తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టార్గెట్ గా జగన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆకస్మికంగా లోకేశ్ భద్రతను కుదించేశారు. ఇప్పటికిప్పుడు వై ప్లస్ భద్రత ని మరింత తగ్గిస్తూ ఎక్స్ క్యాటగిరీకి మార్చారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా జనంలోకొస్తున్న లోకేశ్ భద్రత తగ్గించడానికి గల కారణాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో పక్క, సెలెక్ట్ కమిటీ సభ్యుడు అయిన లోకేష్, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్తున్న వేళ, ఈ డెసిషన్ షాక్ అనే చెప్పాలి. ఎన్నికలలో ఓటమి తరువాత నారా లోకేశ్ మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన రెండుబిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లడం, మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకునపడేయడంలో నారా లోకేశ్ ముందున్నారు.జగన్ కి 151 మంది ఎమ్మెల్యేలు అండగా ఉన్నా..శాసనమండలిలో తెలుగుదేశందే పైచేయి కావడంతో ఏకంగా మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నారు జగన్. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా నారా లోకేశ్ కొంత తగ్గుతారని ఊహించిన జగన్ సర్కారుకు ఝలక్ ఇచ్చారు.

అమరావతి పరిరక్షణకి మద్దతుగా ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కార్యకర్తలు, సామాన్యులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు పార్టీలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పారు. అలాగే తప్పుడు కథనాలు రాస్తూన్న సాక్షి పత్రికపై ఇటీవల పరువునష్టం దావా 75 కోట్ల రూపాయలకు వేశారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భద్రతను ఆకస్మికంగా కుదించారని తెలుస్తోంది. మా-వో-యి-స్టు-ల నుంచి ము-ప్పు పొంచి వుందనే నిఘా సంస్థల నివేదికలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ కి 2014 కు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2+2 భద్రత కల్పించారు.

అనంతరం 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత లోకేశ్ భద్రతని 4+4 కి పెంచారు. అనంతరం మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఇదే భద్రతను ప్రభుత్వం కొనసాగించింది. ఆంద్రా ఒడిశా సరిహద్దులో 2016 సంవత్సరంలో భా-రీ ఎ-న్ కౌం-ట-ర్ జరిగింది. మా-వో-యి-స్టు-లు ఓ లేఖ విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జరిగిన ఎ-న్కౌం-ట-ర్కి బదులు తీర్చుకుంటామని, చంద్రబాబు తనయుడు లోకేశ్ పై దా-డే తమ లక్ష్యమంటూ ప్రకటించారు.ఈ ఘటనతో ఆనాటి ప్రభుత్వం లోకేశ్ కి జె-డ్ క్యాటగిరి భద్రత కల్పించింది. ముందుగా జెడ్ క్యాటగిరి నుండి వై ప్లస్ కి తగ్గించి, ప్రస్తుతం ఎక్స్ కేటగిరీ మార్పు చేస్తూ భద్రతను పూర్తిగా కుదించారు.8 నెలల్లోనే రెండు సార్లు లోకేశ్ భద్రతను కుదించింది వైకాపా ప్రభుత్వం. ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నారా లోకేశ్ ప్రత్యక్షంగా జనంతో కలిసి పోరాడుతున్న ఈ దశలోభద్రత తగ్గించడంపై తెలుగుదేశం పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తనకు కేటాయించిన సెక్యూరిటీ కుదింపు, భద్రతాపరమైన వైఫల్యాలపై మాజీ మంత్రి నారా లోకేశ్ దాదాపు ఎనిమిది సార్లు లేఖలు రాసినా వీటిని కనీసం పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.  

రాజ్యసభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజ్యసభలో, దేశంలో ఉన్న అందరి ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల విషమై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ తరుపున, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడారు. ఆయన ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసుల విషయం ప్రస్తావిస్తూ, జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న 11 సిబిఐ కేసుల గురించ ప్రస్తావించారు. జగన్ మొహన్ రెడ్డి పై, ఎన్నో అక్రమ ఆస్తుల కేసులు నమోదు అయ్యాయని, సిబిఐ 11 కేసులు, ఈడీ 5 కేసులు నమోదు చేసింది అంటూ, కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన వారం వారం కోర్ట్ విచారణకు హాజరు కావాల్సి ఉందని చెప్పారు. అయితే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వటంతో, వారం వారం నేను కోర్ట్ రాలేను అంటూ, ఆయన కోర్ట్ ల్లో పిటీషన్ వేసారని, చెప్పుకొచ్చారు. అలగే జగన్ కేసుల ప్రస్తావన, ఆయన పై ఉన్న కేసులు, జగన్ కోర్ట్ మినహాయింపు కోరుతూ, వేస్తున్న పిటీషన్లు ఇలా అన్ని విషయాలు సభ ద్రుష్టికి తీసుకు వచ్చారు.

అయితే కనకమేడల రవీంద్ర కుమార్మ జగన్ పేరును సభలో ప్రస్తావించడం పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది ఒక వ్యక్తీకి సంబంధించిన విషయం కాదని, ఇది ఒక విస్తృతమైన అంశమని, కేవలం ఆ అంశానికి కట్టుబడి చర్చ జరగాలని, ఏ రాష్ట్రం పేరు గానీ, వ్యక్తిగతంగా పేరును గానీ ప్రస్తావించ వద్దు అంటూ, వెంకయ్య నాయుడు కనకమేడలకు సూచించారు. అయితే చైర్మన్ వెంకయ్య ఒకపక్క చెబుతుండగానే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కనకమేడల ప్రసంగానికి అడ్డుపడ్డారు. జగన్ పేరును ఎలా ప్రస్తావిస్తారు అంటూ, అభ్యంతరం చెప్పారు. కనకమేడల ప్రసంగించిన అంత సేపు, విజయసాయి రెడ్డి పక్క నుంచి అరుస్తూ, అభ్యంతరం చెప్తూనే ఉన్నారు.

అయితే విజయసాయిరెడ్డి కలుగజేసుకోవడంపై చైర్మన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానంలో తాను ఉన్నానని వెంకయ్య విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చెప్పారు. కనకమేడల వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించడంపై చైర్మన్ అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించడానికి మీరు మంత్రి కాదని వెంకయ్య నాయుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విజయసాయి, యు ఆర్ నాట్ మినిస్టర్, సిట్ డౌన్ అంటూ వెంకయ్య వ్యాఖ్యానించారు. జగన్‌‌పై ఉన్న సీబీఐ కేసుల్లో విచారణను త్వరగా పూర్తి చేయాలని, ప్రజా ప్రతినిధులు, సీఎంలపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కనకమేడల చెప్తూ, తన ప్రసంగం ముగించారు.

కియా విషయం రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే కియా ఎక్కడికీ వెళ్ళటం లేదు అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. దీంతో ఈ వివాదం ప్రస్తుతానికి ముగిసినట్టే. అయితే, ఈ సందర్భంలో, వైసీపీ నేతలు, కియా పై పెట్టిన వరుస ప్రెస్ మీట్లు, కియా మీద కురిపించిన ప్రేమ విషయం మాత్రం, అందరినీ ఆశ్చర్య పరిచింది అనే చెప్పాలి. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి అంటారు. అలా నిలకడ మీద, వీళ్ళకు నిజాలు తెలిసాయో ఏమో కాని, ఒకప్పుడు కియా అంటే మండి పడిన వైసీపీ నేతలు, ఈ రోజు కియా మీద మాట పడనివ్వటం లేదు. ఇది నిజంగా శుభ సూచికమే. ఇప్పటికైనా చంద్రబాబు కృషిని వీరు గుర్తించారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా కియా మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు. టైం మారే కొద్దీ, హోదాలు మారే కొద్దీ మనుషుల్లో వచ్చిన మార్పుగా దీన్ని భావించాలేమో. కియా మోటార్స్ కంపెనీని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, కరువు జిల్లా అయినా అనంతపురం జిల్లాకు, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తీసుకు వచ్చారు.

తెలంగాణా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి హేమాహేమీ రాష్ట్రాలు పోటీ పడినా, చంద్రబాబు కియా మోటార్స్ ని ఒప్పించి, ఆ రాష్ట్రాల కంటే, మీకు మెరుగైన రాయతీలు ఇస్తాం అని చెప్పి, తీసుకువచ్చారు. కియాతో పాటుగా, 17 కియా అనుబంధ సంస్థలు రావాల్సి ఉండగా, అవి గత కొన్ని రోజుల క్రితం తమిళనాడు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే కియా వచ్చిన సందర్భంలో, వైసీపీ పార్టీ నేతలు, కియా పై, చంద్రబాబు పై విమర్శలు చేస్తూనే వచ్చారు. విజయసాయి రెడ్డి అయితే, కియా ప్లాంట్ ఎక్కడో దేశంలో ఎత్తేసారు, అలాంటి ప్లాంట్ ఇక్కడా అంటూ ట్వీట్ చేసారు. కియా ముందు వైసీపీ పార్టీ వాళ్ళు వెళ్లి ధర్నాలు కూడా చేసారు. ఇక కియా పై సాక్షిలో రాతలు అయితే చెప్పనవసరం లేదు.

అయితే, ఇప్పుడు వాళ్ళు విపక్షం నుంచి అధికార పక్షంలోకి రావటం, అదీ కియా వెళ్ళిపోతుంది అంటూ విమర్శలు రావటంతో, డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో వైసీపీ పడింది. ఈ క్రమంలోనే, వైసీపీ పార్టీ నేతలు, కియా గొప్పదనం గురించి వివరించారు. బుగ్గన అయితే, కియా 14 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది, దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి అని చెప్పారు. ఇక ఎంపీ మాధవ్, ఎమ్మల్యే శ్రీకాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇలా అందరూ, కియా గురించి గొప్పగా చెప్పారు. ఇది అభినందించ దగ్గ విషయమే అయినా, గతంలో చంద్రబాబు ఏమి తెచ్చాడు అన్న నోటితోనే, ఈ రోజు 14 వేల కోట్లు ఒకే కంపెనీ పెట్టుబడి తెచ్చాడు అంటూ కియా గొప్ప చెప్తున్నారు అంటే, వైసీపీ ఇలా మాట్లాడి, సెల్ఫ్ గోల్ వేసుకుందా ? అనే అభిప్రాయం కలుగుతుంది. రేపు చంద్రబాబు ఏమి తెచ్చాడు అంటే, కియా పై, వైసీపీ నేతలు గొప్పగా మాట్లాడిన మాటలు చూస్తేనే అర్ధం అయిపోతుంది.

సీఆర్‌డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జర్క్ తో, శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీ షాక్ తింది. శాసనసభలో 151 స్థానాలతో, తిరుగులేని శక్తిగా, జగన్ ఏమి అనుకుంటే, అది జరిగేలా ఉన్న వైసీపీ, అసెంబ్లీలో బిల్లులను ఆమోదిస్తే, శాసనమండలిలో దానికి బ్రేక్ పడటం, అది కూడా టిడిపి అనుకోకుండా, వేరే వ్యుహంతో వచ్చి షాక్ ఇవ్వటం, ఏమి చెయ్యలేని స్థితిలో వైసీపీ ఉండి పోవటంతో, జగన్ షాక్ తిన్నారు. తన మాటకు ఎదురు చెప్పిన మండలి ఉండటానికి వీలు లేదు అంటూ నిర్ణయానికి వచ్చారు. వెంటనే, మండలి రద్దు తీర్మానం, అసెంబ్లీలో పెట్టి, చర్చించి, బిల్లుని ఆమోదించి, గవర్నర్ వద్దకు, అక్కడ నుంచి కేంద్రానికి పంపించారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. మండలి రద్దు వల్ల వైసీపీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాసం కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చెయ్యాల్సిన పరిస్థితి.

ఇక దీంతో పాటుగా, వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో, దాదపుగా 25 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. వాటి పై ఇప్పటికే అనేక మంది కన్ను వేసారు. జగన్ దగ్గర హామీ కూడా పొందారు. అయితే ఇప్పుడు మండలి రద్దుతో వారికి జగన్ ఏమి సమాధానం చెప్తారో అనే ఆసక్తి నెలకొంది. అయితే, జగన్ మోహన్ రెడ్డి,మండలి స్థానంలో, ప్రాంతీయ మండల్లు తెస్తున్నారని, అవి కూడా ఎమ్మెల్సీకి సమానంగా హోదా కలిగి ఉంటారని ప్రచారం చేస్తున్నారు. అయితే వీటి పై ఎవరూ ఆసక్తి చూపటం లేదు. జగన్ తొందర పాటు నిర్నయం తీసుకున్నారని అంటున్నారు. ఈ నిర్ణయం ఇప్పట్లో తెలియదు అని, రాను రాను, ఈ పరిస్థితి గురించి, రాజకీయంగా ఎంత డ్యామేజ్ అనేది జగన్ కు అర్ధం అవుతుందని అంటున్నారు.

ఈ నిర్ణయంతో ఇప్పుడు గన్నవరం పరిస్థితి మరింత క్లిష్టంగా మారబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల అనంతరం, చంద్రబాబుని విమర్శించి, జగన కు జై కొట్టడంతో ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిపోయిన, వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ఉండటానికి జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది. ఆ ఒప్పందం మీదే, వెంకట్రావ్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. అయితే, ఇప్పుడు ఆ అవకాశం లేదు. రేపు బై ఎలక్షన్ వస్తే, వంశీ, వెంకట్రావు ఇద్దరికీ టిక్కెటు ఇచ్చే అవకాశం లేదు. దీనితో ఇద్దరిలో ఒకరికి ఇబ్బంది తప్పదు. కాదు కూడదు అనుకుంటే వెంకట్రావుని రాజ్యసభకు పంపాలి. అయితే ఇప్పటికే రాజ్యసభ ఆశావహుల లిస్టు చాంతాడంత ఉంది. దీంతో, మండలి రద్దు ఎఫెక్ట్ మొదటగా, గన్నవరం మీదే పడే అవకాసం కనిపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read