మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉండే వారు. ఆ తరువాత, జగన్ మోహన్ రెడ్డిని ప్రతి విషయంలో వెనకేసుకుని వచ్చే వారు. జగన్ మోహన్ రెడ్డిని సియం కుర్చీ ఎక్కించటంలో ఆయన కూడా, ఆయనకు తోచిన సహయం చేసారనే చెప్పాలి. ప్రతి విషయంలో చంద్రబాబుని విమర్శిస్తూ, జగన్ ని వెనకేసుని వచ్చేవారు. ఇప్పుడు కూడా, జగన్ సియం అయిన తరువాత, అనేక విషయాల్లో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా, ఉండవల్లి మాత్రం స్పందించలేదు అనే విమర్శలు వచ్చాయి. చివరకు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన రాజధాని విషయంలో కూడా, మూడు ముక్కలు చెయ్యటం పై స్పందించలేదు. అయితే, ఉండవల్లి ఎట్టకేలకు ఈ విషయం పై స్పందించారు. ప్రతి విషయంలో జగన్ ను వెనకేసుకుని వచ్చే ఉండవల్లి, ఈ విషయంలో మాత్రం భిన్నంగా స్పందించింది, వైసీపీకి షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ఎంతో కన్ఫ్యూజన్ ఏర్పడిందని, ఉండవల్లి అన్నారు.

ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, ప్రభుత్వం మారి తర్వాత అధికారంలోకి వచ్చిన ఇంకో ప్రభుత్వం రద్దు చేస్తే, ఇక ఆ రాష్ట్రం మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించారు. ఇక ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏ పని చెయ్యటానికి అయినా ఎందుకు వస్తారు అని ఉండవల్లి ప్రశ్నించారు. మూడు రాజధానుల విషయం పై, ఏమి చెప్పలేక పోతున్నాని అన్నారు. అసెంబ్లీ ఒక చోట, సచివాలయం మరోచోట అనే కాన్సెప్ట్ మన దేశంలో ఎక్కడా లేవని, ఎప్పుడూ చూడలేదని ఉండవల్లి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి, రాజధాని మీద ఫోకస్ పెట్టి, ముందుకు వెళ్తాం కంటే, పోలవరం, ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటి వల్ల రాష్ట్రానికి మేలని ఉండవల్లి వ్యాఖ్యానించారు. జగన్ ఆ విధంగా ముందుకు వెళ్లాలని అన్నారు.

రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉండే విషయం అని కేంద్రం చెప్పింది అని, మళ్ళీ అదే కేంద్రం 2015లోనే అప్పటి ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని కూడా కేంద్రమే చెప్పిందని, ఇలాంటి గందరగోళ పరిణామం గతంలో ఎప్పుడూ చూడలేదని ఉండవల్లి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా విశాఖపట్నం ను హైదరాబద్ లా చేస్తాను అంటున్నారని, మళ్ళీ అవే తప్పులు ఎందుకని, మనకు మరో హైదరాబాద్ వద్దు అని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని ఉండవల్లి అన్నారు. ఇక పోలవరం పై మాట్లాడుతూ, పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని ఉండవల్లి అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతూ, ఆయన సినిమాల్లో నటించడంలో తప్పు లేదని, గతంలో తాను కూడా ఆయన్ను సినిమాలు చేసుకోమని సలహా ఇచ్చానని అన్నారు.

విజిలెన్స్ కమిషన్ కార్యాల యాన్ని కర్నూలుకు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చీఫ్ సెక్రటరి నీలం సాహ్నిని కలిసి విజ్ఞప్తి చేశామని సెక్రెటరియేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విలిలెన్స్ కమీషన్ 'క్వాజీ జుడీషయరీ' అయినా అందులో పనిచేసే సిబ్బంది సెక్రెటరియేట్ ఉద్యోగులు కాబట్టి ఎక్కడ సెక్రెటరియేట్ ఉంటే అందులోనే విజిలెన్స్ కమీషనర్, ఆఫ్ ఎక్వెరీస్ కార్యాలయాలు ఉంచాలని సీఎస్ నీలం సాహ్నిని కోరామని తెలిపారు. ఇందులో పనిచేసే సిబ్బంది అందరూ సెక్రెటరియేట్ ఉద్యోగులేనని, డిపార్ట్మెంట్ ట్రాన్స్ ఫర్స్ అయినా, ప్రమోషన్లు వచ్చినా సెక్రటరియేట్ శాఖల్లోనే వస్తాయన్న విషయాన్ని కూడా సీఎస్ దృష్టికి తీసుకవెళామని తెలిపారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటులో భాగంగా విజిలెన్స్ కమీషనర్, కమీషనర్ ఆఫ్ ఎక్వరీస్ కార్యాలయాలు కర్నూలుకు మారుస్తూ జీవో ఇచ్చామని, మీ విజ్ఞప్తిని పరిశీలిస్తామని సిఎస్ హామీ ఇచ్చారని తెలిపారు.

కర్నూలుకు విజిలెన్స్ కమీసనర్, కమీషనర్ ఆఫ్ ఎక్వెరీస్ కార్యాలయాలు తరలించడంపై కోర్టులో ఉన్న వాజ్యంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సెక్రెటరియేట్ లోనే ఈ కార్యాలయాలు ఉంచాలని తాము కోరుతున్నామని తెలిపారు. సెక్రెటరియేట్ ఎక్కడికి మార్చినా అభ్యంతరం లేదని.. ప్రభుత్వం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడికి వెళ్లి పనిచేస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నంకు మార్చితే అక్కడికి వెళ్లి పనిచేస్తామని తెలిపారు. సెక్రెటరియేట్ విశాఖకు మార్చడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉద్యోగులకు అలాంటి ఇబ్బందులు మామూలే అన్నారు. హైదరాబాద్ నుండి మార్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉద్యోగులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వైజాగ్ వెళ్ళటానికి, మేము సిద్ధం అని అన్నారు.

అయితే ఈ ప్రకటన పై, విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క వైజాగ్ కు వెళ్ళటానికి మాకు ఏమి ఇబ్బంది లేదని, ఎక్కడికైనా ప్రభుత్వం వెళ్ళమంటే వెళ్తాం అని, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాం అని చెప్తున్న వెంకట్రామిరెడ్డి, కర్నూల్ వెళ్ళటానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి ? ప్రభుత్వం చెప్తే ఎక్కడికైనా వెళ్తాం అని చెప్తూ, సచివాయలం ఎక్కడ ఉంటే, మేము అక్కడే ఉంటాం అని ఎందుకు చెప్తున్నారు ? ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళమంటే, అక్కడికి వెళ్తాం అంటారు, కాని కర్నూల్ కి వెళ్ళమంటే మాత్రం, అమ్మో అంటున్నారు. వారి దాక వస్తే కాని నొప్పి తెలియదా అని కొంత మంది సచివాలయ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.

పంచాయితీ ఎన్నికలను సత్వరం నిర్వహించడానికి రిజర్వేషన్లకు సంబంధించిన సాంకేతిక అడ్డంకులు ఎదురవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపోలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. దీనితో ఫిబ్రవరి నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ముందు చేయాల్సిన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు సంబం ధిత విభాగాలన్నీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్ని కల సన్నాహకాల్లో ఉండగానే, కేంద్రం కొత్తగా విధించిన నియమావళి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాష్ట్ర విభజన తరువాత రెండోసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్యను, మున్సిపాలిటీలలో వార్డుల సంఖ్యను పెంచడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజాగా డివిజన్లు, వార్డులు పెంపుకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఏలూరు, కాకినాడ వంటి రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లల్లో డివిజన్లను పెంచుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తాజా మార్గదర్శకాలతో... డివిజన్లు, వార్డుల పెంపుతో ఒక వైపు రాజకీయ ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ఔత్సాహిక పోటీదారుల ముందుకాళ్లకు బంధం వేస్తున్నాయి. తాజాగా జరిగే ఎన్నికలను పాత హద్దుల ప్రకారమే నిర్వహించాలని, కొత్తగా వార్డులు, డివిజన్లు ఏర్పాటు చేయడానికి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసినట్లు కొందరు అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పడిన వార్డులు, డివిజన్లతో స్థానికంగా కొందరికి రాజకీయ పునరావాసం కల్పించొచ్చనుకున్న రాజకీయ పార్టీలకు కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ఇబ్బందిగా మారాయి.

అయితే కొత్త మార్గదర్శకాలకుల సంఖ్య పెంపుపై అధికారికంగా ఆదేశాలు అందలేదని కొందరు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. తమకు స్పష్టమైన కేంద్ర మార్గదర్శకాలు అందిన తరువాత ఎలా ముందుకెళ్లాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని వారు పేర్కొంటున్నారు. ఎన్నికల సంఘం సమావేశం.. మున్సిపోల్ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమ సన్నద్ధతను ఎన్నికల సంఘానికి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. దీనితో ఈ నెల 7వ తేది అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లతో కాకుండా పాత పద్ధతిలోనే బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది

ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనపై రాష్ట్ర ప్రభుత్వం కొంత మెత్తబడిన సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠ శాలలో 6వ తరగతి వరకు విధిగా ఆంగ్లమాధ్యమంలోనే బోధన చేయాలని జారీ చేసిన జీవోలో కొన్ని సడలింపులు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన చేయాలని ప్రభుత్వం జారీ చేసినజీ వోను సవాల్ చేస్తూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ఆనే సామాజిక కార్యకర్త హైకోర్ట్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా మాతృభాషలో విద్యాబోధన హక్కును కోల్పోవటంతో పాటు లింగ్విస్టిక్ట్ మైనారిటీస్ ' హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. పిటీషనర్ తరుపున ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు.

కేంద్రప్రభుత్వం తరపున వాదిస్తున్న అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ సైతం మాతృభాషలోనే విద్యాబోధన చేయాలన్న జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు విచారణ ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ జితేంద్రకుమార్‌ మహేశ్వరీ, జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం కౌంటర్ దాఖలు చేశారు. ఇతర భాషలకు ఒకే... రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ కు దాఖలు చేసిన కౌంటర్‌లో లింగ్విస్టిక్ మైనారిటీ పాఠశాలల్లో ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒరియా భాషలలో బోధనను కొనసాగించగలమని స్పష్టం చేసింది.

అంటే తెలుగు మినహా మిగిలిన అన్ని భాషలలో బోధనా యధావిధిగా కొనసాగేందుకు అవకాశమేర్పడింది. తెలుగు ఒక్కటే వద్దు అని చెప్పటంలో, ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో మరి ? రాష్ట్రంలోని తల్లిదండ్రుల కమిటీలు అభిప్రాయాలు స్వీకరించామని, అత్యధిక శాతం మంది ఆంగ్ల భాషా బోధననే కోరుకుంటున్నారని ప్రభుత్వం కౌంటర్‌లో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు తెలుగు మాధ్యమాన్ని కోరుకున్న పక్షంలో మండలానికి ఒక పాఠశాల ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని ఆ కౌంటర్ లో తెలిపింది. దీనిపై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఇదే ‘ పిల్ 'లో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తూ మరో ఇరువురు ఇంప్లీడ్ అయ్యారు. విద్యా సంవత్సరం సైతం సమీపిస్తున్నందున ఈ 'పిల్ 'పై న్యాయమూర్తి నిర్ణయం కీలకం కానున్నది.

Advertisements

Latest Articles

Most Read