జగన్ మోహన్ రెడ్డి తన స్థాయిని కూడా మరిచి, ఇంకా రోడ్డు మీద పాదయాత్రలో తిరిగే నాయకుడుని అనుకుంటూ, ప్రతిపక్షాల పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, తన హోదాని దిగజారుస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా నోరు తెరవని జగన్ మోహన్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియం పై, తన పైన వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తూ, వ్యక్తిగత విమర్శలు, అదీ తీవ్రంగా చేసి, అందరినీ ఆశ్చర్య పరిచారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం పై, టీవీలు చేసే వారే కాదు, అక్కడ ఉన్న వైసిపీ మంత్రులు, ఎమ్మేల్యేలు కూడా అవాక్కయ్యారు. జగన్ మోహన్ రెడ్డి, ఒక సియం హోదాలో ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని, ఎవరూ ఊహించలేదు. రాష్ట్ర ప్రభుత్వ, తెలుగు మీడియంని పూర్తిగా ఎత్తేస్తూ, అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడుతూ, ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఒకేసారి ఇలా మార్చేస్తే, ఎలా అని, అదీ కాక, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చదువుకుంటారని, తెలుగు భాషని కాపాడే విధంగా ఉండాలని అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

jagan 11112019 2

తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందిస్తూ, గతంలో మేము ఆప్షన్స్ ఇచ్చామని, మీరు ఇలా చెయ్యటం కరెక్ట్ కాదని, తెలుగు భాషని కాపాడుకోవాలని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్, వరుస ట్వీట్లతో ఈ అంశం పై స్పందించారు. ఇక నిన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా, మాతృభాషని కాపాడాలని, ఒక వ్యాసం రాసారు. అయితే అది తెలుగు ఒక్కటే కాదు, దేశంలో ఉన్న అన్ని భాషల గురించి రాసారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి తన కోసమే రాసారని, బుజాలు తడుముకున్నారు. మరో పక్క అన్ని పేపర్లు కూడా, ఈ విషయం పై ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని తప్పుబట్టాయి. దీని పై ఈ రోజు జగన్ స్పందిస్తూ, తన అక్కసును వెళ్ళగక్కారు. ఎందుకు నిర్ణయం తీసుకున్నాం, ఎలా చేస్తాం అనేది వివరంగా చెప్పకుండా, ఎదురు దాడి చేసారు. అది కూడా వ్యక్తిగత దాడి.

jagan 11112019 3

వెంకయ్య నాయుడు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ కొడుకులు, మనవళ్లు ఏ మీడియంలో‌ చదువుతున్నారు. అంటూ, డైరెక్ట్ గా ఉప రాష్ట్రపతి పైనే వ్యాఖ్యలు చేసారు. నిజానికి వెంకయ్య, ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై స్పందించలేదు. కేవలం మన దేశంలో ఉన్న అన్ని భాషల గురించి వ్యాసం రాసారు. అయితే జగన్ మాత్రం తనకు ఆపాదించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పై అయితే, తీవ్రంగా వ్యక్తిగత దాడి చేసారు. అయ్యా సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్ గారు.. పవన్ కల్యాణ్‌కు ముగ్గురు భార్యలు... నలుగురో ఐదుగురో పిల్లలు కూడా ఉన్నారు, వారు ఎక్కడ చదువుతున్నారు అంటూ ప్రశ్నించి, సమస్య పై స్పందించకుండా, వ్యకిగత దాడి చేసారు. అలాగే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటూ, వ్యాఖ్యలు చేసారు. అయితే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, ఇలా మనసులో ఉన్నది ఉక్రోషంతో కక్కేస్తూ, వ్యాఖ్యలు చెయ్యటం పై, మాత్రం, జగన్ వైఖరిని ఆక్షేపించక తప్పదు. రేపు పవన్ కళ్యాణ్ కూడా, జగన్ కుటుంబ సభ్యుల పై, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ఏమి చేస్తారు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ, ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఢిల్లీ నుంచి పిలుపు రావటం, సంచలనంగా మారింది. ఆయన ఢిల్లీ పిలుపు మేరకు, రెండు రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. అయితే, ఆయనకు ఆదివారం ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్ర పరిణామాలు నేపధ్యంలో, ప్రధాని మోడీ బిజీగా ఉండటంతో, ప్రధానితో భేటీకి కుదరలేదు. రాత్రి వరకు పీఎంఓ వేచి చూడమని చెప్పినా, ప్రధాని అందుబాటులోకి రాకపోవటంతో, ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. అయితే, ఈ నెల 15న, ఆయనకు ప్రధాని మోడీ మరో అపాయింట్మెంట్ ఇచ్చారని, తెలుస్తుంది. ఈ నెల 14న మరోసారి ఎల్వీ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో ఏ అంశాల పై స్పందిస్తారు అనే విషయం మాత్రం తెలియటం లేదు. హస్తిన నుంచి పిలుపు రావటంతో, అటు వైపు నుండే అజెండా ఉండే అవకాసం కనిపిస్తుంది. మరో పక్క ఎల్వీ కూడా, తనా మనసులో మాట చెప్పే అవకాసం ఉంది.

lvs 11112019 2

ముఖ్యంగా ఆయన కేంద్ర సర్వీసులకు వస్తాను అనే ప్రతిపాదన ప్రధాని ముందు పెట్టబోతున్నారని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానకరంగా సాగనంపిన తీరు గురించి ఆయన ఫిర్యాదు చేసి, రాష్ట్రం పై ట్రిబ్యునల్ లో పోరాడటానికి కూడా కేంద్రం దగ్గర సలహా తీసుకోనున్నారని తెలుస్తుంది. ఈ నెల నాలుగున, ఎల్వీని అకస్మాత్తుగా బదిలే చేసి, సాధారణ హోదా కలిగిన బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అయితే, ఎల్వీ మాత్రం, ఆ పదవి తీసుకోకుండా, వచ్చే నెల 6 వరకు లాంగ్ లీవ్ పెడుతూ, సెలవు పై వెళ్ళిపోయారు. ఆయన తరువాత ఢిల్లీలో ప్రత్యక్షం అవ్వటంతో, ఏమి జరుగుతుందా అని చర్చకు దారి తీసింది. ఆయన బదిలీ తీరు పై, ప్రతిపక్షాలు కూడా, ఆయనకు మద్దతుగా నిలిచాయి.

lvs 11112019 3

మరో చర్చ ఏమిటి అంటే, రాష్ట్రంలో జరుగుతున్న జగన్‌ పాలన, లోటుపాట్ల గురించి ఒక నివేదికను ఎల్వీ తయారు చేసారని, ఆ నివేదికను కూడా ప్రధానికి ఇస్తారనే చర్చ, రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎల్వీ ఢిల్లీ వెళ్ళటం వెనుక, బీజేపీ కూడా ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక మాజీ ఐఏఎస్ అధికారి, తతంగం మొత్తం నడుపుతున్నారని తెలుస్తుంది. ఒక చీఫ్ సెక్రటరీని బదిలీ చెయ్యటం అంటే, ఒక పెద్ద సంచలనం అని, ప్రధాని కూడా ఈ విషయం పై అరా తియ్యటంతో, ఆయనకే నేరుగా విషయం చెప్పే విధంగా, ఎల్వీని ప్రధానితో భేటీ అయ్యేలా చేస్తున్నారని సమాచారం. బీజేపీ ఈ వ్యవహారంలో, రాజకీయ మలుపు తిప్పి, రాజకీయంగా ఈ అంశాన్ని ఉపయోగించుకునే పనిలో భాగంగానే, ఎల్వీ ఢిల్లీ ట్రిప్ అనే ప్రచారం జరుగుతుంది. 15న ప్రధానితో భేటీ అయిన తరువాత కాని, అసలు విషయం తెలిసే అవకాసం లేదు.

2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఎన్నికల్లో తనకు సహకరించిన అందరికీ పదవులు కేటాయింపులు చేస్తూ, ఇష్టం వచ్చినట్టు పదవులు ఇచ్చేసారు. చివరకు లక్ష్మీపార్వతికి కూడా పదవి కట్టబెట్టారు. అయితే ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకొని ఉన్న మంచు మోహన్ బాబుకి అన్నిటి కన్నా పెద్ద పదవిని, గౌరవమైనది, కీలకమైన పదవిని ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయం అట. అందుకే ఎంత లేట్ అయినా అలంటి పదవి ఏముందా అని వెతుకుతూ ఉన్నారు. వచ్చే సంవత్సరంకి అతి ముఖ్యమైన పదవి అయిన రాజ్యసభ ఎంపీ పదవి ఖాళీ అవుతుంది. ఆ పదవి ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు గారికి ఇవ్వాలనేది వైసీపీ ప్రభుత్వం అభిప్రాయం అని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని పదవులకు నేతలను ఎన్నుకుని పదవి భాద్యతలను వారికి అప్పగించారు. మరికొంత మందికి కూడా త్వరలో పదవులు ఇచ్చే అంశం పై లీకులు ఇస్తున్నారు.

mohan 10112019 2

ఇప్పటి వరకు పదవులు వచ్చిన ప్రముఖులు నటుడు పృథ్వి కి ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ పదవిని , ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ పదవి కి చైర్మన్ గా విజయ్ చందన్ ని (ఇంకా నియమించలేదు), తెలుగు అకాడమీ చైర్మన్ గా లక్ష్మి పార్వతిని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే, తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అన్నట్టు మోహన్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ లోనే ఏదైనా పదవి లో చేయాలనీ ఉందని, కానీ వైసీపీ అధినేత ఢిల్లీ రాజకీయాలు చూసుకోవాలిసిందిగా కోరుతున్నట్లు అయనకు సూచించినట్టు సమాచారం. అంతకముందు ఎన్టీఆర్ ప్రభత్వం లో మంచు మోహన్ బాబు గారికి రాజ్య సభ లో పదవిలో అనుభవం ఉందని అందుకే అయన ని ఆ పదవికి ఎంపిక చేస్తారని వైసిపీ వర్గాలు అంటున్నాయి.

mohan 10112019 3

మోహన్ బాబుకి రాజ్యసభ పదవి ఇచ్చి, ఢిల్లీ రాజకీయాలకు ఆయన్ను పరిమితం చెయ్యాలని జగన్ ఎత్తుగడగా తెలుస్తుంది. మోహన్ బాబుకి, బీజేపీలోని నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సంబంధాలు ఉండటంతో, ఆయన్ను అక్కడ ఉంచితే, బీజేపీని ఇంకా కొంచెం మచ్చిక చేసుకునే ప్రయత్నం చెయ్యొచ్చని, అందుట్లో మోహన్ బాబు వాక్ చాతుర్యంతో, అందరినీ ఆకట్టుకుంటారు కాబట్టి, ఢిల్లీ లాబీయింగ్ కి తేలిక అవుతుందని జగన్ అభిప్రాయంగా తెలుస్తుంది. మరో పక్క, మోహన్ బాబుకి రాజ్యసభ లాంటి పెద్ద పదవి ఇచ్చి, కమ్మ సామాజిక వర్గాన్ని కూడా దగ్గరకు తీసుకునట్టు అవుతుందని, వైసిపీ అధిష్టానం ఎత్తుగడగా తెలుస్తుంది. మొత్తానికి అందరికీ పదవి ఇస్తున్న జగన్, మోహన్ బాబుకి కూడా ఊహించని పెద్ద పదవి అయిన రాజ్యసభ ఇస్తున్నారు.

ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది. వనభోజనాలు టైం. ఎవరి కులం వాళ్ళు, ఇంకా చెప్పాలంటే, ఎవరి ఇంటి పేరున వాళ్ళు, కార్తీక వనసమారాధనలను చేసుకుంటూ ఉంటారు. కుల భోజనాలు అని కూడా, వీటికి పేరు ఉంది. ఒక కులం అని కాదు, అన్ని కులాల వారు ఇలాగే చేస్తారు. ఇక్కడ వరకు పర్వాలేదు కానీ, మా కులమే గొప్ప, అవతలి కులం ఇలా అలా అంటే మాత్రం, ఇది ఆక్షేపనీయం. ఇక ఈ కుల భోజనాల్లో, రాజకీయాలు మాట్లాడితే అంతకంటే హేయం కూడా ఉండదు. నీ కులం గురించి గొప్పగా చెప్పుకో, నీ చరిత్ర చెప్పుకో, నీ కులంలో ఉన్న గొప్పవాళ్ళని స్మరించుకుని, వారిలా జీవితంలో ఎలా ఎదగాలి అనేది నేర్చుకుంటే, ఇలాంటి వాటికి ఏమైనా అర్ధం ఉంటుంది. అంతే కాని, కులం గజ్జిని, భవిష్యత్తు తరానికి అందిస్తూ, మనమే గొప్ప, ఎదుటి వాళ్ళు అందరూ అల్పులు, అని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రం, ఇది ఏ మాత్రం సమాజానికి మంచిది కాదు. మన కర్మకి, ఇప్పుడు ఇలాగే జరుగుతుంది.

roja 1112019 2

అయితే ఇప్పుడు నిన్న జరిగిన ఒక సంఘటన గురించ చెప్పుకుందాం. కాకినాడ సమీపంలోని అచ్చంపేటలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, కార్తీక వన సమారధాన జరిగింది. ఈ కార్తీక వనసమారాధనలకు, ముఖ్య అతిధిగా, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్‌కే రోజా వచ్చారు. ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం, జగన్ అన్న పాలనలో, రెడ్డి కులస్థులు కార్తీక వనసమారాధనలను చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఇక్కడతో ఆగకుండా, తెలుగుదేశం పార్టీ పై కుల విమర్శలు చేసారు. గత అయుదు సంవత్సరాల్లో చంద్రబాబు రెడ్లను తొక్కి పెట్టి, తీవ్రంగా అవమానపరిచారని అన్నారు. రెడ్ల అందరూ, కష్టపడి జగన్ అన్నకు, 151 సీట్లు వచ్చేలా కష్టపడ్డారని, రెడ్లు అంటే ఒక కులం కాదని, ఒక గుణం, ఒక ధైర్యం, ఒక భరోసా అని, రోజా అన్నారు.

roja 1112019 3

అయితే, రోజా వ్యాఖ్యల పై, పెద్ద దుమారమే రేగింది. 151 మంది ఎమ్మెల్యేలు గెలవటానికి, కేవలం రెడ్లు మాత్రమే సహాయం చేసారా ? మిగతా కులాల వారి సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మీకు వచ్చిన 50 శాతం ఓట్లు రెడ్ల వల్ల వచ్చాయి అంటారా అని ప్రశ్నిస్తున్నారు. మిగతా కులాల వాళ్ళు మీకు ఓట్లు లేదంటారా ? చివరకి కమ్మ కులంలో నుంచి కూడా దాదాపుగా 40 శాతం ఓట్లు వైసిపీకి పడ్డాయని గుర్తు చేస్తున్నారు. రెడ్లు మాత్రమే సంతోషంగా ఉంటే చాలా అని రోజా వ్యాఖ్యలకు ప్రశ్నిస్తున్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, అన్ని కులాలు వారు, మతాల వారు, చివరకు రెడ్డి కులస్తులు కూడా, పనులు లేక పస్తులు ఉంటున్నారని, వారిని కూడా సంతోష పెట్టే కార్యక్రమం చెయ్యమని, జగన్ కు చెప్పమని అంటున్నారు. ఇక చంద్రబాబు రెడ్లను తోక్కేసారు అనటం పై కూడా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు 5 మంత్రి పదవులు ఇచ్చి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి రెడ్లను గౌరవించారని గుర్తు చేస్తున్నారు. అంతెందుకు, ఇన్ని చెప్తున్న రోజా రెడ్డి గారిని, రాజకీయాల్లోకి తీసుకు వచ్చిందే చంద్రబాబు అనే విషయం, ఆమె మర్చిపోవటం, ఆశ్చర్యకరం. చంద్రబాబు సమాజంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని, కుల ముద్ర వేసుకోవాలి అంటేనే ఆయన భయపడతారని గుర్తు చేస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ, కులాల పై మాట్లాడటం, సమంజసం కాదని, రోజాకి గుర్తు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read