అమరావతి రైతుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్, రెండు రోజుల్లోనే పదవి పోగుట్టుకునే పరిస్థితికి వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిలో రైతుల గురించి మాట్లాడుతూ, వైసీపీ లైన్ ప్రకారమే, అందరి మంత్రులు అంటున్నట్టే, అమరావతి రైతులని పైడ్ ఆర్టిస్ట్ లతో పోల్చారు. అక్కడితో ఆగకుండా, ఇంకా ఎక్కువ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నాకు తెలిసిన రైతులు అంటే, బురదలో ఉండాలి, బురదలో దొరికింది తినాలి, కాని ఇక్కడ అమరావతి రైతులు మాత్రం, మంచి మంచి చీరలు, మంచి ఫోన్లు, చేతికి బంగారపు గాజులు, మెడలో నల్ల పూసలు వేసుకుని తిరుగుతున్నారని, పృధ్వీ అన్నారు. దీంతో ఇది ఒక పెద్ద దుమారం అయ్యింది. వైసీపీ అధిష్టానానికి, జరిగిన డ్యామేజ్ అర్ధమైంది. దీంతో, డ్యామేజ్ కంట్రోల్ కోసం, పోసానిని రంగంలోకి దించారు. పృధ్వీని తిట్టించారు. అయినా, ప్రజల్లో వ్యతిరేకత పోలేదు. దీంతో, ఇక వైసీపీ, పృధ్వీని బహిష్కరిస్తారని, వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్త జరుగుతూ ఉండాగానే, పృధ్వీ సరసాల ఆడియో టేప్ బయట పడింది.

audio 18012020 2

దీంతో సాక్షాత్తు వెంకన్న సేవలో ఉంటూ, ఇదేమి గోల అంటూ, ప్రజల్లో ఇంకా వ్యతిరేకత వచ్చింది. అతను అలాంటి వాడు అని తెలిసినా, అలాంటి పదవి ఎందుకు ఇచ్చారు అంటూ, వైసీపీ పై విమర్శలు వచ్చాయి. దీంతో, అవకాసం కోసం చూస్తున్న వైసీపీ, పృధ్వీ పై చర్యలు తీసుకుంది. పృధ్వీ చేత, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేపించి, విజిలెన్స్ ఎంక్వయిరీ వేయించారు. అయితే, ఇక్కడ కధ మరో మలుపు తిరిగింది. ఈ కేసు పై విచారణ చేస్తున్న, టీటీడీ విజిలెన్స్ అధికారులకు కొత్త కష్టాలు వచ్చాయి. దీంతో కేసు విచారణ ముందుకు సాగటం లేదు. ఇప్పటి వరకు పృథ్వీ పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు, ఎవరూ ముందుకు రాలేదు. చివరకు, ఆయన బాధితులుగా మీడియా ముందుకు వచ్చిన వారు కూడా, ఇప్పుడు ముందుకు రావటం లేదు.

audio 18012020 3

పృథ్వీ, అది చేసారు, ఇది చేసారు అంటూ, మీడియా ముందుకు వచ్చి చెప్పిన వారు, అలాగే అంతర్గతంగా సమాచారం ఇచ్చిన వారు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు కంప్లైట్ చేసేందుకు మాత్రం వెనకాడుతున్నారు. ఇక పృధ్వీతో, ఆడియోలో ఫోన్ సంభాషణ చేసిన మహిళ కూడా ఫిర్యాదు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. ఇప్పటికే తాను అల్లరి పాలు అయ్యానని, ఇంకా ఈ పరిస్తితుల్లో కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, మీడియా ముందుకు రాలేను అంటూ, ఆమె కూడా వెనకడుగు వేస్తుంది. దీంతో ఈ ఆడియో సంభాషణ పై విచారణ ముందుకు వెళ్ళాలి అంటే, బాధితులు ముందుకు రాకుంటే ఆరోపణలు నిరూపించడం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు.

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల మందు వరకు శత్రువులుగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు మిత్రులు అవుతుంటే, మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులు అవుతున్నారు. ఎన్నికల ముందు, బీజేపీ పార్టీ, వైసీపీ పార్టీ అధికారంలోకి రావటానికి అన్ని విధాలుగా సహాయ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ, పార్టీ, వైసీపీ పాలన నచ్చక, వారి పై విమర్శలు చెయ్యటం ప్రారంభించింది. బెజేపీకి కేవలం ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఉండటంతో, వైసీపీని ఎదుర్కునే శక్తి లేక, పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికలకు వెళ్ళటానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా ఈ ప్రకటన కూడా చేసారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా ఈ కలియక వైసీపీకి అస్సలు మింగుడు పడటం లేదు. మొన్నటి దాక తమకు లోపాయికారకంగా మద్దతు తెలిపిన, బీజేపీ ఇప్పుడు తమకు దూరం అవుతుందని, ఢిల్లీ లెవెల్ లో చేసే లాబయింగ్ కు ఇది ఇబ్బంది అవుతుందని, వైసీపీ పార్టీ భావిస్తుంది.

cbn 18012020 2

అయితే ఇదే తరుణంలో, తెలుగుదేశం పార్టీ ఆచితూచి స్పందిస్తుంది. ఇప్పటికప్పుడు ఈ కలియిక వల్ల తమకు ఇబ్బంది ఏమి లేదని టిడిపి భావిస్తుంది. అయితే బీజేపీ - జనసేన కలియిక పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి సారిగా స్పందించారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో, అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గున్నారు. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న చంద్రబాబు, బహిరంగ సభలో ఈ విషయం పై స్పందించారు. రాజధాని అమరావతిని తరలిస్తూ, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై, కనుక, జనసేన-బీజేపీ కూటమి కలిసి పోరాటం చేస్తే, ఈ రెండు పార్టీల కలయికని తాము కూడా స్వగిస్తామని అన్నారు. ఎన్నికలు, ఓట్లు ఇప్పుడు ప్రాధాన్యం కాదని, ఈ దిశగా అన్ని పార్టీలు ఆలోచించాలని అన్నారు.

cbn 18012020 3

"పవన్ కల్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, సంతోషం. అమరావతిని కొనసాగించడానికి మీ పొత్తును ఉపయోగిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తాను. కానీ జగన్ అరాచకాలకు మీరు కూడా భయపడిపోయి, పోరాడకపోతే ఉపయోగంలేదు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకు ముందు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా, ఇవే వ్యాఖ్యలు చేసారు. బీజేపీ-జనసేన కలయిక రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేస్తుందన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో ఉందని, కేంద్రంలో ప్రభావితం చేయగలస్థానంలో ఉన్న బీజేపీ రాజధాని మార్పు అంశంలో పెద్దన్నపాత్ర పోషించాలని అమరావతి ఉద్యమకారులతో పాటు, ఆంధ్రులంతా విశ్వసిస్తున్నారని పయ్యావుల కేశవ్‌ అన్నారు. బీజేపీ-జనసేన కలయిక కేవలం భేటీలకే పరిమితం కాకుండా, ఇప్పటికైనా ప్రత్యక్షకార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలన్న ఆకాంక్ష రాష్ట్రమంతటా ఉందన్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంపై శుక్రవారం నాడు సీబీఐ కోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణకు ఎంపీ విజ యసాయిరెడ్డి, తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడీ రాజగోపాల్, ఆడీఓ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మ హాజరయ్యారు. అనుబంధ చార్జిషీట్ను గతంలో సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడంతో పలువురు నేతలు, అధికారులకు సమన్లు జారీ అయ్యా యి. సీబీఐ రెండేళ్ల క్రితమే అనుబంధ చార్జిషీట్ ను దాఖలు చేసినా హైకోర్టు స్టే విధించ డంతో గతంలో విచారణ నిలిచిపోయింది. తాజాగా ఉన్నత న్యాయస్థానం ఈ కేసులో స్టే తొలగించడంతో దానిపై మళ్లీ విచారణ మొదలైంది. అయితే అనుబంధ చార్జిషీట్లను స్వీకరిం చవద్దంటూ జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎన్ఫో ర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు మాత్రం ఆ వాదనలను తోసిపుచ్చారు.

jagan 18012020 2

తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు మొదటి చార్జిషీటు దాఖలు చేశామని, తర్వాత మరిన్ని వివరాలు వెలుగుచూడడంతో అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేశామని వారు పేర్కొన్నారు. చట్టప్ర కారం ఎప్పుడు కీలక సమాచారం లభించినా దానికి అనుగుణంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసే వెసులుబాటు ఉందని వారు పేర్కొ న్నారు. గతంలో అనంతపురం జిల్లాలో పెన్నా సిమెంటు భూముల కేటాయింపు, తాండూరు ఇతర ప్రాంతాల్లో గనుల కేటాయింపు వ్యవహా రాల్లో అవకతవకలు జరిగాయని అనుబంధ చార్జీ షీలో సీబీఐ పేర్కొంది. అప్పుడు గనుల మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించగా, రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద వీరంతా నేరానికి పాల్పడినట్టు సీబీఐ అనుబంధ చార్జిషీట్ లో పేర్కొంది.

jagan 18012020 3

కాగా, ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు కోర్టు ముందు హాజరయ్యారు. సీఎం హోదాలో జగన్మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టుకు గత వారం తొలి సారి హాజరయ్యారు. సీబీఐ కేసు తేలేంత వరకూ ఈడీ కేసుల విచారణ నిలిపివేయాలని, సీబీఐ ఐదు చార్జిషీట్లనూ ఒకేమారు విచారించాలని జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు చేసిన వాదనలను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుండి జగన్మోహన్ రెడ్డిని మినహాయించా లని న్యాయవాదులు కోరారు. అయితే ఈ సారి జగన్ మోహన్ రెడ్డి కోర్ట్ కు రాకుండా, తనకు హై పవర్ కమిటీతో మీటింగ్ ఉందని చెప్పటంతో, కోర్ట్ ఈ ఒక్క వారానికి మినహాయింపు ఇచ్చింది. అనంతరం తదు పరి విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

రాజధాని అమరావతి తరలింపుపై ఆచితూచి అడుగేయాలని వైఎస్ జగన్మో హన్ రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు తది తర అంశాలను నిశతంగా పరిశీలించిన తరువాతే ముందడుగు వేయాలనే భావనతో ఉన్నట్లు తెలి సింది. ఇందులో భాగంగా కేబినెట్ సమావేశాలను ముందుగా నిర్దేశించిన తేదీ కంటే రెండు రోజులు ముందుగానే నిర్వహించాలని తొలుత నిర్ణయిం చారు. శనివారం రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, ఆతర్వాత సోమవారం నాటికి వాయిదా వేశారు. కాగా, భవిష్యత్ లో కేంద్రం నుంచి సహకారం అందుతుందనే భావనతో పాటు శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్నందున రాజధాని వికేంద్రీకరణపై దూకుడు పెంచిన సర్కార్ భవిష్యత్ వ్యూహ రచనపై ఇప్పటికే నిమగ్నమైంది. బీజేపీ, జనసేన పొతు నేపథ్యంలో రాజధానితో సహా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఆగమేఘాలపై రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

cabinet 18012020 2

తొలుత 20వ తేదీన శాసనసభ సమావేశాలకు కొద్ది గంటల ముందే కేబినెట్ సమావేశం నిర్వ హించి రాజధానిని విశాఖకు తరలించే అంశాన్ని ఆమోదించు కోవటం ద్వారా స్పష్టత ఇవ్వాలనుకు న్నారు. దీనితో 18వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు. కానీ, ఆ తర్వాత మరిణామాల నేపథ్యంలో మళ్లీ 20వ తేదీనే ఖరారు చేశారు. దీనికి తోడు హైకోర్టు కూడా రైతుల అభిప్రాయాలను సీఆర్డీఏ మెయిల్ కు పంపే విషయంలో ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ప్ర భుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇలావుంటే, అమరావతిపై ఆచితూచి అడుగు పలు అంశాలతో పాటుగా రాజధాని తరలింపు, ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుకు సంబంధించి చట్ట సవరణ బిల్లులను శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఇతర బిల్లులపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బీజేపీ, జనసేనతో పాటు ప్రతిపక్ష పార్టీ లన్నీ రాజధాని తరలింపును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.

cabinet 18012020 3

ఈ విషయంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే భవిష్యత్ లో అనర్థాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదనేది ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వీటన్నింటి పై కూలంకషంగా చర్చించటం ద్వారా కేబినెట్ సమావేశంలో అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియవచ్చింది. కాగా ఈ నెల 20 నుంచి అధికారికంగా అమ్మఒడి నిర్వహణ అంశంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించ నున్నట్లు సమాచారం. ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే విషయంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వంలో స్పష్టత లేదు. గత కొద్ది రోజుల క్రితం వరకు యథాప్రకారం విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించా లని ప్రభుత్వం భావించింది. తాజాగా విశాఖపట్నంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read