కౌన్సిల్ రద్దు, కేంద్రం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదించిన వెంటనే, ఇద్దరు మంత్రులు - పిల్లి సుబాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకట రమణ తమ సీట్లను ఖాళీ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా, వైయస్ఆర్ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఆశావాదుల జాబితా చాలా పెద్దగా ఉంది. మొన్న ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ సందర్భంగా, జగన్ అనేక మంది నాయకులకు MLC వాగ్దానాలు చేసారు. అయితే ఇప్పుడు వారికిఎమ్మెల్సీ పదవి లేకుండా పోతుంది.

జగన్ ఇప్పుడు దానిని విస్మరించి, ప్రాంతీయ మండల్లిలో, ఎమ్మెల్సీ హోదాతోనే ఇస్తాం అంటున్నా, ఎవరూ ఇష్ట పడటం లేదు. వచ్చే ఎన్నికల సమయంలో దీని దెబ్బ జగన్ కు గట్టిగా తగిలే అవకాసం ఉంది. అయితే ఇదే విషయం పై, చంద్రబాబుని కొంత మంది అడగుతూ, ఈ నిర్ణయం మీకే ఎక్కువ నష్టం కదా అని అడగగా, కౌన్సిల్‌లో 29 మంది సభ్యులను కలిగి ఉన్న టిడిపికి ఇప్పుడు తాత్కాలిక నష్టం జరగవచ్చు, కాని మా మెజారిటీ ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో కోల్పోతుండటంతో, మాకు పెద్దగా ఆందోళన లేదు, ప్రజల కోసం పదవులు నష్ట పోతున్నాం అనే సంతోషం ఉంది, అమరావతి రైతుల కోసం, 29 మంది పదవులు త్యాగం చేసారు అంటూ చంద్రబాబు చెప్పారు. మండలి రద్దు అవ్వాలంటే ఏడాది పైన పడుతుంది. సరిగ్గా వైసీపీకి మెజారిటీ వస్తుంది అనే టైంకి, రద్దు అవుతుంది. జగన్ తనకు ఉన్న అహంతో, తానే తన పార్టీని నష్ట పరుచుకున్నారు అంటూ, చంద్రబాబు వాపోయారు.

Advertisements

Latest Articles

Most Read