ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం, మంగళగిరిలో ఉన్న ఎన్టీఆర్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా, రేపు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, అలాగే ప్రజలకు ఎలా అర్ధమయ్యేలా చెప్పాలి అనే దాని పై, చర్చించారు. ఈ సందర్భంగా, ఆనాడు ఎన్టీఆర్ తీసుకువచ్చిన ఒక ఫార్ములా ఎలా సక్సెస్ అయ్యింది ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు: 1).అభివృద్ది వికేంద్రీకరణే తెలుగుదేశం పార్టీ మూల సిద్దాంతం. అన్ని ప్రాంతాల్లో అభివృద్ది జరగాలి, పరిపాలన ప్రజల వద్దకు చేరాలి అనేదే ఎన్టీఆర్ హయాం నుంచి టిడిపి విధానం. ఎన్టీఆర్ మాండలిక వ్యవస్థ తెచ్చింది పరిపాలన ప్రజల వద్దకు తెచ్చాం. ఆఫీస్ మారిస్తే, ఏదో 10మంది ఉద్యోగులను అటుఇటు మారిస్తే అభివృద్ది జరగదు. ఇప్పుడు పరిపాలన వికేంద్రకరణ పేరుతో అంతా రివర్స్ చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వ శాఖలను 4చోట్లకు మార్చడం ‘‘పాలనా వికేంద్రీకరణ కాదు. పాలనా విచ్ఛిన్నం..’’ బాధ్యతా యుతమైన స్థానాల్లో ఉన్నవాళ్లు ఈవిధంగా చేయరాదు. ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన ఉండాలి. మండల స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట (మండల కేంద్రంలో) ఉండాలి. జిల్లా స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు జిల్లా కేంద్రంలోనే ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట సెక్రటేరియట్ లో ఉండాలి. అప్పుడే వివిధ పనులపై వచ్చిన ప్రజానీకం ఆ ప్రాంతానికి వచ్చి అన్ని పనులు చేసుకుని వెళ్లడం సులువుగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లో భాగంగానే ప్రతి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలని ఎన్టీఆర్ అప్పట్లో భావించారు, మాండలిక వ్యవస్థకు రూపకల్పన చేసి దిగ్విజయంగా నడిపారు.  రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు రాజధాని ప్రాంతంలో ఒకేచోట సెక్రటేరియట్ లో ఉంటేనే, అన్నివర్గాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. ఒక్కో శాఖ పనికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సి రావడం ప్రజలకు వ్యయ ప్రయాస భారమే..

ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కేంద్ర కార్యాలయాలను అన్నింటినీ ఒకేచోట తెచ్చి, 70వేల ఉద్యోగులను ఒకే చోటకు తెచ్చి, ఇండియా గేట్- రాష్ట్రపతి భవన్ మధ్య నిర్మిస్తుంటే, పరిపాలనా కేంద్రీకరణ చేస్తుంటే, మన రాజధానిలో ఉన్న శాఖలను 4చోట్లకు మార్చేసి ‘‘పాలనా విచ్ఛిన్నానికి’’ వైసిపి ప్రభుత్వం పాల్పడుతోంది. 10వేల ఎకరాల భూములపై కన్నేసినందుకే విశాఖకు రాజధానిని తరలించాలని ఎత్తుగడ వేశారు. 8నెలల్లో సీఎం స్వంత నియోజకవర్గానికి వేలకోట్లు ఇచ్చారు. అదే శ్రీకాకుళం, విజయనగరంకు ఎందుకివ్వలేదు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే..? 2).నీటిపారుదల ప్రాజెక్టులపై టిడిపి ప్రభుత్వం రూ72వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో 40వేల కోట్లు పైన వెనుకబడిన జిల్లాలలోనే(ఉత్తరాంధ్ర, రాయలసీమ) ఖర్చు చేశాం. టిడిపి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా విశాఖ నుంచే చేశాం. 3సమ్మిట్లు పెడితే మూడూ విశాఖలోనే నిర్వహించాం. ఆర్ధిక రాజధానిగా, ఫార్మాహబ్ గా, టూరిస్ట్ కేంద్రంగా విశాఖను అన్నివిధాలా అభివృద్ది చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే..హుద్ హుద్ తుపాన్ బీభత్సంలో విశాఖ అతలాకుతలం అయితే, సెక్రటేరియట్, కేబినెట్ అంతా అక్కడే 14రోజులు మకాం వేసి విశాఖను మళ్లీ సర్వాంగ సుందరంగా చేశాం. తిత్లి తుఫాన్ బీభత్సంలో కనీసం శ్రీకాకుళం జిల్లాలో బాధితులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు.

హుద్ హుద్ తుపాన్ తో విశాఖ అల్లాడితే అక్కడ కనీసం గంట కూడా ఉండకుండా వెళ్లిపోయాడు. వాళ్ల అమ్మను ఓడించినందుకే హుద్ హుద్ వచ్చిందన్నవాళ్లకు విశాఖపై ప్రేమ ఉంటుందా..? 3).ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఈ 8నెలల్లో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఎంత నిధులు ఖర్చు చేశారు..? భావనపాడు పోర్ట్, భోగాపురం ఎయిర్ పోర్ట్ అతీగతీ పట్టించుకోలేదు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార ప్రాజెక్టుల్లో ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క యూనిట్ కాంక్రీట్ వేయలేదు. విశాఖపై ప్రేమతో కాదు అక్కడి భూములపై కన్నేయడం వల్లే అక్కడికి తరలిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ కాబట్టి అమరావతి వీలుకాదు, ల్యాండ్ గ్రాబింగ్ కోసమే విశాఖపై కన్నేశారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టి ఇక్కడి భూముల ధరలు పెంచడం దేవుడెరుగు, ఉన్నభూములన్నీ వైసిపి భూతాలే మింగేస్తున్నారని అక్కడి ప్రజలు భీతిల్లుతున్నారు. పనులన్నీ నిలిపేసి ఇక్కడ అమరావతిని దెబ్బకొట్టారు. రూ లక్ష కోట్ల సంపదను నాశనం చేశారు. రూ లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే డేటా సెంటర్, లులూ, ప్రాంక్లిన్ టెంపుల్ టన్, ఫిన్ టెక్ అన్నీ పోగొట్టేసి విశాఖను దెబ్బకొట్టారు. కియా ఆగ్జిలరీ యూనిట్లు 17పోగొట్టి అనంతపురాన్ని, మెగా సీడ్ హబ్ పోగొట్టి కర్నూలును, రిలయన్స్ కంపెనీ పోగొట్టి తిరుపతిని, సోలార్-విండ్ పవర్ ప్లాంట్లను బెదిరించి మొత్తం రాయలసీమనే దెబ్బకొట్టారు. మొత్తం రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు తీరని నష్టం చేశారు.

గత 8నెలల్లో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నాశనం చేయడంపై సర్వత్రా వ్యతిరేకత ఉంది. ఆదాయం పెంచే చర్యలు లేకుండా సంపద నాశనం చేసే చర్యలు చేపట్టారు. పెట్టుబడులు వచ్చే వాతావరణాన్ని విచ్ఛిన్నం చేశారు. 4).అభివృద్ది వికేంద్రీకరణలో ఒక భాగమే అమరావతి..రాజధానితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ 13జిల్లాల అభివృద్ది ప్రణాళికను 04.09.2019న అప్పటి సీఎంగా చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు, చాలావరకు చేసి చూపించారు. ‘‘అభివృద్ది వికేంద్రీకరణ-రాజధానిగా అమరావతి’’ అనే శీర్షికతో చంద్రబాబు చేసిన ప్రకటన అసెంబ్లీ రికార్డులలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఒక సెటిల్డ్ ఇస్యూ...4ఏళ్లుగా సజావుగా నిర్వహిస్తున్న అంశం. సీఎం మారాడని మళ్లీ రాజధానిని మార్చే అధికారం ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 650కూడా, 29రాష్ట్రాలలో 650జిల్లాలలో పెట్టమని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారా..? అదేవిధంగా ఏపిలో 175నియోజకవర్గాలలో 175ఆఫీసులు పెడతారా నియోజకవర్గానికి ఒకటి చొప్పున..? ఈ 8నెలలు ఒక్క పనిచేయకుండా, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, పనులన్నీ నిలిపేసి అభివృద్దిని రివర్స్ చేశారు, పరిపాలనను రివర్స్ చేశారు, రాష్ట్రాన్నే తిరోగమనంలో నడిపిస్తున్నారు. అబద్దాన్ని కూడా నిజంగా వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. అలాంటిది నిజాన్ని నిజంగా చెప్పడంలో వెనుకంజ సరికాదు.

5).అమరావతిని 3ముక్కలు చేసి ఒక్కో ముక్క ఒక్కో ప్రాంతంలో పెట్టడమే ముద్దు అంటూ ర్యాలీలు నిర్వహిస్తున్న అమరావతి నుంచి ఎన్నికైన వైసిపి ఎమ్మెల్యేలు రేపు అడ్రస్ లేకుండా పోతారు. రాజధాని మార్పుపై ఆందోళనకు గురై తీవ్ర ఆవేదనతో 23మంది గుండెలు ఆగాయి. వాళ్ల ఉసురు వైసిపి నేతలకే తగులుతుంది. గత 33రోజులుగా దీక్షలు,ధర్నాలు,ర్యాలీలతో ఆందోళనలు చేస్తున్నా, పండుగలు కూడా చేసుకోకుండా పస్తులు ఉంటున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకుండా మూర్ఖంగా పోతున్నారు’’ అంటూ చర్చలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్, టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, టిడిఎల్ పి ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, గౌరివాని శ్రీనివాసులు, ఎంపి కనకమేడల రవీంద్రకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

రాజధాని తరలింపును సమర్థిస్తూ, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు నడిరోడ్లపైకొచ్చి అభినవకట్టప్పల్లా మారి అమరావతికి వెన్నుపోటు పొడుస్తున్నారని టీడీపీసీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మండిపడ్డా రు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుట్టినప్రాంతానికి, కన్నతల్లి వంటి జన్మభూమికి ద్రోహం చేస్తున్న అధికార పార్టీనేతలంతా అమరావతి ద్రోహులుగా మిగిలిపోయారన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా, గద్దెనెక్కాక మరోలా మాట్లాడటం జగన్‌కు బాగా వంటపట్టిందని, ఆవిద్యతోనే ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడని నరేంద్ర దుయ్యబ ట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలు మర్చిపోయేలా చేయడానికి రోజుకోవిధంగా కపటనాటకాలు ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పాలనావ్యవస్థను ముక్కలు చేయడం, రాజధానిని విభజించడం ఎంతవరకు సమంజసమని నరేంద్ర ప్రశ్నించారు. కర్నూల్లో హైకోర్టు పెడితే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే అన్నిరంగాల్లో ముందంజలోఉన్న విశాఖజిల్లాలో రాజధానిపెడితే, అక్కడేం ఒనగూరుతుందని ధూళిపాళ్ల నిలదీశారు. అభివృద్ధిలో అన్ని జిల్లాలకంటే, విశాఖ అత్యున్నతస్థానంలోనే ఉందన్నారు. రాబోయేరోజుల్లో విశాఖ వాసులు ధృతరాష్ట్రకౌగిలిలో చిక్కుకోబోతున్నారనే విషయాన్ని ఆప్రాంతవాసులకు ఇప్పటికే అర్థమైందన్నారు. ప్రపంచంలో ఎక్కడాకూడా ఈ విధమైన విభజన జరగలేదని, కేంద్రప్రభుత్వం కూడా పరిపాలనావ్యవస్థలన్నింటినీ ఒకేచోట కేంద్రీకృతం చేస్తోందన్నారు. ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతుల నివాసాలు, అన్నిరకాల డైరెక్టరేట్లు ఒకేచోట ఉండేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిచా రని ధూళిపాళ్ల పేర్కొన్నారు. జగన్‌ నిర్ణయాలను సమర్థిస్తూ, మూడురాజధానులు అద్భుతమని పొగిడిన కేసీఆర్‌, తనరాష్ట్రాన్నికూడా ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలుగా విభజిస్తాడా అని నరేంద్ర నిలదీశారు. రాష్ట్రంలోని ఆందోళనలవల్ల ఎక్కువగా లాభపడు తోంది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. ఏపీలో రగిలిన మంటల్లో తెలంగాణ చలికాచుకుం టోందని, 13జిల్లాలకే మూడు పరిపాలనాకేంద్రాలుంటే, 33జిల్లాలకు ఎన్ని కేంద్రాలుం డాలో, ఆవిధంగా చేయడానికి తెలంగాణ సర్కారు ముందుకెళుతుందా అని టీడీపీ నేత ప్రశ్నించారు.

కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా, పుల్లయ్యఉన్నా చొక్కాపట్టుకొని నిలదీసి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొస్తానన్న జగన్‌, ఇప్పుడు ప్లీజ్‌ప్లీజ్‌ అంటూ మోదీకాళ్లు పట్టుకునే స్థితికి చేరాడని నరేంద్ర ఎద్దేవాచేశారు. రాష్ట్రమంతా రాజధాని కేంద్రంగా రగులుతుంటే, ఆప్రాంతంలో వేలాదిమందిపోలీసుల్ని నియమించి, వారిబూట్లకింద ప్రజలు నలిగిపోయేలా ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులంతా కన్నీళ్లతో వేడుకుంటున్నా జగన్‌ప్రభుత్వం ఎందుకు మూర్ఖత్వంతో వ్యవహరి స్తోందని నరేంద్రప్రశ్నించారు. తనకున్న ఎంపీల బలంలో ఎన్‌ఆర్సీ, సీ.ఏ.ఏ బిల్లులకు పార్లమెంట్‌లో మద్ధతుతెలిపిన జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్రంలో మాత్రం 102జీవో జారీ చేశాడన్నారు. ముస్లింమైనారిటీలకు ద్రోహం చేశాడుకాబట్టే, జగన్‌ తనపార్టీలోని ఆయావర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు ముఖం చూపించడంలేదన్నారు. ఎన్నికలకు ముందు ముస్లింలకు అండగాఉంటామని చెప్పినజగన్‌, అధికారంలోకి రాగానే వారిని నడిసముద్రంలో ముంచేశాడని నరేంద్ర ఆక్షేపించారు. పింఛన్లు రూ.3వేలకు పెంచుతాన ని చెప్పి, రూ.2,250కే పరిమితం చేశాడని, 45ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని చెప్పి మోసం చేశాడని, అన్నక్యాంటీన్లు మూసేశాడని ఇలా అనేక విషయాల్లో జగన్‌ చెప్పేమాటలకు చేస్తున్నపనులకు పొంతనలేకుండా పోయిందన్నారు.

రాజధాని అంశంలో నేడుజరగబో యే అసెంబ్లీసాక్షిగా జగన్‌ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపేప్రయత్నాలు ప్రారంభిం చాడన్నారు. ప్రజల్ని ఏమార్చడం కోసం తనవిషపుత్రిక సాక్షిలో తమపై అసత్యప్రచారం చేస్తూ, తమగొంతునొక్కే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌పేరుతో తనకుమార్తెపై విషప్రచారం చేసేక్రమంలో సాక్షిపత్రికలో అభూతకల్పనలతో, అసత్యాలు వండివార్చారని నరేంద్ర మండిపడ్డారు. తన కుమార్తెకు తెల్లకార్డు ఉందని, ఆమెకు అమరావతిలో భూమిఉందని చెబుతూ, సాక్షిని అడ్డంపెట్టుకొని, జగన్‌ అసత్యాలపై బతుకుతున్నాడన్నారు. ఎన్నిరోజులు ఇలా కుల, మతరాజకీయాలు చేస్తూ జగన్‌ పబ్బం గడుపుకుంటాడని నరేంద్ర ప్రశ్నించారు. జగన్‌ ఉంటున్న ఇల్లు ఆయనదికాదని, ఇల్లుఉన్న తాడేపల్లి ప్రాంతంలో, పక్కనున్న నంబూరు, కాజలో ఏవర్గాలవారున్నారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు.

రాజధానివల్ల సామాజికవర్గాలకు అతీతంగా అంద రూ లబ్ధిపొందారన్నారు. ఆస్తులేవైనా ఉంటే అవితనపేరుతో, తనపిల్లలపేరుతోనే ఉంటాయని, జగన్‌లా తానేమీ బినామీలపై ఆధారపడి బతకడంలేదని నరేంద్ర తేల్చి చెప్పారు. జగన్‌కే బెయిల్‌కార్డు, బినామీకార్డు, జైల్‌కార్డున్నాయని, ఆయన నివాసం హరీశ్‌ఇన్‌ఫ్రా, భారతిపేరుతో ఉందన్నారు. బినామీ బతుకుబతికే వ్యక్తి, తమగురించి ఇష్టానుసారం ఎలా మాట్లాడతాడని, ఎలా వార్తలు రాయిస్తాడని ధూళిపాళ్ల మండిపడ్డా రు. అసత్యాలతో ప్రజలమధ్య అపోహలు, వైషమ్యాలు రెచ్చగొట్టేపనిలో జగన్‌ఉన్నాడని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవుపలికారు. 2004లో వైఎస్‌ ముఖ్యమం త్రి అయ్యేనాటికి జగన్‌ ఆస్తులెన్ని, తండ్రి అధికారంనుంచి దిగిపోయేనాటికి ఆయనకు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులెన్ని అనేదానిపై ఆయనచర్చకు వస్తాడా అని నరేంద్ర ప్రశ్నించారు. జగన్‌ నిజంగా ధైర్యవంతుడయితే ఈ అంశంపై బహిరంగంగా చర్చకు రావాలని నరేంద్ర సవాల్‌విసిరారు. ఏ అధికారి అయినాసరే, జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా, గుడ్డిగా పనిచేస్తే, వారంతా కోర్టులచుట్టూ తిరగకతప్పదని ఆయన హెచ్చరించారు.

తామేదైనా తప్పుచేసుంటే, ఏవిచారణ జరిపినా ఎదుర్కోవడానికి తాముసిద్ధంగానే ఉన్నామన్నారు. కండీషన్‌ బెయిల్‌పై బయటతిరుగుతున్న ఏ2ముద్దాయి ఏహోదాలో ప్రధానికి లేఖలు రాశాడన్నారు. సీబీఐ కేసులో ఏ2గా ఉన్న విజయసాయి కోర్టులను, ప్రభుత్వసంస్థలను, అధికారులను ప్రభావతంచేసేలా లేఖలు ఎలారాస్తాడని, వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాడని నరేంద్ర నిలదీశారు. అధికారయంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్‌, విజయసాయిల గురించి సీబీఐకి, ఈడీకి, సుప్రీంకోర్టుకి లేఖలు రాస్తామన్నారు. ప్రజలను ఏమార్చడానికి, మైమరపించడానికి ఈప్రాంతానికి వెయ్యికోట్లు, ఆప్రాంతానికి మరోవెయ్యికోట్లని అసెంబ్లీ సాక్షిగా మోసం చేయడానికి జగన్‌ సిద్ధమయ్యాడన్నారు. అసత్యాలు, అబద్ధాల కలయికలోనుంచి పుట్టిన సాక్షి కథనాలు నమ్మకుండా, కులాలు, మతాలపేరుతో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకో కుండా, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర హితవుపలికారు. వ్యక్తులు తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలిగానీ, కులాలు, మతాలప్రస్తావన ఎందుని ఆయన ప్రశ్నించారు. బెయిల్‌పక్షులన్నీ ఒకేగూటికిచేరేలా తమవంతు ప్రయత్నాలు చేస్తామని, జగన్‌ తనపైఉన్న కేసులనుంచి పునీతుడయ్యాక, ఎదుటివారిగురించి మాట్లా డాలని ధూళిపాళ్ల సూచించారు.

మోసగాళ్ళు పలు రకాలు ఉంటారు. కొంత మంది మరీ బరి తెగించి ప్రవర్తిస్తూ ఉంటారు. ఏకంగా సియం తెలుసు, పిఎం తెలుసు అంటూ, లాబయింగ్ చేసి, పనులు చేస్తూ ఉంటారు. కొంత మంది ఈ ట్రాప్ లో పడి బురిడీ కొట్టిస్తూ ఉంటారు. ఇదే కోవలో, గతంలో కొంత మంది ఎమ్మేల్యేలని, మంత్రులని కూడా ఇలా ట్రాప్ చేసి, వారి దగ్గర డబ్బులు గంజిన వైనం చూసాం. తరువాత విషయం తెలిసుకుని, ఆ ప్రజా ప్రతినిధులు లబో దిబో అంటూ, పోలీసు కేసులు పెట్టారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. ఇదే కోవలో, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక వార్త వినబోతున్నాం. ఏకంగా సియం జగన్ పేరు, సిబిఐ డైరెక్టర్ పేరు చెప్పి, ఒక మాజీ ఎంపీని బుట్టలో వేసే పని చేసాడు ఒక ప్రబుద్ధుడు. అయితే ఆ మాజీ ఎంపీ అంతా పరిశీలించి, వీడు ఒక ఫేక్ గాడు అని తెలుసుకుని, వెంటనే సిబిఐ అధికారులకు సమాచారం ఇవ్వటంతో, సిబిఐ అధికారులు ఎంట్రీ ఇచ్చియా, ఆ ఫేక్ ప్రబుద్ధుడిని పట్టుకుని, లోపల వెయ్యటంతో కధ సుఖాంతం అయ్యింది.

cbi 190102020 2

తెలుగుదేశం పార్టీ నాయకూడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పై, సిబిఐ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. గత నెలలో, రాయపాటి పై, సిబిసి సోదాలు జరిపి, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ విషయంలో, ఆయన పై కేసు నమోదు చేసారు. అయితే ఇప్పుడు ఇదే అదునుగా చూసిన ఒక ముఠా రాయపాటిని బుట్టలో వేసే పనిలో పడింది. అసలు జరిగిన విషయం ఏమిటి అంటే, నేను సిబిఐలో పని చేస్తున్నాను, నాకు సిబిఐ డైరెక్టర్ బాగా సన్నిహితంగా ఉంటారు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాకు బాగా క్లోజ్, కావాలంటే ఈ ఫోటో చూడండి అంటూ, రాయపాటిని కలిసి మణివర్ధన్‌ రెడ్డి అనే వ్యక్తి, రాయపాటి సాంబశివరావుని కలిసారు. మీ మీద ఉన్న సిబిఐ కేసు మాఫీ చేయిస్తానని, రూ.10 కోట్ల దాకా డబ్బు డిమాండ్‌ చేసాడు.

cbi 190102020 3

ముందుగా రాయపాటిని ఫోన్ లో సంప్రదించిన వ్యక్తీ, తరువాత రోజు సారాసరి రాయపాటి ఇంటికే వచ్చేసారు. తనకు సిబిఐలో అందరూ తెలుసనీ, మీ సిబిఐ కేసు క్షణాల్లో మాఫీ చేయిస్తానని, దానికి మీరు ఒక 10 కోట్లు ఇస్తే చాలని, చెప్పారు. అలాగే డైరెక్టర్ గారితో మాట్లాడండి అంటూ, మరెవరితోనో ఫోన్ లో మాట్లాడించారు. అలాగే జగన్ మోహన్ రెడ్డికి తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికి, జగన్ తో దిగిన ఫోటో చూపించారు. అయితే, మణివర్ధన్‌ రెడ్డి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన రాయపాటి సాంబశివరావు, ఈ విషయం పై సిబిఐ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేసారు. రాయపాటి ఇచ్చిన వివరాలను గోప్యంగా ఉంచిన సిబ్బంది, రంగంలోకి దిగి, మణివర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాయపాటి ఈ విషయంలో లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇచ్చారు.

రేపటి అసెంబ్లీ సమావేశాల కోసం, పోలీసులు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు పలు పార్టీలు, రైతులు, అమరావతి జేఏసీ , అసెంబ్లీ ముట్టడి పిలుపు ఇవ్వటంతో, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటి నుంచి పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో, తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని హౌస్ అరెస్ట్ చెయ్యటానికి, పోలీసులు, ప్రయత్నం చేసారు. రేపటి అసెంబ్లీ ముట్టడికి చింతమనేని వెళ్ళకుండా, ముందు జాగ్రత్తగా పోలీసులు ఆయన నివాసానికి చేరుకొని, హౌస్ అరెస్ట్ చెయ్యాలని అనుకున్నారు. దీంతో చింతమనేని నివాసానికి, భారీగా పోలీసులు వచ్చారు. అయితే, అప్పటికే చింతమనేని పోలీసుల కళ్లుగప్పి తన నివాసం నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చింతమనేని ఎక్కడకు వెళ్ళారో కనుక్కోవటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

chintamaneni 190102020 2

ఇక మన్రో పక్క, రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జెఏసి చేస్తున్నఆందోళనలకు మద్దతుగా తాడికొండ శివారు గ్రామం బడేపురం గ్రామస్థులు రూ.1,00,116విరాళం అందించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన మహిళలు ఆదివారం ఎన్టీఆర్ భవన్ కు తరలివచ్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా బడేపురం మహిళలు మాట్లాడుతూ రాజధాని పరిరక్షణ కోసం రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. భూములిచ్చి రోడ్లపాలైన ఆ కుటుంబాలకు తామంతా అండగా ఉంటామని అన్నారు. లాఠీదెబ్బలకు భయపడకుండా, అక్రమ కేసులకు బెదరకుండా వారు చేస్తున్న ఆందోళనలు ఫలవంతం కావాలని ఆకాంక్షించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ జెఏసి పిలుపు మేరకు జరుగుతున్న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది 5కోట్ల ప్రజల జీవన్మరణ సమస్య అంటూ ఏ ఒక్కరి కోసమో చేస్తున్న ఉద్యమం కాదని అన్నారు. భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు.

chintamaneni 190102020 3

అమరావతిని కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని, మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే రాష్ట్రానికి భవిష్యత్తులో పెట్టుబడులు రావని ఆవేదన చెందారు. ఒక వ్యక్తి చేస్తున్న చెడు ఫలితంగా రాష్ట్రం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్నప్పుడు ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలని, నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని అన్నారు. చెడు జరుగుతున్నప్పుడు ప్రజల పక్షాన పోరాడటం ప్రతిఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులు, రైతుకూలీలు, కార్మికులు, మహిళలు, యువతరంపైనే ఉందని అన్నారు. చంద్రబాబును కలిసి బడేపురం గ్రామస్థులలో రెడ్డి వెంకట్రావు, మద్దినేని శివయ్య, రజనీకుమారి, అరుణ, చుక్కపల్లి రజని, సుశీల,మాధవి, లలిత తదితరులు ఉన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి తలాఇంత విరాళాలు పోగుజేసి అమరావతి పరిరక్షణ జెఏసికి అందజేస్తున్నట్లు వాళ్లు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read