జగన్ మోహన్ రెడ్డి సెక్యూరిటీకి, రేపటి అసెంబ్లీ టెన్షన్ పట్టుకుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వెలగపూడిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్, అసెంబ్లీకి వెళ్ళాలి అంటే, మందడం మీదుగా వెళ్ళి. అయితే గత 33 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళన నేపధ్యంలో, అలాగే రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపిచ్చిన నేపధ్యంలో, రేపు ఎలా గట్టెక్కించాలా అని పోలీసులు వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో ఇప్పటికే అమరావతి అసెంబ్లీకి వెళ్ళటానికి, వేరే రోడ్ కూడా వేసారు. ఈ కొత్త రోడ్డు ద్వారా, అసెంబ్లీకి తేలికగా చేరుకోవచ్చని, ప్రభుత్వం వ్యూహంగా ఉంది. అయితే రేపటి అసెంబ్లీ సమావేశాల కోసం, ఇప్పటి నుంచి, జగన్ సెక్యూరిటీ సిద్ధం అవుతుంది. తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి, అసెంబ్లీకి, వెళ్ళే మార్గంలో, ఇప్పటికే జగన్ కాన్వాయ్ ట్రయల్ రన్ చేసారు. అలాగే, దారి పొడుగునా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, అయితే, మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసారు.

jagan 19012020 2

ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఇప్పటికే అందరికీ 149 సీఆర్పీసీ నోటీసులు వెళ్ళాయి. బయట వ్యక్తులు ఎవరూ ఊరిలో ఉండకూడదు అంటూ నోటీసులు కూడా ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ఇక మరో పక్క, మూడు రాజధానుల ప్రతిపాదన, CRDA చట్టం రద్దు బిల్లులు.. శాసనసభతో పాటు.... మండలిలో గట్టెక్కడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. బిల్లులు ఆమోదం కోసం అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహంపై..ముఖ్యమంత్రి జగన్ పలువురు మంత్రులతో చర్చించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో ఉపముఖ్యమంత్రి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలిలో వైకాపా పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

jagan 19012020 3

మండలిలో వైకాపాకు బలం తక్కువగా ఉండటంతో బిల్లులను గట్టెక్కించడంపై సమాలోచనలు జరిపారు. మండలిలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలనే దానిపైనా దృష్టి సారించారు. ఇదే సమయంలో అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టే బిల్లులపై ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తోంది. ఇక మరో పక్క, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు రైతులు, అమరావతి రాజధానిని తరలించ వద్దు అంటూ, అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ పైకి ఎక్కారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కిన వాళ్ళు, అమరావతిని ఇక్కడే ఉంచుతాం అని చెప్పే దాకా, దిగమని, స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, ప్రాణత్యాగానికైనా వెనుకాడేదిలేదని నినాదాలు చేస్తున్నారు. అయితే, వారిని దించే ప్రయత్నం చేస్తున్నా, ఇప్పటి వరకు ఫలించలేదు.

అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి, మూడు రాజధాణులుకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నిన వ్యూహాన్ని, శాసనమండలిలో అడ్డుకునే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంది. దీనిపై తమ వ్యూహాలకు టిడిపి పార్టీ నేతలు పదును పెడుతున్నారు. అసెంబ్లీలో వైసీపీకి, శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండటంతో, అసెంబ్లీలో వైసీపీ తమను మాట్లాడనివ్వకుండా బుల్ డోజ్ చేసినా, శాసనమండలిలో అడ్డుకోవాలని, ప్రజలకు అన్నీ అక్కడ వివరించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే అసెంబ్లీలో బిల్లుల ఆమోదం పొందటంలో అసెంబ్లీదే పైచేయి అవుతుంది. ఒకసారి శాసనమండలి బిల్ తిప్పి పంపిస్తే, రెండో సారి మళ్ళీ అసెంబ్లీ బిల్ చేస్తే, ఇక శాసనమండలికి తిప్పి పంపించే అవకాసం ఉండదు. అయినప్పటికీ తన వ్యతిరేకతను తెలియజేయడానికి, ఈ ప్రక్రియ కొంత కాలమా జాప్యం చేసి, ఢిల్లీ లెవెల్ లో చెక్ పెట్టటానికి, తెలుగుదేశం పార్టీ శాసనమండలి ద్వారా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెక్ పెట్టటానికి రెడీ అయ్యింది.

assembly 19012020 2

ఈ ప్రక్రియ ద్వారా, తాము మూడు ముక్కల రాజధానికి ఎందుకు వ్యతిరేకం, దాని వల్ల, ఏ ఉపయోగం ఉండదు, అలాగే రాజధాని రైతుల సమస్యల గురించి కూడా ప్రజలకు వివరంగా చెప్పాలని టీడీపీ భావిస్తోంది. అయితే శాసనమండలిలో తిప్పి పంపకుండా, ఎక్స్పర్ట్ కమిటీకి రిఫర్ చేస్తే, ఒక నెల రోజులు పాటు, ఈ ప్రక్రియ ఆపవచ్చని, తద్వారా, ప్రభుత్వం తీసుకున్న ఈ తిక్క నిర్ణయం గురించి, ప్రజల్లో మరింత చర్చ జరిగి, ఢిల్లీ స్థాయిలో, జోక్యం చేసుకునే అవకాసం ఉంటుందని, తెలుగుదేశం భావిస్తుంది. అసెంబ్లీ, శాసనమండలిలో ఎలాంటి వాదనలు వినిపించాలి, ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే దాని పై, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం ఈ రోజు సమావేశం అయ్యింది.

assembly 19012020 3

శాసనసభలో ఎలాంటి వదనలు వినిపించాలి, తమకు మైక్ ఇవ్వకపోతే ఏమి చెయ్యాలి అనే దాని పై, అలాగే శాసనమండలిలో తమ అభిప్రాయం వినిపించడంతో పాటు బిల్లులను ఎలా ఆపాలి అనే దాని పై చర్చిస్తున్నారు. రాజధాని మార్పు అంటూ నేరుగా ప్రభుత్వం బిల్లులో చెప్పదని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అల చేస్తే, రైతులకు పరిహారం ఇవ్వాలి కాబట్టి, అలా చెయ్యదని, పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఈ బిల్లు వచ్చే అవకాసం ఉందని టిడిపి భావిస్తుంది. అయితే, ఈ బిల్లులను ద్రవ్య బిల్లు రూపంలో తెద్దామని ప్రభుత్వం భావించారు. ఇలా అయితే మండలిలో అడ్డుకోలేదని భావించారు. అయితే, ద్రవ్యబిల్లుగా తెస్తే ముందు దాన్ని గవర్నర్‌ కు పంపి అనుమతి తీసుకోవాలి. అయితే గవర్నర్ పరిశీలన చేయాల్సి ఉంటుందని చెప్పటంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మరి శాసనమండలిలో ఎలా ఉంటుందో చూడాలి.

ఏపీలో రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన ఆచరణలోకి తెచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుగబోతోంది. ఆ సమావేశంలో మూడు రాజధానుల నిర్ణయానికి ఆమోదముద్ర వడేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ మరుసటి రోజే శాసనమండలిలోనూ ఆమోదం పొందా లనేది ప్రభుత్వ వ్యూహం. ఇదే సమయంలో ప్రతిపక్ష టిడిపి సైతం ప్రతి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారిగా సభ్యు లకు విప్ జారీచేసింది. పార్టీ నుంచి దూరమై, అధికార పార్టీకి దగ్గరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని నిర్ణయించారు. మండలిలోనూ టిడిపి కీలక భూమిక పోషించనుంది. దీనిపైన పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ ఎమ్మె ల్యేలు, ముఖ్య నేతలతో కీలక నమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని తరలింపు అంశాన్ని ప్రతిపక్ష టిడిపి మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు అమరావతికి మద్దతుగా పర్యటనలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగునున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు.

whip 19012019 2

ప్రభుత్వం సభలో సీఆర్డీఏ బిల్లు సవరణ లేదా రద్దు, మూడు రాజధానుల అంశంపై తీర్మానం వంటివాటిల్లో ఏరూపంలో సభ ముందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశ ముందనే దానిపై టిడిపి ఇప్పుడు దృష్టి సారిం చింది. ఏరూపంలోనైనా బిల్లు సభలోకి ప్రవేశ పెడితే ఎలా ఎదుర్కోవాలనేదే టిడిపి వ్యూహాత్మ కంగా ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు, శాసన మండలినభ్యులకు పార్టీ విప్ జారీ చేసింది. పార్టీ నుంచి గెలిచిన 23 మంది శాసనసభ్యులు తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలంటూ టిడిపి విప్ జారీ చేసింది. అందులో వల్లభనేని వంశీ, మద్దాళి గిరికి సైతం పార్టీ విప్ జారీ చేసింది. వారికి పార్టీ నుంచి అధికారిక సమావేశం వంపారు. వారి వ్యక్తిగత మెయిలకు సందేశం, ఫోన్‌కు మెసేజ్ తోపాటుగా వాట్సప్-టెలిగ్రామ్ సందేశాలను సైతం అందిస్తున్నారు. వారిద్దరు ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల ప్రకారం టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. టీడీపీ విప్ జారీ చేయడం ద్వారా వీరిద్దరు విప్ ఉల్లంఘిస్తే దానిని వారిమీద చర్యలు తీసుకునే విధంగా వ్యూహం సిద్ధం చేసింది.

whip 19012019 3

సీఆర్డీఏ చట్ట సవరణ, అమరావతికి చట్టబద్ధంగా ఉన్న హక్కులు, ప్రభుత్వ ప్రతిపాదనలపై న్యాయ పరంగా సాంకేతికంగా ఏరకంగా ఎదుర్కోవాలనే దానిపై న్యాయ నిపుణుల సలహాలు సైతం టిడిపి సేకరిస్తోంది. శాసనసభలో తమకు బలం లేదని తెల్సి నా రాజధాని విషయంలో డివిజనక్కు పట్టుబట్టి ఆ ఇద్దరూ రెబల్స్ వ్యతిరేకంగా వ్యవ హరిస్తే వారిపై చర్యలకు తమకు అవకాశం దక్కుతుందని టీడీపీ అంచానా వేస్తోంది. ఇదే సమయంలో విశాఖ నుంచి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేల పాత్ర ఏంటనేది కీలకంగా మారనుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మండలి సభ్యుల పాత్ర కీలకం కానుంది. శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులుండగా, అందులో టిడిపి 28, పిడిఎఫ్ 5, వైఎస్సార్సీ 9, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8, బిజెపి 2గా ఉన్నాయి. ఇవిగాక మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఏరూపంలో మూడు రాజధానుల అంశంపై శాసనసభ ముందుకొచ్చినా అనుకూలంగా ఫలితం సాధించేందుకు అధికార వైసీపీకి శాసనసభలో పూర్తి మెజార్టీ ఉంది. శాసనసభలో ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లు లేదా తీర్మానం ఆమోదం పొందిన తర్వాత మండలిలోనూ చర్చకురానుంది.

రాజధాని పై, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రేపు జరగనుంది. మూడు రాజధానులు, అమరావతి నుంచి పరిపాలన, రాజధాని తరలింపు దిశగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. తరలింపుకు నిరసనగా రైతులు 32 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. స్థానికుల ఆందోళన సమయంలో జగన్ మోహన్ రెడ్డి సచివాలయానికి వచ్చే సమయంలో పెద్దఎత్తున బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో వలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలంటే, మందడం మీదుగా రావాలి. అయితే, అక్కడ ఆందోళనలు అధికంగా ఉండటంతో, ప్రజలు ఎక్కడ తిరగబడతారో అని, హుటాహుటిన కొత్త రోడ్డును అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా జైలు భరో-ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో జేఏసీ నేతలతోపాటు రైతులకు వ్యక్తిగతంగా పోలీసులు ముందస్తు నోటీసులివ్వడం ప్రారంభించారు. అసెంబ్లీ వరిసర ప్రాంతాల్లో సమావేశాల సమయంలో స్థానికులు, రైతులు ఆందోళనకు దిగే అవకాశముందని భావిస్తున్నారు.

road 19012020 2

ఇప్పటికే సచివాలయానికి వెళ్లే దారిలో మందడం, వెలగపూడి గ్రామాల్లో నిరసనలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. దీంతో అసెంబ్లీకి హాజరయ్యే స్పీకర్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఇబ్బంది లేకుండా పోలీసులు ప్రత్యామ్నాచ చర్యలపై ఫోకస్ చేశారు. అందులో భాగంగా అసెంబ్లీ చేరుకోవడానికి మరోదారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మత్తులు చేస్తున్నారు. కృష్ణాయ పాలెం చెరువు నుంచి శాసనసభకు రావడానికి వీలుగా రోడ్డును గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆరోడ్డును పట్టించుకోలేదు. కొన్ని రోజులుగా వాటిని పూడ్చి వాహనాల రాకపో కలకు వీలుగా మరమ్మత్తులు చేస్తున్నారు. రాజ ధాని తరలింపు ప్రకటన తర్వాత ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండటంతో ముందస్తుగా ఈ మార్గాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.

road 19012020 3

అవసరమైన సమయంలో ముఖ్యుల రాకపోకలు ఈ దారిగుండానే కొనసాగించనున్నారు. అసెంబ్లీ రాజధాని అంశంపై సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశముండటంతో ఉద్రిక్తతలు ఏర్పడే ఛాన్స్ ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసుబలగాలను మోహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రైతులకు ముందస్తు నోటీసులిచ్చిన పోలీసులు ఈ నెల 20న ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని స్పష్టంచేస్తున్నారు. ఛలో అసెంబ్లీతో పాటు జైలు భరో కార్యక్రమానికి పిలువునివ్వడంతో జెఎసిలోని నేతలకు, రైతు లకు ఈ నోటీసులు అందజేస్తున్నారు. సమావేశాలు జరిగే రోజున ఎటువంటి ఆందోళనకు అనుమతి లేదన్న పోలీసులు ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 29 గ్రామాల్లో రైతులతోపాటు పలు రాజకీయ నేతలకు పోలీసులు నోటీలు ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read