జగన్ మోహన్ రెడ్డికి ఒక వైపు పరిపాలనలో ఎదురు దెబ్బలు తగులుతూ, చికాకు పెట్టిస్తుంటే, మరో పక్క, తన వ్యక్తిగతంగా ఉన్న కేసులు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అక్రమ ఆస్తుల కేసులో, జగన్ మోహన్ రెడ్డి, ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళాల్సి ఉన్న విషయం తెలిసిందే. 12 చార్జ్ షీట్లలో జగన్ మోహన్ రెడ్డి, అభియోగాలు ఎదుర్కుంటున్నారు. 43 వేల కోట్లు అక్రమంగా కొల్లగొట్టినట్టు, సిబిఐ కూడా ప్రాధమికంగా తేల్చి, కోర్ట్ లో పెట్టింది. దీనిలో భాగంగానే, జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం విచారణకు వెళ్తున్నారు. అయితే ఆయన గత ఏడు నెలలుగా విచారణకు హాజరు కాకపోవటంతో, కోర్ట్ ఆగ్రహం చెందటంతో, పోయిన శుక్రవారం కోర్ట్ కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు, ముఖ్యమంత్రిగా ఉంటూ, కోర్ట్ కు వెళ్ళిన వారు ఎవరూ లేరు. దేశంలో కూడా, లాలూ, మధు కోడా తరువాత, జగన్ మోహన్ రెడ్డి, ఇలా ముఖ్యమంత్రిగా ఉంటూ కోర్ట్ కు వెళ్లారు. అయితే, ఇప్పుడు మరోసారి శుక్రవారం రావటంతో, జగన్ కోర్ట్ కు వెళ్తారా లేదా, అనే టెన్షన్ నెలకొంది.

cbi 17012019 2

అయితే, ఈ రోజు జగన్ కోర్ట్ కు వెళ్ళలేదు. ఈ రోజుకి వ్యక్తిగత మినహాయింపు కోరాటంతో, ఈ ఒక్క రోజుకి కోర్ట్ మినహాయింపు ఇచ్చింది. మరో పక్క, ఈ రోజు పెన్నా అనుబంధ ఛార్జిషీటుకు సంబంధించి కోర్ట్, విచారణ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న ఏడుగురు నిందితులు హాజరు కావాలని కోర్ట్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ రోజు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. దీని పై ఇంకా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ కోర్ట్ షాక్ ఇచ్చింది. తనకు సంబధించిన 5 ఛార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలంటూ ఆయన కోర్ట్ కు పిటీషన్ పెట్టుకున్నారు. అయితే కోర్ట్ దాన్ని తిరస్కరించింది.

cbi 17012019 3

ఇవన్నీ వేరే వేరే కేసులు అని, అన్నిటికీ ఒకటే విచారణ చెయ్యలేమని చెప్పింది. ఇది జగన్ కు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, 5 ఛార్జిషీట్లు కలిపి విచారిస్తే, జగన్ తప్పు చేసారని తేలితే, ఒకే శిక్ష ఉంటుంది. కాని ఇప్పుడు కోర్ట్ అన్నీ వేరే వేరే విచారణ చేస్తాం అని చెప్పటంతో, జగన్ తప్పు చేసారని తేలితే, ప్రతి చార్జ్ షీట్ కు శిక్ష ఉంటుంది. లాలూ కేసులో ఇది జరిగింది. ఇక మరో అభ్యర్ధన కూడా కోర్ట్ తిరస్కరించింది. సీబీఐ విచారణ ముగిసే వరకు ఈడీ విచారణను నిలిపివేయాలనే జగన్ వేసిన, మరో పిటిషన్ కూడా కోర్ట్ తిరస్కరించింది. దీంతో జగన్ కు షాక్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు సిబిఐ కోర్ట్ కు వెళ్తున్న జగన్, ఇక ఈడీ విచారణ కూడా మొదలైతే, దానికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికి, జగన్ కేసులు ఆయన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, నాలుగు రోజుల క్రితం, చంద్రబాబు పై బూతులు తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, తెలుగుదేశం పార్టీ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చరిత్ర ఇది అంటూ, మొత్తం బయట పెట్టింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ అనురాధ మీడియాతో మాట్లాడారు. ఆవిడ మాటల్లో... "కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నాలుగురోజుల క్రితం చంద్రబాబునాయుడుగారిని ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. ఆ మాటలను వెనక్కు తీసుకొమ్మని కోరినప్పటికిని వెనక్కి తీసుకోలేదు. ఖర్మకాలి కాకినాడకు ఎమ్మెల్యే అయినప్పటికి ప్రజలకు శాపంగా మారారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తనంత నిజాయితీపరుడు లేడని అనుకుంటున్నాడు. అతను అవినీతిపరుడడని తన నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. అనపర్తి నుంచి వచ్చి కాకినాడలో దందాలు మొదలుపెట్టిన చరిత్ర నీది. నీ తండ్రి భాస్కర్‌రెడ్డి అనపర్తిలో ఉన్నప్పుడు దొంగ నోట్లు ముద్రించి కాల్‌ మనీ ద్వారా చెలామణి చేశారు. పేద ప్రజల పొట్టగొట్టి, రేషన్‌ షాపుల్లో బియ్యం దొంగతనం చేసి వాటికి పాలిష్‌ పట్టి విదేశాలకు తరలించిన చరిత్ర నీ తండ్రిది. ప్రిన్సిపల్స్‌లను, హెడ్మాష్టర్లను కిడ్నాప్‌ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేసుకుని వారి ఆస్తిని కాజేసిన చరిత్ర మీది. కాకినాడలోని భానుగుడి సెంటర్‌లో మహేంద్ర స్వీట్‌ స్టాల్‌ యజమానికి కనీసం అద్దెకూడా ఇవ్వకుండా కోటి రూపాయల ఆస్తిని కాజేసిన చరిత్ర నీది.కోటి రూపాయలు ఇవ్వపోగా 70 లక్షల రూపాయలు అతని వద్ద వసూలు చేసిన చరిత్ర నిదికాదా?"

"కార్పొరేషన్‌ దగ్గర నీకున్న కాంప్లెక్స్‌ లో ఎవరు రావటంలేదని రోడ్డు వెడల్పు కోసం వేల కోట్లు నష్టం చేసిన చరిత్ర నీది. భాస్కర కాంప్లెక్స్‌ను పేకాట క్లబ్బుగా మార్చి పేద, మధ్య తరగతి యువత జీవితాలను నాశనం చేసిన చరిత్ర నీది కాదా? అదే కాంప్లెక్స్‌లో ఒక మంత్రిని గన్ను పెట్టి బెదిరించిన విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. చమురు కంపెనీలకు సంబంధించి పైప్‌లైన్‌ను కట్‌ చేసి నిస్సుగ్గుగా ఆయిల్‌ను దొంగతనం చేసి దాన్ని అమ్ముకుని బతికే మీరు చంద్రబాబునాయుడు గురించి మట్లాడుతారా? మీరు చేసిన దొంగతనాలు, కిడ్నాప్‌లు, దౌర్జన్యాలపై రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అడిషనల్‌ ఎస్పీ రంగనాధ్‌ను నియమిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కొడుకు అయిన జగన్మోహన్‌రెడ్డి అండతో రాజశేఖర్‌రెడ్డి కూడా ఎటువంటి యాక్షన్‌ తీసుకోలేదు. మీకు చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయన కాలి గోటికికూడా మీరు సమానం కారు. దేవీ-శ్రీదేవి థీయేటర్స్‌ దగ్గర మీరు కట్టిన ఆపార్టుమెంట్‌ పరిస్థితి చెప్పగలరా? ఆ ఆపార్టుమెంటును కొనుగోలు చేసిన వ్యక్తులు తిరిగి డబ్బులు చెల్లించమని అడిగితే పట్టించుకోకుండా రోడ్డున పడేసిన చరిత్ర మీది. కాకినాడ రూరల్‌ ఏరియాలో మీరు చేసే రొయ్యల ఎక్స్‌పోర్ట్‌ పేరుతో అక్రమాలు సాక్షాలతో సహా మేము బయట పెట్టబోతున్నాం. ఇంత నేర చరిత్ర ఉన్న మీరు 40 సంవత్సరాలల్లో ఎటువంటి మచ్చ లేని చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. చంద్రబాబునాయుడు పేరు ఉచ్చరించే అర్హత కూడా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి లేదు. 2004 నుంచి సెక్షన్‌ 147, 323, 506, 186,149 దొమ్మి కేసులు, హత్యాయత్నం కేసులు నీ మీద ఉంటే మీరేదో నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు. ద్వారాంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి చెంచాగాళ్లు నలుగురున్నారు. "

"వారిని అడ్డం పెట్టుకుని కాకినాడ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న మీరు చంద్రబాబునాయుడుపై అసభ్యకరంగా మాట్లాడుతారా? మీ చెంచాగాళ్లు గణపతి, అలీషా, కన్నా, ఫ్రూటీకుమార్‌ ఈ నలుగురిని ఆంబోతుల్లా ఊరిమీద వదిలారు. వారు తప్పతాగి జనాలమీద పడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే స్థాయికి తగరు. ఎమ్మెల్యే సీటు ఎలా వచ్చింది? ఒక దొంగ ముఖ్యమంత్రి దొంగలకే సీట్లు ఇస్తారు. బోట్లల్లో మీరు ఏం షిప్‌ చేశారు? చిన్న చిన్న బోట్లల్లో ఎవరిని షిఫ్ట్‌ చేశారు?తద్వారా ఏ రకంగా ఆయిల్‌ను దొంగతనం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైసీపీ నాయకులు రైతుల త్యాగాలపై కామెంట్‌ చేస్తున్నారు, మీరు మాత్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2,65,000 ఎకరాలు కొట్టేసిన విషయం అందరికి తెలిసిందే. దాని గురించి సమాధానం చెప్పమంటే కుంటి సాకులు చెబుతున్నారు. ఏ-2 విజయసాయిరెడ్డి ఖర్మగాలి రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఏ-1 ముద్దాయి జగన్‌ పాపం పంచుకున్నారు కాబట్టి రాజ్యసభ సభ్యులయ్యారు. విజయసాయిరెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రికి సీబీఐ వాళ్లు తనకు నచ్చిన వారిని నియమించమని లేఖ రాస్తున్నారు. ఒక ముద్దాయి ఎవరు కావాలని నిర్ణయించడం చూస్తుంటే మన దేశం ఎక్కడికి పోతోందో అర్థం కావడంలేదు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్‌రెడ్డి అనే చీడ పట్టింది. ఈ చీడ వదిలిన రోజే మళ్లీ మన ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుంది. నిజంగా ముఖ్యమంత్రి దగ్గర నీతి, నిజాయితీ ఉంటే ముందు కోర్టుకు వెళ్లాలి. నిస్సుగ్గుగా మొన్న రెండు గంటలు కూర్చున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఒక రౌడీ షీటర్‌ అని తన నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్ని చోట్ల రాష్ట్రమంతటా దందాలు చేస్తున్నారు. అతను క్యారక్టర్‌ లేని వ్యక్తి. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి జగన్మోహన్‌రెడ్డికి బినామీ." అంటూ అనురాధ ధ్వజమెత్తారు.

అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి, అనేక ప్రచారాలతో, అమరావతి పై నెగటివ్ ప్రచారం చేస్తూ వచ్చారు. ఒక పక్క అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అమరావతిని రాష్ట్రంలో అందరికీ కనెక్ట్ అయ్యేలా, అన్ని గ్రామాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చారు. అలాగే 10 రూపాయలకు ఇటుకు పెట్టి, అందరినీ భాగస్వామ్యం చేసారు. అమరావతి అందరిదీ అనే భావం తీసుకువచ్చారు. అయితే అప్పటి ప్రతిపక్షం వైసీపీ మాత్రం, అమరావతిని, మిగతా జిల్లాల ప్రజలకు దూరం చేసే కార్యక్రమాలు చేసింది. ఇందులో భాగంగా అనేక ప్రచారాలు చేసారు. ముందుగా రైతులను భూములు ఇవ్వకుండా, ప్రయత్నాలు చేసినా, రైతులు మాత్రం వీళ్ళ మాట వినలేదు. దీంతో 33 వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. దీంతో అమరావతిలో పనులు మొదలయ్యాయి. రోడ్లు వేసారు, బిల్డింగ్ లు కడుతున్నారు, రైతులకు ప్లాట్లు ఇచ్చారు. ఇలా అమరావతి ముందుకు సాగుతూ ఉన్న సమయంలో, ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారి పోవటం జరిగిపోయాయి.

amaravati 16012020 2

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, అమరావతిని ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా, అనేక ప్రచారాలు మొదలు పెట్టింది. అమరావతి ఒకే కులానికి సంబంధించింది అని ప్రచారం చేసారు. అయితే అది ఎస్సీ రిజర్వాడు నియోజకవర్గం. ఇక మరో ప్రచారం, అమరావతి కొంత మంది పెద్ద రైతులది అని. అయితే, 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులలో, 20490 మంది, ఒక ఎకరం కన్నా తక్కువ ఉన్నవారు. దీంతో ఈ ప్రచారం కూడా తుస్సు మంది. తరువాత, అమరావతి కోసం, 33 వేల ఎకరాలు ఎందుకు ? అనే ప్రచారం. అయితే జగనే 30 వేల ఎకరాలు కావాలి అని చెప్పే వీడియో రావటంతో, ఇది కూడా తుస్సు మంది. ఇక తరువాత అమరావతి గ్రాఫిక్స్. అయితే ఇది కూడా అక్కడ బిల్డింగ్ లు చూపించి తిప్పి కొట్టారు.

amaravati 16012020 3

మరో ప్రచారం, అమరావతికి లక్ష కోట్లు అని. కాని ఇది సెల్ఫ్ ఫైనాన్సు ప్రాజెక్ట్ అని లెక్కలతో చెప్పటంతో, ఇది కూడా పోయింది. అమరావతికి వరదలు అన్నారు, దీనికి ఎన్జీటీ తీర్పు రావటంతో, ఇదీ తుస్సు మంది. చివరగా, అమరావతి నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందని , ఐఐటీ మద్రాస్ దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇచ్చిందని, ప్రచారం మొదలు పెట్టరు. అయితే ఐఐటీ మద్రాస్ అలాంటి నివేదిక ఏమి ఇచ్చిన దాఖలాలు లేకపోవటంతో, కొంత మందికి అనుమానం వచ్చి, ఐఐటీ మద్రాస్ కు మెయిల్ పంపించారు. దీనికి స్పందించిన ఐఐటీ మద్రాస్‌, అలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేస్తూ ఐఐటీ మద్రాస్‌ రిప్లయ్‌ ఇచ్చింది. దీంతో అమరావతి పై, చేసిన మరో విష ప్రచారం కూడా తప్పు అని తేలిపోయింది. ఐఐటీ మద్రాస్ అంటూ చెప్తున్న రిపోర్ట్ , అబద్ధమని తేలిపోయింది.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అమరావతి రగడ పై, తెలంగాణా ప్రభుత్వ పెద్దలు, తమకు ఈ పరిణామాలు మంచి చేస్తున్నాయి అని ఎంజాయ్ చేస్తున్నారు కాని, ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. ఇక కేటీఆర్ అయితే, అది ఒక రాష్ట్ర అంతర్గత వ్యవహారం అని, దాని పై ఆ రాష్ట్ర ప్రజలే స్పందిస్తారని చెప్పారు. మరో మంత్రి హరీష్ మాత్రం, ఏపిలో జరుగుతున్న పరిణామాలు, మాకు రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పారు కాని, ఎక్కడా ప్రభుత్వ నిర్ణయం పై స్పందించలేదు. ఇక తెలంగాణా ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ కూడా, తెలంగాణా పౌరుడిగా సంతోషిస్తున్నా అని చెప్పి, ఆ రాష్ట్ర వ్యవహారం మాకు ఎందుకు అని వదిలేసారు. ఇక చివరకు కేంద్రంలో ఉండే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా, అధికారికంగా ప్రకటన రాకుండా, మేము స్పందించం అని చెప్పారు. అయితే ఇంత మంది, పక్క రాష్ట్రం వాళ్ళు, అమరావతిలో జరుగుతున్న విషయాల పై, తమ అభిప్రాయం చెప్పటానికి ముందుకు రాలేదు. అది ఒక రాష్ట్ర అంతర్గత వ్యవహారం, అని వదిలేసారు.

telangana 16012020 2

అయితే, ఇదే తెలంగాణాకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం, ఇక్కడ జరుగుతున్న ఉద్యమం పై సుదీర్ఘంగా మాట్లాడారు. ఎప్పటి లాగే, ఈ అవకాశాన్ని కూడా, తనకు రాజకీయ బిక్ష పెట్టిన, చంద్రబాబు పై విమర్శించటానికే ఉపయోగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు ఆడుకోవటానికి, ఏలూరు ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన, అమరావతిలో జరుగుతున్న పోరాటం పై స్పందిస్తూ, అమరావతి రైతులకు భారోసా ఇచ్చారు. ఇక్కడ మంత్రులు నోరు ఎత్తటం లేదు కాని, పక్క రాష్ట్ర మంత్రి వచ్చి, భరోసా ఇవ్వటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అమరావతి రైతులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని, జగన్ మోహన్ రెడ్డి అన్నీ చూసుకుంటారని అన్నారు.

telangana 16012020 3

ఇంకా చెప్పాలంటే అమరావతిలో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారని, బిక్షమెత్తుకునేవాళ్లే ఇబ్బంది పడి, రోడ్డున పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేసారు. మీకు ఒక డైనమిక్ ముఖ్యమంత్రి ఉన్నారనీ, ఆయన మీకు అంతా మంచే చేస్తాడని అన్నారు. అలాగే చంద్రబాబు పై ఘాటైన విమర్శలు చేసారు. చంద్రబాబు జోలె పట్టుకుని ఉద్యమం కోసం తిరుగుతూ ఉండటాన్ని విమర్శిస్తూ, ఈ బిక్షాటన చేసేవాళ్లతో ఏం జరగదనీ, మునిగిపోతారని అన్నారు. అయితే తెలంగాణా ఉద్యమం చేసిన పార్టీలో ఉంటూ, ఉద్యమాన్ని, ఉద్యమం చేసే వారిని బిచ్చగాళ్ళగా తలసాని అంటున్నారు అంటే, ఈయన అసలు తెలంగాణా ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎక్కడ ఉన్నారు, ఈయనకు ఉద్యమం అంటే ఏంటో తెలిస్తే కాదా, అనే విమర్శలు వస్తున్నాయి. పక్క రాష్ట్రంలో లక్షల మంది ఉద్యమం చేస్తుంటే, అలా చెయ్యద్దు, మీకు భరోసా అంటూ ఈయన చెప్పటం ఏమిటో అంటూ విమర్శలు వస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read