రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో, ఇన్వెస్టర్స్ లో భరోసా పోతుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న స్టార్ట్ అప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేసుకుంటూ జీవో ఇవ్వటం, వెంటనే సింగపూర్ ప్రభుత్వం కూడా, మేము అమరావతి నుంచి తప్పుకుంటున్నాం అని ప్రకటించటంతో, ఏపి ప్రభుత్వం తీసుకున్న చర్య వివాదాస్పదం అవుతుంది. ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలి అంటేనే, పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా, తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. అలాంటిది సింగపూర్ ప్రభుత్వం, ఏకంగా రంగంలో దిగిటంతో, మిగతా పారిశ్రామిక వేత్తలకు కూడా కాన్ఫిడెన్సు వచ్చి, పెట్టుబడులకు ముందుకు వచ్చారు. అయితే, ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం, అమరావతి నుంచి వెళ్ళిపోవటంతో, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఏకంగా దేశాని పరువు, ప్రతిష్టతకు సంబంధించిన విషయంగా మారింది. సింగపూర్ ప్రభుత్వం, ఏపి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోవటం, పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

mohandas 13112019 2

కర్ణాటకకు చెందిన ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, అక్షయ పాత్ర సంస్థ సహవ్యవస్థాపకుడు, మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఛైర్మన్‌, ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ టి.వి.మోహన్‌దాస్‌ పాయ్‌ కూడా, ఈ విషయం పై స్పందించారు. ఆయన ఈ విషయం పై ట్వీట్ చేస్తూ, ఒకింత ఘాటుగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ వైదోలగటం, ఆంధ్రప్రదేశ్ కు బ్యాడ్ న్యూస్ అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఇది, హరాకిరీ అని స్పందించారు. హరాకిరీ అంటే, ఆత్మహత్య అని అర్ధం. అంటే, జగన్‌ చేజేతులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, మోహన్‌దాస్‌ పాయ్‌ ట్వీట్ చేసారు. జగన్ చేస్తున్న ఈ పనితో, ఒంటి చేత్తో ఆంధ్రప్రదేశ్‌ పై పెట్టుబడి సంస్థల నమ్మకాన్ని నాశనం చేస్తున్నారు అని అన్నారు.

mohandas 13112019 3

ఇలాంటి చర్యలతో, ఎవరూ అక్కడ పెట్టుబడి పెట్టరు, ఉద్యోగాలు రావు, అభివృద్ధి ఆగిపోతుంది, ఇది నిజంగానే చాలా బాధకారమైన విషయం అంటూ ఆయన పెర్కున్నారు. అయితే ట్విట్టర్ వేదికగా ఈ అభిప్రాయం చెప్పటంతో, ఆయన ట్వీట్ పై, వైసీపీ సోషల్ మీడియా, దాడి చేసింది. గతంలో కూడా, విద్యుత్ పీపీఏల విషయంలో, జపాన్ ప్రభుత్వం మోడీ కి లేఖ రాయటం పి, మోహన్ దాస్ స్పందిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని ఒక "గవర్నమెంట్ టెర్రర్" అంటూ స్పందించారు. దీని పై వైసీపీ ఎదురు దాడి చేస్తూ, ఈయన చంద్రబాబు అజేంట్ అని, చంద్రబాబు డబ్బులు ఇచ్చి వేయిస్తున్నాడు అంటూ, ఆయన ట్వీట్ పై కొంత మంది వైసిపీ సానుభూతి పరులు ఎదురు దాడి చేసారు. అయితే, మోహన్‌దాస్‌ పాయ్‌ అనే వ్యక్తీ, చంద్రబాబు చెప్తే చేస్తారా ? ఆయన అక్షయ పాత్ర సంస్థ సహవ్యవస్థాపకుడు, మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఛైర్మన్‌, ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ అనే విషయం, వీరికి తెలుసో తెలియదో.

"And today's prize for most ridiculous excuse-making goes to..... the government of Andhra Pradesh. Hard to fathom how much damage the decision unilaterally to scrap this new city project will have for India's reputation as a reliable international partner." ఈ మాటలు చెప్పెంది, సింగపూర్ దేశానికి చెందిన ఒక ప్రముఖ ప్రొఫెసర్. ఆయన పేరు "జేమ్స్ క్రాబ్ ట్రీ". సింగపూర్ ప్రభుత్వం, అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాం అంటూ ఇచ్చిన ప్రకటన పై, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. "ఇలాంటి వింత వింత కారణాలు చెప్తూ, తప్పించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బహుమతి ఇవ్వాలి. మంచి ఇంటర్నేషనల్ పార్టనర్ గా, భారత దేశానికి పేరు ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, భారత దేశ ప్రతిష్టకే ఇబ్బందికర వాతావరణం ఉండే పరిస్థితి ఉంది అంటూ, ఈయన చేసిన ట్వీట్ తో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

singapoire 13112019 2

ఆరు నెలల్లో, దేశం మొత్తం, మన రాష్ట్రం వైపు చూసేలా చేస్తాం అని అంటే, ఏంటో అనుకున్నాం అని, ఇప్పుడు భారత దేశమే కాదు, ప్రపంచ దేశాలే మన వైపు చూసేలా, జగన్ చేసారని, కాకపొతే, అది మంచి అయితే పరవాలేదు, చెడుగా మన రాష్ట్రాన్ని చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో పీపీఏల విషయంలో జపాన్ ప్రభుత్వం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని మోడీకే ఉత్తరం రాసింది. ఏపిలో జరుగుతున్నవి చూస్తుంటే, మా పెట్టుబడి దారులు పెట్టుబడులు పెట్టాలి అంటేనే భయపడుతున్నారు, ఇది ఒక రాష్ట్రంతో ఆగదు, మీ దేశం మొత్తానికి ఇబ్బంది అంటూ, అప్పట్లో జపాన్ ఉత్తరం రాసింది. ఇప్పుడు, సింగపూర్ ప్రభుత్వం, కూడా ఇంచుమించు ఇలాగే స్పందించింది. గతంలో చంద్రబాబు హయంలో, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే, ఇప్పుడు అది రివర్స్ అయ్యింది.

singapoire 13112019 3

సింగపూర్ లో ఉన్న జాతీయ పత్రికలు కూడా, సింగపూర్ ప్రభుత్వం, ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో, చెప్తూ కధనాలు రాసారు. నిన్న సింగపూర్ ప్రభుత్వం ఆఫిషియల్ ప్రెస్ నోట్ గురించి చెప్తూ, ఈ కధనాల్లో, అసలు ఎందుకు సింగపూర్ ప్రభుత్వం తప్పుకుంది అని చెప్తూ రాసిన విశ్లేషణల్లో, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అమరావతి పై ఆసక్తి లేదని రాసాయి. దీనికి ఉదాహరణగా, అమరావతికి లోన్ ఇవ్వకుండా, ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్ళిపోవటం, అలాగే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా వెనక్కు వెళ్ళిపోవటం పై, ప్రస్తావించాయి. అలాగే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి కూడా కారణం అని చెప్తూ, చంద్రబాబు నాయుడు లెగసి లేకుండా చెయ్యాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తుందని రాసాయి. అలాగే, సింగపూర్ దేశానికి ఉన్న డైరెక్ట్ ఫ్లైట్ కూడా, ఈ కొత్త ప్రభుత్వం రద్దు చేసింది అంటూ, అన్ని వివరాలతో, కధనాలు రాసారు.

ఎవరైనా పెద్దలు ఇచ్చిన సంపాదనను, జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఇంకా ఆదాయం పెంచుకుంటూ, సుఖంగా జీవిస్తూ, పెద్దలు ఇచ్చిన ఆస్తి భరోసాతో, మంచి ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు. మంచి నడవిక గలవారు ఎవరైనా చేసే పని ఇది. ఇంకో రకం వారు మాత్రం, వాళ్లకి ఆదాయం సంపాదించటం చేతకాదు. దుబారా చేస్తారు. చివరకు ఖర్చులకు డబ్బులు లేక, పెద్దలు ఇచ్చిన ఆస్తులు అమ్మి, కొన్నాళ్ళు సాగదీస్తారు. తరువాత కొన్నాళ్ళకు, అటు ఆస్థులు కరిగిపోయి, ఇటు డబ్బు సంపాదించే మార్గం తెలియక, కుటుంబ సభ్యులను రోడ్డున పడేస్తారు. మన రాష్ట్రం ప్రభుత్వం చేసే పని కూడా ఇలాగే ఉంది. పెట్టిన పేరేమో, బిల్డ్ ఏపి. చేసే పనేమో, సెల్ ఏపి. బిల్డ్ ఏపి మిషన్ ద్వారా, మౌలిక సదుపాయాలు పెంచుతాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది కాని, ఆ బిల్డ్ చెయ్యటానికి, రాష్ట్రాన్ని సెల్ చేస్తాం అంటుంది.

jagan 12112019 2

దీని కోసం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు పై కన్ను వేసింది ప్రభుత్వం. రాష్ట్రమొత్తం మీద వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న భూములు, అతిధి గృహాలు, నిరుపయోగ భవనాలను గుర్తుంచి, ఏపీ మెషిన్ బిల్డ్ ద్వారా వాటిని అమ్మి ఆ సంపాదనతో వైసీపీ ప్రభత్వం ప్రజలకి చేస్తా అన్న నవరత్నాలు, నాడు -నేడు వంటి పథకాలని అమలు చేయచ్చు అని వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేసారు. దీని కోసం పోయిన నెల 30 న జరిగిన రాష్ట్ర మంత్రివర్గం మీటింగ్ లో జగన్ ఆలోచనకు క్యాబినెట్ ఆమోదం తెలిపారు. ఈ మెషిన్ కోసం ప్రేత్యక కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ ప్రభత్వ స్థలాలని అమ్మడానికి ప్రణాళిక వేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల లెక్క తీస్తున్నారు.

jagan 12112019 3

దీని కోసం ముందుగా విజయవాడ లాంటి చోటు ఎంచుకున్నారు. నిజానికి విజయవాడ లాంటి చోట, భూములు అమ్మాలి అని ఎవరూ అనుకోరు. కాని, మన ప్రభుత్వం, విజయవాడ నడి ఒడ్డులో ఉన్న, స్టేట్ గెస్ట్ హౌస్ కు సంబంధించిన, రెండు ఎకరాలు అమ్మేందుకు సిద్ధం అయ్యింది. అయితే, ఈ ప్రతిపాదన పై, అందరూ భగ్గు మంటున్నారు. అసలు ఆస్థులు అమ్మి, కార్యక్రమాలు చెయ్యటం, ఇదేమి పద్దతి అంటూ, ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. భూములు అమ్మి, ఖర్చు పెట్టటం గొప్ప కాదని, ఆదాయం సంపాదించి, పెట్టుబడులు తెచ్చి, వాటిని ఫలాలు ప్రజలకు ఇవ్వటం, ప్రభుత్వం చెయ్యాల్సిన బాధ్యత అని, అంతే కాని భవిషత్తు తరాల సంపదను, ఇలా అమ్మివేయటం కరెక్ట్ కాదని, ప్రభుత్వాలు ఇలా చెయ్యకూడదు అని విమర్శలు వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు, ఈ నెల 14న, భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాటం చేస్తూ, 12 గంటల పాటు, ఇసుక దీక్ష చెయ్యనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మికంగా తీసుకుంది. ఈ కార్యక్రమం విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర జరుగుతూ ఉండటంతో, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ , ఈ దీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఈ క్రమంలోనే, సోమవారం, అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మొన్నటి దాక ఎడమొఖం, పేద మొఖంగా ఉన్న నాయకులు, ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవటం, పక్కపక్కనే కూర్చువటంతో, తెలుగుదేశం కార్యకర్తలు, మొదట ఆశ్చర్యపోయినా, చంద్రబాబు దీక్ష వల్ల, మా నాయుకులు ఇద్దరూ కలిసి పోయారు అంటూ, సంతోషిస్తున్నారు. వారు ఎవరో కాదు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, మరో టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఇసుక దీక్ష, వీరిద్దరినీ మళ్ళీ కలిపిందనే చెప్పాలి.

nani 12112019 2

ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నకల తరువాత నుంచి, విజయవాడ టిడిపిలో చిన్న పాటి తుఫాను వచ్చింది. ఎన్నికల ఫలితాలు తరువాత నుంచి, కేశినేని నాని, బుద్దా వెంకన్న ఒకరి పై ఒకరు, విమర్శలు చేసుకున్నారు. ఇదంతా ట్విట్టర్ వేదికగా జరిగింది. అయితే ఈ ట్విట్టర్ యుద్ధం కొనసాగుతూ ఉండటం, ప్రతి రోజు వార్తల్లో విషయం కావటంతో, చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని, ఇరువురికి సర్ది చెప్పారు. అప్పటి నుంచి, ఇరువు నేతలు, ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. అసలు జరిగిన విషయం ఏమిటో, క్లారిటీ లేకపోయినా, ఇద్దరు నేతల మధ్య మాత్రం, తేడాలు గమనించిన క్యాడర్ మాత్రం, అసంతృప్తితో ఉంది. వచ్చే మునిసిపల్ ఎన్నికలకు ధీటుగా ఎదుకోవాల్సిన టైంలో, ఇలా మనలో మనకే ఇబ్బందులు ఉంటే ఎలా అంటూ, కార్యకర్తలు ఆందోళన చెందారు.

nani 12112019 3

అయితే, నిన్న అనూహ్యంగా, ఇరువురి నేతలు, ఒకే వేదిక పై కుర్చుని, పక్క పక్కనే కూర్చుని, మాట్లాడుకోవటంతో, ఇరువురి మధ్య మళ్ళీ స్నేహం చిగురించిందని, ఇది పార్టీకే మంచిదని, కార్యకర్తలు అంటున్నారు. సోమవారం విజయవాడలోని కేశినేని భవన్‌లో నిర్వహించిన టీడీపీ అర్బన్‌ కమిటీ సన్నాహక సమావేశంలో, ఈ కలయిక చోటు చేసుకుంది. సమావేశం కేశినేని భవన్ లో జరగటం, అక్కడకు, బుద్దా వెంకన్న రావటం, కేశినేని నాని కూడా బుద్దా వెంకన్నతో సఖ్యతగా ఉండటంతో, ఇక నుంచి మళ్లీ అర్బన్‌ టీడీపీ నాయకులంతా ‘టీమ్‌ విజయవాడ’గా ముందుకు వెళ్తూ, వచ్చే మునిసిపల్ ఎన్నికల నాటికి, పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తామని, కార్యకర్తలు అంటున్నారు. ఏది ఏమైనా, చంద్రబాబు దీక్ష, ఇరువురి నాయకులను మళ్ళీ ఏకం చెయ్యటం, శుభ పరిణామం.

Advertisements

Latest Articles

Most Read