తాడికొండ నియోజకవర్గ, వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎన్నిక వ్యవహారం వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే. ఆమె ఎస్సీ సామాజికవర్గం కాదని, ఆమె క్రిష్టియన్ అంటూ, వచ్చిన ఫిర్యాదు పై, ఇప్పుడు విచారణ ప్రారంభం అయ్యింది. ఆమె కులం పై ఫిర్యాదు రావటంతో, అసలు ఆమె ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారో కాదో, తేల్చాలి అంటూ, రాష్ట్ర ఎన్నికల ప్రాధానాదికారి, విచారణ చేయటానికి రంగంలోకి దిగారు. 2019 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి, వైసిపీ పార్టీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు. ఆమె తెలుగుదేశం అభ్యర్ధి శ్రవణ్ కుమార్ పై పోటీ చేసి గెలుపొందారు. తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వడు నియోజకవర్గం. అయితే, ఉండవల్లి శ్రీదేవి ఒక ఛానెల్ ఇంటర్వ్యూ లో, తాను క్రిష్టియన్ అని చెప్పుకున్నారు. ఎస్సీ కులం వేరు, క్రిష్టియన్ వేరు కావటంతో, ఆమె ఎస్సీ అని చెప్పి, ఎన్నికల్లో పోటీ చేసారని, అందుకే ఆమెను అనర్హురాలుగా ప్రకటించాలని ఫిర్యాదు అందింది.

sridevi 19112019 2

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోష్ అనే వ్యక్తి , ఈ ఫిర్యాదు ఏకంగా భారత దేశ రాష్ట్రపతి, రాం నాద్ కోవింద్ వద్దకు పంపించారు. ఈ ఫిర్యాదుని సమీక్షించిన, రాష్ట్రపతి కార్యలయం, ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని, ఆమె ఎస్సీనో కాదో, విచారణ జరపాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఆ ఫిర్యాదు ఫార్వర్డ్ చేసారు. అదే విధంగా, రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఈ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసారు. రాష్ట్రపతి కార్యాలయం పంపించిన ఫిర్యాదు పై, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. పూర్తీ విచారణ జరిపి, వాస్తవాలు ఇవ్వాల్సిందిగా, ఎన్నికల కమిషన్, గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్‌ను ఆదేశించింది. విచారణ జరిపి, త్వరగా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు వెళ్ళాయి.

sridevi 19112019 3

ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ స్పందిస్తూ, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి, ఈ నెల 26న మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చారు. తాను ఎస్సీ అని నిరూపించే ఆధారాలు తీసుకు రావాలని, అన్ని పత్రాలతో, హాజరు కావాలని చెప్పారు. అలాగే తన తల్లిదండ్రులను వెంట తీసుకురావచ్చని పేర్కొన్నారు. అయితే ఈ విచారణ ఎటు దారి తీస్తుందో అనే టెన్షన్ వైసిపీ లో నెలకొంది. ఒక వేళ విచారణలో ఆమె ఎస్సీ కాదు అని తేలితే, ఆమెను అనర్హురాలిగా ప్రకటించి, సమీప అభ్యర్ధి అయిన శ్రవణ్ కుమార్ కు ఎమ్మెల్యే పదవి ఇస్తారో, లేక మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయో చూడాలి. ఏది ఏమైనా, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చే రిపోర్ట్ ని బట్టి, రాష్ట్రపతి కార్యాలయం దీని పై తన నిర్ణయం ప్రకటించే అవకాసం ఉంది.

తెలుగుదేశం నాయకుడు, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడి పై, మంత్రి కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సంగతి తెలిసిందే. దీని పై,బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ, మంత్రి కొడాలి నానికి అల్టిమేటం ఇచ్చారు. ఇది వరు రాసిన బహిరంగ లేఖ... "బలహీనవర్గాల జాతీయ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌, ఉత్తమ పొలిటీషియన్‌ అవార్డు గ్రహీత శ్రీ యనమల రామకృష్ణుడుగారిని బ్రోకర్‌ అంటూ మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలకు నాంది పలికి రాష్ట్ర ప్రగతికి బంగారు బాటలు వేసినటువంటి యనమల రామకృష్ణుడుగారిని కించపరచడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. బీసీల ముద్దుబిడ్డ యనమల రామకృష్ణుడు. బలహీనవర్గాలపై జరుగుతున్న దాడిపై,చేసిన విమర్శలపై ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించకపోవడం గర్హనీయం."

nani 18112019 2

"మూడు రోజుల్లో మంత్రి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే నేషనల్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. బలహీనవర్గాలంటే వైకాపా నేతలకు అంత చులకనా? మేం రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులపై కూడా ప్రభుత్వం శీతకన్ను వేసింది. అగ్రవర్ణాలకు పెత్తనం కట్టబెడుతూ బీసీలను అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకే వైసీపీ నేతలు యనమల రామకృష్ణుడుపై నోరుపారేసుకుంటున్నారు." అంటూ వై. నాగేశ్వరరావు యాదవ్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అన్నారు.

nani 18112019 3

ఇక మరో పక్క, మాజీ మంత్రివర్యులు, అమర్‌నాథ్‌ రెడ్డి, కొడాలి నాని తిరుమల గుడి పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పై స్పందించారు. "తిరుమల తిరుపతి దేవస్థానం గురించి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని మాటలు అత్యంత అవమానకరం. కోట్లాది మంది ప్రజలు ఆరాధించే ఆ దేవదేవుడి విషయంలో ''తిరుమల దేవస్థానాన్ని నీ.. అ.. మొ.. కట్టించాడా.? జగన్మోహన్‌ రెడ్డి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు.'' అంటూ హిందువుల మనోభావాలను కించపరిచినా.. ఇంత వరకు టీటీడీ బోర్డు ఛైర్మన్‌ ఎందుకు స్పందించ లేదు.? తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార సాంప్రదాయాలు, హిందూ భక్తుల మనోభావాలను హేళన చేసేలా మాట్లాడితే స్పందించాల్సిన టీటీడీ బోర్డు ఉత్సవ విగ్రహంలా ఎందుకు వ్యవహరిస్తోంది. సభ్య సమాజం సిగ్గుపడేలా కలియుగ దైవాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడడం సరికాదు. గతంలో పింక్‌ డైమండ్‌, శ్రీవారి నగలు విషయంలో రకరకాల ఆరోపణలు చేశారు. వెయ్యి కాళ్ల మండపం తవ్వేశారంటూ తిరుమల విశిష్టతకు మచ్చతెచ్చారు. ఇప్పుడు ఏకంగా శ్రీవారి ఆలయం గురించే తప్పుగా మాట్లాడడం బాధాకరం." అని అమర్‌నాథ్‌ రెడ్డి అన్నారు.

ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశాల ప్రారంభమే గందరగోళంతో మొదలైంది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలు పై చర్చ జరపాలి అంటూ, కాంగ్రెస్, శివసేన, ఆందోళన వ్యక్తం చేసాయి. ప్రశ్నోత్తరాలను జరగకుండా, నినాదాలు చేసారు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే, ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ప్రశ్నోత్తరాలతో పాటుగా, జీరో హవర్ ని కూడా, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఉపయోగించుకుని, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలని దేశ స్థాయిలో చర్చకు తెచ్చే ప్రయత్నం చేసారు. ప్రశ్నోత్తరాల సమయంలో, విజయవాడ ఎంపీ కేశినేని నాని, దేశంలోని ప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో అన్ని సంస్కృతులని, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని అన్నారు. మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని, కేశినేని నాని గుర్తు చేసారు.

tdp mp 18112019 2

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలుగు మీడియం మొత్తం తీసివేసి, అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్‌ను తప్పనిసరి చేసిందని, తెలుగు ఆప్షన్ గా ఉంచి, ప్రజలే నిర్ణయం తీసుకునేలా చెయ్యాలని అన్నారు. త్రిభాషా విధానాన్ని దేశమంతా అమలు చేయాలన్నారు. అయితే, కేశినేని నాని ప్రశ్న పై కేంద్రమంత్రి పోఖ్రియాల్ స్పందిస్తూ, తెలుగు భాష ఉన్నతి కోసం, చాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్, బెనారస్ తదితర విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠాల అభివృద్ధికి మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరో పక్క వైసిపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు, తెలుగు అకాడమీ 10వ షడ్యుల్ లో ఉందని, దాని విభజనకు దోహదపడేలా చేసి, నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

tdp mp 18112019 3

ఇక మరో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్, జీరో హావర్ లో, రాష్ట్రంలో మీడియా పై జరుగుతున్న అణిచివేత పై దేశానికి తెలిసేలా, పార్లమెంట్ లో వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు న్యూస్ చానల్స్ పై బ్యాన్ విధించారని టిపారు. టీవీ5, ఏబీఎన్ ఛానళ్ల పై నిషేధం విధించారని, నిషేదాన్ని ఎత్తివేయాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛను తోక్కేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 2430 తీసుకు వచ్చిందని తెలిపారు. వాస్తవాలు రాయాలి అన్నా మీడియాని భయపెట్టే స్థాయికి తీసుకు వెళ్ళారని అన్నారు. ఈ జీవో రద్దు అయ్యేలా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని గల్లా కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులు పై దాడులు చేస్తున్నారని, ఒక జర్నలిస్టును, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు హత్య చేశారని పార్లమెంట్ ద్రుష్టికి తీసుకువచ్చారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ, జాతీయ స్థాయిలో, కూడా, జగన్ ప్రభుత్వం పై పోరాటం చేస్తుంది.

మన రాష్ట్రంలో మీడియా పై, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉన్న విషయం తెలిసిందే. జీవో నెంబర్ 2430 తీసుకు వచ్చి మరీ, మీడియాను టార్గెట్ చేసారు. కావాలని, ఎవరైనా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే కధనాలు రాస్తే, వారి పై కేసులు పెడతాం అంటూ ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీని పై దేశ వ్యాప్తంగా, మీడియా, జర్నలిస్ట్ వర్గాల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ రోజు పార్లమెంట్ లో కూడా, టిడిపి ఎంపీ, గల్లా జయదేవ్ ఈ విషయం లేవనెత్తారు. అయితే ఇప్పటి వరకు, ఈ జీవో ఉపయోగించి, ఎలాంటి కేసు అయితే నమోదు కాలేదు. అయితే ఈ రోజు మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు వింటే, మొదటి కేసు ఆంధ్రజ్యోతి పై పెట్టే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మొన్న శనివారం, వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో, ఆంధ్రజ్యోతి ఎండీ రాధకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇంగ్లీష్ మీడియం అమలకు, ప్రభుత్వం చూపుతున్న ఉత్సాహం పై, తన అభిప్రాయాన్ని, ఆ కార్యక్రమంలో వ్యక్త పరిచారు.

medigag 1811209 2

ఒకేసారి తెలుగు మీడియం తీసేసి, బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దితే, అటు పిల్లలతో పాటు, టీచర్లు కూడా చెప్పలేరని, నెమ్మదిగా ఈ ప్రక్రియ చేపట్టాలని, అలాగే తెలుగు మీడియంని ఆప్షనల్ గా పెట్టాలని, ఎవరికి కావల్సింది వారు, సెలెక్ట్ చేసుకుంటారని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ప్రభుత్వం ఎదురు దాడి చేసి, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని ఎదురు ప్రశ్నించి తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక, ఏదో ఉంది అని చెప్తూ, ఇంగ్లీష్ మీడియం బలవంతంగా రుద్దటం పై, మత మార్పిడులు చేసే అవకాసం ఉందని, ఆ కుట్ర ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది అంటూ, వీకెండ్ కామెంట్ లో తన అభిప్రాయం చెప్పారు, రాధాకృష్ణ.

medigag 1811209 3

అయితే ప్రభుత్వం ఈ విషయం పై సీరియస్ గా తీసుకుంది అని, రహస్య ఎజెండాతో జగన్ ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నారని, వక్రీకరణ వార్తలు రాశారని, అందుకే కొత్త పలుకు పేరుతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన విశ్లేషణపై చట్టపరమైన చర్య తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు. ఈ మాటలను బట్టి చూస్తుంటే, జీవో 2430 ద్వారా, మొదటి కేసు ఆంధ్రజ్యోతి పై పెట్టే అవకాసం ఉంది. అయితే, ఈ విషయం పై ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానెల్ లో స్పందించింది. వార్తకు, అభిప్రాయానికి తేడా ఉందని, వీకెండ్ కామెంట్ అనేది ఆర్కే చెప్పే అభిప్రాయం అని మంత్రి తెలుసుకోవాలని అంటున్నారు. అయితే, ఇదే వ్యాఖ్యలు పదే పదే చేస్తున్న, బీజేపీ ఏపి అధ్యక్షుడు, కన్నా లక్ష్మీ నారాయణను మాత్రం, ప్రభుత్వం ఒక్క మాట కూడా అనకపోవటం, గమనార్హం.

Advertisements

Latest Articles

Most Read