వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు, నేతలతోపాటు, తమ మాటవినని వారిపై అక్రమకేసులు, బహిరంగదాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా ఇలాంటిపరిస్థితులు లేవని, ఆపార్టీ సీనియర్‌నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. మంగళవారం గుంటూరులోని పార్టీరాష్ట్ర కార్యాల యంలో పల్నాడుప్రాంత వైసీపీ బాధితులకు టీడీపీ తరుపున నష్టపరిహారం కింద నగదు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆనందబాబు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఏనాడు వైసీపీ మాదిరిగా అరాచకాలకు పాల్పడలేదని, అలా చేసుంటే, వైసీపీఎప్పుడో కనుమరుగయ్యేదన్నారు. అక్రమకేసులతో యరపతినేని,చింతమనేనిపై కూడా కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు బెదిరింపులు, దాడులతో ఎల్లకాలం పాలనసాగించలేరన్న విషయాన్ని వైసీపీప్రభుత్వం గుర్తించాలని, నేడు అధికారపార్టీచేసే దురాగతాలకు భవిష్యత్‌లో తప్పకు ండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆనందబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు.

help 1112019 1

దాడులు, అక్రమకేసులతో ప్రత్యర్థులపై కక్షసాధింపులకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ తప్ప, ఎక్కడాకూడా మచ్చుకైనా అభివృద్ధి కనిపించడంలేదని గుంటూరుజిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ.ఆంజనేయులు మండిపడ్డారు. అధికారంలో ఉన్నామ నే అహంకారంతో తప్పుడుకేసులతో వేధిస్తునవారిని దెబ్బకుదెబ్బ తీస్తామని ఆయన హెచ్చ రించారు. తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలెవరూ అధైర్యపడకుండా స్థానికఎన్నికల్లో సత్తాచాటాలని జీవీ పిలుపునిచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మాజీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఆరిపోయేదీపమని, అధికారం కొత్తకాబట్టే ఆపార్టీనేతల్లో అహంకారం ఎక్కువైందని ఆయన ఎద్దేవాచేశారు. పోలీస్‌శాఖను అడ్డుపెట్టుకొని ఎన్నాళ్లో ప్రభుత్వాన్ని నడపలేరని, పాలకులు ఎప్పుడు జైలుకువెళతారో కూడా తెలియని పరిస్థితులున్నాయని యరపతినేని వ్యాఖ్యానించారు. పల్నాడుప్రాంత కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్న వారందరి జాతకాలు తమదగ్గరున్నాయని, ఎవరినీ వదిలేదిలేదని ఆయన హెచ్చరించారు.

help 1112019 1

వైసీపీ ప్రభుత్వ దాడుల్లో సర్వంకోల్పోయిన వారికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నివిధాలా అండగా నిలుస్తూ, వారి కన్నీళ్లు తుడుస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ తెలిపారు. పల్నాడులో వైసీపీ దాష్టీకాలకు బలైన, టీడీపీ కార్యకర్తలను ఆదుకునే క్రమంలో చంద్రబాబు పోరాటంచేశాకే రాష్ట్రప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. తెలుగుదే శం పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదని గిరిధర్‌ స్పష్టంచేశారు. ఒక్క అవకాశం ఇవ్వడంటూ ప్రజల కాళ్లావేళ్లాపడి బతిమలాడిన వైసీపీ, అధికారంలోకి వస్తే, పరిస్థితి ఇంతదారుణంగా ఉంటుందని ప్రజలెవరూ ఊహించలేదని ఎమ్మెల్సీ అశోక్‌ బాబు తెలిపారు. ఒక్కసారి అని వేడుకున్నవారు, అధికారంలోకి వచ్చాక ఇన్ని అరాచకాలు సృష్టిస్తారని ఎవరూ అనుకోలేదని, టీడీపీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవాల్సిన పనిలేదని, అశోక్‌బాబు చెప్పారు. వైసీపీపాల నలో ఇబ్బందులకు గురైనబాధితులకు టీడీపీ నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుం దన్నారు. జగన్‌ నాయకత్వంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనిస్థితికి రాష్ట్రంచేరుకుం దన్నారు. చుండూరు ఘటనతర్వాత, ఇన్నేళ్లకు వైసీపీప్రభుత్వ పుణ్యమాఅని మానవహక్కుల కమిషన్‌ రాష్ట్రంలో పర్యటనకు రావాల్సి వచ్చిందన్నారు. వైసీపీప్రభుత్వ దాష్టీకాలకు బలైన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని జంగమేశ్వరపాడు, పిన్నెల్లి గ్రామస్తులైన ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 210 మంది టీడీపీ కార్యకర్తలకు నష్టపరిహారం కింద నగదు పంపిణీ చేశారు.

14 ఏళ్ళ క్రితం, లక్ష్మీపార్వతి, ఏసీబీ కోర్ట్ లో, చంద్రబాబు పై అక్రమ ఆస్థులు అంటూ వేసిన కేసు పై, స్టే లేదని, విచారణ కొనసాగించాలంటూ, నిన్న ఏసీబీ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే అప్పట్లో చంద్రబాబు, ఇది రాజకీయ పరమైన కేసు అంటూ, హైకోర్ట్ కు వెళ్ళటంతో, హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టే రెన్యువల్ చేసుకోవటంలో జాప్యం కావటంతో, స్టే తొలగింది. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కోర్ట్ కు వెళ్లి, స్టే పొడిగించుకునే అవకాసం ఉంది. అయితే, ఇలాంటి కేసులు చంద్రబాబు పై అనేకం వచ్చాయి. 2014లో కూడా వైఎస్ విజయమ్మ, 2 వేల పేజీల అఫిడవిట్ వేసి, సుప్రీం కోర్ట్ లో కేసు వెయ్యటంతో, సుప్రీం కోర్ట్, ఇదేమిటి అంటూ కొట్టేసింది. లక్ష్మీపార్వతి కేసు కూడా అలాంటిదే అయినా, ఏదో జరిగిపోతుంది అంటూ, చంద్రబాబు జైలుకు వెళ్ళిపోతారు అంటూ, వైసిపీ హడావిడి చేస్తుంది. నిజానికి అది ఒక చిన్న సాంకేతిక అంశం. అయినా, హడావిడి చేస్తూ ఉండటంతో, సోషల్ మీడియాలో హడావిడి నెలకొంది.

cbn 191112019 2

అయితే ఈ విషయం పై, ఈ రోజు చంద్రబాబు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు, అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో, విలేఖరులు ఈ ప్రశ్న అడిగారు. లక్ష్మీ పార్వతి గారు పెట్టిన కేసులు, ఏసీబీ కోర్ట్ లో స్టే లేకపోవటంతో, ఆ కేసులో విచారణ ప్రారంభం అయ్యింది, దీని పై మీ స్పందన ఏంటి అని విలేఖరులు అడగగా, చంద్రబాబు సింపుల్ గా తీసి పడేసారు. ఇదేమి పెద్ద కేసు కాదు, ఈ విషయం మా లాయర్లు చూసుకుంటారు. ఇదేమంత పెద్ద విషయం కాదు, ఇలాంటివి నా మీద 29 కేసులు పెట్టారు, ఒక్కటి కూడా నిరూపించ లేకపోయారు, ఇలాంటివి వస్తూనే ఉంటాయి, మా లాయర్లు చూసుకుంటారు అంటూ, ఒక్క ముక్కలో తీసి పడేసారు.

cbn 191112019 3

ఒక పక్క వైసిపీ ఏదో జరిగిపోతుంది అంటూ హడావిడి చేస్తుంటే, చంద్రబాబు మాత్రం, ఒక్క ముక్కలో, ఇదేమంత విషయం కాదు అంటూ, లాయర్లు చూసుకుంటారు అంటూ తీసి పడేసారు. అలాగే రాష్ట్రంలో జరుగతున్న సమస్యల పై స్పందిస్తూ, "పోలీసులు ఉన్నది.. కేసులు పెట్టాలని చెప్పడానికి కాదు, వచ్చిన కేసులను విచారణ చేసి న్యాయం చేయడం పోలీసుల విధి. వారానికి ముందుగా సమాచారం ఇస్తే అనుమతి ఎందుకు ఇవ్వరు. తణుకులో నా కాన్వాయ్‌కి సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కావాలనే అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. నేను బహిరంగ సభకు రాలేదే.. సెక్యూరిటీ నెపంతో అనుమతి ఇవ్వకుండా ఆపారు. పోలీసు 30 యాక్టు పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. తణుకులో టీడీపీ కార్యకర్తలు రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు" అంటూ చంద్రబాబు పోలీసుల పై విమర్శలు చేసారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబునాయుడు నిన్నటి నుంచి మూడు రోజుల పాటు, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. శనివారం హైదరాబాద్ వెళ్ళిన చంద్రబాబు, సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి, గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం నుంచి, ఏలూరు దగ్గరలో ఉన్న దుగ్గిరాల గ్రామానికి, మాజీ ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్ ను పలకరించటానికి వెళ్లారు. అయితే ఈ పర్యటన మొత్తం, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. చంద్రబాబు వెంట కాన్వాయ్‌తో వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ఆపుతూ వచ్చారు. అయితే కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నం చెయ్యటంతో, చంద్రబాబు కాన్వాయ్ ఆపి, కిందకు దిగి, పోలీసుల తీరు పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు స్వయంగా కిందకు దిగటంతో, కార్యకర్తలకు కూడా గుమికూడి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

tour 19112019 2

ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసుల తీరు పై అసహనం వ్యక్తం చేస్తూ, తమాషాలు చేస్తున్నారా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల వాహనాలను ఎందుకు ఆపుతున్నారు అంటూ పోలీసులను నిలదీశారు. చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు పర్యటన కోసం, గన్నవరం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరారు. మార్గ మధ్యలో హనుమాన్‌ జంక్షన్‌లో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆగి, స్వామికి పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి పెదవేగి మండలంలోని దుగ్గిరాల గ్రామానికి, మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ ఇంటికి వెళ్లి పరామర్శించటానికి బయలుదేరారు. ఈ క్రమంలో కలపర్రు టోలుగేటు వద్దకు వచ్చేసరికి, చంద్రబాబుకు ముందు కాన్వాయ్‌లో ఉన్న వాహనాలను పోలీసులు ఆపేశారు.

tour 19112019 3

గన్నవరం దగ్గర నుంచి ఇలాగే ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబుకి చెప్పటంతో, చంద్రబాబు తన వాహనం నుంచి దిగి, పెదవేగి ఎస్సై మోహనరావు, అక్కడ ఉన్న ఇతర పోలీసు ఉన్నతాధికారుల పై అసహనం వ్యక్తం చేశారు. తాము ప్రజా సమస్యల పై పోరాటం చేసే ప్రతిపక్షం అని, ఎక్కడికి వెళ్తున్నా, ఇలాగే ఇబ్బందులు పెడుతున్నారని, ఇక్కడ ఎందుకు వారి వాహనాలు ఆపాలి అంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు కొంచెం మెత్తబడి, వివాదం పెద్దది కాకుండా, టిడిపి నేతలు, కార్యకర్తల వాహనాలను విడిచిపెట్టడంతో కాన్వాయ్‌ ముందుకు సాగింది. అయితే, మళ్లీ జాతీయ రహదారి వద్ద నుంచి దుగ్గిరాల ఊరిలోకి వెళ్లేందుకు వాహనాలను డైవర్ట్ చేస్తూ ఉండగా, అక్కడ కూడా పోలీసులు మరోసారి తెలుగుదేశం నేతల వాహనాలను పోలీసులు ఆపేసారు. అక్కడ కూడా చంద్రబాబు కలుగజేసుకోవడంతో విడిచిపెట్టారు. ఇలా చంద్రబాబు కాన్వాయ్‌కు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

గత నాలుగు అయిదు రోజులుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అన్ని విషయాలు పక్కకు వెళ్లి, పరుష పదజాలంతో, నేతలు మాట్లాడిన మాటలు హైలైట్ అయ్యాయి. చంద్రబాబు ఇసుక దీక్ష చేసే ముందు రోజు దాకా, సాదా సీదాగా సాగిన రాజకీయం, చంద్రబాబు చేసిన ఇసుక దీక్షతో వేడెక్కింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల తరుపున చంద్రబాబు పోరాటం చెయ్యటంతో, సహజంగానే రాజకీయం వేడెక్కింది. అయితే, వైసీపీ వైపు నుంచి మాత్రం, అనూహ్యంగా, వేరే స్ట్రాటజీతో ముందుకు రావటంతో, ఇసుక దీక్ష పక్కకు వెళ్ళిపోయింది. వార్తలు నిండా వైసిపీకి చెందిన వార్తలు వచ్చేలా వాతవరణం వచ్చింది. చంద్రబాబు దీక్ష చేసే రోజు నాలుగు గంటలకు, దేవినేని అవినాష్, జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, అయుదు గంటలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తన భవిష్యత్తు రాజకీయ అడుగుల పై ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అవినాష్ సైలెంట్ గా ఒక నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోగా, వల్లభనేని వంశీ మాత్రం, విమర్శలతో చంద్రబాబు పై ఎదురు దాడి చేసారు.

cbn 19112019 2

ప్రెస్ మీట్ తరువాత, వంశీ వివిధ టీవీ ఛానెల్స్ లో మాట్లాడిన చర్చల్లో, అవి బూతులు దాకా వెళ్ళిపోయాయి. రెండు రోజుల తరువాత వంశీ, వైవీబీకి క్షమాపణ చెప్పినా, ఆయన పరుష పదజాలంతో, చంద్రబాబు పై మాట్లాడటం అందరూ చూసారు. ఇక తరువాత, గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని కూడా, వరుసుగా రెండు రోజులు చంద్రబాబు పై, దేవినేని ఉమా పై బూతులతో, వ్యక్తిగత విమర్శలతో విరుచుకు పడ్డారు. ఒక పక్క వంశీ మాల వేసుకుని అలా మాట్లాడటం, కొడాలి నాని తిరుమల పై చేసిన వ్యాఖ్యలతో వాతవరణం వేడెక్కింది. ఈ వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ నేతలు కూడా, ప్రెస్ మీట్ లు పెట్టి ఖండించారు. కొంచెం సంస్కారంతో, రాజకీయాలు చెయ్యాలని హితవు పలికారు. హిందూ సంప్రాదాయాన్ని గౌరవించాలని అన్నారు.

cbn 19112019 3

అయితే మళ్ళీ దీని పై వంశీ స్పందించటం, ఇలా జరుగుతూ ఉంది. అయితే, ఈ రోజు ఈ పరుష పదజాలం పై చంద్రబాబు ఒకే ఒక్క ముక్కతో వారి మాటలకు స్పందించారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో కొంత మంది విలేఖరులు, వంశీ, నాని మాట్లాడిన మాటల పై, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, "బూతులు తిట్టటం కష్టం కాదు, నిగ్రహం పాటించటమే కష్టం.. అదే తెలుగుదేశం పార్టీ చేస్తుంది.. బూతులు మాట్లాడటం మాకు చేతకాక కాదు. మేము అలా మాట్లాడటం మొదలు పెడితే, టీవీలు కూడా చూడలేరు. కాని, మేము క్రమశిక్షణతో ముందుకు వెళ్తాం, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు" అంటూ ఒక్క మాటలో చంద్రబాబు, వారి మాటలకు స్పందించారు.

Advertisements

Latest Articles

Most Read