ఒక ఒప్పందం రద్దు చేస్తున్నప్పుడు, వారికి కారణాలు చెప్పరా ? పలానా కారణంతో, ఒప్పందం రద్దు చేస్తున్నాం అని చెప్పాలి కదా ? రద్దుకు గల కారణాలు చెప్పకుండా, కాంట్రాక్టు ఎందుకు రద్దు సెహ్సారు ? ఒప్పందం రద్దు చేసే ముందు, కనీసం నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా ? ఇది రాష్ట్ర ప్రభుత్వం పై, హైకోర్ట్ కురిపించిన ప్రశ్నల వర్షం. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి, నవయుగను అర్ధాంతరంగా తప్పించటం పై, నవయుగ హైకోర్ట్ లో వేసిన అప్పీలు పిటీషన్ పై, వాదనలు జరిగిన సమయంలో, హైకోర్ట్, రాష్ట్రానికి సంధించిన ప్రశ్నలు ఇవి. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు జెన్కోకి కూడా, ఈ ప్రశ్నలు సంధించారు. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్ట్ ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రద్దు చేస్తూ, ఆగష్టు 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వెంటనే, అంటే, ఆగష్టు 22న, నవయుగ హైకోర్ట్ లో పిటీషన్ వేసి, ఈ ఉత్తర్వులు, నిలుపుదల చేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు సాధించింది.

court 14112019 2

ఆ ఉత్తర్వుల పై, జెన్కో హైకోర్ట్ లో అప్పీల్ కు వెళ్ళగా, సింగల్ జడ్జి, స్టే ని ఎత్తివేస్తూ, ఆదేశాలు జారీ చేసారు. సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ, నవయుగ హైకోర్ట్ లో మళ్ళీ అప్పీల్ చేసింది. ఈ పిటీషన్ పై హైకోర్ట్ వాదనలు వింటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని పై వాదనలు వినిపించిన నవయుగ తరుపు న్యాయవాది, పి.విల్సన్‌, ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఒప్పందాన్ని రద్దు చేసారని అన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, పోలవరం హైడల్ ప్రాజెక్ట్, రెండు వేరు వేరు. అయితే, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు సరిగ్గా చెయ్యలేదు అని, హైడల్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేసారని అన్నారు. ఒప్పందం ప్రకారం 58 నెలలు, అంటే, 2023కి ప్రాజెక్ట్ పూర్తీ చేసి ఇవ్వాల్సి ఉండగా, మాకు మాత్రం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ప్రాజెక్ట్ రద్దు చేసారని అన్నారు.

court 14112019 3

ఒప్పందంలోని ఒక్క అంశం తీసుకుని, నవయుగ సంస్థకు వ్యతిరేకంగా సింగల్ జడ్జి తీర్పు ఇచ్చారని, అందుకే స్టేను యథాతథంగా కొనసాగించండి అంటూ హైకోర్ట్ ని విజ్ఞప్తి చేసారు. మరో పక్క జెన్కో తరుపు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ, నవయుగ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది అని, అందుకే రద్దు చేసామని అన్నారు. నవయుగకు 27 సార్లు నోటీస్ ఇచ్చామని, నవంబర్ నుంచి జూన్ వరకు పనులు కొనసాగాలని, అందుకే స్టే వెకేట్ చేసి, కొత్త కాంట్రాక్టు కు ఇచ్చామని అన్నారు. సింగల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అడ్డుకోవద్దు అంటూ హైకోర్ట్ ని కోరారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వం చేతకాని తనం వల్ల, ఇసుక మాఫియా వల్ల, ఇసుక కొరత ఎర్పటడంతో, ఇబ్బందులు పడుతున్న 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు అండగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 12 గంటలు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ ధర్నా చౌక్ లో, చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ దీక్షకు, పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు వచ్చి మద్దతు తెలుపుతూ, వారు పడుతున్న బాధలు చెప్తున్నారు. ప్రతిసారి జరిగే దీక్షలకు భిన్నంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నాయకులు కాకుండా, ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ, తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఆరు నెలల నుంచి కడుపులు కాలి, సమాజంలో ఇబ్బందులు పడుతూ, బ్రతుకు గడవక, ఆత్మాభిమానం చంపుకోలేక వీరు పడుతున్న ఇబ్బందులు, వీరి మాటల్లో తెలిసింది. సామాన్యుడి కడుపు కాలితే, వాళ్లకి సియం ఆయినే ఒకటే, ఎవరైనా ఒకటే అనే విధంగా, ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డిని దుమ్ము దులిపారు.

deeksha 14112019 2

చాలా మంది కార్మికులు వారి సమస్య చెప్తూ, ప్రభుత్వాన్ని విమర్శలతో ముంచెత్తారు. ముఖ్యంగా సుశీలమ్మ అనే కార్మికురాలు మాటలు, ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న కోపాన్ని చెప్పాయి. తన మనవడు పనులు లేక ఆత్మహత్య చేసుకున్నారని, ఈ రోజు దినం కార్యక్రమం ఉన్నా, ఆటో కట్టుకుని, ఇక్కడకు వచ్చానని, నా మాటలు ఈ ప్రభుత్వం వినాలి అని, ఇంత కష్టపడి వచ్చానని చెప్పారు. కేవలం ఇసుక లేక, పనులు లేక, అల్లాడిపోతున్నామని అన్నారు. ఇంట్లో మగవాళ్ళు జీవత్సవాలుగా మారిపోయారని, ఇళ్ళకు వస్తే ఎక్కడ డబ్బులు అడుగుతామో అని, రోడ్ల మీద ఉంటున్నారని అన్నారు. పిల్లలకు తిండి పెట్టలేక పోతున్నామని, అప్పు కూడా పుట్టక, ఇంట్లో వస్తువులు అమ్ముకునే స్థితికి వచ్చామని, ఇంకో రెండు నెలలు పొతే, ఇక మా జీవితాలు ముగించాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేసారు.

deeksha 14112019 3

ఈ సందర్భంగా జగన్ పై విరుచుకు పడ్డారు. ఇంత మండి ఉసురు పోసుకుని, మీరు బాగుపడరని, ఏ ప్రజలు గద్దెను ఎక్కించారో, వారే నిన్ను కుల్చేస్తారని అన్నారు. నీకు పాలించటం చేతకాదు దిగిపో, నేను ఒక సామాన్యురాలుగా చెప్తున్నా, నేను సియంగా ఒక్క రోజు చేసినా, ఇసుక సమస్య ని లైన్ లో పెడతా, నువ్వు దిగిపో అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇలాగే మిగతా వారు కూడా, తమ పరిస్థితిని తలుచుకుని, ఈ దీన పరిస్థితికి జగనే కారణం అంటూ విరుచుకు పడ్డారు. సామాన్యులు, అదీ కూలి పని చేసుకునే కూలీలు, ఇలా ప్రభుత్వాన్ని ఎదురు తిరిగి, చీల్చి చెండాడుతున్నారు అంటే, వీరి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. జగన్ లాంటి బలమైన నేతను ఇలా బహిరంగంగా, విమర్శలు చేస్తున్నారు అంటే, సామాన్యుడి కడుపు మాడితే, ఇలాగే ఉంటుంది. జగన్ అధికారానికి భయపడి, పేదల తరుపున పోరాడకుండా పారిపోతున్న టిడిపి నేతలు, ఇలాంటి సామాన్యులను చూసి కొంచెం ధైర్యం తెచ్చుకోవాలని, టిడిపి కార్యకర్తలు అంటున్నారు.

ఇసుక స‌మ‌స్య ప్ర‌భుత్వానికి చాలా చెడ్డ‌పేరు తెచ్చి పెడుతుంది. జ‌గ‌న్ అంటే బాగా మోజుగా ఉన్న జ‌నాలు కూడా ఇసుక విష‌యంలో ఇబ్బంది ప‌డుతున్నారు. ఇసుక కొర‌త‌పై ప‌వ‌న్ లాంగ్ మార్చ్ అనుకున్న‌దానికంటే విజ‌యవంతం అయ్యింది. ఇంటిలిజెన్స్ నివేదిక‌తోపాటు వైకాపా ఫీల్డ్ ఫీడ్ బ్యాక్ కూడా ఇసుక కొర‌త‌తో ఇబ్బందులు నిజ‌మేన‌ని ప్ర‌భుత్వానికి నివేదించాయి. ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు గారు చేప‌డుతున్న దీక్ష ప్ర‌భుత్వాన్ని షేక్ చేస్తోంది. తెలుగుదేశం ప్ర‌భుత్వం ఇసుక కొర‌త‌పై చేస్తున్న ఉద్య‌మాలు,దూకుడుతో వైకాపాని చాలా చికాకు పెడుతున్నాయి. దీనిని డైవ‌ర్ట్ చేయ‌డానికి వారు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. రేపు చంద్రబాబు దీక్ష అనగా, ఈ రోజు మరో కొత్త ప్రచారానికి తెర లేపారు. ఇసుక వెబ్సైటు హ్యాక్ అయ్యింది అని, వెబ్సైటు మొత్తం హ్యాక్ కాదు, వెబ్సైటు లో ఉన్న ఓక ఫీచర్ హ్యాక్ చేసి, నో స్టాక్ అంటూ చూపిస్తున్నారని, ఇది నారా లోకేష్ సన్నిహిత కంపెనీ ఒకటి చేస్తుంది అంటూ, ఈ రోజు సాయంత్రం నుంచి సాక్షిలో వార్తలు ఇస్తున్నారు. అయితే, ఈ వార్తలు రాగానే లోకేష్ ఘాటుగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డికి, లేఖ రాసారు.

కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 42 మంది భవన నిర్మాణ కార్మికులను పొట్టనపెట్టుకున్న వైకాపా ప్రభుత్వం, జగన్ గారు చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు మరో కుట్రకి తెరలేపారు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇంత కాలం వరద కారణంగా ఇసుక కొరత ఏర్పడింది, పోలీసులే అక్రమ ఇసుక రవాణాని ప్రోత్సహిస్తున్నారు అని తలో మాటా చెప్పిన వైకాపా నేతలు ఇప్పుడు తన పై అసత్య ప్రచారాలకు తెర లేపారని లోకేష్ అన్నారు. వైకాపా ఇసుకాసురులు అడ్డంగా దొరికోపోయారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైకాపా నేతల జాతకాలు టిడిపి బయటపెట్టడం తో వైకాపా ప్రభుత్భం మరో కొత్త నాటకం మొదలు పెట్టిందని అన్నారు.

"5 నెలలుగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్ల పాలు చేసి 42 మందిని వైకాపా ఇసుకాసురులు బలి తీసుకున్నారు. ఇప్పుడు చేసిన తప్పులు బయటపడి ప్రజలు మోహన ఉమ్ము వేసే పరిస్థితి రావడంతో మరో సారి కట్టు కథ రెడీ చేసింది.గతంలోనే జగన్ గారు నాపై అనేక ఆరోపణలు చేసారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలల అయినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేక ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసారు. విశాఖ లో బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ పై సిఐడి దాడులు లోకేష్ కి అత్యంత సన్నిహితుడు కంపెనీ అంటూ మరో అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు.నేను గతంలో అనేక సార్లు జగన్ గారికి నేరుగా సవాల్ చేసా.ఇప్పుడు మరోసారి సవాల్ విసురుతున్నా జగన్ గారి చెత్త మీడియా కి కూడా నేరుగా సవాల్ చేస్తున్నా దోంగ చాటుగా అసత్య వార్తలు ప్రచారం చేసి ఆనంద పడటం కాదు దమ్ముంటే నా పై మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించండి.బ్లూ ఫ్రాగ్ కంపెనీ కి నాకు ఎటువంటి సంబంధం లేదు.నాకు ఆ కంపెనీకి సంబంధాలు ఉన్నట్టు అసత్య వార్తలు సృష్టించిన వారిపైనా సోషల్ మీడియా ఒక కుట్ర ప్రకారం నా పై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానాని తెలియజేస్తున్నాను. ....టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్"

సహజంగా ఎవరైనా తప్పు మాట్లాడితే, వారిని ఎవరైనా మందిలిస్తారు. కాని నువ్వు నాన్ను ఎందుకు అంటున్నావ్, అని అడిగిన వారిని మందిలించటం, మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. మొన్న మన స్పీకర్ తమ్మినేని గారు మాట్లాడుతూ, నేను స్పీకర్ గా చెప్పటం లేదు, ఎమ్మెల్యేగా చెప్తున్నా అంటూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గుడ్డలూడదీస్తాం... మడిచి ఎక్కడో పెట్టుకో... అంతకు ముందు కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై లోకేష్ స్పందిస్తూ, స్పీకర్ కు ఒక బహిరంగ లేఖ రాసారు. మీరు చేసిన వ్యాఖ్యలు స్పీకర్ స్థానానికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి అంటూ, లేఖలో పెర్కున్నారు. అలాగే, తన పై, చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ కు సవాల్ విసిరారు లోకేష్ తన పై చేసిన ఆరోపణలు నిరూపించాలని, నిరూపిస్తే, నేను రాజీనామా చేస్తా, లేకపోతె మీరు ఏం చేస్తారు అంటూ, లోకేష్ ఛాలెంజ్ చేసారు.

lokesh 14112019 2

అయితే, దీని పై వైసిపీ స్పందించింది. స్పీకర్ ని అలా ఎలా అంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, లోకేష్ కు నోటీసులు ఇస్తాం అంటుంది వైసీపీ ప్రభుత్వం. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా విమర్శలు చేసారు అంటూ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తున్నామని, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌, మాజీ విప్‌ కూన రవికుమార్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. నిన్న శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయం చెప్పారు. అసభ్య పదజాలంతో తెలుగుదేశం నేతలు స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను దూషించారని, అన్నారు.

lokesh 14112019 3

ముఖ్యంగా లోకేష్, లేఖల రూపంలో స్పీకర్ ను చపర్చేలా వ్యాఖ్యలు చేశారన్నారు. నోటీసులే కాదని, ఈ ముగ్గురి పై, క్రిమినల్‌ చర్యల తీసుకునే విషయం పై కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. స్పీకర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోదు అంటూ, వ్యాఖ్యలు చేసారు. అయితే, ఇక్కడ వరకు బాగానే ఉంది కాని, అసలు వీళ్ళు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసారు అనే విషయం పై మాత్రం, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడలేదు. స్పీకర్ స్థానాన్ని అగౌరపరిస్తే, ఎవరి పైన అయినా చర్యలు తీసుకోవాల్సిందే, అందులో సందేహమే లేదు. కాని, అటు స్పీకర్ నేను ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా అంటూ, గుడ్డలూడదీస్తాం... మడిచి ఎక్కడో పెట్టుకో... కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అని వ్యాఖ్యలు చేసిన తరువాతే, టిడిపి నేతలు స్పందించారు. మరి ప్రభుత్వం నోటీసులు ఇస్తాం అంటున్న విషయం పై, స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read