నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో రోజుకు ఒకటి చెప్తూ, గందరగోళానికి గురు చేస్తూ, ప్రభుత్వం నిర్ణయం ఏమిటో తెలియకుండా ఉన్న పరిస్థతి పై, పూర్తీ వివరాలు చెప్పండి అంటూ మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. మంత్రులతో పాటుగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌, రాజధాని కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు, కమిటీ సభ్యులు అందరికీ హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. రాజధాని విషయంలో తాము నిపుణల కమిటీ వేశామని, ఆ కమిటీ నిర్ణయం ఆధారంగా నిర్ణయం ఉంటుంది అని ప్రభుత్వం చెప్తుంది. కమిటీ సభ్యులు అన్ని ప్రాంతాలకు వెళ్లి, అభిప్రాయలు తీసుకుంటున్నారు. మరో పక్క మంత్రులు మాత్రం, అమరావతి అక్కడ ఉండదు, అమరావతి ఓక కులానికి సంబంధించింది అని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరో పక్క సచివాలయం, తాడేపల్లి పరిసర ప్రాంతాలకు వచ్చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతంది.

court 15112019 2

ఈ గందరగోళ పరిస్థితిలో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, కోర్ట్ కు వెళ్లారు. అసలు రాజధాని ఎప్పుడో నిర్ణయం అయిపొయింది అని, ఇప్పుడు వేసిన రాజధాని నిపుణుల కమిటీకి ఏ అధికారము లేదని, అమరావతి రైతులు, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ కమిటీని రద్దు చెయ్యాలని, హైకోర్ట్ ని కోరారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించి సెప్టెంబరు 13న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 585ను రద్దు చెయ్యాలని, వీరు హైకోర్ట్ ని కోరారు. ఈ కమిటీ ఏర్పాటు, ఏపీసీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏర్పడిందని అన్నారు. ఏపీసీఆర్‌డీఏ చట్టం ప్రకారం, రజధాని పునఃపరిశీలించే అధికారం ఈ నిపుణల కమిటీకి లేదని, దీన్ని వెంటనే రద్దు చెయ్యాలని హైకోర్ట్ ని కోరగా, హైకోర్ట్ ఈ పిటీషను విచారణకు స్వీకరించి, అందరికీ నోటీసులు జరీ చేసింది.

court 15112019 3

రాజధాని పునఃసమీక్ష కోసం, ఆ కమిటీ ఎందుకు వేసారు, తదితర అంశాల పై, మీ వైఖరి చెప్పండి అంటూ, అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి కూడా హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణను, నవంబర్ 28కి వాయిదా వేసింది. పిటీషనర్ తరుపున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్‌ హైకోర్టుకు వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని కోర్ట్ కు చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ అనేక సార్లు పొంతనలేని వివాదాస్పద ప్రకటనలు చేశారని చెప్పారు. ఇవి మీడియాలో వచ్చి గందరగోళానికి తెర లేపాయని అన్నారు. మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇప్పటికే అమరావతిలో ఉన్న హైకోర్టు తరలింపు పై వ్యాఖ్యలు చేసారని, తరువాత న్యాయవాదులు అందరూ గందరగోళానికి గురయ్యిం, ఆందోళన చెయ్యాల్సి వచ్చిందని అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి, ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళటంతో ఆసక్తి నెలకొంది. ఈ రోజు ఉదయం, గుంటూరు జిల్లా, మంగళగిరిలో, భవన నిర్మాణ కార్మికుల కోసం, డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఈ కార్యక్రమం అయిన వెంటనే, ఆయన గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే జనసేన పార్టీ వర్గాలు మాత్రం, ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గునేందుకు వెళ్తున్నారు అని చెప్తున్నా, దీని వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రయం కలుగుతుంది. ఢిల్లీలో పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులను పవన్ కళ్యాణ్ కలిసే అవకాసం ఉనట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది అని, ఒక పక్క 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, మరో పక్క అభివృద్ధి లేదని, అలాగే అమరావతి, పోలవరం ఆగిపోయాయని, వచ్చిన కంపెనీలు కూడా వెనక్కు వెళ్ళిపోయాయి అని, వీటి అన్నిటి పై, కేంద్రంతో ఫిర్యాదు చేస్తాను అని గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

delhi 15112019 2

ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్, ఢిల్లీ వెళ్ళటం పై, ఆసక్తి నెలకొంది. ప్రధని మోడీ అందుబాటులో లేరు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారో లేదో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు, రాజకీయ అంశాలు కూడా, ఈ భేటీలో చర్చించే అవకాసం ఉనట్టు తెలుస్తుంది. మరో పక్క, ఈ రోజు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో, ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’ ప్రారంభిస్తూ, ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. పనులు లేక, కనీసం తిండి కూడా దొరక్క, కూలీలు ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందని అన్నారు. 50 మంది చనిపోయిన తరువాత కూడా ప్రభుత్వం మేల్కొనలేదని అన్నారు. ఆరు నెలల తరువాత, మొక్కుబడిగా, ఇసుక వార్తోత్సవాలు చేస్తున్నారని, ఆరు నెలల నుంచి ఏమి చేస్తున్నారని పవన్ అన్నారు.

delhi 15112019 3

ప్రజలు చచ్చిపోతుంటే, మేము మాట్లాడకూడదు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చి, వన్ సైడ్ మ్యన్దేట్ ఇస్తే ఇలా చేస్తారా అంటూ, పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గతంలో అమరావతిని సమర్ధిస్తూ, ఏకగ్రీవ తీర్మానం చేసిన, జగన్ , ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు పై కోపం ఉంటే, ఆయన పై తీర్చుకోండి కాని, అమరావతి ఎందుకు మారుస్తున్నారు అంటూ, వ్యాఖ్యలు చేసారు. రాజధాని పై ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని పవన్ అన్నారు. పులివెందులలో పెడతారా, ఇడుపులపాయలో పెడతారా, ఎక్కడైనా పెట్టుకోండి కాని, ప్రజామోదంతో, ఏదో ఒకటి తొందరగా తేల్చండి అంటూ, పవన్ కళ్యాణ్ వాపోయారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తరువాత, వారానికి ఒకసారి, దేవినేని నెహ్రు తనయుడు, దేవినేని అవినాష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పార్టీ మారిపోతున్నారు అంటూ వార్తలు వస్తూ వచ్చాయి. అయితే అవినాష్ ఏమో చచ్చి పొతే పార్టీ జెండా కప్పుకుని చచ్చిపోవాలి అని మా నాన్న గారు చెప్పిన మాటలే నావి కూడా అన్నారు. వల్లభనేని వంశీ ఏమో, ఎన్నికల ముందు అన్నం తినే వాళ్ళు ఎవరూ ఆ పార్టీలో చేరారు అన్నారు, ఎన్నికల తరువాత, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్నారు. అయితే, అవినాష్ పార్టీ మారుతున్నారు అంటూ మూడు రోజుల నుంచి వార్తలు రావటం, నిన్న అనుచరులతో మీటింగ్ పెట్టుకోవటం, అక్కడ పార్టీలో గుర్తింపు లేదు అని తీర్మనించటం జరిగి పోయింది. ఈ రోజు నాలుగు గంటలకు అవినాష్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. మరో పక్క ఎవరూ ఊహించని విధంగా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్ మీట్ పెట్టరు.

tdp 14112019 2

దీపావళి నుంచి వంశే పార్టీ మారుతున్నారు అని వార్తలు వచ్చినా, వంశీ వైపు నుంచి క్లారిటీ రాలేదు. చంద్రబాబుకు మెసేజ్ చేసి, నేను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పారు. అయితే అప్పటి నుంచి స్పీకర్ కు మాత్రం, రాజీనామా లేఖ వెళ్ళలేదు. అయితే వంశీ పార్టీ మార్పు పై మాత్రం, ఎక్కడా స్పష్టత రాలేదు. అసెంబ్లీ కమిటిల్లో వంశీ పేరు రావటంతో, ఆయన ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యరు అనే విషయం అర్ధమైంది. ఆయన తటస్థంగా ఉంటారు అంటూ వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ పత్రికలో వంశీ మాట్లాడిన మాటలు ప్రచురిస్తూ, తాను ఎమ్మెల్యేగా ఉంటానని, అవసరం వచ్చినప్పుడు రాజీనామా చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం, జగన్ కు మద్దతు ఇస్తున్నాను అంటూ చెప్పినట్టు వార్త వచ్చింది.

tdp 14112019 3

అయితే అనూహ్యంగా వంశీ ఈ రోజు అయుదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. తాను జగన్ తో కలిసి నడుస్తానని, ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవి అడ్డు అందుకుంటే, అప్పుడు రాజీనామా చేస్తానని చెప్పారు. పనిలో పనిగా చంద్రబాబుని, లోకేష్ పై కూడా, విమర్శలు చేసారు. అయితే, చంద్రబాబు ఈ రోజు ఇసుక కోసం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం చంద్రబాబు ఈ దీక్షలో మాట్లాడుతూ, మన దీక్షను డైవర్ట్ చెయ్యటానికి, వైసీపీ పార్టీ, మన పార్టీలోని ఇద్దరితో, ఈ రోజు మన పై బురద చల్లించే కార్యక్రమం చేస్తున్నారు అంటూ చెప్పారు. చంద్రబాబు చెప్పినట్టే, దీక్ష ఎనిమిది గంటలకు ముగుస్తుంది అనగా, నాలుగు గంటలకు దేవినేని కండువా కప్పించుకుని, రాజీనామా లేఖ రాసి, మాకు గుర్తింపు లేదు అని చెప్తూ, వార్తల్లో నిలిచారు. అది అయిపోతుంది అనుకున్న టైంలో, వల్లభనేని వంశీ ప్రెస్ మీట్ పెట్టు, వార్తల్లో నిలిచారు. మొత్తానికి చంద్రబాబు చెప్పినట్టే, ఇద్దరూ బయటకు వచ్చారు. ఇది యాదృచ్చికమో, లేక నిజంగానే రాజకీయ గేమో అనేది వారికే తెలియాలి.

కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత కూడా ఈ స్నేహం కొనసాగింది. ప్రమాణస్వీకారం కూడా అవ్వకుండానే, హైదరాబాద్ లోని ఏపి సెక్రటేరియట్ భవనాలు, తెలంగాణాకు అప్పగించే ఆదేశాలు ఇచ్చారు జగన్. అప్పటి నుంచి, నాలుగు, అయుదు సార్లు ఇద్దరూ కలిసారు. అయితే ఏపికి లాభం చేకూరే ఏ నిర్ణయం కూడా కేసిఆర్ ప్రకటించలేదు. మరో పక్క, గోదావరి నీళ్ళు, తెలంగాణా భూభాగం మీదుగా, శ్రీశైలం తరలించటానికి వేసిన ప్రణాళిక పై, ఏపిలో విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ను నమ్మవద్దని, ఆయన తెలంగాణా ప్రయోజనాల కోసం, మనలను ముంచేస్తారని, చెప్పినా వినలేదు. జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీలో, ఈ విషయం పై మాట్లాడుతూ, కేసిఆర్ ఉదారస్వభ్యావం కలవారు అంటూ, ఆ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అలాగే కేసిఆర్ కూడా మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అన్ని రకాలుగా , ఏపి ప్రభుత్వానికి సహకారం అందిస్తామని, కోర్ట్ లో వేసిన కేసులు కూడా వెనక్కు తీసుకుంటాం అని చెప్పారు. అలాగే ప్రత్యెక హోదా విషయంలో కూడా కలిసి పోరాడదాం అని అన్నారు.

kcr 15112019 2

ఇంత వరకు బాగానే ఉన్నా, గత కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తల ప్రకారం, ఇద్దరి సియంల మధ్య గ్యాప్ వచ్చిందని అంటున్నారు. ఆ ప్రాజెక్ట్ పై కూడా ఏపి వెనక్కు తగ్గిందని, తెలంగాణాతో సంబంధం లేకుండా, ఏపి ఒంటరిగానే, వెళ్తుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ధాఖలు చేసిన అఫిడవిట్ చూస్తే, ఈ విబేధాలు నిజమే అని అర్ధమవుతుంది. విభజన హామీల్లో జాప్యం జరుగుతూ ఉండటం పై, తెలంగాణా బీజేపీ నేత, పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్ట్ లో వేసిన పిటీషన్ పై, తెలంగాణా వేసిన అఫిడవిట్ కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. కౌంటర్ అఫిడవిట్ లో, తెలంగాణా పై పలు ఘాటు విమర్శలు చేసింది, ఏపి ప్రభుత్వం.

kcr 15112019 3

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రాజెక్ట్ అని తెలిపింది. అయితే ఇదే సందర్భంలో, జగన్ మొహన్ రెడ్డి, సియం హోదాలో, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క అఫిడవిట్ లో, పోలవరం ప్రాజెక్ట్ పై మాట్లాడుతూ, తెలంగాణాలోని ముంపు మండలాలు , ఆంధ్రపదేశ్ లో కలపటం విషయంలో, తెలంగాణా రాష్ట్రానికి అభ్యంతరం చెప్పే హక్కు లేదని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, తెలంగాణాను ఒక పార్టీగా పరిగణించాల్సిన పని లేదు అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. అయితే, ఇద్దరి సియంల మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసిన వారు, ఈ అఫిడవిట్ చూసిన తరువాత, ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే విషయం స్పష్టం అవుతందని, వ్యక్తిగతాలు పక్కన పెట్టి, ఎవరి రాష్ట్రం గురించి, ఎవరికీ వారు ప్రాధాన్యం ఇచ్చి, వారు పోరాడితే, ఇరు రాష్ట్ర ప్రజలకు మంచిదని, విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read